Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#14
వసుధ
శ్రవన్ కుమార్ రాజా
అభివృద్ధికి,నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ఆ గ్రామం లో పెళ్లయి సంవత్సరం లోపు సంతానం కలగని ఆడపిల్లని ఆ ఊరి లో ఉండే పెద్ద జమీందారు కు సేవకురాలిగా పంపుతారు.
అలా వెళ్లిన అమ్మాయి ఆ జమీందారు కుటుంబానికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండాలి సేవలు అనడం కన్నా బానిస అనడం ఎంతో అర్థవంతం. సంవత్సర కాలం బానిసగా ఉంటూ ఆ ఆడపిల్ల తన భర్తతో సంతానం పొందే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పటికీ.. సంవత్సరం బానిసత్వం చేసిన కాలం లో కూడా ఆ ఆడపిల్లకి సంతానం కలగకపోతే ఆ అమ్మాయిని జమీందారు కుటుంబం లోని మగవాళ్ళకి తాళి కట్టకుండానే భార్యగా చేసేస్తారు.
అలాపెళ్లయి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సంతానం కలగని వసుధని ఆ ఊరి జమీందారు కుటుంబానికి సేవ చెయ్యడానికి పంపించారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కి కాకుండా మరో కుటుంబానికి చెందిన మగవాళ్ల మధ్యలో రాత్రియంబవళ్ళు ఉంటూ ఆ కుటుంబానికి బానిసల బ్రతుకుతూ ఉంది వసుధ
ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అలా పరాయి మగవాళ్ల మధ్యలో విడిచేసినప్పటి నుండి శేఖర్ మనసులో మనసు లేదు.రోజు ఉదయాన్నే వెళ్లి రాత్రి పడినాక ఇంటికి తిరిగొచ్చే భార్యని చూసి శేఖర్ బాధపడేవాడు.ఇప్పటి కాలం లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్న గ్రామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.
బానిసత్వం అనుభవిస్తున్న కాలం లో ఒక రోజు జమీందారు గారి పెద్ద కొడుకు ఆనంద్ మద్యం మత్తులో తన ఇంటిలో పనిచేస్తున్న వసుధని అత్యాచారం చేస్తాడు..వసుధ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఆ మదమెక్కిన కామాంధుడి చేతిలోంచి తప్పించుకోలేకపోతుంది.
ఆరోజు రాత్రి ఇంటికి చేరుకున్న వసుధ తనను ఎంతగానో ప్రేమించే భర్తకి జరిగిన విషయం చెప్పలేకపోతుంది దానికి కారణం మగాడైనా తన భర్త ఆవేశం తో చేసే పని వాళ్ళిద్దరికీ మంచిది కాదని.మరుసటి రోజు పనికి వెళ్లని వసుధను పనిలోకి తీసుకెళ్లడానికి బంగళా నుండి మనుష్యులు వస్తారు.వసుధ భర్త ఎందుకుపనిలోకి వెళ్లలేదని ప్రశ్నించగా వసుధ తడబడుతూ మరేం లేదు కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉండే అందుకే ఆలస్యమయింది వెళ్తాను అని బయలుదేరుతుండగా,శేఖర్ నీరసంగా ఉంటె వెళ్ళకు అని ఆపబోయేలోపే వసుధ వెళ్ళిపోతుంది.
జమీందారు బంగళాకు చేరుకున్న వసుధని అప్పుడే మత్త్తు వీడి లేచిన ఆనంద్ చూస్తాడు,తూలుతూ నడుస్తూ వచ్చి నిన్న రాత్రి జరిగిన దానికి నేను చాలా చాలా ఆనందపడుతున్నాను,నిన్న జరిగింది ఈరోజు,రేపు ఆ రేపు జరుగుతూనే ఉంటుంది.ఒక విషయం ఆలోచించు వసుధ.. నా ఒక్కడికి సుఖాన్ని ఇవ్వడం మంచిదా లేకపోతే సంతానం కలగకుండా ఉండిపొయ్యి మా కుటుంబంలోనిమగాళ్లందరికి పడకమీద బొమ్మ లాగ ఉండడం మంచిదా నువ్వే ఆలోచించుకో అంటాడు.
నాతో ఈ సంవత్సర కాలం పాటు సంసారం చేస్తే నీకు ఒక బిడ్డను ఇస్తాను నిన్ను బానిసత్వం నుండి కాపాడుతాను అంటాడు..జమీందారు కొడుకు నీచపు ఆలోచనకు వసుధ కుంగిపోతుంది.వంట గదిలో ఒక మూల కూర్చొని తనకు,తన భర్త శేఖర్ కు మధ్య జరిగిన ప్రేమ సన్నివేశాలను నెమరువేసుకుంటుంది ఏడుస్తూ.
అలా ఆలోచిస్తూ కూర్చున్న వసుధకి జమిందారీ కొడుకు చెప్పన మాటలు పదే పదే గుర్తొస్తుంటాయి.."నా ఒక్కడికే భార్యగా ఉండి సంతానాన్ని పొందు"అన్న మాట వసుధకి పదే పదే గుర్తొచ్చి ఆలోచించడం మొదలుపెడుతుంది.
