Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అమృత వర్షం
ఊర్వశీపురూరవుల కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
త్రేతాయుగం అనగానే మనకు శ్రీరామ చంద్రుడు గుర్తుకు వస్తాడు. శ్రీరామ చంద్రుడు అనగానే ‘శ్రీరాముడు చెట్టు చాటునుండి వాలిని చంపాడు. సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు. నిండు గర్భవతిగా అయిన సీతమ్మ ను అడవికి పంపాడు. అమానుషం గా శంబూకుని సంహరించాడు. ఆడదైన యక్ష రాక్షసిని చంపాడు. శూర్పణఖ ముక్కూ చెవులూ కోయించాడు’ వంటి విషయాలు గుర్తుకు వస్తాయి.
అయితే త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. మూడు కాళ్ళ ధర్మం లో జన్మించిన శ్రీరామ చంద్రుడు యుగ ధర్మం ప్రకారం సంచరించాడు అనే విషయం మాత్రం గుర్తుకు రాదు. అలాగే వన వాసం పూర్తి చేసుకుని సకాలంలో అయోధ్య కు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని భరతుడు శ్రీరామ చంద్రుని తో అన్నాడు.
అలాగే శరంబంగ మహర్షి వంటి మహర్షులు అగ్ని ప్రవేశం చేసారు. అసలు ఆ కాలంలో అగ్ని ప్రవేశం అంటే ఏమిటి అనే విషయాలు కూడా గుర్తుకు రావు.
త్రేతాయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన సత్య యుగం కాదు అనే విషయం కూడా గుర్తుకు రాదు. ఏదేమైనా ధర్మం మూడు పాదాల నడిచిన త్రేతాయుగంలో జరిగిన కథ ఊర్వశీపురూరవులు.
త్రేతాయుగం లో ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పురూరవుడు అనే రాజు పరిపాలించేవాడు. సమస్త లోకాలలో అతనిని మించిన అందగాడు లేడని అందరితో పాటు దేవతలు కూడా అనుకునేవారు. అతని పరాక్రమానికి అతని పరాక్రమమే సాటి అని సుర నర యక్ష కిన్నెర రాక్షసాది వీరులు ధీరులు అనుకునేవారు. అతని అందాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్ర పటం లో చిత్రించాలని నరసురాది
చిత్రకారులు అందరూ ప్రయత్నించారు. కానీ అది ఎవరికీ సాధ్యం కాలేదు.
అతడు యుగ ధర్మాన్ని అనుసరించి లెక్క లేనన్ని అశ్వమేధ యాగాలను చేసాడు. అహంకారం ప్రదర్శించే రాజుల అహాన్ని మట్టి కరిపించాడు. మంచి మానవత్వం ఉండి, ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునే రాజులను సోదరుల కంటే మిన్నగా చూసుకున్నాడు. వారు "మేం పేరుకు సామంత రాజులమే గానీ నిజానికి మేం పురూరవుని ఆరవ ప్రాణం" అనుకునేటట్లు ప్రవర్తించాడు.
ఇలా పురూరవుడు భూమండలం మొత్తాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో నివసించే నిరుపేదల కష్టసుఖాలను తెలుసుకుని వారికి తగిన సహాయ సహకారాలు అందించాడు. తను పుట్టిన పురు పర్వతం మీద వేద పాఠశాలను, లౌకిక విద్యలను నేర్పించే పాఠశాలలను, వైద్య శాలలను, మనుషుల మనో గతాలను అనుసరించి వారి సామర్థ్యాలను పెంచే విద్యాలయాలను నిర్మించాడు.
పురూరవుడు తన అవక్ర పరాక్రమంతో సంపాదించిన సంపాదన సమస్తాన్ని తన రాజ్యంలోని వారందరు సమానంగా పంచుకోండి అని అన్నాడు. సంపదను సమానంగా పంచవలసిన బాధ్యతను తన రాజ్యంలోని కొందరు బ్రాహ్మణులకు అప్పగించాడు. నిరు పేదలకు, నిర్భాగ్యులకు యుగ ధర్మానుసారం కొంచెం ఎక్కువ ధనం ఇవ్వమనీ బ్రాహ్మణులకు చెప్పాడు.
అందుకు ఆ బ్రాహ్మణులు, "రాజా పురూరవ! అవసరమైతే నిరుపేదలకు మా ధనం కూడా ఇచ్చేస్తాం" అన్నారు.
బ్రాహ్మణుల మాటలను విన్న పురూరవుడు మిక్కిలి సంతోషించాడు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా పురూరవుని రాజ్యం లో ప్రతి రోజూ ఏదో ఒక వేడుక జరుగుతుండేది. అతని రాజ్యం లో యజ్ఞ యాగాదులు విస్తృతంగా జరిగేవి. శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను జరిపించిన ఋషులు, వేద పండితులు సంతృప్తి గా జీవించడానికి కావలసిన ధనకనకవస్తు వాహనాలను పురూరవుడు వారికి పుష్కలంగా సమకూర్చాడు. యజ్ఞ యాగాదులకు కావలసిన సరకులను, గజతురగాదులను, గోవులను సమకూర్చిన వారికి సహితం పెద్ద ఎత్తున సకల సంపదలను సమ కూర్చాడు.
నిరుపేదలను ఆదుకున్న ఋషులను వేద పండితులను పురూరవుడు తానే స్వయంగా పెద్ద ఎత్తున సన్మానించాడు. యజుర్వేద పురుష వదన రూపమైన మేకలను సంరక్షించే వారిని ప్రత్యేకంగా గౌరవించాడు. వారికి కావలసిన సకల సదుపాయాలను సమకూర్చాడు. " సా విశ్వాయుః.. సా విశ్వ కర్మా.. సా విశ్వధాయాః" అంటూ శుక్ల యజుర్వేద మంత్రముల లోని వర్ణాలను ఉదాత్తానుదాత్తాది స్వరాలతో గణిత బద్దంగా ఉచ్చరించే వారికి ప్రత్యేక ప్రయోగ శాలలను నిర్మించి ఇచ్చాడు. అప్పుడప్పుడు తను కూడా ప్రయోగ శాల లకు వెళ్ళి కొత్త విషయాలను నేర్చుకో సాగాడు.
పురూరవుడు తన రాజ్యంలో ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హ్యపత్యం అనే త్రేతాగ్నులు పరిపూర్ణ తేజస్సు తో లేవని గమనించాడు. త్యాగ గుణం నిమిత్తం అవి తప్పక ఉండాలనుకున్నాడు. పవిత్ర తేత్రాగ్నులను తీసుకు రావడానికి పురూరవుడు గంధర్వ లోకం బయలు దేరాడు. మార్గ మధ్యంలో పురూరవునికి కొందరు సాధువులు కనపడ్డారు.
వారు ఒక్కొక్కరు ఒక బంగారు పాత్రను పురూరవునికి ఇస్తూ, "రాజా ! ఇవి అక్షయ బంగారు పాత్రలు. వీటిని స్వీకరించి సుఖంగా ఉండు. నీ గంధర్వ లోక పయనం ఆపు. "అని అన్నారు.
పురూరవుడు వారు సాధువులు కాదని, త్యాగ గుణ కంటకులు అని గ్రహించాడు. వెంటనే వారు ఇచ్చిన బంగారు పాత్రలను వారి ముఖం వైపుకే విసిరి కొట్టాడు.. బంగారు పాత్రలు మండుతున్న మంటలు గా మారి సాధువుల ముఖాలను మాడ్చి వేసాయి. పురూరవుడు, సాధు రూపంలో వచ్చినవారు తన ప్రయత్నానికి అడ్డుపడే దుష్ట శక్తులు అని గ్రహించాడు.
మాడిన ముఖాలతో దుష్ట శక్తులు మాయమై పోయాయి. అంత పురూరవుడు గంధర్వ లోకము నుండి త్రేతాగ్నులను తీసుకుని వచ్చాడు. యజ్ఞ శాలకు తూర్పు వైపున ఉండే ఆహవనీయ గుండం విషయంలో అత్యంత శ్రద్ద తీసుకోమని ఋషులకు, వేద పండితులకు చెప్పాడు. తన రాజ్యంలో యజ్ఞ శేషము ను భుజించు అమృతాశులు అధికంగా ఉండాలని మహర్షులకు సూచించాడు.
పురూరవుడు త్రేతాగ్నులను తీసుకువచ్చే సందర్భంలో రంభ మేనక త్రిలోత్తమాదులతో ఉద్యానవనం లో సంచరించే ఊర్వశి మొదటిసారి గా త్రేతాగ్నులలో ప్రకాశించే పురూరవుని చూసింది. పురూరవుని చూడగానే ఊర్వశి లోని అందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అయ్యింది. ఆమె ఆలోచనల్లో ఇల్లాలి తనం, మాతృత్వం అధికం కాసాగాయి. ఆమె నర్తన లో అయిదవ తనం గల ఇల్లాళ్ళ హావభావాలు అధికం కాసాగాయి.
ఆ హావభావాలను చూసిన దేవేంద్రుడు ఇంద్ర సభ లో ఆమెకు మహోన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఊర్వశి తనకు మహోన్నత స్థానం సంక్రమించినప్పుడు "ఇదంతా పురూరవ దర్శన భాగ్యం" అని మనసులో అనుకుంది.
నారాయణుని ఊరువుల నుండి జన్మించిన తన జన్మ మరింత పవిత్రమైనది అని అనుకుంది.
పురూరవుని చూసిన ఊర్వశి, "ఇతడు సామాన్యుడు కాదు. మహారాజు లను మించిన మహారాజు. ఘన రాజులను మించిన ఘన రాజు. సురులను మించిన సురుడు. " అని మనసులో అనుకుంది.
క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులను విస్తృతంగా నిర్వహించే పురూరవుని తో అనేకమంది దేవతలు స్నేహ సంబంధాలను పెంచుకున్నారు. యజ్ఞ దేవతలందరూ సంతృప్తిగా హవిస్సులను అందుకున్నారు.
వైకుంఠం లో, కైలాసం లో, బ్రహ్మ లోకం లో, తదితర లోకాలలో దేవతల నడుమ అప్సరసల నడుమ వచ్చిన చిన్న చిన్న సమస్యలకు పురూరవుడే తగిన పరిష్కారాన్ని చూపించి సమస్త లోకాల దేవతల మన్ననలను పొందాడు.
ఒకసారి బ్రహ్మ లోకం లో బ్రహ్మాభారతులు, ‘సృష్టించడం గొప్ప విషయమా? సృష్టి లోని జీవరాశులకు జ్ఞానం ప్రసాదించడం గొప్ప విషయమా?’ అన్న విషయం మీద తగవులాడుకున్నారు. వారి తగాద చివరికి చిన్నపాటి యుద్దం అయ్యింది.. ఈ విషయం పురూరవునికి నారదుని ద్వారా తెలిసింది.
అప్పుడు పురూరవుడు బ్రహ్మ లోకం వెళ్లి, "జ్ఞానం లేని సృష్టి అల్లకల్లోలమై అనుక్షణం రక్త సముద్రం అవుతుంది. సృష్టి శృతి మించకూడదు. జ్ఞానం వెర్రి తలలు వెయ్యకూడదు. " అని పురూరవుడు బ్రహ్మ భారతులకు చెప్పాడు.
26 కలియుగంలో శృతి మించిన సృష్టి చక్రం గురించి, వెర్రి తలలు వేసిన జ్ఞానం గురించి బ్రహ్మ భారతులకు పురూరవుడు చెప్పాడు. పురూరవుని మాటలను విన్న బ్రహ్మ భారతులు పురూరవుని పలు విధాలుగా మెచ్చుకున్నారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
అమలిన జ్ఞాన చక్రాన ప్రకాశిస్తూ బ్రహ్మ భారతుల మెప్పును పొందే పురూరవుని ఊర్వశి రెండవ సారి చూచింది. అప్పుడు పురూరవుడు ఊర్వశి హృదయంలో సుస్థిరంగా నిలిచి పోయాడు. ఊర్వశి తన అంతఃపురంలో శయనించినప్పుడు ఆమె హృదయం లోని పురూరవుడు ఆమె శయనం మీదకు వచ్చాడు. ఆమె అధరాలను నిమిరి అమృతం కురిపించాడు.
ఊర్వశి పురూరవునే తలచుకుంటూ ఇంద్ర సభకు సహితం వెళ్ళడం మానేసింది. అది తెలిసిన ఇంద్రుడు ఊర్వశి మందిరం నకు వచ్చి పురుషోత్తమ నృత్యం చేయమన్నాడు.
