30-01-2024, 04:28 PM
"అవునండీ! నాకూ అలానేఉంది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, పిల్లాడు దక్కితే చాలు" అంది భద్ర.
"ఆదిత్యా! నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేమూ ఏమీ అనము, నువ్వు ఇంటికి వచ్చెయ్యి" అంటూ విడియో మెసేజ్ పెట్టింది.
అంతే, వెంటనే "జాబ్ రిజైన్ చేశాను" అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకి వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు పదిగంటలు నిద్ర పోయాడు. నిద్ర లేచాక, టీ తాగుతూ చెప్పడం మొదలు పెట్టాడు.
"అమ్మా! నాన్నా! మీ ఇద్దరికీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలీదు కదా. చిన్నప్పటినుంచి నేను చదువు మీదే దృష్టి పెట్టాను, ఆటలు లేవు, స్నేహితులు లేరు.
మీరూ, చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగం లో చేరాక, నేను, నా వయసు వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్లేవారు. ఒకరు, ఇద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవీ తెలీవు.
నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు, ఎప్పుడూ దాంట్లోనే మునిగి ఉండేవాణ్ణి.
ఈ మధ్య కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి, దానితో, నేను ఏ తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో, అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధ పడతారు, ఇదే నా ఆలోచన.
దానితో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ ని కలిసాను.
ఆయన సలహా మీద, నేను ఉద్యోగం మానేసి, నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను.
ముందు కొన్నిరోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదామనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికీ వెళ్లకుండా నాతోనే ఉన్నారు, అమ్మా! ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాము. దగ్గరలో మన బంధువులు ఉంటే వాళ్ళనీ కలుద్దాము" అన్నాడు ఆది.
"అలాగే వెళదాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకి పూజ చేయిస్తాను అని మొక్కుకున్నా. నాన్న అక్క, జయ అత్తయ్యా వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో, మా అన్నయ్యా వాళ్ళు ఉంటారు.
అందరూ, వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి, అడిగి విసిగి పోయారు. అందర్నీ చూసి వద్దాము" సంతోషంగా అంది సుభద్ర.
రెండు రోజుల తరవాత, కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురూ. అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం రాజారామ్ వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు.
"ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్నా? అత్తయ్య వాళ్ళ పిల్లలు, వేరే ఊళ్ళో ఉంటారు కదా?" అన్నాడు ఆది.
"అవును, ఈ ఇల్లు మా బావగారి నాన్న కట్టించిన ఇల్లు.
ఇది వదిలి పెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం, ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు కానీ, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేటులో ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి.
ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా" అన్నాడు రాజారామ్.
"అమ్మా! ఇక్కడ మంచి బట్టల షాపులు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు, కొన్ని పళ్ళు, స్వీట్స్ తీసుకు వెళదాం" అన్నాడు ఆది.
ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దార్లో షాపుల దగ్గర ఆపి, అన్నీ తీసుకున్నారు.
కార్ గుమ్మం ముందు ఆగాక, ఆశబ్దానికి రాజారామ్ బావగారు నారాయణ బయటికి వచ్చాడు.
వీళ్ళ రాక ఏమాత్రం ఊహించని ఆయనకి ఒక నిమిషం అర్థం కాలేదు.
"జయా! ప్రళయం వస్తుంది జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో" అంటూ, "రండి, రండి. ఏదో దారి తప్పి వచ్చారు అమెరికా దొరవారు మనఇంటికి."
నారాయణ మాటలకి నవ్వుతూ రాజారామ్ " అనండి బావా ! మీకు కాక ఇంకెవరికి ఆ అధికారం ఉంది" అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది.
" రాజా! ఇన్నాళ్ళకి వచ్చారు. ఏదో పెళ్లి, పేరంటాలకు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం?" అంటూ పలకరించింది.
ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా, నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు.
ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడు అని తెలిసాక "అదేమిటి ఆదీ! మేము అందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాము. ఎందుకు అలా మానేసావు?"
అని ఖంగారుపడ్డాడు.
"ఏం కాదు మామయ్య గారు. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తాను." అన్నాడు ఆది.
ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారు ఇద్దరూ. వాళ్ళ తమ్ముడిని, మరదలిని పిలిచి చూపించారు నారాయణగారు.
వాళ్ళకీ, తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్నీ ఇచ్చింది సుభద్ర.
మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజీనిరింగ్ అయిపోయిందనీ, అమెరికాలో చాలా మంచి కాలేజి అయిన MIT లో MS సీట్ వచ్చిందనీ, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా, పై ఖర్చులు పెట్టుకోవడం కష్టమని సీట్ వదిలేస్తామని చెప్పారు.
ఆదిత్య వెంటనే "మామయ్యగారూ, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా?" అని అడిగాడు నారాయణ గారి తమ్ముడిని.
