29-12-2024, 06:38 PM
(This post was last modified: 29-12-2024, 06:38 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రభ
![[Image: image-2024-12-29-183646101.png]](https://i.ibb.co/72NpH2Q/image-2024-12-29-183646101.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
చంద్రవంశానికి చెందిన ఊర్వశీపురూరవుల పుత్రుడు ఆయువు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు.
అతని పట్టాభిషేక మహోత్సవానికి వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, మహారాజులతో పాటు రంభ, ఊర్వశి, మేనక వంటి సురలోక వాసులు కూడా హాజరయ్యారు.
"చంద్రవంశానికి నువ్వు తీసుకువచ్చే కీర్తిప్రతిష్టలు చిర కాలం చరిత్రలో నిలిచిపోవా”లని ఆయువును వశిష్ట మహర్షి దీవించాడు.
"ఇక ఆయు మహారాజే మా ఆయుష్షు పెంచే దాత విధాత కావాలి" అని రాజ్యంలోని పెద్దలందరూ ఆయు
మహారాజు ను ప్రశంసించారు.
ఆయు మహారాజు అందరి ఆశీర్వాదాలను వినయంగా స్వీకరించాడు. అందరికి వారి వారికి తగిన రీతిలో విందు వినోదాలను ఏర్పాటు చేసాడు.
తదనంతరం ఆయువు తన అంతఃపురం లో విశ్రాంతి తీసుకొనుచుండగా అతని తలిదండ్రులు ఊర్వశీ పురూరవులు ఆయు మహారాజు అంతః పురానికి వచ్చారు. ఆయు మహారాజు తలిదండ్రులైన ఊర్వశీపురూరవులకు నమస్కారం చేసాడు.
"నాయన ఆయు, మీ తండ్రి పురూరవ మహారాజు మహా శౌర్యవంతుడు. వివిధ యజ్ఞ యాగాదులను నిర్వ హించడంలో కడుసమర్థుడు. అయితే వారు బలగర్వం తో బ్రాహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కున్నారు. నా మీద మితిమీరిన వ్యామోహంతో చెయ్యరాని తప్పు పనులు చేసారు. చివరికి తన తప్పు తను తెలుసుకున్నారు. ఉత్తమ మహారాజు గుణాలను వశిష్టాది మహర్షుల ద్వారా తెలుసుకున్నారు.
మీ తండ్రిగారు సనకసనందాదుల విశ్వరూపమును దర్శించి తన జన్మ ధన్యం చేసుకున్నారు. నువ్వు నీ తండ్రిగారు చేసిన పొరపాట్లను చేయమాకు. అలాగే వారు చేసిన గొప్ప గొప్ప పనులను విస్మరించకు. " అని తన కుమారుడైన ఆయువుకు ఊర్వశి చెప్పింది.
తల్లి ఊర్వశి మాటలను అనుసరించి ఆయు మహారాజు తన తండ్రి పురూరవుడు బలగర్వంతో స్వంతం చేసుకున్న బ్రాహ్మణ ధనాన్ని, సామంత రాజుల దగ్గర సంపాదించిన మొత్తం ధనాన్ని తన కుల గురువు వశిష్ట మహర్షి కి చూపించాడు. వశిష్ట మహర్షి ఆయు మహారాజు చూపించిన ధనాన్నంత చూసాడు. అంత వశిష్ట మహర్షి "ఆయు మహారాజ! ఈ బ్రాహ్మణ ధనాన్ని ఏం చేయదలచుకున్నావు?" అని ఆయు మహారాజును అడిగాడు.
వశిష్ట మహర్షి మాటలను విన్న ఆయు మహారాజు "కులాచార్య వశిష్ట మహర్షి! ఇందులో బ్రాహ్మణులకు చెందవలసిన ధనాన్నంత బ్రాహ్మణులకు మీరే పంచేయండి. మిగతా ధనంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేద్దాం. అన్నార్తులను ఆదుకుంటాం.. " అని అన్నాడు.
ఆయు మహారాజు మాటలను అనుసరించి వశిష్ట మహర్షి ధర్మబద్ధంగా బ్రాహ్మణులకు ఇవ్వ వలసిన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసాడు. మిగతా ధనంతో ఆయు మహారాజు వశిష్ట మహర్షి తో అనేక యజ్ఞయాగాదులు చేయించాడు. గోసంపదను, పశుసంపదను, గొర్రెల సంపదను, మేకల సంపదను పెంచి పోషించాడు. తన రాజ్యంలోని రహదారులను బాగుచేయించాడు. నిరుపేదలను తగిన రీతిలో రక్షించాడు.
వశిష్ట మహర్షి ఆయు మహారాజు తో " ఆయు మహారాజ! నీ తండ్రి పురూరవుడు ఈ భూమిని పదమూడు ద్వీపాలను మహా శౌర్యంతో పరిపాలించాడు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నువ్వు నీ తండ్రి లోని ఈ మంచి గుణాలను తప్పకుండా స్వీకరించాలి. ప్రజలందరినీ కన్నతండ్రి వలే కాపాడాలి.. " అని అన్నాడు.