పెళ్లయి సంవత్సరకాలం అయినా తనకు తన భర్త శేఖర్ చేత సంతానం కలగలేదు ,ఇప్పుడు జమీందారు ఇంటికి వచ్చి మూడు నెలలు అవుతుంది తన భర్త చేత సంతానం పొందలేకపోతే తాను ఎంత గానో ప్రేమించిన శేఖర్ కి దూరం అవ్వడంతో పాటు తాను ఆ జమీందారు కుటుంబానికి ఎల్లకాలం పడక సుఖాన్ని ఇచ్చే వేశ్యగా ఉండిపోవాల్సిందే అనుకుంటుంది.
ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లి రాత్రంతా ఎంత గానో అలోచించి మరుసటి రోజు ఉదయం బంగళా కు చేరుకుంటుంది వసుధ..టీ తీస్కొని ఆనంద్ ఉన్న గదిలోకి వెళ్తుంది వసుధ..వసుధ రావడాన్ని గమనించిన ఆనంద్ బెడ్ మీద నుండి లేచి ఓ మహారాణి వచ్చేసావా నిన్న రాత్రి నేను వచ్చేలోపే నువ్వు జారుకున్నావ్ నిన్న పొద్దున్న నేను చెప్పిన మాటలు నీకు అర్థం అయ్యాయా లెవా అంటాడు వసుధ శరీరం మీద తన చేతులను అసభ్యంగా తాకుతూ.
వసుధ,ఆనంద్ చేతులని తన శరీరం నుండి తీసేసి ఆడదాని కడుపులో బిడ్డను పుట్టించిన మాత్రాన మగాడు కాలేడు ఆడదాని మనసుని గెలిచిన వాడే మగాడు అంటుంది..దానికి ఆనంద్ సరే సరే నీ మొగుడు నీ మనసుని గెలిచాడు కానీ ఏమయ్యింది నీకు ఈ బానిసత్వం వచ్చింది.నన్ను నీ శరీరాన్ని గెలవనివ్వు బానిసత్వం నుండి విముక్తి చేస్తా అని వసుధని లోబర్చుకుంటాడు.
కొన్ని రోజులకి వసుధ గర్భవతి అవుతుంది..ఈ విషయం తెలిసిన శేఖర్ ఎంతో సంబరపడుతాడు.ఊరంతా మిఠాయిలు పంచిబెడతాడు.అలా మిఠాయిలు పంచుతూ ఆ ఊరిలోని ఒక చిన్నపాటి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లి తన భార్య కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతాడు,ఆ డాక్టర్ అన్ని జాగ్రత్తలు శేఖర్ కి వివరించి పంపుతాడు.ఒకసారి మీ భార్యని సాయంత్రం పంపించు శేఖర్ అని చెప్తాడు.అలాగే అని బయలుదేరుతాడు శేఖర్
సాయంత్రం వసుధని డాక్టర్ దగ్గరికి తీసుకొనివస్తాడు శేఖర్,డాక్టర్ వసుధని చెక్ చేసి శేఖర్ ని బయట కూర్చో మంటాడు
డాక్టర్:ఎంతో అమాయకంగా ఉండే నువ్వు ఇంతటి నెరజానవని అనుకోలేదు
వసుధ:డాక్టర్ గారు మీరేమి మాట్లాడుతున్నారు
డాక్టర్:వసుధ నేను... నీకు,శేఖర్ కి ఆర్నెల్ల నుండి వైద్యం చేస్తున్నాను శేఖర్ కి సంతానం కలిగే అవకాశమే లేదు మరి ఈ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అంటాడు డాక్టర్
డాక్టర్ మాటలకు ఆశ్చర్యపోయిన వసుధ మీరెప్పుడు శేఖర్ కి బిడ్డలు పుట్టరని చెప్పలేదే అంటుంది దానికి డాక్టర్ చూడు వసుధ కొన్నేళ్లు వైద్యం చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందేమో అని నేనే చెప్పలేదు కానీ ఇంత త్వరగా శేఖర్ ఆరోగ్యం లో మార్పు వచ్చేప్రసక్తే లేదు అంటాడు
వసుధ వెంటనే డాక్టర్ కాళ్ళమీద పడి తన తప్పును తన భర్తతో చెప్పొద్దు అని వేడుకుంటుంది.....డాక్టర్ గదిలోంచి బయటికి వచ్చిన వసుధని తీస్కొని ఇంటికి వెళ్తూ శేఖర్ వసుధతో చాలా పెద్ద తప్పుచేసావ్ వసుధ నీకు సంతానం కలగకపోతే ఇంత నీచమైన పనికి సిద్ధపడతావా అని అంటాడు
వసుధ ఆశ్చర్యంతో ఏమి మాట్లాడుతున్నావ్ శేఖర్ అని అనగానే నేను మొత్తం విన్నాను అంటాడు శేఖర్
నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను దానికి బదులుగా నువ్వు నాకిచ్చిన బహుమానం ఇదా అని శేఖర్ అనగానే
అవును ఇదే నాకు ఈ సంవత్సరం లో సంతానం కలగకపోతే జీవితాంతం నేను ఆ కుటుంబం లోని మగాలందరితో వాళ్లకి కోరిక కలిగినప్పుడల్లా సంసారం చెయ్యాలి ఒక కుక్క కన్నా హీనంగా నేను బతకాలి అప్పుడు నువ్వేమి చేసేవాడువి అని ప్రశ్నిస్తుంది లలిత
అంతవరకు వస్తే మనం ఈ ఊరి నుండి పారిపొయ్యేవాళ్ళం లేదా చచ్చిపొయ్యేవాళ్ళం కానీ నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటాడు శేఖర్ ఏడుస్తూ
శేఖర్ ఒక్క మాట చెప్తా విను నేను నీతోనే జీవించాలి అని అనుకోని నేను ఆ ఆనంద్ తో కలిసాను,చచ్చిపోవాలని నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు,చచ్చిపోయేంత ధైర్యం నీకు ఉంది కదా అదే ధైర్యం తో ఈ కాలం లో కూడా ఇలాంటి ఆచారాలను పెట్టి మనలాంటి మామూలు మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న ఆ జమిందారీ కుటుంబముని చంపు అని శేఖర్ తో కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది వసుధ.
