Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - అత్త తోడికోడలీయం
#41
జుట్టుకి డై వేసుకోవడం అయ్యాక, రాధ బట్టల్ని చేతితో ఉతికి, వాటిని పిండకుండా, దండెం మీద వేసి, స్నానానికి వెళ్ళింది. 'వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు కదా. ఇంత కష్టపడడం ఎందుకు? ఉతికిన బట్టల్ని పిండకుండా వదిలేసేరేమిటి? ఆ బరువుకి దండం తెగి పడిపోతే ఏం చేస్తారు?' అనుకుంది జాగృతి. రాధ స్నానం చేసి వచ్చి, ఉతికిన బట్టలని డాబా మీదకి తీసుకెళ్ళి, అక్కడున్న దండాన్ని రిన్ తో తుడిచి, మడతలు పడకుండా బట్టలన్నింటినీ ఆరేసింది. రాధ పనితీరుకు జాగృతి ఆశ్చర్యపోతూ, 'బట్టలకి క్లిప్పులు మర్చిపోయారా ఈవిడ?' అనుకుంది.



రాధ మళ్ళీ ఎవరు తనని చూడటంలేదని నిర్దారించుకుని, తన జుట్టుని విప్పి ఆరబెట్టుకుంది.  పైపైన కనపడే వెంట్రులకు మాత్రమే డై వేసుకుని, లోపల వెంట్రుకల్ని తెల్లగానే రాధ వదిలెయ్యడాన్ని జాగృతి గమనించింది.



'బట్టలకి క్లిప్పులు పెట్టడం మర్చిపోలేదన్నమాట. అవి అర్ సమయంలో ఈవిడ జుట్టుని ఎవరు చూడకుండా ఆరబెట్టుకుందన్నమాట!!' అనుకుంది జాగృతి. బట్టలు, జుట్టు ఆరేంతవరకు డాబా మీదే ఉండి, బట్టల్ని మడతపెట్టి, దాబా మీదనుండి కిందకి దిగింది.



అప్పుడే బయటనుండి వచ్చిన మాణిక్యాలరావు రాధ చేతికి డబ్బులిచ్చి, "నిన్నే వెతుకుంటున్నాను. ఎక్కడున్నావ్ ఇంతసేపూ. పెన్షన్ డబ్బులు వచ్చాయి. జాగ్రత్తగా దాచు. పొదుపుగా ఖర్చు చెయ్యి." అని చెప్పాడు.



"నా పొదుపు గురించి మీకు తెలియదా? క్లిప్పులకి, ఇస్త్రీకి కూడా ఖర్చుపెట్టాను నేను. చక్కగా మడతలు పడకుండా బట్టల్ని ఆరేసి, అవి ఎగిరిపోకుండా చూసుకుంటూ, ఆరేంతవరకు  ఎండలోనే కూర్చుంటాను. నాకు జాగ్రత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తున్నామన్న పొగరుతో దుబారా ఖర్చులు చేసేవారికి చెప్పండి పొదుపు పాఠాలు." అని జాగృతిని చూస్తూ అంది రాధ. 



మాణిక్యాలరావు, జాగృతిని చిరాకుగా చూస్తూ, "మీ అత్తగారు చెప్పేది అర్ధమయ్యిందా? ఆవిడ దగ్గర పొదుపు నేర్చుకో. ఇంజనీరింగ్ చదివాను, ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు మా దగ్గర చూపించకు." అన్నాడు.



'ఎన్ని మాటలు అనిపిస్తోంది ఈవిడ. నేను ఈవిడ దగ్గర పొదుపు పాఠాలు నేర్చుకోవాలా? నాకేమన్నా జుట్టు తెల్లబడిందా ఈవిడలాగా? బట్టలు ఉతకటానికాని వెళ్ళి, ఎవరికీ కనపడకుండా హెయిర్ డై వేసుకుకోవడానికి. బట్టలు ఆరేంతవరకూ ఎండలోనే ఉన్నానని చెప్పి, ఎవరికీ కనపడకుండా జుట్టు ఆరబెట్టుకోవడానికి?' అని రాధని మనసులోనే తిట్టుకుంది  జాగృతి.