ఊర్వశి పురుషోత్తమ అని ప్రారంభించి పురూరవ అంటూ శతప్రశంస పురూరవ నృత్యం చేసింది. దేవేంద్రుడు ఊర్వశి మనసును గ్రహించాడు. ఊర్వశి పురూరవుని మనసులో నిలుపుకోవడానికి విధాత రాత లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నాడు. కడకు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అనుకున్నాడు.
ఒకనాడు ఊర్వశి, రంభ, మేనక, త్రిలోత్తమాదులతో కూడి ఉద్యానవనం లో ఉంది. ఊర్వశి రంభ కు పురూరువుని రూపం గురించి పలు విధాలుగా వర్ణించి చెప్పసాగింది. అప్పుడు అందమైన యువతుల వెంట్రుకల కోసం వచ్చిన కేశిన్ అనే మాంత్రిక రాక్షసుడు ఊర్వశిని చూసాడు.
సృష్టి లో యజుర్వేదం లేకుండా చేయాలని కేశిన్ అనే మాంత్రికుడు అనేక మేకలను క్షుద్ర దేవతలకు బలి ఇచ్చాడు. యజుర్వేద పురుషుడి బొమ్మను అప్సరసల వెంట్రుకలతో కట్టాలని క్షుద్ర దేవత అనడంతో కేశిన్ అక్కడకు వచ్చాడు. అప్సరసల వెంట్రుకలను అపహరించాలని అనుకున్నాడు.
ఊర్వశిని చూడగానే కేశిన్. ఆలోచనా సరళి మారింది. కేశిన్ క్షుద్ర పూజకు మంగళం పాడి ఊర్వశి ప్రేమలో మునిగి పోయాడు. ‘ఊర్వశి నా ప్రేయసి నువ్వే నా ప్రాణం, నేనే నీ హృదయ రూపం’ అంటూ ఊర్వశి నామం జపియించ సాగాడు.
పురూరవుని పక్షపాత రాహిత్యానికి, అతని నిజాయితీకి మిక్కిలి సంతసించిన కొందరు రాక్షసులు కూడా అతని అనుచరులు అయ్యారు. యుగ ధర్మం తప్పని రాక్షసులకు సహితం పురూరవుడు తన సహాయ సహకారాలను అందించాడు.
అప్పుడప్పుడు దేవతలు రాక్షస సంహారం నిమిత్తం పురూరవుని సహాయం కోరేవారు. పురూరవుడు యుగ ధర్మం తప్పిన రాక్షస సంహారం నిమిత్తమే దేవతలకు సహకరించేవాడు. యుగ ధర్మం తప్పిన రాక్షసులనైన సరే దేవతలనైన సరే పురూరవుడు కఠినంగా శిక్షించేవాడు.
ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునే పురూరవుడు నిరుపేదల పాలిట దేవుడు అయ్యాడు. పురూరవుడు నిరుపేదలు తప్పు చేసిన ఊరుకునేవాడు కాదు. "ప్రతి మనిషి తన శక్తి మేర ఏదో ఒక పని చేయాలనేవాడు. మనిషికి నిద్రలేమి మంచిది కాదనే వాడు.. ఓంకార జపము లో ఔషద గుణం ఉందనే వాడు. అందరితో కలిసి జీవించాలి అనేవాడు.
ఎవరైనా సరే తమ శక్తి మేర ఆరోగ్య నిమిత్తం యాగం చేయించాలి అనేవాడు. పౌర్ణమి నాడు చేసే పూర్ణ యాగం, అమావాస్య రాత్రి చేసే దర్శ యాగం ఇంకా తదితర యాగాల గురించి తనకు తెలిసింది ప్రజలందరికి చెప్పేవాడు. యజుర్వేద పఠనం ద్వారా గణిత జ్ఞానం వికసిస్తుందనేవాడు. చీకటి వెలుగుల జీవన గమనాన్ని విధాత రాతకు అనుకూలంగా చూపించేవి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనేవాడు.
ఒకసారి పురూరవుడు వైకుంఠం లో కలిసిన సమస్త దేవ బృందం ను దర్శించుకుని తిరిగి వస్తుండగా, ఊర్వశి అతని కంటపడింది. అప్పుడు అతని మనసులో నారాయణుని ఊరువులు మెదిలాయి. మహోన్నత ఉషస్ లో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అతని మనసులో కదలాడాయి. అప్రయత్నంగా అతని పెదవుల నుండి ఓం కేశవాయ స్వాహ అంటూ మంత్ర శ్లోకాలు ఉద్భవించాయి. అటు పిమ్మట ఊర్వశి రూపం అతని మనసులో నిలిచిపోయింది.
పదే పదే మనసులో కదలాడే ఊర్వశి రూపం మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, ఊర్వశీ ఊర్వశీ అంటూ పురూరవుడు అంతఃపురంలో అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ విషయం అవకాశవాదులైన కొందరు బ్రాహ్మణ పండితులకు తెలిసింది. వారు పురూరవుని మనసుని, అతని మనసులోని ఊర్వశి రూపాన్ని రకరకాలుగా వక్రీకరించి వర్ణించారు. ఈ విషయం కుల గురువు వశిష్ట మహర్షి ద్వారా పురూరవునికి తెలిసింది.
అప్పుడు పురూరవుడు కుల గురువు వశిష్ట మహర్షి తో, "దేవ వశిష్ట మహర్షి.. ఊర్వశి నా మనసున కేవలం అప్సరస గా కాకుండా యజుర్వేద తేజంతో నారాయణ ఊరు తేజంతో నిలిచింది అన్నది ముమ్మాటికీ నిజం. అయితే కేవలం ఒక స్త్రీ వ్యామోహ తేజం లో పడి నేను రాజ్య పరిపాలనా బాధ్యతను విస్మరించేటంతటి అవివేకిని కాదు" అని అన్నాడు.
ఒకనాడు ఒక నిరుపేద పురూరవుని అంతఃపురంలో పురూరవుని కలిసాడు. నిరుపేదను విషయం ఏమిటని పురూరవుడు అడిగాడు. అప్పుడు ఆ నిరుపేద, "రాజా! బ్రాహ్మణులకు మీరు పంచమని ఇచ్చిన సంపదను పూజలు, వ్రతాల పేర్లతో వారే ఉంచి వేసుకుని, మా ముఖాన ఎంగిలి మెతుకులు వేస్తున్నారు. అదేమంటే ఇది అంతే అంటున్నారు. మా నిరుపేదలకు మీరే న్యాయం చెయ్యాలి. " అని అన్నాడు.
నిరుపేద మాటలను విన్న పురూరవుడు మంత్రులనూ, ఊరి పెద్దలను పిలిపించి నిరుపేద మాటలలో నూటికి నూరు శాతం నిజం ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అంత కత్తి పట్టి బ్రాహ్మణుల దగ్గరున్న ధనాన్నంత తెప్పించి నిరుపేదలందరికి పంచి పెట్టాడు.
కొందరు ఛాందస బ్రాహ్మణులు పురూరవుని కుల గురువు వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్ళి ‘పురూరవుడు ఊర్వశి మైకం లో పడి చెయ్యకూడని పనులను చేస్తున్నాడు మా ధనాన్నంత అతగాడు అపహరించాడు. అంతేగాక పురూరవుడు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి ధర్మానికి కొరివి పెడుతున్నాడు’ అని చెప్పడమే గాక కొందరు పండితుల చేత పురూరవుడు బాహ్య సౌందర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు అని ప్రచారం చేయించారు. అలా కొన్ని తాళ పత్ర గ్రంథాలు కూడా వ్రాయించారు.
బ్రాహ్మణుల మాటలను విన్న వశిష్ట మహర్షి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు నిరాకరించి, అది బ్రాహ్మణ ధనం కాదు. నిరుపేదల ధనం అన్నాడు.
వశిష్ట మహర్షి కోపంతో బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్ళి పురూరవుడు బ్రాహ్మణ ధనం తీసుకున్న విధానం చెప్పాడు. బ్రహ్మ సనత్ కుమారుని పిలిచి పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇప్పించి రమ్మని పలికాడు. సనత్ కుమారుడు పురూరవుని కలిసి బ్రాహ్మణ ధనం బ్రాహ్మణులకు ఇచ్చివేయమన్నాడు. అందుకు పురూరవుడు "సనత్ కుమార! బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు ధర్మం మూడు పాదాల మీద నడిచే త్రేతాయుగంలో కూడా ధర్మం నాలుగు పాదాల మీద నడిచే సత్య యుగం బ్రాహ్మణునిగా బతికి బ్రహ్మ తేజం తో యశసించాలి. అలాంటి వారే నిజమైన బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ముందుగా బ్రహ్మ జ్ఞానం ను తాను అనుసరించి చూపించాలి.
అది చెయ్యని వారు పుట్టుకతో బ్రాహ్మణులైన అసలు సిసలు బ్రాహ్మణులు మాత్రం కాదు. అలాంటి వారికి ఎలాంటి సహాయం చేయనవసరం లేదు. నేను సమస్త ప్రజలకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు సమానంగా పంచమని ఇచ్చిన సంపదను కొందరు బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నారు. అలాంటి వారికి ధనం ఇవ్వవలసిన పనిలేదు. "అని అన్నాడు.
పురూరవుని మాటలకు ఆగ్రహోదగ్రుడైన సనత్ కుమారుడు, "హే పురూరవ! నువ్వు సూర్యోదయం లతో అనుసంధానించబడిన చంద్ర వంశ సంజాతుడవు.. నీలో సూర్య చంద్ర కళలు సమ స్థాయిలో ఉన్నాయి. నీకు కొందరు దేవతలనే శాసించగలిగిన సామర్థ్యం ఉంది అని నాకు తెలుసు. త్రేతాగ్నులు, యజుర్వేద పురుషుడు నిన్ను విశ్వ సుర కవచం తో కాపాడుతున్నారు. అలాంటి నీ మీద నా శాపం పని చేయదు. అయినా నా సుర శక్తినంత ధారపోసి నువ్వు కొంత కాలం వెర్రివాడిగ తిరగాలని శపిస్తున్నాను. " అని పురూరవుని శపించాడు.
సనత్ కుమారుని శాపాన్ని విన్న పురూరవుడు
"హే దేవ! యుగ ధర్మం నిరుపేదల మానసిక ధర్మం దరిదాపు ఒకే రీతిన ఉంటుంది. నేను ఆ పథానే పయనిస్తున్నాను. ఆకలి దప్పిక లకు అల్లంత దూరంలో ఉండే మీలాంటి మహాత్ములు కృత యుగ ధర్మ భావనలతోనే సంచరిస్తుంటారు. ఆ ఆలోచనలతోనే ఒక్కొక్కసారి ఆవేశపడుతుంటారు. అదేమంటే మేము మీ మాటలను పెడ చెవిన పెట్టి గర్వంగా సంచరిస్తున్నాము అంటారు.
మీ శాపం నా మీద పని చేయదని మీరే అంటున్నారు. అయితే మీలాంటి మహాత్ముల వరాలను, శాపాలను యుగ ధర్మం తప్పకుండా సదా తలవంచి స్వీకరించాలనే సదాలోచనలు ఉన్నవాడిని నేను.. మీ శాపాన్ని నా తలరాత గా భావించి స్వీకరిస్తాను. మీ శాపం నాకు తగల వలెనని యుగ పురుషుని ప్రార్థిస్తాను" అని పురూరవుడు సనత్ కుమారుని తో అన్నాడు.
పురూరవుడు సనత్ కుమారుని శాపాన్ని స్వీకరించాడు. సనత్ కుమారుని శాప ప్రభావం నూరింట ఒక వంతు పురూరవుని తనువు ని ఆక్రమించింది. అప్పటినుండి సమస్త భూమండలంలో, విశ్వంలో ఉండే మేకలు అధికంగా చని పోసాగాయి. గణిత జ్ఞానం ఉన్న వారు అధిక శాతం పిచ్చి వాళ్ళు కాసాగారు. యజుర్వేదం లోని శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చదివే వారిలో అప శబ్దాలు అధికం కాసాగాయి.
ఒకనాడు పురూరవుడు గంధర్వ లోకం నుండి భూమి మీదకు వస్తుండగా ఊర్వశి వెంట పడుతున్న మాంత్రిక రాక్షసుడు కేశిన్ అతని కంట పడ్డాడు. పురూరవుడు కేశిన్ తో యుద్దానికి సిద్ధపడ్డాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కేశిన్ వెంట్రుకలు వంటి తెలుపు నలుపు కిరణ బాణాలతో పురూరవుని తో యుద్దం చేయసాగాడు. అది గమనించిన పురూరవుడు యూక( పేను మరియు స్వేదం వలన పుట్టిన క్రిములు) కిరణ బాణాలతో కేశిన్ ని ఎదుర్కొన్నాడు. కేశిన్ శరీరం నిండా యూక బాణాలు చుట్టుముట్టాయి. కేశిన్ భయంకర ఆర్తనాదాలతో ప్రాణాలను విడిచాడు.