ఆయు మహారాజు వశిష్ట మహర్షి మాటలను విని "చిత్తం" అని అన్నాడు. అటుపిమ్మట అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయసాగాడు.
ఆయు మహారాజు చేసే పనులను చూసి సుర నర రాక్షసాది లోకాలలోని వారంత ఎంతో సంతోషించారు.
"మహా శౌర్యం లో తండ్రిని మించిన తనయుడు ఆయు మహారాజు. తండ్రి లోని సుగుణాలను మాత్రమే తన స్వంతం చేసుకున్నాడు ఆయు మహారాజు" అని ఆయు మహారాజు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రజలంతా అనుకోసాగారు.
ఊర్వశీ పురూరవుల వృత్తాంతంను, పురూరవుని గుణగణాలను దృష్టి లో పెట్టుకొని ఆయువుకు తమ కుమార్తెను యిచ్చి పెళ్ళిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.. అది గ్రహించిన వశిష్ట మహర్షి, " మహారాజ ఆయు. నీ తండ్రి పురూరవుడు బ్రహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కుని చాలా పెద్ద పాపం చేసాడు. పెద్దలు చేసిన పాపం తప్పకుండా తమ పిల్లలు కొంత అనుభవించ వలసి ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసి చాలా పుణ్యాన్ని మూటకట్టు కున్నావు. అయినా నీ తండ్రి చేసిన పాపం నిన్ను కొంత పట్టి విడువకుంది. అందుకే నీ వివాహం ఆలస్యం అవు తుంది. నీ చిత్ర పటాలను నరసురకిన్నెర రాక్షసాది లోకాలకు పంపాను. అయినా ఫలితం దక్కలేదు.
ఇకపై నువ్వు శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం దినం లో నాలుగవ భాగం శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో ఉండు. త్వరలో నీకు వివాహం జరుగుతుంది. " అని అన్నాడు.
వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని సేవించసాగాడు. " అనసూయ పుత్ర, అత్రి తనయ హరిః ఓం జై గురుదత్త..
కృపావతార!" అంటూ ఆయు మహారాజు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ కుక్కల పండగ చేసాడు. కుక్కల నడుమ చిరు దరహాసం తో సంచరించే శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆయు మహారాజు దర్శించాడు. స్వామి తేజం లోని వేద కాంతులను దర్శించాడు.
![[Image: image-2024-12-29-183646101.png]](https://i.ibb.co/72NpH2Q/image-2024-12-29-183646101.png)
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
చంద్రవంశానికి చెందిన ఊర్వశీపురూరవుల పుత్రుడు ఆయువు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు.
అతని పట్టాభిషేక మహోత్సవానికి వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, మహారాజులతో పాటు రంభ, ఊర్వశి, మేనక వంటి సురలోక వాసులు కూడా హాజరయ్యారు.
"చంద్రవంశానికి నువ్వు తీసుకువచ్చే కీర్తిప్రతిష్టలు చిర కాలం చరిత్రలో నిలిచిపోవా”లని ఆయువును వశిష్ట మహర్షి దీవించాడు.
"ఇక ఆయు మహారాజే మా ఆయుష్షు పెంచే దాత విధాత కావాలి" అని రాజ్యంలోని పెద్దలందరూ ఆయు
మహారాజు ను ప్రశంసించారు.
ఆయు మహారాజు అందరి ఆశీర్వాదాలను వినయంగా స్వీకరించాడు. అందరికి వారి వారికి తగిన రీతిలో విందు వినోదాలను ఏర్పాటు చేసాడు.
తదనంతరం ఆయువు తన అంతఃపురం లో విశ్రాంతి తీసుకొనుచుండగా అతని తలిదండ్రులు ఊర్వశీ పురూరవులు ఆయు మహారాజు అంతః పురానికి వచ్చారు. ఆయు మహారాజు తలిదండ్రులైన ఊర్వశీపురూరవులకు నమస్కారం చేసాడు.
"నాయన ఆయు, మీ తండ్రి పురూరవ మహారాజు మహా శౌర్యవంతుడు. వివిధ యజ్ఞ యాగాదులను నిర్వ హించడంలో కడుసమర్థుడు. అయితే వారు బలగర్వం తో బ్రాహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కున్నారు. నా మీద మితిమీరిన వ్యామోహంతో చెయ్యరాని తప్పు పనులు చేసారు. చివరికి తన తప్పు తను తెలుసుకున్నారు. ఉత్తమ మహారాజు గుణాలను వశిష్టాది మహర్షుల ద్వారా తెలుసుకున్నారు.
మీ తండ్రిగారు సనకసనందాదుల విశ్వరూపమును దర్శించి తన జన్మ ధన్యం చేసుకున్నారు. నువ్వు నీ తండ్రిగారు చేసిన పొరపాట్లను చేయమాకు. అలాగే వారు చేసిన గొప్ప గొప్ప పనులను విస్మరించకు. " అని తన కుమారుడైన ఆయువుకు ఊర్వశి చెప్పింది.
