07-01-2026, 08:34 AM
Part - 30
లలిత అన్న మాటలకి సత్యవతి గారు రోషంగా మీ అమ్మాయే కాదు పనిమంతురాలు.. నా మనవరాలు కూడా పనిమంతురాలే అని చెబుతుంది.
దానికి భార్గవి అయోమయంగా ఈవిడ ఏంటి శిల్ప ని ఇంత వెనకేసుకొస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది. మాధవి వెంటనే అవును.. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా....
పొద్దుటే లేగమంటే లెగదు. పూజ దగ్గర సర్ధమంటే తెలియదంటది. కిచెన్లో పని అంటే తెలియదంటది. చాలా కష్టం అండి మీ మనవరాలితో..
మీరేమో మా మనవరాలు కి అన్నీ తెలుసు అని చెబుతున్నారు అని వెటకారంగా అంటుది. అయ్యో నేను చెబుతుంది శిల్ప గురించి కాదు...
నా పెద్ద మనవరాలు అవని గురించి అని గొప్పగా చెబుతుంది. అంతే భార్గవి గుండెలో రాయపడుతుంది. ఇప్పుడు ఈవిడ అవిని ఎందుకు తీసుకొస్తున్నారు అని..
దానికి ఇందిరాగారా ఆశ్చర్యంగా ఏంటి మీకు ఇంకొక మనవరాలు కూడా ఉందా.. మాకు ఆ విషయం తెలియదే..
ఆరోజు మాకు ఒక్కతే కూతురని చెప్పారు అని భార్గవి వంక కోపంగా చూస్తారు. దానికి తల్లి కూతుర్లు ఇద్దరు గుటకలు మింగుతూ ఉంటారు.
సత్యవతి గారు ధనుంజయ్ వంక చూస్తూ అదేంటి ధనుంజయ్ అవని గురించి ఏమీ చెప్పలేదా నీకు ఇద్దరు కూతుర్లు కదా.. ఒక్కతే కూతురు అని ఎలా చెప్పావు అని సీరియస్ అవుతారు.
ధనుంజయ్ కి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు. ఇందిరా గారు కోపంగా ఇప్పుడు తలదించుకుంటే ఏమి ఉపయోగం..
ఇంతకీ పెద్ద మనవరాలు ఎక్కడ ఉంటుంది. ఆమె భర్త ఏమి చేస్తావుంటాడు అని అడుగుతారు. దానికి సత్యవతి గారు అయ్యో మా మనవరాలకు ఇంకా పెళ్లి అవ్వలేదండి అని చెబుతారు.
దానికి ఇందిరాగారి కోపంగా పెద్ద మనవరాలు పెళ్లి అవ్వకుండా చిన్న మనవరాలు పెళ్ళి చేస్తారా.. ఆ విషయం మళ్ళీ మా దగ్గర దాచారు. ఇదేనా మీ పద్ధతి అని సీరియస్ అవుతారు.
మీ దగ్గర ఏ పద్ధతులు లేవు కాబట్టే మీ మనవరాలు కి కూడా ఒక్క పద్ధతి రాలేదు. ఇంకా మీరు ఎన్ని విషయాలు మా దగ్గర దాచారో..
పెళ్లిలో ఏదో దోషం జరిగింది అని మా సిద్ధాంతి గారు కూడా అందుకే చెప్పి ఉంటారు. నేను శిల్పతో ఎన్ని పూజలు చేపిస్తున్న.. ఎన్ని ఉపవాసాలు చేపిస్తున్న ఇంకా దోష నివారణ జరగలేదు ఏమిటా అని కలవర పడుతున్నాము.
భార్గవి నీ పెద్ద కూతురు మీద ప్రేమ లేదా లేకపోతే నీకు పుట్టలేదా అసలు.. మీకు ఒక్కతే కూతురే అని ఆ రోజున మాకు ఎలా చెప్పావు అని సూటిగా అడుగుతారు.
భార్గవికి నుంచున్న చోట భూమి కదిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ధనుంజయ్ వంక సూటిగా చూడలేక పోతుంది. సత్యవతి గారు వెంటనే అవునండి తను భార్గవికి పుట్టిన కూతురు కాదు.