"తప్పకుండా" అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ ని పిలిచారు.
"ఆదిత్యా! నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేమూ ఏమీ అనము, నువ్వు ఇంటికి వచ్చెయ్యి" అంటూ విడియో మెసేజ్ పెట్టింది.
అంతే, వెంటనే "జాబ్ రిజైన్ చేశాను" అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకి వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు పదిగంటలు నిద్ర పోయాడు. నిద్ర లేచాక, టీ తాగుతూ చెప్పడం మొదలు పెట్టాడు.
"అమ్మా! నాన్నా! మీ ఇద్దరికీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలీదు కదా. చిన్నప్పటినుంచి నేను చదువు మీదే దృష్టి పెట్టాను, ఆటలు లేవు, స్నేహితులు లేరు.
మీరూ, చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగం లో చేరాక, నేను, నా వయసు వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్లేవారు. ఒకరు, ఇద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవీ తెలీవు.
నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు, ఎప్పుడూ దాంట్లోనే మునిగి ఉండేవాణ్ణి.
ఈ మధ్య కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి, దానితో, నేను ఏ తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో, అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధ పడతారు, ఇదే నా ఆలోచన.
దానితో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ ని కలిసాను.
ఆయన సలహా మీద, నేను ఉద్యోగం మానేసి, నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను.
ముందు కొన్నిరోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదామనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికీ వెళ్లకుండా నాతోనే ఉన్నారు, అమ్మా! ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాము. దగ్గరలో మన బంధువులు ఉంటే వాళ్ళనీ కలుద్దాము" అన్నాడు ఆది.
"అలాగే వెళదాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకి పూజ చేయిస్తాను అని మొక్కుకున్నా. నాన్న అక్క, జయ అత్తయ్యా వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో, మా అన్నయ్యా వాళ్ళు ఉంటారు.
అందరూ, వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి, అడిగి విసిగి పోయారు. అందర్నీ చూసి వద్దాము" సంతోషంగా అంది సుభద్ర.
రెండు రోజుల తరవాత, కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురూ. అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం రాజారామ్ వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు.
"ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్నా? అత్తయ్య వాళ్ళ పిల్లలు, వేరే ఊళ్ళో ఉంటారు కదా?" అన్నాడు ఆది.
"అవును, ఈ ఇల్లు మా బావగారి నాన్న కట్టించిన ఇల్లు.
ఇది వదిలి పెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం, ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు కానీ, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేటులో ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి.
ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా" అన్నాడు రాజారామ్.
"అమ్మా! ఇక్కడ మంచి బట్టల షాపులు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు, కొన్ని పళ్ళు, స్వీట్స్ తీసుకు వెళదాం" అన్నాడు ఆది.
ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దార్లో షాపుల దగ్గర ఆపి, అన్నీ తీసుకున్నారు.
కార్ గుమ్మం ముందు ఆగాక, ఆశబ్దానికి రాజారామ్ బావగారు నారాయణ బయటికి వచ్చాడు.
వీళ్ళ రాక ఏమాత్రం ఊహించని ఆయనకి ఒక నిమిషం అర్థం కాలేదు.
"జయా! ప్రళయం వస్తుంది జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో" అంటూ, "రండి, రండి. ఏదో దారి తప్పి వచ్చారు అమెరికా దొరవారు మనఇంటికి."
నారాయణ మాటలకి నవ్వుతూ రాజారామ్ " అనండి బావా ! మీకు కాక ఇంకెవరికి ఆ అధికారం ఉంది" అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది.
" రాజా! ఇన్నాళ్ళకి వచ్చారు. ఏదో పెళ్లి, పేరంటాలకు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం?" అంటూ పలకరించింది.
ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా, నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు.
ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడు అని తెలిసాక "అదేమిటి ఆదీ! మేము అందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాము. ఎందుకు అలా మానేసావు?"
అని ఖంగారుపడ్డాడు.
"ఏం కాదు మామయ్య గారు. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తాను." అన్నాడు ఆది.
ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారు ఇద్దరూ. వాళ్ళ తమ్ముడిని, మరదలిని పిలిచి చూపించారు నారాయణగారు.
వాళ్ళకీ, తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్నీ ఇచ్చింది సుభద్ర.
మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజీనిరింగ్ అయిపోయిందనీ, అమెరికాలో చాలా మంచి కాలేజి అయిన MIT లో MS సీట్ వచ్చిందనీ, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా, పై ఖర్చులు పెట్టుకోవడం కష్టమని సీట్ వదిలేస్తామని చెప్పారు.
ఆదిత్య వెంటనే "మామయ్యగారూ, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా?" అని అడిగాడు నారాయణ గారి తమ్ముడిని.
"తప్పకుండా" అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ ని పిలిచారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