తల్లి ఊర్వశి మాటలను అనుసరించి ఆయు మహారాజు తన తండ్రి పురూరవుడు బలగర్వంతో స్వంతం చేసుకున్న బ్రాహ్మణ ధనాన్ని, సామంత రాజుల దగ్గర సంపాదించిన మొత్తం ధనాన్ని తన కుల గురువు వశిష్ట మహర్షి కి చూపించాడు. వశిష్ట మహర్షి ఆయు మహారాజు చూపించిన ధనాన్నంత చూసాడు. అంత వశిష్ట మహర్షి "ఆయు మహారాజ! ఈ బ్రాహ్మణ ధనాన్ని ఏం చేయదలచుకున్నావు?" అని ఆయు మహారాజును అడిగాడు.
వశిష్ట మహర్షి మాటలను విన్న ఆయు మహారాజు "కులాచార్య వశిష్ట మహర్షి! ఇందులో బ్రాహ్మణులకు చెందవలసిన ధనాన్నంత బ్రాహ్మణులకు మీరే పంచేయండి. మిగతా ధనంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేద్దాం. అన్నార్తులను ఆదుకుంటాం.. " అని అన్నాడు.
ఆయు మహారాజు మాటలను అనుసరించి వశిష్ట మహర్షి ధర్మబద్ధంగా బ్రాహ్మణులకు ఇవ్వ వలసిన ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసాడు. మిగతా ధనంతో ఆయు మహారాజు వశిష్ట మహర్షి తో అనేక యజ్ఞయాగాదులు చేయించాడు. గోసంపదను, పశుసంపదను, గొర్రెల సంపదను, మేకల సంపదను పెంచి పోషించాడు. తన రాజ్యంలోని రహదారులను బాగుచేయించాడు. నిరుపేదలను తగిన రీతిలో రక్షించాడు.
వశిష్ట మహర్షి ఆయు మహారాజు తో " ఆయు మహారాజ! నీ తండ్రి పురూరవుడు ఈ భూమిని పదమూడు ద్వీపాలను మహా శౌర్యంతో పరిపాలించాడు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నువ్వు నీ తండ్రి లోని ఈ మంచి గుణాలను తప్పకుండా స్వీకరించాలి. ప్రజలందరినీ కన్నతండ్రి వలే కాపాడాలి.. " అని అన్నాడు.
ఆయు మహారాజు వశిష్ట మహర్షి మాటలను విని "చిత్తం" అని అన్నాడు. అటుపిమ్మట అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయసాగాడు.
ఆయు మహారాజు చేసే పనులను చూసి సుర నర రాక్షసాది లోకాలలోని వారంత ఎంతో సంతోషించారు.
"మహా శౌర్యం లో తండ్రిని మించిన తనయుడు ఆయు మహారాజు. తండ్రి లోని సుగుణాలను మాత్రమే తన స్వంతం చేసుకున్నాడు ఆయు మహారాజు" అని ఆయు మహారాజు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రజలంతా అనుకోసాగారు.
ఊర్వశీ పురూరవుల వృత్తాంతంను, పురూరవుని గుణగణాలను దృష్టి లో పెట్టుకొని ఆయువుకు తమ కుమార్తెను యిచ్చి పెళ్ళిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.. అది గ్రహించిన వశిష్ట మహర్షి, " మహారాజ ఆయు. నీ తండ్రి పురూరవుడు బ్రహ్మణ ధనాన్ని బలవంతంగా లాక్కుని చాలా పెద్ద పాపం చేసాడు. పెద్దలు చేసిన పాపం తప్పకుండా తమ పిల్లలు కొంత అనుభవించ వలసి ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చివేసి చాలా పుణ్యాన్ని మూటకట్టు కున్నావు. అయినా నీ తండ్రి చేసిన పాపం నిన్ను కొంత పట్టి విడువకుంది. అందుకే నీ వివాహం ఆలస్యం అవు తుంది. నీ చిత్ర పటాలను నరసురకిన్నెర రాక్షసాది లోకాలకు పంపాను. అయినా ఫలితం దక్కలేదు.
ఇకపై నువ్వు శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం దినం లో నాలుగవ భాగం శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో ఉండు. త్వరలో నీకు వివాహం జరుగుతుంది. " అని అన్నాడు.
వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఆయు మహారాజు శ్రీ దత్తాత్రేయ స్వామి ని సేవించసాగాడు. " అనసూయ పుత్ర, అత్రి తనయ హరిః ఓం జై గురుదత్త..
కృపావతార!" అంటూ ఆయు మహారాజు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ కుక్కల పండగ చేసాడు. కుక్కల నడుమ చిరు దరహాసం తో సంచరించే శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆయు మహారాజు దర్శించాడు. స్వామి తేజం లోని వేద కాంతులను దర్శించాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
