Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Inspiration పీత కష్టాలు పీతవి
#4
పీతల ప్రముఖులందరూ సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నాక వారి రాజు కొండి దీర్ఘుడు ఇలా చెప్పాడు.
 
" మిత్రులారా! ఈ రోజు మనం చేసే ప్రార్థనను బట్టి మన జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం ఎవరి పక్షమూ కాదు. కేవలం వారధి నిర్మాణం ఆలస్యం కావాలని మాత్రమే ప్రార్థిద్దాం. అందరూ మనసు పెట్టి ప్రార్థిస్తే ఆ రాముడే మనల్ని కరుణిస్తాడు. నిజానికి ప్రతి సంవత్సరం వేసవి కాలంలోనే మన సంతానోత్పత్తి ప్రక్రియ పూర్తి అవుతుంది. మన దురదృష్టమేమో ఈ సారి ఆలస్యమయింది”.
 
ఇంతలో వేగుల వాళ్ళు అక్కడికి వచ్చారు.
" మీరు తీసుకు వచ్చిన సమాచారాన్ని చెప్పండి" అని అనుమతి ఇచ్చాడు కొండి దీర్ఘుడు.
 
" మహారాజా! వారధి నిర్మాణం ప్రారంభం కాబోతోంది. యుద్ధంలో రాముడికి విజయం లభించినా కోట్లాది వానరులు, భల్లూకులు మరణించడం ఖాయం. అయినా ఏ ఒక్కరిలోనూ ప్రాణ భయం అనేది కనిపించడం లేదు. పైగా రాముడి కోసం ప్రాణాలు అర్పించడం గొప్పగా భావిస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. సముద్రానికి ఆవలి వైపు అడవుల్లో వున్న లక్షలాది ఉడుతలు కూడా సమావేశమై రామ కార్యంలో పాలుపంచుకోవాలని తీర్మానించాయట. తమ శక్తి కొద్దీ రాళ్లను మోసి వారధి నిర్మాణానికి తమవంతు సహాయం అందిస్తాయట. ఆ ప్రయత్నంలో వానరుల కాళ్ళ కింద పడి ఎన్నో ఉడుతలు చనిపోవడం ఖాయం. అయినా ఆ ఉడుతలు ఎంతమాత్రం వెరవడం లేదు "
 
వేగులు చెప్పిన మాటలు విని పీతల ప్రముఖులందరూ ఆశ్చర్యపోయారు.ఇంతలో లంకలో పర్యటించిన మరికొందరు వేగులు రాజుగారి అనుమతితో తాము మోసుకొచ్చిన సమాచారాన్ని ఇలా చెప్పారు.
 
" మహారాజా! అశోక వనంలో సీతాదేవి మన కోసం ప్రార్థిస్తోందట. మన కష్టానికి ఆమె ఎంతో కలత చెందిందట. మరి కొన్ని రోజులయినా కష్టాలు భరిస్తుందట".
వేగులు చెప్పింది విన్న పీతలకు సీతాదేవి హృదయం ఎంత ఉన్నతమైనదో అర్థం అయింది.
 
ఇంతలో కొన్ని ఆడ పీతలు భారంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చాయి. మగ పీతలు వారిస్తున్నా వినకుండా రాజు దగ్గరకు వచ్చి " మహారాజా! మన ప్రాణాలు శాశ్వతం కాదు. సీతమ్మ విముక్తి మన కారణంగా ఆలస్యం కాకూడదు. అలా చేసి దక్కించుకున్న ప్రాణాలు ఎంతకాలం ఆపుకోగలం? చెట్లూ,పుట్టలూ, జంతువులూ, పక్షులూ, సముద్రుడు అందరూ రాముడికి సహాయం చేస్తోంటే పీతలు మాత్రం తమ స్వార్థం చూసుకున్నాయన్న అపప్రథ మన జాతికి వద్దు. వంతెన తొందరగా కట్టి, రాముడు లంకకు వచ్చి రావణ సంహారం చేయాలని మనమంతా ప్రార్థన చేద్దాము." అని ముక్త కంఠంతో చెప్పాయి. ఆ మాటలను అన్ని పీతలూ స్వాగతించాయి.
పీతలన్నీ రాముడు తొందరగా లంకా ప్రవేశం చేయాలని ప్రార్థించాయి.
***
రాముడు ధర్మ స్వరూపుడన్నది మరోసారి రుజువైంది. పీతలు కాపాడబడటమే ధర్మం. అందుకోసం సీతామాత స్వయంగా ప్రార్ధించడం దైవ సంకల్పం. ఆమె ప్రార్థించినట్లుగానే వారథి నిర్మాణం కొన్ని రోజులు ఆలస్యమయింది. ఈ లోపల పీతల గుడ్లు పొదగబడ్డాయి. తరువాత అన్ని పీతలూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాయి.



ఆ తరువాతే వానర సైన్య సమేతుడై శ్రీరాముడు లంకలోకి ప్రవేశించాడు. భీకరమైన రణంలో రావణ సంహారం చేసాడు. యుద్ధంలో మరణించిన వానరులందరూ పునరుజ్జీవింప బడ్డారు. ధర్మం వైపు నిలబడ్డ విభీషణుడు, మండోదరి, త్రిజట లాంటి కొద్దిమంది రాక్షసులు మాత్రం మిగిలారు. తమకోసం ప్రార్థించిన జానకీమాతను, ధర్మపరాయణుడైన శ్రీరామ చంద్ర మూర్తిని లంకలోని పీతలు ఇప్పటికీ తమ కుల దేవతలుగా పూజిస్తున్నాయి.
(కల్పితం)

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పీత కష్టాలు పీతవి - by k3vv3 - 17-04-2024, 09:42 PM



Users browsing this thread: 2 Guest(s)