నా కొడుకుకి, నా పెద్ద కోడలు రజిత కి పుట్టిన కూతురు. అవిని పుట్టిన సంవత్సరం తర్వాత అనుకోకుండా మెట్లపై నుంచి పడి చనిపోయింది.
భార్గవి రజిత కి దూరపు బంధువు. అవిని నీ బాగా చూసుకోవడంతో ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుందని మేమే పెళ్లి చేసాము అని చెబుతారు.
మాధవి గారు ఆశ్చర్యంగా అలా ఏలాగా మెట్లపై నుంచి పడిపోయారు అని అడుగుతారు. దానికి సత్యవతి గారు నాకు అదే అనుమానం ఉంది.
రజిత అనుకోకుండా పడిపోయిందా.. ఎవరైనా తోసి ఉంటారా అన్నది నాకు అనుమానం వస్తుంది అని వారగా భార్గవి వంక చూస్తారు.
భార్గవి టెన్షన్ గా చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. సత్యవతి గారికి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇందులో భార్గవి హస్తం ఉండి ఉంటుంది అది ఏమిటో కనిపెట్టాలి అని ఫిక్స్ అయిపోతారు.
ధనుంజయ్ ఆశ్చర్యంగా సత్యవతి గారి వంక చూస్తూ అమ్మ ఏంటి నువ్వు అనేది అంటే... ఇప్పుడు మన ఇంటి విషయాలు ఎందుకు లే తర్వాత మాట్లాడుకుందాం.
నీ కూతుర్ని చూడాలని వచ్చావు కదా చూసుకుని మాట్లాడేయాల్సిన మాట్లాడటం అయిపోతే మనం బయలుదేరుదాం అని సైలెంట్ అవుతారు.
ఇందిరా గారు మాత్రం చాలా కోపంగా ఉంటారు. మీరు మా దగ్గర చాలా విషయాలు దాచేశారు అని..
లలిత గారు చూపు చాలా చిరాగ్గా ఉంటుంది. ధనుంజయ్ కి తల కొట్టేసినట్టు ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక మేము బయలుదేరుతాము అత్తయ్య గారు అని అంటాడు. దానికి ఆవిడ ఏమీ మాట్లాడదు.
మొదటిసారి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించిన పెద్దావిడ ఇప్పుడు మాట్లాడటానికి అసహ్యించుకుంటున్నారు అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అర్థమవుతుంది.
భార్గవి వంక కూడా చూడకుండా ఇంకా వెళదామా అమ్మ అని అంటాడు. భార్గవి వెంటనే తేరుకొని పెద్దమ్మ గారు అవని అప్పుడే పెళ్లి చేసుకోను అంది.
మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అలా చెప్పాను గాని నాకు నా పెద్ద కూతురు అంటే నాకు పంచప్రాణాలు అని చెబుతుంది.
అవునా అని లలిత గారు సాగదీస్తారు. అవునండి అని ఎంతో వినయంగా చెబుతుంది. ఇక ఆ టాపిక్ కట్ చేయాలని శిల్ప ఎందుకు ఇలా చిక్కపోయింది.
ఆరోగ్యం ఏమైనా బాగోలేదా అని ఆందోళనగా అడుగుతుంది. అయ్యో మీ అమ్మాయి ఆరోగ్యానికి బాగానే ఉంది.
దోషం తోలగడానికి సిద్ధాంతి గారు చాలా పెద్ద పూజ చెప్పారు. అమ్మాయి ఉదయం మాత్రమే కొంచెం అల్పాహారం తీసుకుని రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఆకలి వేస్తే పళ్ళు మాత్రమే తినాలి.
మేమే చూస్తూ ఉండలేక రెండి ఇడ్లీలు, ఒక దోస అయినా పెడుతున్నాము అని అమాయకంగా చెబుతారు. ఏమిటి అని భార్గవి ఆశ్చర్యంగా అడుగుతుంది.