పురూరవుడు ఊర్వశిని పరిశీలనగ చూసాడు. సనత్ కుమారుని శాప ప్రభావం చేత అతని మనసులో
కేవలం ఊర్వశి యే నిలిచింది. అంతకు ముందే పురూరవుని చూచి ఉండటంతో ఊర్వశి పురూరవుని కౌగిలిలో ఒదిగి పోయింది. ఇరువురు ప్రేమ లోకం లో విహరించ సాగారు.
ఊర్వశి కౌగిలి లోనే కాలం గడుపుతున్న పురూరవుని ప్రవర్తనను గమనించిన వశిష్ట మహర్షి ఇదంతా తన వలనే జరిగింది అని అనుకున్నాడు. కొందరు అవకాశవాద బ్రాహ్మణుల మాటలకు అగ్ర పీఠం వేసి పురూరవుని ఈ పరిస్థితికి తెచ్చి తప్పు చేసానని వశిష్ట మహర్షి అనుకున్నాడు.
అంత వశిష్ట మహర్షి పురూరవుడంటే ప్రాణమిచ్చే క్షాత్ర ధర్మం ఉన్నవారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాడు. వారికి వశిష్ట మహర్షి పురూరవుని శాప విషయం చెప్పకుండా మీ పరిపాలనా దక్షతను పరిక్షీంచుకోండి అని చెప్పాడు.
ఋషులు, మహర్షులు యజుర్వేద క్షీణత గురించి, పిచ్చి వారవుతున్న గణిత పండితుల గురించి, తగ్గిపోతున్న మేకల సంపద గురించి దేవేంద్రుని కి చెప్పారు.
అప్పుడు దేవేంద్రుడు తన దివ్యదృష్టితో సమస్తం తెలుసుకుని "మహర్షులారా! చంద్రవంశానికి చెందిన పురూరవుని లో యజుర్వేద అంశ ఉంది. అతను సనత్ కుమారుని శాపాన్ని వినయంగా స్వీకరించాడు. ప్రస్తుతం సనత్ కుమారుని శాప ప్రభావం నాలుగింట ఒక వంతు పురూరవుని మీద ఉంది. అందువలన యజుర్వేదం చదవాలని ప్రయత్నించే వారి నాలుకలు తడబడి అప శబ్దాలు ఉత్పన్నమవుతాయి.
యజుర్వేదం లో అనేకానేక గణిత అంశాలు ఉంటాయి. అందులో వధూ పీఠం ( పరిపూర్ణ పైథాగరస్ సిద్దాంతం) వంటి గణిత అంశాలు ఉంటాయి. శాప ప్రభావాన యజుర్వేద గణితాంశాలను ఔపాసన పట్టిన వారు పిచ్చివాళ్ళు అవుతున్నారు. యజుర్వేద పురుషుడు మేక ముఖం తో పసుపు రంగు తో ఒక చేత కర్ర పట్టి ఉంటాడు. సమస్త సృష్టికి సంపదలు, శుభములు ప్రసాదిస్తుంటాడు.
సృష్టిలో మేకల సంపద తరిగి పోవడానికి ప్రధాన కారణం సనత్ కుమారుని శాపం. ప్రస్తుతం మూడింట ఒక వంతు మాత్రమే పురూరవుని సనత్ కుమారుని శాప ప్రభావం ఆవరించింది. మొత్తం శాప ప్రభావం పురూరవుని ఆవహిస్తే సృష్టిలో యజుర్వేద ఛాయలు లేకుండా పోతాయి. పురూరవుని శపించడం అంటే యజుర్వేదం ను శపించటమే. గణిత తేజం ను శపించటమే " అని మహర్షులతో అన్నాడు.
"పురూరవుని కబళిస్తున్న శాప ప్రభావం మొత్తం తగ్గిపోవాలంటే తక్షణ కర్తవ్యం ఏమి”టని మహర్షులు దేవేంద్రుని అడిగారు.
"పురూరవుడు ఇలా బుధుల సంతానం. బుధుడు చంద్రుని కుమారుడు. పురు పర్వతం మీద ఇలా బుధులకు పుట్టిన సంతానమే పురూరవుడు. అతడే యజుర్వేద సంరక్షణ చెయ్యాలి. పురూరవుడు అంటే యజుర్వేదం. యజుర్వేదం అంటే పురూరవుడు. అందుకే అతను భూమండలం తో పాటు పదమూడు ద్వీపాలను జయించ గలిగాడు. త్రేతాగ్నులను తన గుప్పిట ఉంచుకో గలిగాడు.
ఇక యజుర్వేద సంరక్షణ నిమిత్తం పురూరవుడు దిగంబరంగా మారాలి. అప్పుడు చంద్రుడు పురూరవుని మీద అమృత వర్షం కురిపిస్తే పురూరవుని శాపం తక్షణం అతన్ని వదిలిపోతుంది." అని మహర్షులతో దేవేంద్రుడు అన్నాడు.
"పురూరవుని దిగంబరునిగా ఎలా చేయాలి? అప్పుడు అతను యజుర్వేద సంరక్షణ ఎలా చేస్తుంటాడు? " అని మహర్షులు దేవేంద్రుని అడిగారు.
"ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మ భారతులే చెప్పాలి " అని మహర్షులతో అన్నాడు దేవేంద్రుడు.
దేవేంద్రుడు మహర్షులు అందరినీ తీసుకుని బ్రహ్మ భారతుల దగ్గరకు వెళ్ళాడు. తన వంతు కర్తవ్యం గా పురూరవుని గురించి చెప్పాడు..
దేవేంద్రుడు చెప్పిన మాటలన్నిటిని విన్న బ్రహ్మ" ఈ సమస్యకు పరిష్కారం చెప్పు " అన్నట్లు సరస్వతీ దేవి ముఖం చూసాడు. అప్పుడు సరస్వతీ దేవి, " దేవేంద్ర! మహర్షులారా! యుగ ధర్మాన్ని చక్కగా పాటించే వారి ముందు దేవతలు సహితం తల వంచాల్సిందే. లేకుంటే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. ఛాందస భావ జాలం అధికంగా ఉన్నవారు సత్య యుగ ధర్మం సత్య యుగ ధర్మం అని ఎదుటివారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తారు తప్పించి వారు సహితం సత్య యుగ ధర్మం పాటించరు.
అలాంటి వారి మీద సురనరయక్షకిన్నెరరాక్షసాది జాతులు వారు ఎవరూ జాలి దయ చూపించకూడదు. యుగ ధర్మం పాటించని బలి చక్రవర్తి వంటి వారి వలన సృష్టి కి మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది.
ఇక యుగ ధర్మం గురించి ఆలోచించకుండా కొందరు బ్రాహ్మణుల మీద అధిక జాలి చూపించడం వలననే ఇదంతా జరిగింది. ప్రస్తుతం పురూరవుడు ఊర్వశీ ప్రేమ సాగరం లో మునిగి తేలుతున్నాడు.. మీరు ఊర్వశిని కలిసి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే రెండు మేకలను ఆమెకు ఇవ్వండి. ఆ రెండు మేకలను పురూరవుడు అతి జాగ్రత్తగా సంరక్షించాలి. అలాగే పురూరవుడు ఎప్పుడూ ఊర్వశి ముందు దిగంబరంగా ఉండరాదు. అప్పుడే తనని పెళ్ళి చేసుకుంటానని ఊర్వశి తో పురూరవునికి చెప్పించండి. ఆపై యుగ ధర్మ కాలమే చూసుకుంటుంది." అని సరస్వతీ దేవి దేవేంద్రుని తోనూ మహర్షుల తోనూ అంది.
దేవేంద్రుడు బ్రహ్మ భారతులకు నమస్కరించి మహర్షులతో ఊర్వశి దగ్గరకు పయనమయ్యాడు. ఊర్వశి ఒడిలో శయినించిన పురూరవుడు ఊర్వశి అధరాలను, ఆమె అందాలను సప్త ఛందో వృత్తాలతో ప్రశంసిస్తూ, తనని పెళ్ళి చేసుకోమని ఊర్వశిని అడిగాడు. అందుకు ఊర్వశి ధర్మ బద్ధంగా ఆలోచించి చెబుతాను అంది.
అనంతరం పురూరవుడు ప్రేమ జలం తీసుకురావడానికి దగ్గరలో ఉన్న శృంగార శైలానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు ఊర్వశిని కలిసి సరస్వతి చెప్పిన మాటలను చెప్పాడు. సరస్వతీ దేవి చెప్పిన పని చేసినప్పుడే నీకు ఇంద్ర లోక దర్శనం. ఇదే నీకు నా శాపం " అన్న దేవేంద్రుని తో ఊర్వశి అలాగే అంది.
దేవేంద్రుడు, మహర్షులు సుర బలంతో, తపో బలంతో రెండు మేకలను సృష్టించి ఊర్వశి కి ఇచ్చారు. శుక్ల యజుర్వేదం తోనూ, కృష్ణ యజుర్వేదం తోనూ రెండు మేకలు ప్రకాశిస్తున్నాయి.
పురూరవుడు తెచ్చిన ప్రేమ జలం తాగుతూ ఊర్వశి "నా ప్రేమ ప్రాణేశ్వర! శశాంక పౌత్ర! ఈ రెండు మేకలను నువ్వంతట నువ్వే జాగ్రత్తగ సంరక్షించాలి. ఇక నువ్వు నా కళ్ళ ముందెప్పుడూ దిగంబరంగా కనపడ కూడదు. ఇందుకు సరే అంటేనే నిన్ను నేను వివాహం చేసుకుంటాను. " అని ఊర్వశి పురూరవుని తో అంది.
పురూరవుడు ఊర్వశి చెప్పినట్లు చేస్తాను అని చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కొంత కాలం ప్రణయ సాగరంలో మునిగి తేలారు.
ఒక నాడు పురూరవుడు రెండు మేకలను తీసుకుని నిగమ శిఖరం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మేకలను మేతకు వదిలాడు. మేకల ముఖం లో పురూరవునికి శుక్ల యజుర్వేద పురుషుడు, కృష్ణ యజుర్వేద పురుషుడు కనపడ్డాడు. వెంటనే అప్రయత్నంగా అతని నోట యజుర్వేద మంత్రాలు వచ్చాయి.
దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మరియు మాయా గంధర్వ గొల్లలు రెండు మేకలను దొంగిలించాలని చూసారు. అప్పుడు పురూరవుడు వారితో పెనుగులాడి రెండు మేకలను సంరక్షించాడు. ఆ పెనుగులాటలో పురూరవుని కుడి చేతి వేళ్ళకు కొంచెం గాయాలయ్యాయి.
పురూరవుడు మేకలను తీసుకుని యింటికి వచ్చాడు. తను నెల తప్పిన విషయం ఊర్వశి పురూరవునికి చెప్పింది. పురూరవుడు మిక్కిలి సంతోషించాడు.
మేకల దొంగలు ఎక్కువయ్యారని పురూరవుడు రెండు మేకలను తను శయనించే గది పక్క గదిలోనే వాటి నివాస స్థావరం ఏర్పాటు చేసాడు.
పురూరవుడు రెండు మేకల దగ్గర కూర్చుని చదివే యజుర్వేద మంత్రాలను ఊర్వశి గర్భం లో ఉన్న శిశువు వినసాగాడు.
ఒక శుభ ముహూర్తాన ఊర్వశి కి పండంటి మగ శిశువు పుట్టాడు. ఆ శిశువుకు పురూరవుడు ఆయువు అని పేరు పెట్టాడు. అటు పై ఊర్వశి పురూరవులకు మరో అయిదుగురు మగ శిశువులు పుట్టారు. వారికి వనాయువు, శతాయువు, ధీమంతుడు, ధృఢాయువు, అమావసువు అనే పేర్లను ఊర్వశి పురూరవులు పెట్టారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఒకనాడు ఊర్వశి పురూరవులు నిద్రిస్తుండగా దేవేంద్రుడు పంపిన విశ్వావసువు మాయా గంధర్వ గొల్లలు మారు వేషంలో వచ్చి రెండు మేక పిల్లలను దొంగిలించారు. మేక పిల్లల అరుపులకు పురూరవునికి, ఊర్వశి కి మెలకువ వచ్చింది. మేక పిల్లలను దొంగలు ఎత్తుకు వెళుతున్నారని పురూరవునికి అర్థం అయ్యింది.