మాణిక్యాలరావు జాగృతిని తిడుతుంటే, రాధ మోహంలో సంతోషంతో వెలిగిపోయింది. ఆ సంతోషంలో వంట చెయ్యడానికి వెళ్ళింది. 'ఇప్పటివరకూ శుచి శుభ్రత, పొదుపు పాఠాలని నేర్చుకోమని తిట్టించిన ఈవిడ, వంట ఎలా చేస్తారో, వంటింటిని ఎలా సర్దుకున్నారో చూద్దాం.' అనుకుంటూ వంటింటిలోకి చూసింది జాగృతి. వంటిల్లంతా బూజుతో, దుమ్ముతో నిండివుంది. డబ్బాలలో ఉండాల్సిన బియ్యం, పప్పులు, పోపు దినుసులులాంటివన్నీ ప్యాకెట్లలో ఉన్నాయి.



'వంటింటిని కూడా శుభ్రంగా ఉంచటం లేదు ఈవిడ. తన భర్త ఏమీ పట్టించుకోడు, తనేం చెప్పినా నమ్ముతాడన్న నమ్మకంతో తన గురించి అన్నీ మంచిగా చెప్పుకుని, నన్ను తిట్టిస్తోంది. ఏముంది ఈవిడ మనసులో?' అనుకుంది.  



వంట చెయ్యడం అయ్యాక, రాధ మాణిక్యాలరావుని భోజనానికి పిలిచి, వండిన పదార్ధాలని వడ్డించింది. జాగృతిని లాగి, "రా అమ్మ. నువ్వు కూడా తిను. నీకొచ్చిన పని ఇదొక్కటే కదా." అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది.



రాధ అంటున్న మాటలు, ఆవిడ ప్రవర్తన జాగృతిని చాలా బాధపెట్టాయి. జాగృతికి తినాలనిపించలేదు. తినే కంచాల పక్కనే జుట్టు, దువ్వెన, మొహానికి రాసుకునే పౌడర్ ఉండడం చూసి, రాధ రిన్ తో కంచాలని కడిగిన విధానం గుర్తువచ్చి, జాగృతికి కడుపులో తిప్పినట్టు అయ్యింది. అసహ్యంతో, కన్నీళ్ళతో, తినకుండా అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది.



జాగృతిని వెళ్ళిపోవడాన్ని చూసి, "చూసారా దీని పొగరు. దీనికి పని నేర్పిస్తానని నా కొడుకుకి చెప్పాను. ఇది ఏమీ నేర్చుకోదు. ఇలాంటిదానితో నా కొడుకు బతుకు ఏమైపోతుందో ఏమో!! ఈవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే, నా కొడుకే వంట చేసుకుని, దీనికి పెట్టాలేమో!! ఈవిడ తిన్న కంచాలని కూడా వాడే కడుగుతాడేమో. నా ఖర్మ కొద్దీ వచ్చింది ఇలాంటి చదువుకున్న, ఉద్యోగం వెలగబెడుతున్న కోడలు." అని ఏడుస్తూ మాణిక్యాలరావుకు చెప్పింది రాధ.



మాణిక్యాలరావు కోపంతో, సమర్థ్ కి ఫోన్ చేసాడు. "మీ ఆవిడ ప్రవర్తన బాగులేదు. ఎవరి మాట వినదు. ఏ పని రాదు. మీ అమ్మ నేర్చుకోమని చెప్తున్నా, నేర్చుకోవడంలేదు. ఒక్క పనిలో కూడా సాయం చెయ్యలేదు. మీ అమ్మ కష్టపడి, వండి పెడితే, అది కూడా తినకుండా వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇలాంటి దానితో నువ్వు బతకలేవు. ఈ పిల్లని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగం మానేసి, పనులు నేర్చుకుని వస్తే, ముని దగ్గరికి వస్తుంది. లేదంటే ఇక ఆ అమ్మాయిని మర్చిపో." అని చెప్పాడు. రాధ కూడా ఫోన్ తీసుకుని, "నీకు ఈ పిల్ల సరైనది కాదని నేను ముందునుండి చెప్తున్నాను. నువ్వు వినలేదు. చక్కగా ఇంటి పనులు చేసుకునే ఇంకో పిల్లని ఇచ్చి పెళ్ళి చేస్తాను నీకు" అని చెప్పింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
రాధ గురించి జాగృతికి పూర్తిగా అర్ధమయ్యింది. ఏ ఉద్దేశంతో, తనతో అలా ప్రవర్తించిందో తెలిసింది. ఉద్యోగం ఎట్టి పరిస్థితిలోనూ మానకూడదని నిర్ణయించుకుంది. కానీ అప్పటికి సమర్థ్ గురించి ఏమీ తెలియని జాగృతి, తను ఎలాంటివాడో, వీళ్ళ మాటలు విని ఎం నిర్ణయం తీసుకుంటాడో అనుకుంది.



