05-12-2024, 02:29 PM
"ఏమండీ!..." బిగ్గరగా అరిచింది.
పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరుగెత్తాడు.
అతన్ని చూచిన ఊర్మిళ....
"ఏమండి... ఏమండీ... అత్తయ్య... అత్తయ్య..." భోరున ఏడ్చింది.
శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూచాడు.
"అమ్మా!..." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు.
ఆ గదిలో... శాంభవి శాశ్వత నిద్రలో వుంది.
శివరామకృష్ణ, ఊర్మిళలు భోరున ఏడుస్తున్నారు.
గతరాత్రి తాగిన మైకంవదలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళల ఏడుపులు... అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూచాడు శివరామకృష్ణ.
"నాన్నా! అమ్మ చనిపోయింది నాన్నా!..." భోరున ఏడ్చాడు.
మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.
"శాంభవీ! నన్ను మన్నించు...నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చచ్చిపోయావు" ఆమె చేతిపై తన తలను ఆనించి భోరున ఏడవసాగాడు.
పనిమనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు... తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది.
కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూచారు. ఎంతో ప్రేమాభిమానాలతో వరసలతో ప్రీతిగా పలకరించే... శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు.
ఆ వార్త వూరంతా నిముషాల్లో పాకిపోయింది. ఆ వాడ... వూరిజనం అంతా అరగంటలో ఆ ఇంటిముందుకు చేరారు.
కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి... శాంభవిని దానిపైకి చేర్చారు. హరికృష్ణ వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, వూరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రులతో ఐదు గంటల ప్రాంతంలో శాంభవి... నలుగురు వాహకులతో... పసుపు కుంకుమలు... పూలతో జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా స్మశానం వైపు వూరేగింపుగా బయలుదేరింది.
’దేవత... ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది’ అది అందరి నోటిమాట.
అందరి వదనాల్లో కన్నీరు... కారణం ఆ మహాతల్లి అందరినీ అభిమానించింది. ప్రేమించింది. సాయం చేసింది.
ఆరున్నర ప్రాంతంలో ఆమె యాతనా తనువు అగ్నికి ఆహుతైపోయింది.
ఈ లోకపు బాధలన్నింటి నుంచి విముక్తి పొందింది.
కొందరు మంచి మనుషులు బ్రతికి వున్నా... గతించినా... వారి చర్యల వలన ఇతరుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా వుంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి వున్నా సాటివారి మనసుల్లో చచ్చి వారి చిట్టాలోనే వుండిపోతారు. అదే మంచి.... చెడుకు వున్న వ్యత్యాసం.
ఈ మానవ జన్మ అపూర్వమైనది. మరుజన్మ వున్నదో లేదో!... సృష్టిలోని అన్ని ఎలా అశాశ్వతాలో మానవుల జీవిత గతీ అంతే... అందుకే అన్నారు పెద్దలు ’పుట్టుట గిట్టుట కొరకే’ అని శాంభవి మరణం ఆ ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణం అయింది. అయినవారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన మూడు మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు.
====================================================================
ఇంకా వుంది..
పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరుగెత్తాడు.
అతన్ని చూచిన ఊర్మిళ....
"ఏమండి... ఏమండీ... అత్తయ్య... అత్తయ్య..." భోరున ఏడ్చింది.
శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూచాడు.
"అమ్మా!..." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు.
ఆ గదిలో... శాంభవి శాశ్వత నిద్రలో వుంది.
శివరామకృష్ణ, ఊర్మిళలు భోరున ఏడుస్తున్నారు.
గతరాత్రి తాగిన మైకంవదలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళల ఏడుపులు... అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూచాడు శివరామకృష్ణ.
"నాన్నా! అమ్మ చనిపోయింది నాన్నా!..." భోరున ఏడ్చాడు.
మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.
"శాంభవీ! నన్ను మన్నించు...నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చచ్చిపోయావు" ఆమె చేతిపై తన తలను ఆనించి భోరున ఏడవసాగాడు.
పనిమనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు... తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది.
కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూచారు. ఎంతో ప్రేమాభిమానాలతో వరసలతో ప్రీతిగా పలకరించే... శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు.
ఆ వార్త వూరంతా నిముషాల్లో పాకిపోయింది. ఆ వాడ... వూరిజనం అంతా అరగంటలో ఆ ఇంటిముందుకు చేరారు.
కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి... శాంభవిని దానిపైకి చేర్చారు. హరికృష్ణ వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, వూరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రులతో ఐదు గంటల ప్రాంతంలో శాంభవి... నలుగురు వాహకులతో... పసుపు కుంకుమలు... పూలతో జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా స్మశానం వైపు వూరేగింపుగా బయలుదేరింది.
’దేవత... ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది’ అది అందరి నోటిమాట.
అందరి వదనాల్లో కన్నీరు... కారణం ఆ మహాతల్లి అందరినీ అభిమానించింది. ప్రేమించింది. సాయం చేసింది.
ఆరున్నర ప్రాంతంలో ఆమె యాతనా తనువు అగ్నికి ఆహుతైపోయింది.
ఈ లోకపు బాధలన్నింటి నుంచి విముక్తి పొందింది.
కొందరు మంచి మనుషులు బ్రతికి వున్నా... గతించినా... వారి చర్యల వలన ఇతరుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా వుంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి వున్నా సాటివారి మనసుల్లో చచ్చి వారి చిట్టాలోనే వుండిపోతారు. అదే మంచి.... చెడుకు వున్న వ్యత్యాసం.
ఈ మానవ జన్మ అపూర్వమైనది. మరుజన్మ వున్నదో లేదో!... సృష్టిలోని అన్ని ఎలా అశాశ్వతాలో మానవుల జీవిత గతీ అంతే... అందుకే అన్నారు పెద్దలు ’పుట్టుట గిట్టుట కొరకే’ అని శాంభవి మరణం ఆ ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణం అయింది. అయినవారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన మూడు మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