పురూరవుడు వెంటనే మంచం మీద నుండి లేచాడు. అతడు ధరించిన పంచె మంచం కోడుకు పట్టుకుని అతనికి దూరం అయ్యింది. అతడు అదేమీ పట్టించుకోకుండా రెండు మేక పిల్లల సంరక్షణ నిమిత్తం పరుగు తీసాడు. దేవేంద్రుని ప్రభావాన ఉరుమలు ఉరిమాయి. మెరుపులు మెరిసాయి. ఆ మెరుపు లో ఊర్వశి దిగంబరంగా ఉన్న పురూరవుని చూసింది.
దేవేంద్రుని విన్నపము ను అనుసరించి చంద్రుడు తన మనుమడు పురూరవుని మీద "అమృత వర్షం" కురిపించాడు. ఆ అమృత వర్షమే పురూరవునికి అమృత వస్త్రాలయ్యాయి . సనత్ కుమారుడు పెట్టినాడు శాపం సగం కూడా పురూరవుని అంటక ముందే శాప శక్తి ఛాందస శక్తిని చుట్టు ముట్టింది.
శాప విమోచనం కలిగిన పురూరవుని వశిష్ట మహర్షి రాజ్యానికి ఆహ్వానించాడు. నియమాను సారం ఊర్వశి తన పతిగ పురూరవుని విసర్జించింది.
పురూరవుడు సతిగా కాకున్న సాటి మనిషి గా కొంత కాలం తన రాజ్యంలో ఉండమని ఊర్వశి ని కోరాడు. అందుకు ఊర్వశి సమ్మతించింది. అంత పురూరవుడు ఊర్వశి తోనూ, తన సంతానం తోనూ ప్రతిష్టాన పురానికి వచ్చాడు. కొందరు ఛాందస బ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకుని తమని క్షమించమని పురూరవుని ప్రార్థించారు. పురూరవుడు అందరినీ క్షమించాడు. నిరుపేదల పేదరికం తొలగించడానికి నిరంతరం పోరాడతానని ప్రజలందరికి మాట ఇచ్చాడు.
ఊర్వశీపురూరవులు కొంత కాలం ఆనందంగా జీవించారు. పురూరవుడు కడు సమర్థుడు అయిన తన కుమారుడు ఆయువు కు పట్టాభిషేకం చేసాడు. అనంతరం ఆనందంగా తపోవనానికి వెళ్ళిపోయాడు.
తపోవనానికి వెళుతున్న పురూరవుడు ఉషను విసర్జిస్తున్న సూర్య నారాయణునిలా ఉన్నాడు. అతని నోట వెలువడే యజుర్వేద మంత్రాలలో పునర్జన్మ వాసనలు బహిర్గతం మవుతున్నాయి.
ఊర్వశి దేవేంద్రుని విన్నపము ను అనుసరించి ఇంద్ర లోకం వెళ్ళిపోయింది.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కామ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మాలను క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా పాటించేవాడు. అతని ఏలుబడిలో పదునెక్కిన భూసారం పుష్టికరమైన పంటలను ప్రసాదించేది. యజ్ఞ యాగాదులనుండి ఆవిర్భవించిన దట్టమైన పొగలు ప్రకృతి ని, పుడమినిని, గగనాన్ని ఆవరించేవి. దాని ప్రభావం తో వాతావరణం పవిత్రమై సారవంతంగా ప్రకాసించేది.
పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మం పాటించగ వచ్చిన ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఫలితాల్లో వచ్చిన కష్టసుఖాలను తనే భరించేవాడు. ధర్మార్థ కామ మోక్ష మార్గాలను నియమ బద్ధంగా ప్రజల చేత అనుసరింపచేసేవాడు.
పృథశ్రవస మహారాజు ఏ ధర్మాన్ని అయినా ముందు తను అనుసరించేవాడు. ఆపై మంచి ఫలితం ఉన్న ధర్మాన్ని ప్రజలను అనుసరించమనేవాడు. అందుకే అతని రాజ్యం లో అధిక శాతం మంది మనుషులు అతనంటే మహా యిష్టపడేవారు.
పృథశ్రవస మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అతని నడివయస్సులో అతనికి
మంచి శుభ ముహూర్తాన సంతానం కలిగింది.
పృథశ్రవస మహారాజు లేక లేక పుట్టిన ఆడ సంతానానికి మహర్షుల, జ్యోతిష్యుల ఆదేశానుసారం కామ అని పేరు పెట్టాడు.
కామ నామకరణ మహోత్సవానికి అనేకమంది రాజులు,సామంత రాజులు అతిథులుగా వచ్చారు. అందులో ప్రతిష్టాన పురానికి చెందిన మహా భౌముడు అతని భార్య సుపుష్ట కూడా వచ్చారు.వారితో పాటు వారి కుమారుడు ఆయుతానీకుడు కూడా వచ్చాడు.
అతను తన ఆటపాటల నైపుణ్యం తో అందరిని ఆనందింపచేసాడు. ఋగ్వేద మూలాలలోని గణిత శోభను అందరికి తెలియచేసాడు.ఋగ్వేదంలోని 10552 మంత్రముల మాటున ఉన్న గణిత శోభను తెలియచేసాడు. ఆయా మంత్రాల మాటున ఉన్న ఉదాత్తానుదాత్తాది స్వరాల మాటున ఉన్న గణిత తేజాన్ని అందరికి ఎరుక పరిచాడు. ఋక్కులలోని పదబంధ గణితాన్ని వివరించాడు. ఋక్కులు సూక్తాలుగ విభజించబడిన శాస్త్రీయ విధాన్నాన్ని వివరించాడు.
పృథశ్రవసుడు కాల ధర్మానుసారం ధర్మార్థకామమోక్ష మార్గాలని అనుసరిస్తూ" కామ" ని పెంచి పెద్ద చేయసాగాడు.." కామ" నాటి ప్రతిభావంతులైన మహర్షులు,పండితులు పామరులు అందరి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది.
" కామ" అమలిన కామ సంచారిణి గ మంచి పేరు తెచ్చుకుంది. ధర్మం అయినా, అర్థం అయినా, కామమైన, మోక్షమైన అతి సర్వత్ర వర్జయేత్ అనే స్వభావం గల కామ మాటలను మహర్షులు సహితం ప్రశంసించేవారు.
కామ ఋగ్వేదం లోని ఋక్కులు గురించి,10 మండలాల గురించి 1028 సూక్తముల గురించి మహర్షులతో ఎక్కువగా చర్చించేది. అగ్ని దేవునితో మొదలు పెట్టి అగ్ని దేవునితో ముగిసే ఋగ్వేదం మూలాలను గురించి కామ అనునిత్యం ఆలోచించేది. ఆత్మ చైతన్య స్వరూపమే అగ్ని. ఆ అగ్నే పరమాత్మను కలుస్తుంది అని కామ ఋగ్వేదం లోని అగ్ని గురించి చేసే చర్చలు మహా మహా మహర్షులను కూడ ఆలోచింపచేసేవి. ఈ అగ్ని ప్రయాణంలోనే అమలిన కామం ఉంటుందనే కామ మాటలను మహర్షులు, బ్రహ్మర్షులు సహితం ఆమోదించేవారు.
కామ అంతఃపురంలో కంటే హాలికుల పొలాలో ఎక్కువగా సంచరించేది. శ్రమైక జీవన సిద్దాంతానికి అగ్ర పీఠం వేసేది. స్వేదం చిందేలా కష్టపడే పవిత్ర హృదయాలలో ప్రశాంతంగా జనించే కామమే నిజమైన కామం అనేది. కామ పథాన సంచరించి మోక్ష మార్గాన్ని చేరవచ్చనేది. కామిగాక మోక్ష కామి కాడు అన్న భావనలోని ఆంతర్యాన్ని అందంగా వివరించి చెప్పేది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ధన మూలం ఇదం జగత్ అనేవారు తమ వంద శాతం జీవితంలో ఒక భాగం ధనం ఉన్నవారు రెండు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. రెండు భాగాల ధనం ఉన్నవారు మూడు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. మూడు భాగాల ధనం ఉన్నవారు నాలుగు భాగాల ధనం ఉన్నవారిని అనుసరిస్తారు. వంద శాతానికి సరిపడ నాలుగు భాగాల ధనం ఉన్నవారు తమ చిత్తం వచ్చినట్లు ఆలోచిస్తారు. ఆ చిత్తం లో ఋగ్వేద దేవతలు లేకుంటే వారి ఆలోచనలు సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అని కామ చెప్పే మాటలు పండిత పామరులందరిని ఆకర్షించేవి.
కామ ప్రతిష్టాన పురాన్ని పరిపాలించే ఆయుతానీకుని సుపరిపాలనను చారుల ద్వారా అనుక్షణం తెలుసుకునేది. కామ ఆయుతానీకుని పట్టాభిషేకానికి తలిదండ్రులతో సహా వెళ్ళింది. అక్కడ
"కామ భావ విజయం" అనే నృత్యాన్ని ప్రదర్శించింది.
ఆ నృత్యం లో సామాన్య కుటుంబంలో జన్మించిన వారు సహితం సాధన ద్వారా మోక్షం పొందవచ్చును అని తెలియ చేసే ఋగ్వేదం లోని ఋభుగణ వృత్తాంతాలు ఉన్నాయి. కామ నృత్యం అక్కడి వారినందరిని ఆకర్షించింది. ముఖ్యంగా తన నృత్యం లో కామ తీసుకున్న ఋభుగణ వృత్తాంతం ఆయుతానీకుని విపరీతంగా ఆకర్షించింది.
ఆయుతానీకుడు పది వేల గోబృందాలతో గోపూజ చేయించడం, గోవులను గోపాలురను సంరక్షించడం వంటి అంశాలు కామను బాగా ఆకర్షించాయి. అలా కామ క్రమ క్రమంగా ఆయుతానీకుని మీద యిష్టాన్ని పెంచుకుంది.
కామ మహర్షుల, మహానుభావుల ఆశీర్వాదం తో పృథ్వీ తీర్థం ను ఏర్పాటు చేసింది. ఆ కొలను దగ్గర కామ ఋగ్వేద మంత్రాలతో అనేక పవిత్ర యాగాలను చేయించింది ఆ కొలను లో స్నానం చేసిన వారికి వెయ్యి గోదానాల ఫలితం వస్తుందని కామను ఇంద్రుడు ఆశీర్వదించాడు. అంతేగాక ఆ కొలనులో స్నానం చేసిన సమస్త జీవరాశికి అమలిన కామ సంచార సుగుణం అలవడుతుందని సమస్త దేవ గణం కామ ను ఆశ్వీర్వదించింది.
కామ దేవతల ఆశీర్వాదం ఏ మేర ఫలిస్తుందో గమనించడానికి అన్నట్లు తన చెలికత్తెలలో అతి కామం ప్రదర్శించే నిర్లజ్జ, నిరుణ, నితి వంటి వారిని పృథ్వీ తీర్థం లో స్నానం చేయమంది. కామ మాటలను అనుసరించి వారు పృథ్వీ తీర్థం లో స్నానం చేసారు. అనంతరం వారు అమలిన కామ గుణాలతో ప్రకాశించారు. ఋగ్వేద ప్రచారం లో, హాలిక సమాజాభివృద్ధికి ప్రధాన పాత్ర వహించారు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేయాలని రాక్షసులు, గోహింసా పరులు ప్రయత్నించారు. అప్పుడు కామ కత్తి పట్టింది. గోహింసా పరుల కుత్తుకలను తెగ నరికింది. సమరంలో ఆమెకు ఇంద్రుడు,అత. ఆని అనుచరులు తోడుగా వచ్చారు. ఇది తెలిసి ఆయుతానీకుడు కూడా కామ కు తోడుగా యుద్ద రంగానికి వచ్చాడు.
పృథ్వీ తీర్థం ను నాశనం చేద్దాం అనుకున్న గోహింసా పరులు, రాక్షసులు యుద్ద రంగంలో కాలికి బుద్ది చెప్పారు. కామను విజం వరించింది. పృథ్వీ తీర్థం లో ఇంద్రుడు, ఆయుతానీకుడు స్నానం చేసారు. గోదాన ప్రముఖులు గా కీర్తిని ఆర్జించారు. అప్పటినుండి వారి చేతుల మీదుగా అనేక గోదానాలు జరిగాయి.