అంత కొంచమే తింటే అమ్మాయి ఏమైపోతుంది. పైగా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా...
ఆ సిద్ధాంతి గారి ఎవరు నాకు చెప్పండి నేను ఒకసారి మాట్లాడతాను అని భర్త వంక చూస్తుంది. ధనుంజయ్ మందు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన అవిని విషయంలో భార్గవి అలాగే చేసింది కదా...
అదే తిరిగి శిల్ప కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏమి స్పందించను. మీకు ఏది మంచిదైతే అదే చేయండి చెల్లెమ్మ అని చెప్పి ఇంకా బయలుదేరుతారు అని చెప్పి స్పీడ్ గా బయటకు వచ్చేస్తాడు.
శేషగిరి, సత్యవతి గారు ఇందిరాగారి వంక చూసి చిన్న చిరునవ్వుతో వెళ్లి వస్తాము అని చెప్పి బయటకు వచ్చేస్తారు.
భార్గవికి ఏమి చేయాలో అర్థం కాక కూతురు వంక చూస్తూ భర్త వెనకాల బయటికి వస్తుంది. ధనుంజయ్ కారు జై సింహ మాన్షన్ దాటి బయటికి రాగానే సత్యవతి గారు కారు ఆపు ధనుంజయ్ అని చెబుతారు.
ఏమైందమ్మా అని అడుగుతాడు. ఒక్క నిమిషం భార్గవి వైపు తిరిగి నీ ఫోను పర్సు ఇలా ఇవ్వు. అలాగే ధనుంజయ్ ఒకసారి నీ భార్యని ఇలాగే ఫోటో తియ్యి అని చెబుతారు.
ఎందుకమ్మా అని అయోమయంగా అడిగితే ముందు చెప్పింది చెయ్ అని గట్టిగా మాట్లాడతారు. సరే అని ఫోటో తీస్తాడు. ఫోటో తీయడం అవ్వగానే కారు దిగు భార్గవి అని చెబుతారు.
ఎందుకు అత్తయ్య గారు అని కంగారుగా అడుగుతుంది. నువ్వు ఇక్కడి నుండి మన ఇంటి దాకా కాలినడకనే రా.. ఎక్కడైనా ఆటో ఎక్కినా క్యాబ్ బుక్ చేసుకుందామని తెలిసినా... అలాగే ఒంటి మీద ఉన్న నగలు ఎవరికైనా ఇచ్చి లిఫ్ట్ తీసుకున్న వారం రోజుల దాకా నువ్వు మన ఇంటి గేటు బయట ఉంటావు.
నీ వెనకాల మన మనిషి ఉంటాడు. ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చినట్టు ఉన్నా సరే నాకా విషయం తెలిసిపోతుంది. తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి నువ్వే బాధ్యురాలు అవుతావని కోపంగా అంటారు.
ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు అని అడుగుతుంది. మొదటి తప్పు మీకు ఒక్కతే కూతురు అని చెప్పడం. అవని గురించి ఎక్కడా చెప్పకపోవడం.
రెండవ తప్పు ఈరోజు నా దగ్గర అబద్ధం చెప్పి తీసుకురావడం. దానికి నువ్వు శిక్ష అనుభవించవలసిందే అని గట్టిగా చెబుతారు.
భార్గవి కోపంగా అంత దూరం ఎవరైనా నడిచి రాగలరా నేను కారు దిగను అంటే... సరే అయితే నేను నా భర్త కారు దిగి మేము నడిచి వస్తాము.
అది నీకు ఇష్టమైతే ధనుంజయ్.. నీ భార్యని తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పి కారు దిగబోతుంటే... అమ్మ నువ్వు ఆగు అని భార్గవి వంక చూస్తూ కారు దిగు అని చెబుతాడు.
ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తుంది. మర్యాదగా చెబుతున్నాను కారు దిగి అమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ రా..
ఏమైనా పిచ్చి వేషాలు వేసావని నాకు తెలిసిందో అమ్మ కోపాన్ని కాదు నా కోపాన్ని చూడాల్సి వస్తుంది దిగు అనే అరుస్తాడు.
