Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - తుపాను
#12
"అది తెలిసి మీ కోసం భోజనం తెచ్చాం' ఈ బస్తాల్లో... పులిహోర ప్యాకెట్లను తీసుకొని అందరూ పంచుకుతినండి" అన్నాడో యువకుడు.

పిల్లలు ఆహారపు సంచులవైపు ఆశగా చూశారు. యువకులు తాముతెచ్చిన సంచుల మూతులు విప్పారు. ఇసుకమీద ఓ గుడ్డపరిచి, పులిహోర ప్యాకెట్లు కుప్పగా కుమ్మరించారు.

ఈ లోపల ఇంకొందరు బయటికొచ్చి చుట్టూ ముట్టారు. గడ్డమీద పోసిన ఆహార పొట్లాలవైపూ, అవి తెచ్చిన యువకులవైపు ఎగాదిగా చూస్తున్నారు వాళ్ళంతా. కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని చూస్తున్న వాళ్ళ చూపుల్లోని భావమేమిటో శ్రీనువాళ్ళకేం అర్ధం కాలేదు.

"ఎన్ని పొట్లాలు తెచ్చారు?" ముందుగా వచ్చి మాట్లాడినతను ప్రశ్నించాడు. ప్రశ్న కాస్త కటువుగా వుంది.

"అయిదొందలు" చెప్పాడు శ్రీను. క్షణం నిశ్శబ్దం!

"లం... కొడకల్లారా..." పళ్ళు పట పట కొరుకుతూ అరిచాడతను.

నెత్తుటి జీరలు చిట్లిపోయినట్టు అతని కళ్ళూ, మొహమూ కందిపోతున్నాయి.

ఉలిక్కిపడ్డారు యువకులు. విషయమేమిటో అర్ధం కాక తెల్లమొహం వేసుకొని నిలబడిపోయారు.

"నాలుగు రోజుల్నుండీ మా మొహం చూసినోడు లేడురా!" కొండరాయి బ్రద్దలవుతున్నంత కోపంతో మళ్ళీ అరిచాడతను. అంతే...! అందరూ కూడబలుక్కున్నట్లు అరుపులు మొదలెట్టారు.

"కడుపులో మెతుకులేక అల్లల్లాడుతుండాంరా...!"

"అయిదొందల మందికి తెత్తారా భోజనాలు! మీ కడుపు కొట్ట!"

"అయిదొందల మంది తింటావుంటే మిగతావోళ్ళేమైపోవాలా??"

"సగమ్మందికి కూడా సాలవీ బిచ్చం మెతుకులు!"

"సచ్చినోళ్ళతో పాటూ చావనన్నా చచ్చి నోళ్ళంకాదు. మాకు సగమ్మంది కన్నా సరిపోతాయంట్రా ఇయ్యి!"

"నువ్వు దెచ్చిన నాలుగు మెతుకులకోసం మాలో మేం పీక్కొని కొట్టుకొని సావాలంట్రా లం... కొడకల్లారా! మావూ... మావూ... కొట్టుకు సత్తంటే సూద్దావని వచ్చార్రా...!"

"అందరం సావుతో పోరాడి బతికినోళ్లమే...! కొనూపిరితో వుండమేం ఈ తిండితో సగమ్మందివి. బతికేసెయ్యాలి? మిగతా సగమ్మంది సత్తంటే సూత్తాకూకోని ఏడవడానికా మేం ఈ మెతుకులు తిని బతకాల??"

అందరం కలిసి ఎట్టా బయటపడ్డావో... అట్టాగే అందరం కలిసే సత్తాంగానీ. నీ బోడిమెతుకుల కోసం... పెద్ద శేపలు సిన్న సేపల్ని మింగినట్లు మేము పశులమైపోతావట్రా...! అందరం బతుకుతా మనుకున్నప్పుడే అందరినోళ్ళలో మెతుకు పడాల! నీ గుప్పెడు మెతుకుల కోసం గుండెల్లో పొడుసుకొం!

"అరె సూత్తారెంట్రా సవుద్రంలో పారేయండ్రా ఆ మాయదారి తిండి!"

అరుపులు... కేకలు... తిట్లు...!

అక్కడేం జరుగుతోందో అర్ధం అయేలోపలే ఆహారమంతా సముద్రం పాలయ్యింది.

ఆకలి కడుపులకు ఆశపెట్టి, భగ్నంచేసినందుకు కాబోలు. వాళ్ళ కోపం తారాస్థాయికి చేరింది. లేని ఓపికని కూడగట్టుకొని ఉగ్రంగా ఊగిపోతున్నారు.

"తరమండ్రా దొంగ నాయాళ్ళని..." అంటూ సముద్రంలో ఆహారాన్ని విసిరికొట్టిన గుంపు వేగంగా యువకులవైపు తిరిగింది.

నిశ్చేష్టులై నిలబడిన యువకులు ఒక్కసారిగా చలనం పుంజుకుని పరుగులు పెట్టారు.

అంత ఓపికలేని తనంలోనూ ఎంత కసిగా ఆ బాదుతులు తమని ఎంత దూరం తరుముకొచ్చారో తెలీదు... ప్రాణభయంతో పరిగెత్తి... పరిగెత్తి... ఇసుక తిన్నెలమీద వాలిపోయారు.

వెంటపడుతున్న వాళ్ళు ఎక్కడ ఆగిపోయింది కూడా చూసుకోలేదు. వాళ్ళది పిచ్చితనం కావచ్చు! వెర్రి ఆవేశం అనిపించవచ్చు!

కానీ...

తమలో కొందరైనా బ్రతకడానికి దొరికిన అవకాశాన్ని కాలదల్చుకున్నవాళ్లు 'ఐక్యత' మానవ సంబంధానికున్న ఔన్నత్యాన్ని బయటి ప్రపంచానికి తెలియచెప్పింది. ప్రకృతి భీభత్సం వాళ్ళని ఏకతాటిమీద నిలబెట్టింది.

ఉన్న కాస్త ఆహారం భీభత్సం బారిన పడిన అందర్నీ బ్రతికించలేనప్పుడు... అందరం కలిసే చావాలన్న నిర్ణయం... అపురూపంగా దొరికిన ఆహారాన్ని నీటిపాలు చేసింది. ఆ నాలుగు మెతుకుల కోసం కొట్టుకోవడం కన్నా... నలుగురం కలిసి కన్నుమూయడమే నయమనిపించిన వాళ్ళ ఐక్యతలోని ఔన్నత్యం ముందు... సహాయం అందించడానికి వచ్చిన తామెంతో చిన్న వాళ్ళుగా అనిపించారు వాళ్ళకు వాళ్ళే ఆ యువకులు!

(గోదావరి జిల్లాల్లో తుఫాను భీభత్సమప్పుడు ఇది నిజంగా జరిగింది.)

[Image: image-2024-09-15-170142791.png]

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - తాతయ్య వాచీ - by k3vv3 - 15-09-2024, 05:02 PM



Users browsing this thread: 4 Guest(s)