ఆయుతానీకుని సహాయంతో కామ యజ్ఞం లను నిరసించే యతులకు తగిన బుద్ది చెప్పింది. తన రాజ్యంలో అనేక యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. కామ మనసును గ్రహించిన పృథశ్రవసుడు ఆయుతానీకుని అల్లునిగా చేసుకోవడానికి సిద్దమయ్యాడు. ఆయుతానీకుని తలిదండ్రులు సుపుష్ట మహా భౌముల దగ్గరకు పెళ్ళి పెద్దలను పంపాడు. వారు రైవత మన్వంతరం లోని దేవ గణం పృథుకం కు చెందిన పృథశ్రవసుని గతాన్నంత తెలుసుకున్నారు. పృథశ్రవసునికి ఇంద్రాదులు ఎలా సహకరిస్తారో కూడా తెలుసుకున్నారు. అంత తమ తనయుడు ఆయుతానీకుని మనసెరిగి కామని తమ కోడలిని చేసుకోవడానికి యిష్ట పడ్డారు. మంచి శుభ ముహూర్తాన కామ ఆయుతానీకుల వివాహం జరిగింది. వారి కుమారుడు అక్రోధనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కరంభ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కళింగ రాజ కుమార్తె కరంభ యౌవనం లోకి అడుగుపెట్టే సరికే ఆమె పేరు ప్రతిష్టలు పదునాలుగు లోకాలు వ్యాపించాయి. యజ్ఞ యాగాది విషయాల ప్రసక్తి వచ్చినప్పుడు అందరూ కరంభ గురించే మాట్లాడుకునే వారు. ముఖ్యంగా కరంభ యజ్ఞ యాగాదులకు అవసరమైన నైవేద్యములను తయారు చేయడంలోనూ, తయారు చేయించడం లోనూ మంచి నైపుణ్యం కలదని త్రిమూర్తులు, త్రిమాతలు కరంభసహితం అనుకునేవారు. ఆమె చేతితో తయారు చేసి సమర్పించిన యజ్ఞ భరిత వేద నైవేద్యములను స్వీకరించడానికి దేవతలు పోటీ పడేవారు. వేద నైవేద్యం లు తయారు చేయడంలో కరంభకు సాటి కరంభయే అని అనుకునేవారు.
యజ్ఞ పురుషుడు నిరంతరం కరంభకు సంరక్షకుడు గా ఉండేవాడు. ఒక సారి కామంతో కళ్ళు మూసుకుపోయి అమానుషం గా కరంభ చెయ్యి పట్టుకున్న పరరాజ్య రాజకుమారుని యజ్ఞ పురుషుడు కాల్చి బూడిద చేసాడు.
గో సంరక్షణ నిమిత్తం, గో సంవృద్ధి నిమిత్తం కరంభ తయారు చేసిన వేద నైవేద్యములకు "కరంభ" అనియే త్రిమాతలు పేరు పెట్టారు. ఆపై కరంభ స్వహస్తాలతో తయారు చేసి సమర్పించిన నైవేద్యములను త్రిమాతలు మనసారా మహదానందంతో స్వీకరించారు. త్రిమాతల మార్గం లో త్రి మూర్తులు పయనించారు.
మంత్రాలతో, ఆయుర్వేద జ్ఞానంతో పవిత్రమైన పచ్చికను మేసిన గోవులు ఇచ్చే పాల నుండి వచ్చిన వెన్నతో కరంభ బార్లీ గింజలను వేయించేది. ఆ వేయించిన గింజలను పొడి పొడి చేసేది. ఆ పొడికి కరంభ "సక్తు" అని పేరు పెట్టింది. సక్తును హయ్యంగ వీనం అనే వెన్నలో కలిపి కరంభ యజ్ఞ దేవతలకు నైవేద్యం తయారు చేసేది. అలాగే బియ్యం పిండి, పెరుగుల తో కూడిన అనేక యజ్ఞ నైవేద్యాలను కూడా కరంభ తయారు చేసేది. తన వేద నైవేద్య జ్ఞానం ను కరంభ ఆడ మగ అనే తేడా లేకుండా ఆసక్తి ఉన్నవారందరికి నేర్పించేది.
దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు, పురోహితులు తదితర పండితులు, ఎవరు యజ్ఞ యాగాదులను చేయించడానికి సిద్ధమైన కరంభ తో లేదా ఆమె అనుచర గణం తో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయించమని యజ్ఞం చేయాలనుకున్న వారికి చెప్పేవారు.
కరంభ తన అంతఃపురానికి సమీపంలో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయడానికి, చేయించడానికి ఒక ఇందీవర వనాన్ని ఏర్పాటు చేయించింది. ఇందీవర వనం నడుమ వేద నైవేద్యాలను తయారు చేయడానికి కరంభ ప్రత్యేక మందిరాలను నిర్మింప చేసింది.
ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు కరంభ చేతి వేద నైవేద్యం స్వీకరించడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. జనం అత్యుత్సాహం తో నైవేద్యం కోసం తొక్కిసలాట దిశగా వెళితే కరంభ వారికి అసలు నైవేద్యం ఇచ్చేది కాదు. వారికి సహన మంత్ర తంతు జరిపిన పిమ్మట వేద నైవేద్యం ఇచ్చేది.
కరంభ చేతి వేద నైవేద్యం తింటే ప్రాణ శక్తి తేజోవంతమవుతుందని నాటివారు ఎక్కువ మంది నమ్మేవారు. తన దగ్గరకు నమ్మకంతో వచ్చిన వారందరికి నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకంను మాత్రం పెంచుకోకండి. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేది.
రంభ సోదరుడు కరంభ ఒకసారి కరంభను ఇందీవర వనంలో చూసాడు. తొలిచూపులోనే కరంభను కరంభ వలచాడు. ఇద్దరి పేర్లు ఒకటేనని కరంభ గ్రహించాడు.
అశ్వం మీద పయనిస్తున్న కరంభను కరంభ అనుసరించాడు. తనను అనుసరిస్తున్న వానిని కరంభ గమనించింది. అశ్వం ను ఆపింది. తన సమీపం నకు వచ్చిన వ్యక్తిని మీరు ఎవరని ప్రశ్నించింది. అప్పుడు కరంభ "నేను రంభ సోదరుడుని. నా పేరు కూడ కరంభయే. తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను." అని అన్నాడు.
కరంభ మాటలను విన్న కరంభ, " నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. ప్రస్తుతం నా మనసు పెళ్ళి మీదకు వెళ్ళడం లేదు" అని అంది.
కరంభ మాటలను విన్న కరంభ రాక్షసుడు లా ప్రవర్తించాడు. కరంభ రాక్షసుడు లా ప్రవర్తించే కరంభ కు కరవాలంతోనే బుద్ది చెప్పింది. కామ పృథశ్రవసుల పుత్రుడు అక్రోధనుడు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. అప్పుడు జరిగిన యజ్ఞ యాగాదులకు కామ పృథశ్రవసుల కోరిక మేర కరంభయే యోగ శక్తితో బ్రహ్మ జ్ఞానం పెంచుకుని వేద నైవేద్యం లను తయారు చేసింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
వేద నైవేద్యం తయారు చేసేటప్పుడు కరంభ అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అక్రోధనుడు కళ్ళార చూసాడు. ఆమె రూపాన్ని మనసులో నిలుపుకున్నాడు.
కరంభ అగస్త్య వంశ పునాదులు కలదని పదుగురు చెప్పుకొనగ అక్రోధనుడు విన్నాడు. కరంభ తన రాజ్యం లో వేద నైవేద్యం లు తయారు చేయడమే కాక పాపాలు చేసే దోషులకు తనే శిక్ష విధిస్తుంది అని అక్రోధనుడు తన మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు.
తన ఉమ్మడి కుటుంబం ను అడ్డం పెట్టుకుని బంధువులను మోసం చేస్తూ, బంధువుల మీద మితి మీరిన కామాన్ని ప్రదర్శించేవారిని, పరుల ధనాన్ని భయపెట్టి అపహరించేవారిని కరంభ అసలు సహించేది కాదు. వారికి కరంభ శిక్ష విధించేది. బాగా వేడిగా ఉన్న ఇసుకను మరింత వేడి చేసి, ఆ ఇసుక గుట్ట నడుమ దోషిని ఉంచి శిక్షించడం ను కరంభ శిక్ష అని అంటారు.
అసలు క్రోధమెరుగని అక్రోధనుని రాజ్యంలో విచ్చలవిడి తనం పెరిగిపోసాగింది. దుర్మార్గులను సహితం క్షమించి వదిలేసి వేదాంతం వల్లించే అక్రోధనుని రాజ్యంలో నానాటికి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోసాగింది. మనం ఏం చేసిన అక్రోధన మహారాజు మనల్ని క్షమిస్తాడు అని మనసులో అనుకొని కొందరు మాయగాళ్ళు అక్రోధన మహారాజు ను మంచి మంచి మాటలతో మాయ చేసేవారు. చేతలను నిర్వీర్యం చేసేవారు. ఇది గమనించిన అక్రోధనుని తల్లి కామ కరంభను కోడలిని చేసుకుంటే బాగుంటుంది. ఆమె అక్రోధనుడికి భార్య అయితే అక్రోధనుడు తన ఆలోచనా సరళిని మార్చుకుంటాడు. రాజ్యం కూడా బాగుపడుతుంది అని అనుకున్న కామ అదే విషయాన్ని తన భర్త పృథశ్రవసునికి చెప్పింది.
అనంతరం భార్యాభర్తలు ఇరువురూ కరంభ తలిదండ్రులను కలిసి తమ మనసులోని మాటను చెప్పారు. అందరి సమ్మతి మీద కరంభ అక్రోధనుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
కరంభ తన భార్య అయిన పిదప అక్రోధనుడు అవసరం వచ్చినప్పుడు చెడ్డవారి మీద క్రోధం చూపించడం నేర్చుకున్నాడు. చెడ్డ వారి మనసులోని మాయలను గమనించసాగాడు.
కరంభ రాజ్య పరిపాలన విషయంలో కూడా తన భర్త అక్రోధనునికి తగిన సూచనలు ఇచ్చింది. రాజ్య సంక్షేమం కోసం పలు యజ్ఞ యాగాదులను చేయించింది. శ్రేష్టమైన వేద నైవేద్యం లను దేవతలకు సమర్పించింది.
కరంభ అక్రోధనుల సుపుత్రుడు దేవతీతి.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
మర్యాద - దేవతీతి
[font="var(--ricos-font-family,unset)", serif] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని సమస్త దేశాన్ని పరిపాలించే అక్రోధనుడు తన భార్య కరంభ కోరిక మీద తమ ముద్దుల కుమారుడు దేవతీతికి పట్టాభిషేకం చేసాడు. ఆ పట్టాభిషేకానికి అందరు మహారాజులు వచ్చారు. అందరూ దేవతీతి వదనంలో సుర కళ ఉందని అనుకున్నారు. దేవతీతి పేరు తలచుకుని ఏ పని చేసినా అంతా శుభమే జరుగుతుంది అనుకున్నారు.
దేవతీతి పరిపాలనలో ప్రజలు ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షం కోసం ఎక్కువ గా సాధన చేసేవారు.
అర్థకామాల తో సురులు ఎంతగా ఆనందిస్తున్నారో దేవతీతి ఏలుబడిలో ఉన్నవారంత అంతకు మించి ఆనందించేవారు. దేవతీతి రాజు దయ వలన తమకు అర్థ తృప్తి, కామ తృప్తి, ధర్మ తృప్తి పుష్కలంగా ఉంది అని అనుకునేవారు.
దేవతీతిని చూసిన వారంతా దేవతీతి వదనంలో సుర కళ ఉందని భావించేవారు. తమకు తెలిసీ సుర కళ అధికంగా ఉన్న రాజు దేవతీతియే అని ఎక్కువ మంది జనం నమ్మేవారు. దేవతీతి వదనం చూడగానే ధర్మార్థకామాలలో కోరిన అందలం ఎక్కేస్తామని ప్రజలంతా బాగా నమ్మేవారు. చిత్రమైన విషయం ఏమిటంటే వారి ఆలోచనలకు తగినట్లే దేవతీతి వదనం చూసినవారంత వారు కోరుకున్న స్థాయికి ఎదిగేవారు. తమ ఎదుగుదలకు ప్రధాన కారణం దేవతీతియే అని నమ్మేవారు.
దేవతీతి మాత్రం ప్రజలకు దర్శనం ఇచ్చినప్పుడల్లా, "మీరు మీ శక్తిని నమ్ముకోండి. ధర్మ మార్గంలో పయనించండి. మీరనుకున్న స్థాయికి ఎదుగుతారు. నేను కేవలం మహారాజుని. మాయా మంత్రాలు తెలిసినవాడిని కాదు. దేవుడిని అంతకంటే కాదు." అని అనేవాడు.