భార్గవి ఏమీ చేయలేక కారు దిగుతుంది. ధనుంజయ్ ఎవరికో ఫోన్ చేసి భార్గవిని ఫాలో చేయమని చెబుతాడు. భార్గవిని దింపి ధనుంజయ్ కారు ముందుకు వెళ్ళిపోతుంది.
భార్గవి ఇంకా తప్పక నడవడం మొదలు పెడుతుంది. ఏమిటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఈ మధ్యన నేను వేస్తున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోతున్నాయి.
ఎప్పుడు నా మాట వినే నా భర్త ఈరోజు నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. మళ్లీ ఎలాగైనా ఈయననినా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ఎలా అని ఆలోచిస్తూ నడవడం మొదలు పెడుతుంది.
కార్లో వెళుతున్న ముగ్గురు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ధనుంజయ్ మెదడులో మాత్రం మాధవి సత్యవతి గారు అన్న మాటలే తిరుగుతూ ఉంటాయి.
రజిత అనుకోకుండా మెట్ల పైనుంచి పడిపోయిందా, ఎవరైనా తోసారా ఎలా తెలుసుకునేది. నా చుట్టూ చాలా జరిగాయి.
ఇందులో గాని భార్గవి హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం నేను ఇచ్చే పనిష్మెంట్ నుంచి జీవితంలో తప్పించుకోలేదు అని కోపాన్ని అంత స్టీరింగ్ మీద చూపిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
సత్యవతి గారు కొడుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీలో ఈ ఆలోచన రావాలి అప్పుడే నిజ నిజాలు అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని సైలెంట్ అయిపోతారు.
కారు దీగి లోపలికి వెళ్ళగానే ధనుంజయ్ అమ్మ అని పిలుస్తాడు. చెప్పు ధనుంజయ్ అనగానే.. రజిత గురించి నీకు ఎందుకు అనుమానం వచ్చింది అని అడుగుతాడు.
నీకు రాలేదా అని సూటిగా అడుగుతారు.
దానికి ధనుంజయ సమాధానం ఏమిటి..
కథ కొనసాగుతుంది..
దానికి భార్గవి అయోమయంగా ఈవిడ ఏంటి శిల్ప ని ఇంత వెనకేసుకొస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తుంది. మాధవి వెంటనే అవును.. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా....
పొద్దుటే లేగమంటే లెగదు. పూజ దగ్గర సర్ధమంటే తెలియదంటది. కిచెన్లో పని అంటే తెలియదంటది. చాలా కష్టం అండి మీ మనవరాలితో..
మీరేమో మా మనవరాలు కి అన్నీ తెలుసు అని చెబుతున్నారు అని వెటకారంగా అంటుది. అయ్యో నేను చెబుతుంది శిల్ప గురించి కాదు...
నా పెద్ద మనవరాలు అవని గురించి అని గొప్పగా చెబుతుంది. అంతే భార్గవి గుండెలో రాయపడుతుంది. ఇప్పుడు ఈవిడ అవిని ఎందుకు తీసుకొస్తున్నారు అని..
దానికి ఇందిరాగారా ఆశ్చర్యంగా ఏంటి మీకు ఇంకొక మనవరాలు కూడా ఉందా.. మాకు ఆ విషయం తెలియదే..
ఆరోజు మాకు ఒక్కతే కూతురని చెప్పారు అని భార్గవి వంక కోపంగా చూస్తారు. దానికి తల్లి కూతుర్లు ఇద్దరు గుటకలు మింగుతూ ఉంటారు.
సత్యవతి గారు ధనుంజయ్ వంక చూస్తూ అదేంటి ధనుంజయ్ అవని గురించి ఏమీ చెప్పలేదా నీకు ఇద్దరు కూతుర్లు కదా.. ఒక్కతే కూతురు అని ఎలా చెప్పావు అని సీరియస్ అవుతారు.
ధనుంజయ్ కి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు. ఇందిరా గారు కోపంగా ఇప్పుడు తలదించుకుంటే ఏమి ఉపయోగం..