మర్నాడు ఉదయం యధావిధిగా వసుధ బంగళాకు పనిలోకి వెళ్తుండగా.. శేఖర్, ఇంకా ఎందుకు వెళ్లడం అని ఆపుతాడు. నా కడుపులో ఒకరికి ప్రాణం పోసిన వాడికి నేను తీర్చుకోవాల్సిన ఋణం బాకీ ఉంది అని వెళ్ళిపోతుంది
ఆరోజు మధ్యాహ్నమే ఇంటికి తిరిగొచ్చేస్తుంది.మర్నాడు ఉదయం ఊరంతా గొడవ గొడవగా ఉంటుంది ఊరిలోని జనాలందరూ బంగళా వైపుకుపరిగెత్తుకుంటూ వెళ్తుంటే అందులోని ఒకడిని ఆపి జరిగిన విషయం ఏంటో చెప్పమని అడగ్గా జమీందారు కుటుంబానికి ఎవరో విషమిచ్చి చంపారంట అని చెపుతాడు.వెంటనే ఇంటికి తిరిగొచ్చి శేఖర్ జరిగిన విషయం చెప్పమని వసుధని అడుగుతాడు దానికి వసుధ వెటకారం గా నవ్వి అవును ఈ పని చేసింది నేనే అంటుంది.నా జీవితం తోనే కాకుండా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఆ కుటుంబాన్న్ని,ఆ ఆనంద్ ని నేనే చంపేసాను అంటుంది.
ఇద్దరు మాట్లాడుకుంటూఉండగా డాక్టర్ చేతిలో రిపోర్ట్ లను పట్టుకొని శేఖర్ ఇంటికి వస్తాడు.శేఖర్,శేఖర్ అని గుమ్మం బయట నుండి పిలవగా వసుధ,శేఖర్ బయటికి వస్తారు .వసుధ కి దగ్గరగా వెళ్లి నేను నీతో నిన్న తప్పుగా మాట్లాడాను శేఖర్ రిపోర్ట్ లు మారిపోవడం వల్ల నేను శేఖర్ కి సంతానం కలగదేమో అనుకున్నాను. కానీ శేఖర్ రిపోర్టులు జమిందారీ కొడుకు ఆనంద్ రిపోర్ట్ లు ఒకరివి ఒకరికి మారాయి.నీ కడుపులో పుట్టబోతున్న బిడ్డకు తండ్రి శేఖరే అనుమానించినందుకు నన్ను క్షమించు అని వెళ్ళిపోతాడు డాక్టర్.
వాళ్ళను చంపి తొందరపడ్డావు వసుధ అని అంటాడు శేఖర్..దానికి వసుధ ఆ కామాంధుడి బారి నుండి ఆ కుటుంబం బారి నుండి నేను చాలా మంది ఆడపిల్లలని కాపాడాను,ఒక ఆడదానిని తన ఇష్టం లేకుండా పొందే వాడికి ఈ శిక్ష తప్పదు అంటుంది వసుధ.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 29-08-2022, 07:46 PM
RE: ఆకాశంలో సగం - by Tammu - 02-09-2022, 08:39 PM
RE: ఆకాశంలో సగం - by Manoj1 - 02-09-2022, 11:36 PM
RE: ఆకాశంలో సగం - by Chutki - 03-09-2022, 07:20 AM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:32 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:46 PM
RE: ఆకాశంలో సగం - by k3vv3 - 03-09-2022, 02:47 PM
RE: నేను చదివిన కధలు - by k3vv3 - 11-09-2022, 01:14 PM



Users browsing this thread: 1 Guest(s)