దేవతీతి ఎన్ని చెప్పినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకునేవారు కాదు. దేవతీతిలో సుర కళ ఉంది అనుకునే వారు. దేవతీతిని దర్శించుకున్న పిదపనే తాము అనుకున్న పనిని మొదలు పెట్టేవారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించేవారు. మహదానందం తో మోక్ష సాధనకు శ్రీకారం చుట్టే వారు. దేవతీతి మహారాజు ఉన్నంత వరకు తమకు ఎలాంటి కొదవ ఉండదు అని అనుకునేవారు.
ప్రజల నమ్మకం క్రమక్రమంగా వారిలో అహాన్ని పెంచసాగింది. మర్యాద మన్నన లను తగ్గించసాగింది. దేవతీతి కొందరు ప్రజలలో మర్యాద మన్ననలు తగ్గుతున్నాయని గమనించాడు. ప్రజలలో మర్యాద మన్ననలను పెంచడానికి ఏం చేయాలా? అని ఆలోచించాడు. తన ఆలోచనలను కుల గురువుల తోనూ, పండితులతోనూ పంచుకున్నాడు.
రాజు మాటలను విన్న కొందరు పండితులు, "కొంత కాలం పాటు ప్రజలకు అసలు దర్శనం ఇవ్వకు మహారాజ!" అని అన్నారు. బాగా ఆలోచించి అదియే సరైన మార్గమని దేవతీతి అనుకున్నాడు.
తన వంశ రాజుకు వచ్చిన సమస్య గురించి చంద్రుడు బ్రహ్మ దేవునికి చెప్పాడు. అంత బ్రహ్మ దేవుడు "చంద్ర ! నీ వంశానికి చెందిన దేవతీతి మహారాజు లో ముక్కోటి దేవతల కళ అధికంగా ఉంది. అందుకే అతనిని దర్శించుకున్నవారి కోరికలన్నీ తక్షణం నెరవేరి పోతున్నాయి. తమ తమ కోరికలు నెరవేరడం తో కొందరు ప్రజలు మర్యాద మరిచి ప్రవర్తిస్తున్నారు. మరి కొందరు ప్రజలు మోక్ష సాధన కు మంచి పథానే ప్రయత్నిస్తున్నారు.
మీ చంద్ర వంశంలోనే అరిహుని తలిదండ్రులు మర్యాద అవాచీనులు ఉన్నారు. ప్రస్తుతం మర్యాద నామధేయం తోనే విదేహ రాకుమార్తె మర్యాద ఉంది. ఆమె సార్థక నామధేయం తో యశసిస్తుంది. ఆమెను చూడగానే అందరిలో మర్యాద భావన జనిస్తుంది. ఆమె దేవతీతి ధర్మ పత్ని అయితే అంతా మేలే జరుగుతుంది. " అని చంద్రునితో అన్నాడు.
దేవతీతి ప్రజలకు దర్శనం ఇవ్వక పోవడంతో కొందరు ప్రజలు మంత్రుల మీద తిరగబడ్డారు. విదేహ మహారాజు " ప్రజలు రాజులో తమ దైవాన్ని చూసుకుంటారు. ఏ రాజు పరిపాలనలో తమకు ఎలాంటి కష్టాలు కలగకుండా ఉంటే ఆ రాజు సాక్షాత్తు దైవాంశ సంభూతుడే అని ప్రజలు అనుకుంటారు. అలాంటి రాజు ప్రజలకు దర్శనం ఇవ్వకపోవడం సరైన మార్గము కాదు. " అని దేవాతీతి కి వర్తమానం పంపాడు. దేవాతీతికి విదేహ మహారాజు మాటలు సమంజసమే అని అనిపించాయి. అంత దేవతీతి మహారాజు విదేహ మహారాజు మాటలను అనుసరించి ప్రజలకు మరలా దర్శనం ఇవ్వసాగాడు..
విదేహ మహారాజు చంద్రుని మాటలను అనుసరించి దేవతీతి తన కుమార్తె మర్యాదల ఇష్టం మీద మర్యాదను దేవతీతికి ఇచ్చి వివాహం చేసాడు.
మర్యాద ప్రతిష్టాన పుర ప్రజల మనస్సును బాగా అర్థం చేసుకుంది. అధిక శాతం ప్రజలు తన భర్త దేవాతీతిని మహారాజుగా కాకుండా దైవాంశ సంభూతుని గా భావిస్తున్నారు అని అర్థం చేసుకుంది. "అదృష్టవంతుడైన రాజు అందలం ఎక్కితే ఆ రాజ్యం సమస్తం ఐశ్వర్యంతో తులతూగుతుంది. " అని అనుకుంది. అనంతరం మర్యాద బాగా ఆలోచించి ప్రజలందరి చేత అనేక రకాల వస్త్రాలను తయారు చేయించింది. వాటన్నిటికీ దేవతీతి వస్త్రాలు అని పేరుపెట్టి ఆ వస్త్రాలన్నిటిని అన్ని రాజ్యాలలో ఉన్న నిరుపేదలకు పంచమని చెప్ఫింది. 'ఒక వస్త్రం ను కూడా వ్యర్థం గా పక్కన పడవేయకండి' అని చెప్పింది.
ప్రజలు అలాగే అని తమ దగ్గర ఉన్న వస్త్రాలను నిరుపేదలందరికి పంచసాగారు. మర్యాద తెలియని ఒక మనిషి తన దగ్గర మిగిలిన చీరను రాజ వీథిలో పక్కనే పడేసాడు. అది చూసిన మర్యాద ఆ చీరను తీసుకుని దానిని ఉయ్యాల గ కట్టి ఒక నిరుపేద స్త్రీ శిశువును ఉయ్యాలలో ఉంచి ఊపసాగింది. అక్కడి వారందరూ మర్యాద చేసే పనినే చూడసాగారు.
శిశువు నిద్ర పోయాక మర్యాద ప్రజలతో, "ప్రజలారా! ఇప్పటివరకు మీరంతా నేను చేసే పనిని కళ్ళార్పకుండా చూసారు. మంచి పనిని పదే పదే చూడటం పదే పదే దాని గురించే ఆలోచించడం తప్పు కాదు. అలాగే మీరు చేసే మంచి పని మీద అందరి దృష్టి ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు పదుగురిలో మీకు మంచి పేరు వస్తుంది. మహారాజు దేవతీతిని చూసి మీరు పని మొదలు పెట్టినట్లే మిమ్మల్ని చూసి మరో పదుగురు పని మొదలు పెట్టగలగాలి. అదే మోక్ష సాధన. వృత్తిని దైవంగా నమ్మినవారినే మోక్షం వరిస్తుంది. " అని అంది.
మర్యాద మాటలను విన్న ప్రజలు అప్పటినుండి చేసే పని మీద దృష్టి ని పెట్టడమే గాక చేసే పనిలో దైవాన్ని చూడసాగారు. క్రమంగా వారు చేసే పనిలో సుర కళ కదలాడ సాగింది.
మర్యాద దేవతీతిలకు కొంత కాలానికి ఒక మగ సంతానం కలిగింది. అతని పేరు ఋచీకుడు.
[font="var(--ricos-font-family,unset)", serif] [/font] సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
జ్వాల
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
జలంలో సంచరించే సర్పముల వలన జలం విష తుల్యం అవుతుందని వరుణ దేవుని అనుచరులు సర్పములను హింసించసాగారు. అంతేగాక కృత్రిమ సర్ప భక్షక జీవులను అధికంగా సృష్టించారు.. కృత్రిమ సర్ప భక్షక జీవుల ప్రభావం తో సర్ప సంతతి భయపడింది. తమ శక్తి యుక్తులను ఉపయోగించి సర్పములన్నీ ఆకాశంలో ఎగర సాగాయి. ఎగిరే పాములను చూసి సమస్త జగతి గజగజలాడి పోసాగింది. గరుత్మంతుడు సహితం కించిత్ భయపడ్డాడు.
విశ్వ సంరక్షణ నిమిత్తం తక్షకుడు ఘోర తపస్సు చేయసాగాడు. తక్షకుని తపస్సుకు సమస్త జీవులు అతలాకుతలం అయ్యాయి. తక్షకుని తపస్సును చూచిన దేవతా సర్పములన్నీ తమకు మరింత మంచి రోజులు రాబోతున్నాయి అని మహదానందంతో పడగలు విప్పి ఆడసాగాయి. నాగినులు ఒళ్ళు మరిచి నాగ నృత్యాలు చేసాయి.
తక్షకుని తపస్సు కు మెచ్చిన వరుణ దేవుడు సర్పముల మీద తన అనుచరుల హింసను ఆపు చేసాడు. అనుచితంగా పరజీవ హింస పాపం అన్నాడు. వరుణ దేవుని అనుచరులు వరుణ దేవుని మాటలను శిరసావహించారు.
తక్షకుడు వెంటనే ఎగిరే సర్పములను కట్టడి చేసాడు. ఆకాశం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఇంద్రధనుస్సు తో ప్రకాశించసాగింది. అప్పటినుండి వరుణ దేవుడు, ఇంద్రుడు తక్షకునితో స్నేహం చేయసాగారు. వరుణ దేవుడు తక్షకునికి చంద్ర గదను బహుమతిగా ఇచ్చాడు. చంద్రగద రూపము మహా విచిత్రం గా ఉండేది.
చంద్రగద ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం తాండవించేది. చంద్రగదను చూడగానే సముద్రాలలోని ఆటుపోట్లు అందంగా కదలాడేవి. వాటిని చూసి అలల కింద తను తిరుగుతున్నట్లుగా భూమాత మురిసిపోయేది. ఒకప్పుడు చంద్రగద తనలో ఒక భాగం గా భూమాత భావించేది. సమస్త జీవరాశి ఆనందంగా నృత్యం చేసేది. చంద్రగద ను చూడగానే పర్యావరణం పులకరించిపోయేది.
దేవేంద్రుని వర ప్రసాదంతో తక్షకునికి జ్వాల అనే కుమార్తె జన్మించింది. దేవేంద్రుని వరుణుని తేజో వికాస ప్రభావంతో జ్వాల సుర తేజంతో ప్రకాశించే మానవ రూప కన్యలా ఎదగసాగింది. జ్వాల ప్రకృతి ని పార్వతీమాత గా భావించి ప్రకృతిలోని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ను అభ్యసించడానికి ప్రయత్నించేది.
జ్వాల వేదాలలో స్తుతించబడుతున్న పంచభూతముల మూలాల గురించి బాగా ఆలోచించేది. అలాగే వేదాలలో స్తుతించబడుతున్న గంగ, యమున, సరస్వతి వంటి నదులు గురించి వాటి వెనుకన ఉన్న విజ్ఞాన అంశాల గురించి తెలుసు కోవడానికి ప్రయత్నించేది.
జ్వాల ఎదిగే కొద్దీ సమస్త విద్యలతో వేద యాగ జ్వాల లా ప్రకాశించసాగింది. వేద జ్వాల లా ప్రకాశించే జ్వాల ఏది చెబితే చంద్రగద అది చేసేవాడు. జ్వాల చంద్రగద ను ముద్దుగా చంద్రగద మామ అని పిలిచేది.
జ్వాల చంద్రగద సహాయం తో భూమి వాతావరణం ను సుస్థిరంగా ఉంచేది. జ్వాల చంద్రగద సహాయం తో కొన్ని జంతువుల పునరుత్పత్తి ని కూడా చేసింది. ఇలా జ్వాల ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించేది. ఆమె సేవలు చూసి నరుల తో పాటు సురులు సహితం ఆమెను పలు విధాలుగా స్తుతించే వారు. జ్వాల కు చంద్రగద తో పాటు ఆమె పినతండ్రి శ్రుతసేనుడు కూడా తోడుగా ఉండేవాడు. ముగ్గురూ కలిసి పార్వతి లాంటి ప్రకృతి ని సంరక్షిస్తూ జనులకు కావలసినవన్నీ సంప్రదాయ బద్దంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బద్దంగా సమకూర్చేవారు.
జ్వాల ఎక్కడ ఉంటే అక్కడ పార్వతీ మాత ప్రకృతి లో లీనమయ్యి సర్వ మంగళ గా మారేది. పవిత్ర పంచ భూతాలను ప్రసాదించి ప్రజలను ఆనందపరిచేది.
జ్వాల దురిత చిత్తుల పాలిట మండే జ్వాల లా ఉండేది. మంచివారి పాలిట యాగ జ్వాల లా ఉండేది.