ఇంతకీ పెద్ద మనవరాలు ఎక్కడ ఉంటుంది. ఆమె భర్త ఏమి చేస్తావుంటాడు అని అడుగుతారు. దానికి సత్యవతి గారు అయ్యో మా మనవరాలకు ఇంకా పెళ్లి అవ్వలేదండి అని చెబుతారు.
దానికి ఇందిరాగారి కోపంగా పెద్ద మనవరాలు పెళ్లి అవ్వకుండా చిన్న మనవరాలు పెళ్ళి చేస్తారా.. ఆ విషయం మళ్ళీ మా దగ్గర దాచారు. ఇదేనా మీ పద్ధతి అని సీరియస్ అవుతారు.
మీ దగ్గర ఏ పద్ధతులు లేవు కాబట్టే మీ మనవరాలు కి కూడా ఒక్క పద్ధతి రాలేదు. ఇంకా మీరు ఎన్ని విషయాలు మా దగ్గర దాచారో..
పెళ్లిలో ఏదో దోషం జరిగింది అని మా సిద్ధాంతి గారు కూడా అందుకే చెప్పి ఉంటారు. నేను శిల్పతో ఎన్ని పూజలు చేపిస్తున్న.. ఎన్ని ఉపవాసాలు చేపిస్తున్న ఇంకా దోష నివారణ జరగలేదు ఏమిటా అని కలవర పడుతున్నాము.
భార్గవి నీ పెద్ద కూతురు మీద ప్రేమ లేదా లేకపోతే నీకు పుట్టలేదా అసలు.. మీకు ఒక్కతే కూతురే అని ఆ రోజున మాకు ఎలా చెప్పావు అని సూటిగా అడుగుతారు.
భార్గవికి నుంచున్న చోట భూమి కదిలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ధనుంజయ్ వంక సూటిగా చూడలేక పోతుంది. సత్యవతి గారు వెంటనే అవునండి తను భార్గవికి పుట్టిన కూతురు కాదు.
నా కొడుకుకి, నా పెద్ద కోడలు రజిత కి పుట్టిన కూతురు. అవిని పుట్టిన సంవత్సరం తర్వాత అనుకోకుండా మెట్లపై నుంచి పడి చనిపోయింది.
భార్గవి రజిత కి దూరపు బంధువు. అవిని నీ బాగా చూసుకోవడంతో ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుందని మేమే పెళ్లి చేసాము అని చెబుతారు.
మాధవి గారు ఆశ్చర్యంగా అలా ఏలాగా మెట్లపై నుంచి పడిపోయారు అని అడుగుతారు. దానికి సత్యవతి గారు నాకు అదే అనుమానం ఉంది.
రజిత అనుకోకుండా పడిపోయిందా.. ఎవరైనా తోసి ఉంటారా అన్నది నాకు అనుమానం వస్తుంది అని వారగా భార్గవి వంక చూస్తారు.
భార్గవి టెన్షన్ గా చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. సత్యవతి గారికి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇందులో భార్గవి హస్తం ఉండి ఉంటుంది అది ఏమిటో కనిపెట్టాలి అని ఫిక్స్ అయిపోతారు.
ధనుంజయ్ ఆశ్చర్యంగా సత్యవతి గారి వంక చూస్తూ అమ్మ ఏంటి నువ్వు అనేది అంటే... ఇప్పుడు మన ఇంటి విషయాలు ఎందుకు లే తర్వాత మాట్లాడుకుందాం.
నీ కూతుర్ని చూడాలని వచ్చావు కదా చూసుకుని మాట్లాడేయాల్సిన మాట్లాడటం అయిపోతే మనం బయలుదేరుదాం అని సైలెంట్ అవుతారు.
ఇందిరా గారు మాత్రం చాలా కోపంగా ఉంటారు. మీరు మా దగ్గర చాలా విషయాలు దాచేశారు అని..