మాణిక్యాలరావు చెప్పిదంతా విన్న సమర్థ్, "వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే, ఇంకా తిని పడుకుంటుంది నాన్నా. అమ్మ దగ్గర కూడా పని నేర్చుకోవటంలేదంటే, ఎలాంటిదో తెలుస్తోంది కదా. నా దగ్గరకే పంపించండి. చూస్తూండండి. ఉద్యోగం మాన్పించి, దాని చేత పని చేయించి, దాని తిక్క ఎలా కుదురుస్తానో." అని చెప్పాడు. సమర్థ్ మాటలకి రాధ సంతోషించింది.



తరువాత, జాగృతికి ఫోన్ చేసాడు సమర్థ్. "నువ్వింక అక్కడ ఉండలేవన్న సంగతి నాకు అర్ధమయ్యింది. తొందరగా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. రేపటికి నీకు టికెట్ కొని పంపిస్తాను." అని చెప్పాడు.



జాగృతి, సమర్థ్ దగ్గరికి వెళ్ళాక, జరిగిందంతా అడిగి తెలుసుకుని, అర్ధం చేసుకున్నాడు. జాగృతి చేత సమర్థ్ పనులు చేయిస్తున్నాడో లేదో, ఉద్యోగం మాన్పించాడోలేదోనని తెలుసుకోవడానికి రాధ, సమర్థ్ కి ఫోన్ చేసింది.



"చక్కగా పనులు చేస్తోందమ్మా. ముగ్గుపిండి మధ్యలో బ్రష్ లు, టాంగ్ క్లీనర్ లు, చెప్పులు, పూల బుట్టలు ఉంచదు. గిన్నెలను రిన్ తో తోమదు. వంటింటిట్లో బూజులు ఉండవు. ఇల్లంతా ఇంద్రభవనంలా ఉంచుతోంది. ఇంక వంట అంటావా? ఇన్నాళ్లు రెస్టారంట్ లో తిన్నవాడిని నేను. అంతకన్నా చక్కగా వండుతోంది. నేను కూడా ఇప్పుడు అన్నీ పనులు తన దగ్గర నేర్చుకుంటున్నాను. ఎప్పటికైనా పనికొస్తాయి కదా. ఏమంటావ్?" అని చెప్పాడు.



వింటున్న రాధ బుర్ర తిరిగింది. మొహం మాడిపోయింది. జాగృతి చేత ఉద్యోగం మానిపించాలని, జాగృతి పరువుని తీద్దామనుకుంది. కానీ ఇప్పుడు తన పరువే పోయింది.   
***
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#43
ప్రస్తుతానికి ఈ థ్రెడ్ ఆగుతోంది.

సావకాశం ఉంటే కొనసాగుతుంది
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#44
అత్తగారి ఇంట్లో ఆరాధ్య


[Image: acb93b_00b65362fbaf4285b9f222926a153f15~mv2.jpg]


మానస రెడ్డి చిచిలీ

పెళ్లి అనేది ఒక కొత్త జీవితానికి ఆరంభం. కానీ కొన్ని అమ్మాయిలకు అది కలల ముగింపు కూడా అవుతుంది. “అత్తగారి ఇంట్లో ఆరాధ్య” కథ ఒక కోడలి మనసులోని నిశ్శబ్ద బాధలను, ప్రేమ కోసం ఎదురుచూసే హృదయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.