సుదేవ ఋచీకుల సుపుత్రుడు ఋక్షకుడు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. చంద్రుని అంశతో జన్మించిన ఋక్షకుడు మహా శివుని సేవ చేస్తూ ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నగా చూసుకోసాగాడు.
ఋక్షకుడు ఎక్కడ ఉంటే అక్కడ అమృత వర్షం కురిసినట్లు ఉండేది. అతని చుట్టూ ఉన్న వారు మాకిక మరణం లేదన్న భావనతో ఉండేవారు. అతనితో మాట్లాడటానికి అందరూ ఇష్టపడేవారు. అమావస్య తెలియని చంద్రునిలా ఋక్షకుడు ప్రకాశించసాగాడు.
అతని ఏలుబడిలో ఉన్న ప్రజలు సమస్యల్లో కూడా అమృత వర్షం లో కాలక్షేపం చేస్తున్నట్లు ఉండేవారు. ఋక్షకుని లో చంద్ర తేజం కించిత్ అధికంగా ఉందన్న విషయాన్ని ఋక్షకుని కుల గురువు వశిష్ట మహర్షి గమనించాడు. అతనిని చూడగానే మైమరచి పోయే మగువలను చూసాడు.
ఋక్షకుని సాధ్యమైనంత త్వరగా వివాహం చేయాలని అతని తలిదండ్రులు సుదేవ ఋచీకుల కు వశిష్ట మహర్షి చెప్పాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఋక్షకుని కి ఎలాంటి యువతితో వివాహం చేస్తే బాగుంటుంది అని సుదేవ ఋచీకులు కుల గురువు వశిష్ట మహర్షి ని అడిగారు. అప్పుడు వశిష్ట మహర్షి " ఋచీకుని లో చంద్ర తేజం కించిత్ అధికంగా ఉంది. అతనిని చూడగానే కన్యలే కాదు, వివాహమైన వనితలు సహితం ఏదో తెలియని మైకంలో పడిపోతారు. కాబట్టి అలాంటి వానికి యాగ జ్వాల లాంటి యువతి ధర్మపత్ని అయితే వారి దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. " అని వశిష్ఠ మహర్షి అన్నాడు.
కుల గురువు వశిష్ట మహర్షి మాటలను అనుసరించి ఋచీకుడు యాగ జ్వాల లాంటి యువతి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. తక్షకుని కుమార్తె జ్వాల యాగ జ్వాల యే అని ఇంద్రాది దేవతలు ఋచీకుని తో అన్నారు.
ఋచీకుడు ఇంద్ర వరుణాదుల తో కలిసి తక్షకుని వద్దకు వెళ్ళాడు. అక్కడ యాగ జ్వాల లా ప్రకాశిస్తున్న జ్వాలను చూసాడు. ఈమెయే తన కుమారునికి తగిన ధర్మపత్ని అని మనసులో అనుకున్నాడు.
తక్షకునితో తాము వచ్చిన కారణాన్ని ఋచీకుడు సమయోచితంగా చెప్పాడు. తక్షకుడు లిప్త కాలం ఆలోచించాడు. అనంతరం తన కుమార్తె జ్వాల తో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరి సమ్మతితో జ్వాల ఋక్షకుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారికి పుట్టిన సుసంతానమే మతినారుడు.
మతినారుడు సరస్వతీ నదీ తీరాన మహోన్నతమైన తపస్సు చేసాడు.
***
సర్వే జనాః సుఖినోభవంతు
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కాళింది
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
"రశ్మిమంతం సముద్యంతం.. దేవాసుర నమస్కృతం.. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం" అంటూ శ్రీ సూర్య నారాయణుని అనునిత్యం కాళింది పలు రీతులలో స్తుతిస్తుంది. ఆమె స్తుతులకు సూర్య భగవానుడు ఆనంద సందోహ సుందర హృదయంతో ప్రకాశవంతమైన, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, తేజోవంతమైన, సుర సదృశవంతమైన కిరణాలను కాళింది తనువుపై ప్రసరింపచేస్తాడు. ఆ కిరణ ప్రభావం వలన కాళింది తేజస్సు స్వచ్ఛ సూర్య కిరణం వలే ప్రకాశిస్తుంది.
అలా కాళింది తనువు క్షణం క్షణం అనుక్షణం తేజోవంత మవుతూనే ఉంది. ఆ తేజస్సు కాళింది తనువులోని సమస్త రోగాలను తుడిచి పెట్టేస్తుంది. రోగ రహిత తనూ తేజంతో కాళింది ప్రకాశిస్తుంది. ఆమె తనువును సూక్ష్మంగా పరిశీలిస్తే ఆమె జల కన్యా? సూర్య కిరణ కన్యా? చంద్ర కిరణ కన్యా? స్వేచ్చ మైన నరకన్యా? అని అనిపిస్తుంది. అలా నర కన్య గ జనించిన కాళింది తనువులో సురత్వం అధికం కాసాగింది.
కాళింది దేహమే కాకుండా ఆమె మనసు కూడా సతతం స్వచ్చంగా నిర్మలంగా ఉంటుంది. ఆమె ఏది మాట్లాడినా అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో సరళంగా ఉంటుంది. నర్మ గర్భంగా, అర్థ రహితంగా, అగమ్య గోచరంగా మాట్లాడటం కాళింది కి అసలు తెలియదు . ఆమె తన మనసులోని మాట ను ఎలాంటి మాయ లేకుండా బహిర్గతం చేసేస్తుంది.. రాజు పేద అనే తేడా లేకుండా అందరితో సమానంగా ఉంటుంది.
కాళింది తో మాట్లాడటానికి మహర్షులు, ఋషిపత్నులు, రాజర్షులు, సామాన్య జనం అందరూ ఇష్టపడేవారు. కాళింది ముందు నిలబడితే చాలు ఆమె తనూ తేజ ప్రభావంతో తమ శరీరం మీద రోగాలన్నీ పోతాయనుకునేవారు. ఆమె మాటలతో మనసులోని కాలుష్యమంతా పోతుంది అనుకునేవారు.
కాళింది అందరి దగ్గర ఆరోగ్యమే మహాభాగ్యము అన్న దృష్టితో మాట్లాడేది. మంచి ఆరోగ్యం నిమిత్తం ప్రకృతి ద్వారా స్వీకరించవలసిన రోగ నిరోధక ఔషదాల గురించి మాట్లాడేది. అంటురోగ నిర్మూలనలకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మాట్లాడేది.
కాళింది మహర్షులందరి దగ్గర తను నేర్చుకోతగిన విద్యలన్నిటిని నేర్చుకుంది.. తను నేర్చుకున్న అన్ని విద్యల ప్రభావాన ఆమె ఆలోచనలలో అనేక నూతన మార్పులు వచ్చాయి.
కాళింది ఆడంబర వేదాద్యయనం అసలు వద్దు అంటుంది. గర్వంతో కూడుకున్న అగ్ని హోత్రం ప్రమాదం అంటుంది. గర్వంతో కూడుకున్న మౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరం తో చేసే యజ్ఞం భూమి మీద అయోగ్యం అమానుషం అసుర ఊహాజనితం అని అంటుంది.
ఇలా అనేకమంది మహర్షుల జ్ఞాన ప్రబావం తో ఎదిగిన కాళింది ఆలోచనలు తేజోవంతమయ్యాయి.
సురవంత మయ్యాయి. కడకు ఆమె మాటలనే ఎక్కువ మంది మహర్షులు అనుసరించే స్థాయికి వచ్చారు. మానవత్వం తో కూడుకుని సురత్వ తేజం తో ప్రకాశించే కాళింది మాటలను విని అనేకమంది మనుషులు తమ ఆలోచనా సరళి ని మార్చుకున్నారు. అనేక మంది మనుషులు మహర్షులు తన దివ్య ఆలోచనలను అనుసరిస్తున్నారన్న గర్వం కాళింది లో ఇసుమంత కూడా లేదు.
సారస్వతిమతినార మహారాజు లు తమ కుమారుడు త్రసుని ప్రతిష్టాన పురానికి రాజుని చేసారు. త్రసుడు అతి చిన్న వస్తువులను, సూక్ష్మ జీవులను కూడా చక్కగా చూడగలడు. వాటి చర్యలను ప్రతీకార చర్యలను అన్నిటిని కనిపెట్ట గలడు. త్రసుని సూక్ష్మ దృష్టి వలన సకల జీవరాశులలో ఉన్న చెడు దృష్టి అంతా నెమ్మది నెమ్మదిగా తొలగి పోసాగింది. కొందరు జనులు త్రసునిలో ఏదో దైవశక్తి ఉంది. అందుకే అతని చూపు పడగానే మనలో మార్పు వస్తుంది అని అనుకునేవారు.
ప్రజల మనసు గమనించిన త్రసుడు, "ప్రజలారా! నాలో ఎలాంటి దైవశక్తి లేదు. అయితే అతి సూక్ష్మ జీవులను, వాటి చేష్టలను కూడా చూడగల శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. దానితో మీమీ ఆంతర్యాన్ని తెలుసుకుని మాట్లాడ గలుగుతున్నాను. దానితో మీరు భయపడి మీ మనసు విప్పి మాట్లాడుతున్నారు. మీలోని చెడును మీరే నేను చెప్పే ఒకే ఒక్క మాటతో తొలగించుకుంటున్నారు. అంతకు మించి మరేం లేదు. "అని అన్నాడు. అయినప్పటికీ ప్రజలు త్రసుని ప్రత్యేకంగానే చూడసాగారు.
సారస్వతి మతినార మహారాజు లు త్రసునికి తగిన భార్య కోసం అనేక మంది మహర్షులను, పెద్దలను సంప్రదించారు. అందరూ త్రసునికి తగిన భార్య కాళింది అని అన్నారు. కాళింది మనసులోని మాటను స్పష్టంగా, సూటిగా, స్వచ్ఛంగా చెబుతుందని తెలుసుకున్న సారస్వతి కాళిందిని ప్రత్యేకంగా కలిసింది. సారస్వతి మనసును గ్రహించిన కాళింది,
"మీ సుపుత్రుడు త్రసుడు అతి సూక్ష్మ జీవులను కూడా చక్కగా చూడగలడు. ఆ జీవుల మనసును కూడా తెలుసు కోగలడు. అయితే అతని మాట, సూటిగా, స్పష్టంగా ఉండదు. సూక్ష్మ జీవుల మనసును తెలుకున్న అతగాడు వాటిని ఏమంటే ఎలా బాధ పడతాయో అన్న దృష్టితో నర్మ గర్భంగా మాట్లాడతాడు. కొందరు మనుషుల విషయం లో కూడా అతను అలాగే ప్రవర్తిస్తాడు. అతని ప్రవర్తన వలన కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే నాలాంటి కన్య మీకు కోడలు కావాలన్న భావనతో మీరు ఉన్నారు. మీ భావన నాకు ఆమోద యోగ్యమే" అని అంది.
మహర్షుల ద్వారా కాళింది గురించిన పూర్తి సమాచారాన్ని, కాళింది మనసులోని అభిప్రాయాన్ని
సారస్వతి మతినార మహారాజు గమనించారు. అందరి సమక్షంలో కాళింది త్రసుల వివాహం చేసారు.
సర్వే జనాః సుఖినోభవంతు
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
వసుదేవా
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
దశార్హ మహారాజు కుమార్తె వసుదేవి. ఈమెను వసుదేవా అని కూడా పిలిచేవారు. వసుదేవా జన్మించ గానే దశార్హ రాజ్యం ఇబ్బడిముబ్బడిగా పాడిపంటలతో, సిరి సంపదలతో కళకళలాడసాగింది. దశార్హ రాజ్యంలోని ప్రజలు పట్టిందల్లా బంగారం అవ్వసాగింది. ఇదంతా వసుదేవా పుట్టిన వేళా విశేషం అని ప్రజలు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్మారు. ప్రతి సంవత్సరం వసుదేవా జన్మ దినోత్సవ వేడుకలను ప్రజలే అంగరంగ వైభవంగా జరిపేవారు.
వసుదేవా జన్మ దినోత్సవ వేడుకల సమయంలో ప్రజలు వసుదేవాకి బహుమతులుగా ఇచ్చిన బంగారు నగలు నిరుపేదలకు దానం చేయగా ఇంకా 5200 వారాల నగలకు రెట్టింపు నగలు వసుదేవా ప్రత్యేక మందిరాలలో కళకళలాడుతూ ఉన్నాయి. అయితే వసుదేవా కి నగల మీద అసలు వ్యామోహం ఉండేది కాదు. అందరి హృదయాలలో నివసించాలి అనేది వసుదేవా సదాలోచన. అందుకు తగ్గట్లుగా వసుదేవా ప్రజాసేవ చేసేది.