లలిత గారు చూపు చాలా చిరాగ్గా ఉంటుంది. ధనుంజయ్ కి తల కొట్టేసినట్టు ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక మేము బయలుదేరుతాము అత్తయ్య గారు అని అంటాడు. దానికి ఆవిడ ఏమీ మాట్లాడదు.
మొదటిసారి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించిన పెద్దావిడ ఇప్పుడు మాట్లాడటానికి అసహ్యించుకుంటున్నారు అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అర్థమవుతుంది.
భార్గవి వంక కూడా చూడకుండా ఇంకా వెళదామా అమ్మ అని అంటాడు. భార్గవి వెంటనే తేరుకొని పెద్దమ్మ గారు అవని అప్పుడే పెళ్లి చేసుకోను అంది.
మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అలా చెప్పాను గాని నాకు నా పెద్ద కూతురు అంటే నాకు పంచప్రాణాలు అని చెబుతుంది.
అవునా అని లలిత గారు సాగదీస్తారు. అవునండి అని ఎంతో వినయంగా చెబుతుంది. ఇక ఆ టాపిక్ కట్ చేయాలని శిల్ప ఎందుకు ఇలా చిక్కపోయింది.
ఆరోగ్యం ఏమైనా బాగోలేదా అని ఆందోళనగా అడుగుతుంది. అయ్యో మీ అమ్మాయి ఆరోగ్యానికి బాగానే ఉంది.
దోషం తోలగడానికి సిద్ధాంతి గారు చాలా పెద్ద పూజ చెప్పారు. అమ్మాయి ఉదయం మాత్రమే కొంచెం అల్పాహారం తీసుకుని రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఆకలి వేస్తే పళ్ళు మాత్రమే తినాలి.
మేమే చూస్తూ ఉండలేక రెండి ఇడ్లీలు, ఒక దోస అయినా పెడుతున్నాము అని అమాయకంగా చెబుతారు. ఏమిటి అని భార్గవి ఆశ్చర్యంగా అడుగుతుంది.
అంత కొంచమే తింటే అమ్మాయి ఏమైపోతుంది. పైగా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా...
ఆ సిద్ధాంతి గారి ఎవరు నాకు చెప్పండి నేను ఒకసారి మాట్లాడతాను అని భర్త వంక చూస్తుంది. ధనుంజయ్ మందు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన అవిని విషయంలో భార్గవి అలాగే చేసింది కదా...
అదే తిరిగి శిల్ప కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏమి స్పందించను. మీకు ఏది మంచిదైతే అదే చేయండి చెల్లెమ్మ అని చెప్పి ఇంకా బయలుదేరుతారు అని చెప్పి స్పీడ్ గా బయటకు వచ్చేస్తాడు.
శేషగిరి, సత్యవతి గారు ఇందిరాగారి వంక చూసి చిన్న చిరునవ్వుతో వెళ్లి వస్తాము అని చెప్పి బయటకు వచ్చేస్తారు.
భార్గవికి ఏమి చేయాలో అర్థం కాక కూతురు వంక చూస్తూ భర్త వెనకాల బయటికి వస్తుంది. ధనుంజయ్ కారు జై సింహ మాన్షన్ దాటి బయటికి రాగానే సత్యవతి గారు కారు ఆపు ధనుంజయ్ అని చెబుతారు.
ఏమైందమ్మా అని అడుగుతాడు. ఒక్క నిమిషం భార్గవి వైపు తిరిగి నీ ఫోను పర్సు ఇలా ఇవ్వు. అలాగే ధనుంజయ్ ఒకసారి నీ భార్యని ఇలాగే ఫోటో తియ్యి అని చెబుతారు.
ఎందుకమ్మా అని అయోమయంగా అడిగితే ముందు చెప్పింది చెయ్ అని గట్టిగా మాట్లాడతారు. సరే అని ఫోటో తీస్తాడు. ఫోటో తీయడం అవ్వగానే కారు దిగు భార్గవి అని చెబుతారు.