పెళ్లి అనే మాట వినగానే ఆరాధ్య కళ్లలో వెలుగు మెరుస్తుండేది. ఆమె కలల్లో ఒక ఇల్లు ఉండేది… ఆ ఇంట్లో ప్రేమ ఉండేది… తనను అర్థం చేసుకునే భర్త ఉండేవాడు. కానీ, ఆ కలలన్నీ ఒకరోజే మసకబారిపోయాయి. అది ఆరాధ్య పెళ్లి రోజు.
[size=undefined][size=undefined]


ఆరాధ్య పెళ్లి అయిన రోజు అందరూ నవ్వారు, కానీ ఆ నవ్వుల వెనుక ఒక నిజం దాగి ఉంది.



ఆమె భర్త రాహుల్ తన జీవితంలో ఆమెకు స్థానం ఇవ్వలేకపోయాడు. పని పేరుతో దూరంగా ఉండేవాడు…

కాల్ చేయడం కూడా అరుదే. ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తే, “బిజీగా ఉన్నాను” అన్న మాటతోనే ముగించేవాడు.



అలా ఆమె ఒంటరిగా ఆ ఇంట్లో మిగిలింది. ఆ ఇంటి పేరు “అత్తగారి ఇల్లు”, కానీ ఆమెకు అది ఒక పరాయి స్థలం.



మొదట్లో ఆమె అత్త గౌరవంగా మాట్లాడింది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మాటలు మారాయి… చూపులు మారాయి… ఆప్యాయతలు మాయమయ్యాయి.



“నీ వల్లే మా కొడుకు దూరం అయ్యాడు,” అని ఒక రోజు ఆమె అత్త గట్టిగా అరిచింది.



ఆరాధ్య ఆశ్చర్యపోయింది. “నేను ఏం చేశాను అత్తగారు?” అని అడిగింది.

“నీకు అర్హత లేదు ఈ ఇంట్లో ఉండడానికి,” అన్న ఆమె అత్తగారి మాటలు కత్తుల్లా గుచ్చుకున్నాయి.



ఆ రోజు మొదలైంది నిజమైన బాధ.

ప్రతి ఉదయం ఆమెకు ఒక పరీక్ష. వంటలో చిన్న తప్పు చేసినా తిట్లు… ఆలస్యంగా లేస్తే తిట్లు… మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే. అవమానం… అవమానం…

అవమానం… అవమానం…



“నీ తల్లిదండ్రులు నీకు ఏం నేర్పారు? నువ్వు ఏమి నేర్చుకున్నావు?”

అని అత్త అన్న మాటలు ఆమె మనసును ముక్కలుగా చీల్చాయి.

రాత్రిళ్లు ఆమె గది మూసుకుని ఏడ్చేది. ఎవరికీ చెప్పుకోలేని బాధ.



ఫోన్ తీసుకుని రాహుల్‌కు కాల్ చేయాలని అనిపించేది… కానీ వెంటనే ఆలోచించేది, “అతను వినడానికైనా సమయం కేటాయిస్తాడా?” అని.



ఒక రోజు, చాలా బాధతో ఆమె కాల్ చేసింది.

“రాహుల్… నాకు చాలా బాధగా ఉంది,” అని ఆమె గొంతులో మాట పలుకుతుండగానే,

“ఇప్పుడే మీటింగ్‌లో ఉన్నాను. తర్వాత మాట్లాడుకుందాం,” అని అతను చెప్పి కాల్ కట్ చేశాడు.



ఆ ఒక్క మాట ఆమె ఆశలను పూర్తిగా చంపేసింది.

ఆమెకు అర్థమైంది, ఈ ఇంట్లో ఆమెకు ఎవరూ లేరని.

రోజులు గడుస్తున్నాయి… కానీ ఆమె నవ్వు తిరిగి రాలేదు. కళ్లలో వెలుగు మాయమైంది. ఒకప్పుడు కలలతో నిండిన ఆ అమ్మాయి, ఇప్పుడు నిశ్శబ్దంగా జీవిస్తోంది.



ఒక సాయంత్రం, ఆమె అత్తగారు మళ్లీ తిట్టింది. ఈసారి కారణం కూడా లేకుండా.

“నీ వల్ల మా ఇంట్లో శాంతి లేదు,” అని అరిచింది.