రాజ్య పరిపాలన లో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేది. అలా ఆమె అందరి హృదయాలకు చేరువయ్యింది. తను రాజ కుమార్తె అయినప్పటికీ నేను రాజ కుమార్తెను అనే గర్వం వసుదేవా కు కించిత్ కూడా ఉండేది కాదు. వసుదేవా ప్రజలందరితో కలిసి మెలసి వారి కష్ట సుఖాలను సరిసమానంగా పంచుకునేది. వసుదేవా కు హాని తలపెట్టాలనుకునే కర్కోటకులు సహితం ఆమె ముఖం చూసిన వెంటనే ఆమె భక్తులైపోయేవారు.
దీర్ఘ శిఖి, ఢంకా మురళి వంటివారు వసుదేవాకు ముందుగా హాని తలపెట్టాలనుకున్నారు. వారు వసుదేవా ముఖం చూసి చూడగానే వారి మనసులోని మాలిన్యమంతా కరిగిపోయింది. ఆపై వసుదేవా భక్తులై రాజ్యాలన్నీ తిరుగుతూ వసుదేవా ముఖ వర్చస్సు ను స్తుతిస్తూ కాలం గడపసాగారు. దైవాంశ సంభూతులైన మహర్షులు, మాన్యులు వసుదేవా ను చూచి శ్రీ మహాలక్ష్మీ 45 అంశలలో ఒక అంశ వసుదేవా అని అనుకునేవారు.
హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. హస్తి మహారాజు యశోధరల కుమారుడు వికుంఠునుడు. ఇతగాడు పెరిగి పెద్దయ్యాక తండ్రి ఖ్యాతి కి తీసిపోని విధంగా హస్తినాపురం ను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించసాగాడు.
తన తండ్రి హస్తి మహారాజు పేరు మీద ఏర్పడిన హస్తినాపురం ను భూలోక వైకుంఠం గా తీర్చి దిద్దాలనే సదుద్దేశంతో వికుంఠునుడు హస్తినాపురం లోని రోడ్లన్ని వెడల్పు చేయించాడు. గోసంపదను విస్తృతంగా పెంచిపోషించాడు. గోమాతలు ఇచ్చే పాలు ప్రజలు తాగినంత తాగి మిగతావి ఎవరూ వద్దనటంతో రోడ్ల మీద పారపోసేవారు. ఆ పాలతో హస్తినాపురం పాల సంద్రంలో వైకుంఠం లా ప్రకాసించేది.
వికుంఠునుడు హస్తినాపురం కు సప్త ప్రాకారాలు ఏర్పాటు చేసాడు. ఆ ప్రాకారాలు సహితం పాలరాతి తో కళకళలాడసాగాయి. హస్తినాపురం లోని చిన్న చిన్న నదులన్నీ పాలతో నిండిపోయాయి. వాటిని చూసి ప్రజలు ఇది నిజమా! కలా! అని అనుకునేవారు.
తన కుమారుడు వికుంఠునుడు కి పెళ్ళి చేయాలని యశోధర అనుకుంది. అదే విషయాన్ని తన భర్త హస్తి మహారాజు కు చెప్పింది.
హస్తి మహారాజు వికుంఠునుని చిన్నతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు.
చిన్నతనం లో వికుంఠునుని ప్రవర్తనను చూసిన హస్తి మహారాజు వికుంఠునుడు, కుంఠుని"లా ప్రవర్తిస్తాడన్న మహర్షుల మాట నిజమైంది అని అనుకున్నాడు.
"కుంఠం" అంటే చెడుకు లొంగి పోవడం అని అర్థం. వికుంఠునుడు చిన్నతనంలో మూర్ఖుల సహవాసం అంటే మహా ఇష్టపడేవాడు. కొందరు మూర్ఖులు వికుంఠునుని "వికంఠనుడు వికంఠనుడు" అని ఆట పట్టిస్తుంటే వారి మీద తిరగబడకుండ, వారి మాటలను విని మహదానంద పడేవాడు. పెద్దల మీద, గురువుల మీద తిరగబడటమంటే అతనికి మహా ఇష్టంగా ఉండేది.
సత్యమేవ జయతే అన్నవారిని చావచితక బాదేవాడు. మాతృదేవోభవ అన్నవారికి మరణ శిక్ష విధించాలనేవాడు. పితృదేవోభవ అన్న వారి మీద పడి గొంతుపిసికేవాడు. ఆచార్య దేవోభవ అన్నవారిని అరణ్యాలకు తరిమేసేవాడు. అలాంటి వికుంఠునునికి తన పదహారవ యేట ముక్కోటి ఏకాదశి నాడు ఒక మహా యాగం చేయాలి అనే సత్సంకల్పం కలిగింది. తను చేయబోయే యాగానికి సప్త మహర్షులందరిని పిలిచి ముక్కోటి దేవతలందరి పేర్లను చెప్పమన్నాడు. వికుంఠునుని మాటలను విని వారంతా నోరు వెళ్ళబెట్టాడు. మహర్షులు ముక్కోటి దేవతలందరి పేర్లు చెప్పేటంత జ్ఞానం మాకు లేదన్నారు.
అప్పుడు వికంఠునుడు, "దేవతలు మూడు కోట్ల మంది కాదు. 33 మందే అని నా అంతరాత్మ చెబుతుంది. వారు ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులుఆ, అష్ట వసువులు, ఇద్దరు అశ్వనీ దేవతలు. అంతే. వీరికి విష్ణువు అధిపతి. విష్ణువు వికుంఠ మాతకు పుట్టి వైకుంఠం నిర్మించాడు. వైకుంఠ నారాయణుడు అయ్యాడు ఈ లెక్క ప్రకారం యాగం చెయ్యండి. నేను వికుంఠునుడిని. " అని అన్నాడు.
వికుంఠునుని మాటలను విన్న సప్త మహర్షులు అదే రీతిన యాగం చేసారు. అప్పటినుండి వికుంఠనునిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి ప్రజలు, మహర్షులు, మహానుభావులు, తలిదండ్రులు అంతా మహదానంద పడ్డారు. ఇదంతా ముక్కోటి ఏకాదశి మహిమ అని అనుకున్నారు. నాటి నుంచి వికుంఠునుడు ప్రజలకోసం ఆలోచిస్తూ, ప్రజోపయోగ పనులను చేస్తూ కాలం గడప సాగాడు. హస్తినాపురం ను క్షీరసాగరం చేసాడు.
ముక్కోటి ఏకాదశి నాడు ప్రజలు హస్తినాపురం లో ఉన్న ఉత్తర ద్వారం నుండి వచ్చి వికుంఠన మహారాజు ను దర్శించుకునేవారు. హస్తి మహారాజు, యశోధర తమ కుమారుడు వికుంఠునికి దశార్హ మహారాజు కుమార్తె వసుదేవా ను ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. వారు గతంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు దశార్హ మహారాజు, వసుదేవా వచ్చినప్పుడు వసుదేవా ను చూసారు.
అప్పుడు వసుదేవా బంగారు వీణ ను మీటుతూ చక్కని పాట పాడింది. ఆ పాటలో వైకుంఠ నారాయణుని వివిధ నామాలు వర్ణనాత్మకంగా ఉన్నాయి. అప్పుడు వారు వసుదేవా లో శ్రీమహాలక్ష్మి తేజస్సును చూసారు. అంతేగాక దీర్ఘ శిఖి వంటి వారు వసుదేవా గురించి స్తుతించగా విన్నారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
హస్తి మహారాజు సప్త మహర్షులను పెళ్ళి పెద్దలుగా చేసి దశార్హ మహారాజు దగ్గరకు పంపాడు. హస్తినాపురం నుండి సప్త మహర్షులు పెళ్ళి పెద్దలుగా వస్తున్నారన్న విషయం దశార్హ మహారాజు కు వేగుల ద్వారా తెలిసింది. అంత దశార్హ మహారాజు సప్త మహర్షులను శాస్త్రోక్తంగా, మంత్రోక్తంగా ఘనంగా సన్మానించండి అని పుర పురోహితులను ప్రార్థించాడు.
రాజు మాటలను అనుసరించి, పుర పురోహితులు "కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వశిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతాః ఓం సప్త ఋషిభ్యో నమః. ఓం కశ్యపో నమః ఓం అత్రో నమః ఓం భరద్వాజో నమః ఓం విశ్వామిత్రో నమః ఓం గౌతమో నమః ఓం జమదగ్నో నమః ఓం వశిష్టో నమః" అంటూ ధర్మ పత్నీ సమేతులైన సప్త మహర్షులను పలు విధాలుగా స్తుతిస్తూ రాజు గారి అంతఃపురానికి ఆహ్వానించారు.
దశార్హ మహారాజు సప్త మహర్షులకు సాష్టాంగ పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం రాజు గారి భార్య, రాజు గారి కుమార్తె వసుదేవా తదితరులందరూ సప్త మహర్షుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.
"బ్రహ్మ మనసునుండి జనించిన సప్త మహర్షులను వసుదేవా నయనానందంతో తనివితీరా చూస్తూ, వారి జ్ఞాన తేజాన్ని గమనించింది. వసుదేవా లోని శ్రీ మహాలక్ష్మీ అంశను గమనించిన సప్త మహర్షులు ఆ అంశకు పరిపూర్ణ హృదయంతో భార్యా సమేతంగా నమస్కరించారు.
అనంతరం దశార్హ మహారాజు "ధర్మపత్నీ సమేతులై వచ్చిన సప్త మహర్షుల రాకకు కారణం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. సంస్కృతీ సంప్రదాయ సంరక్షణ నిమిత్తం బ్రహ్మ చే నియమించబడిన మహానుభావులారా! బ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మర్షులారా! మహా శివుని నుండి అనేక విద్యలను పొందిన మహానుభావులారా!
సుర జ్ఞాన సంరక్షకులారా! మా రాకకు కారణం ఇది అని ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞ ను శిరసావహిస్తాను. " అని సప్త మహర్షులతో అన్నాడు.
దశార్హ మహారాజు మాటలను విన్న సప్త మహర్షులు దశార్హ మహారాజు ను ఆశీర్వదిస్తు తాము వచ్చిన కారణాన్ని చెప్పారు. అనంతరం ఒక్కొక్క మహర్షి వికుంఠునునిలో ఉన్న ఒక మంచి గుణాన్ని, చిన్నప్పటి అతని ఒక చెడు గుణాన్ని వివరించి చెప్పారు. వికుంఠునుడు చెడు నుంచి మంచి కి వచ్చిన విధానాన్ని అందలి దైవ తత్వాన్ని కూలంకషంగా వివరించారు.
సప్త మహర్షుల మాటలను విన్న దశార్హ మహారాజు మరో ఆలోచన చేయకుండా తన కుమార్తె వసుదేవాను వికుంఠునుకి ఇచ్చి వివాహం చేయడానికి తన సమ్మతిని తెలిపాడు. ఆపై భార్య కుమార్తె ల ముఖం చూసాడు. వారు కూడా కనులతోనే తమ సమ్మతిని తెలిపారు. అందరి వదనాలు ఆనంద సంద్రంలో తేలియాడాయి. అది గమనించిన సప్త మహర్షులు తాము వచ్చిన పని శీఘ్రంగా శుభమయమైంది అని అనుకున్నారు. దశార్హ మహారాజు వద్ద సెలవు తీసుకున్నారు.
సప్త మహర్షులు హస్తినాపురానికి వచ్చి, హస్తి మహారాజు కు యశోధర కు దశార్హ మహారాజు హృదయాన్ని కాబోయే పెళ్లి కూతురు వసుదేవా హృదయాన్ని తదితరుల హృదయాలను
తెలియ చేసారు.
హస్తి మహారాజు, యశోధర, దశార్హ మహారాజు ల అభ్యర్థన మేరకు సప్త మహర్షులు వసుదేవా వికుంఠునుల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని చూసారు.
వసుదేవా వికుంఠునుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వసుదేవా వికుంఠునులు శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు ల అంశయే అని రాజర్షులు, బ్రహ్మర్షులు, యోగులు వంటివారు అనుకున్నారు. వికుంఠునుడు తన ధర్మపత్ని వసుదేవా సలహాలను కూడా స్వీకరించి హస్తినాపురం ను మరింత అందంగా తీర్చిదిద్దాడు. వికుంఠుని పరిపాలన లో భూలోక వైకుంఠం లా హస్తినాపురం ప్రకాశిస్తుంది అని నాటి వారందరూ అనుకున్నారు ఆ పుణ్య దంపతుల సుపుత్రుని పేరు అజమీఢుడు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|