ఎందుకు అత్తయ్య గారు అని కంగారుగా అడుగుతుంది. నువ్వు ఇక్కడి నుండి మన ఇంటి దాకా కాలినడకనే రా.. ఎక్కడైనా ఆటో ఎక్కినా క్యాబ్ బుక్ చేసుకుందామని తెలిసినా... అలాగే ఒంటి మీద ఉన్న నగలు ఎవరికైనా ఇచ్చి లిఫ్ట్ తీసుకున్న వారం రోజుల దాకా నువ్వు మన ఇంటి గేటు బయట ఉంటావు.
నీ వెనకాల మన మనిషి ఉంటాడు. ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చినట్టు ఉన్నా సరే నాకా విషయం తెలిసిపోతుంది. తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి నువ్వే బాధ్యురాలు అవుతావని కోపంగా అంటారు.
ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య గారు అని అడుగుతుంది. మొదటి తప్పు మీకు ఒక్కతే కూతురు అని చెప్పడం. అవని గురించి ఎక్కడా చెప్పకపోవడం.
రెండవ తప్పు ఈరోజు నా దగ్గర అబద్ధం చెప్పి తీసుకురావడం. దానికి నువ్వు శిక్ష అనుభవించవలసిందే అని గట్టిగా చెబుతారు.
భార్గవి కోపంగా అంత దూరం ఎవరైనా నడిచి రాగలరా నేను కారు దిగను అంటే... సరే అయితే నేను నా భర్త కారు దిగి మేము నడిచి వస్తాము.
అది నీకు ఇష్టమైతే ధనుంజయ్.. నీ భార్యని తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పి కారు దిగబోతుంటే... అమ్మ నువ్వు ఆగు అని భార్గవి వంక చూస్తూ కారు దిగు అని చెబుతాడు.
ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తుంది. మర్యాదగా చెబుతున్నాను కారు దిగి అమ్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ రా..
ఏమైనా పిచ్చి వేషాలు వేసావని నాకు తెలిసిందో అమ్మ కోపాన్ని కాదు నా కోపాన్ని చూడాల్సి వస్తుంది దిగు అనే అరుస్తాడు.
భార్గవి ఏమీ చేయలేక కారు దిగుతుంది. ధనుంజయ్ ఎవరికో ఫోన్ చేసి భార్గవిని ఫాలో చేయమని చెబుతాడు. భార్గవిని దింపి ధనుంజయ్ కారు ముందుకు వెళ్ళిపోతుంది.
భార్గవి ఇంకా తప్పక నడవడం మొదలు పెడుతుంది. ఏమిటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఈ మధ్యన నేను వేస్తున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోతున్నాయి.
ఎప్పుడు నా మాట వినే నా భర్త ఈరోజు నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. మళ్లీ ఎలాగైనా ఈయననినా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ఎలా అని ఆలోచిస్తూ నడవడం మొదలు పెడుతుంది.
కార్లో వెళుతున్న ముగ్గురు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ధనుంజయ్ మెదడులో మాత్రం మాధవి సత్యవతి గారు అన్న మాటలే తిరుగుతూ ఉంటాయి.
రజిత అనుకోకుండా మెట్ల పైనుంచి పడిపోయిందా, ఎవరైనా తోసారా ఎలా తెలుసుకునేది. నా చుట్టూ చాలా జరిగాయి.
ఇందులో గాని భార్గవి హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం నేను ఇచ్చే పనిష్మెంట్ నుంచి జీవితంలో తప్పించుకోలేదు అని కోపాన్ని అంత స్టీరింగ్ మీద చూపిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
సత్యవతి గారు కొడుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీలో ఈ ఆలోచన రావాలి అప్పుడే నిజ నిజాలు అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని సైలెంట్ అయిపోతారు.
కారు దీగి లోపలికి వెళ్ళగానే ధనుంజయ్ అమ్మ అని పిలుస్తాడు. చెప్పు ధనుంజయ్ అనగానే.. రజిత గురించి నీకు ఎందుకు అనుమానం వచ్చింది అని అడుగుతాడు.
నీకు రాలేదా అని సూటిగా అడుగుతారు.
దానికి ధనుంజయ సమాధానం ఏమిటి..
కథ కొనసాగుతుంది..


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