ఆ మాట విన్న ఆరాధ్య కళ్లలో నీళ్లు నిండాయి. కానీ ఈసారి ఆమె ఏడవలేదు, కేవలం నిశ్శబ్దంగా నిలబడి ఉంది.



ఆమె గదిలోకి వెళ్లి అద్దం ముందు నిల్చుంది.

“ఇదేనా నా జీవితం?” అని తనని తాను అడిగింది.

ఆమె ముఖంలో ఒక ప్రశ్న… ఒక బాధ… ఒక ఖాళీ.

ఆ రాత్రి ఆమె డైరీ తీసుకుని ఇలా రాసింది:



“నన్ను అర్థం చేసుకునే ఒక మనిషి కోసం నేను ఎదురు చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది… నేను… నేనే నాకు తోడుగా ఉండాలి.

ఈ బాధ నాకు అంతం కాదు… కానీ ఇది నా కథలో ఒక భాగం.”



ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నా, ఆ మాటల్లో ఒక ధైర్యం ఉంది.

ఆరాధ్య ఇంకా అదే ఇంట్లో ఉంది… అదే బాధల మధ్య. కానీ ఇప్పుడు ఆమె మౌనం బలహీనత కాదు,

అది ఒక గట్టిగా నిలబడే నిర్ణయం.

ఎందుకంటే కొన్ని గాయాలు కనిపించవు… కానీ అవే మనసును బలంగా మార్చేస్తాయి.



కోడలు అంటే కేవలం ఇంటికి వచ్చిన అమ్మాయి కాదు… ఆమె కూడా ఒక ఇంటి ఆడబిడ్డ.



ఆమె ఎప్పుడో ఎవరో ఇంట్లో ప్రేమతో పెరిగిన కూతురు… కలలతో పెరిగిన అమ్మాయి.



ఆమె తన తల్లిదండ్రులను, తన బాల్యాన్ని, తన ఆత్మీయతను వదిలి… మీ ఇంటిని తన ఇంటిగా మార్చుకోవడానికి వచ్చింది.



ఆమెను గాయపరచకండి… మాటలతో అయినా, ప్రవర్తనతో అయినా.

ఎందుకంటే ఆమె హృదయం కూడా మిగతా వారిలానే నాజూకుగా ఉంటుంది.



ఆమెను అవమానించకండి, ఎందుకంటే ప్రతి అవమానం ఆమె మనసులో ఒక మచ్చగా మిగిలిపోతుంది.



ఆమె కూడా ఒక కూతురు… ఒక భార్య… ఒక తల్లి… రేపు ఒక అత్తగా మారబోయే అమ్మ.



మీరు ఈ రోజు ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో, అదే ఆమె మనసులో ఒక గాయంగా కానీ, ఒక జ్ఞాపకంగా కానీ నిలుస్తుంది.

ఆమె నవ్వు వెనుక ఉన్న బాధను గమనించండి… ఆమె మౌనం వెనుక ఉన్న కన్నీళ్లను అర్థం చేసుకోండి.



ఆమెను ప్రేమతో చూసుకుంటే… ఆమె మీ ఇంటిని స్వర్గంలా మార్చగలదు.

కానీ మీరు ఆమె మనసును నొప్పిస్తే, ఆమె మౌనంగా కన్నీళ్లు కార్చుకుంటూ తన బాధను దాచుకుంటుంది.

ఆ బాధ ఎప్పటికీ మానని గాయంగా మారుతుంది.

కోడలు ఒక పరాయి ఆడబిడ్డ కాదు… ఆమెను కూతురిలా చూసుకోండి.

అప్పుడు మాత్రమే ఒక ఇంటికి నిజమైన సంతోషం వస్తుంది.



సమాప్తం[/size][/size]
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#45
భానుమతి గారు రచించిన అత్తగారి కథలు ఓ 8/9 పి డి ఎఫ్ లో ఉన్నాయి.

మితృలు ఎవరికన్నా ఆసక్తి ఉంటె ఇక్కడ పెడతాను, ఒకదాని తరువాత మరొకటి.

ఇవన్నీ దాదాపు 60ఏళ్ళ క్రితం రాసినవి. ఈ మధ్యే దొరికాయి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#46
[Image: 01.jpg]
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)