07-06-2019, 11:53 AM
(06-06-2019, 05:45 AM)stories1968 Wrote: అనిత రాము దూరంగా ఉన్నప్పుడు రాసిన లేఖ ఇది
ఈ పుడమిని అడిగా నీ ఊసు ఎదని పలకలేదు ఉలకలేదు
పోనీలే మనల్ని మోసేది కదా నా గోడు వినబడలేదేమో అనుకున్నా
సరేలే అని పయనించు గాలిని అడిగా పరిచయం లేనట్టు చూసింది సఖి
పోనీలే తనమీదే అందరూ ఆధార పడ్డారు అని గర్వం అనుకున్నా
ఇంక ఉండలేక ఆకాశాన్ని అడిగా ఏమన్నాదో తెలుసా సఖి
నేను రోజూ ఎంతోమందిని చూస్తా వారిలో నీ సఖి ఎవరో నాకు తెలిదు అంది
అప్పుడనుకున్నా సఖి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అయినా
నాకుతూహలం ఆపుకోలేక సాహసించి ఆ అగ్ని దేవుడిని అడిగా
ఏమన్నాడో తెలుసా నేను వెళ్ళినచోట ఏమి మిగలదు అందుకే
నీ సఖి ఉన్నచోటుకి నేను పోనుకనుక నాకు తెలిదు అన్నాడు
ఆఖరికి ఆ కడలిని అడిగా తను కొద్దిసేపు ఆగు వస్తుంది అంది ఇంకా ఎంతసేపు చూడాలి సఖి చెప్పు ............
కవితతో పాటు బొమ్మ కూడా చాలా బాగున్నది స్టోరిస్ గారు....




