Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
యుగధర్మం - ఇందూ రమణ
[Image: y.jpg]
"మే... ! మే... !"
దిక్కులు పిక్కటిల్లాయి. భువనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. ఆ అడవి అడవంతా అల్లల్లాడి పోయిందా అరుపులకు.
ప్రాణభీతితో అరచిన మేక అరుపులకు ఇహానికొచ్చాడు అప్పన్న.


చాకరేకు కొండమీదకు మేకల మందల్ని తోలుకువెళ్లి వాటిని అడవిలో మేతకు వదలి తను ఓ చిన్న బండమీద కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడు.


రోజూ ఉదయం లేవగానే గేదెల దగ్గర పాలు పితికి కాఫీ దుకాణాలకు చిల్లర వాడకందార్లకు పంపిణీ చేసిన తరువాత, తమ పాల వాడకం ఆసామీల ఇళ్ల దగ్గర నుండి 'కుడితి ' తీసుకు రావడం, దానికి ప్రతిగా ఆ ఇళ్లవాళ్లకు 'కల్లాపు'కు కావలసిన 'పేడ' తీసుకు వెళ్లి అందించటం అయింతర్వాత -


ఉదయం ఎనిమిదయ్యేసరికి చద్దన్నం తినేసి - మధ్యాహ్నానికి 'సోడి ' అంబలి పట్టుకొని మేకల మందని అడవికి తోలుకు వెళ్లడం పరిపాటి.
సాయంత్రం ఆరయ్యేసరికి మందని మళ్లించి ఇంటికి చేరుకున్న తరువాత మళ్లా గేదెల దగ్గర పాలు పితికి సరఫరా చేసిన తరువాత - ఇంటి వాడకానికి కావలసిన మంచినీళ్లు బజారు నూతి దగ్గర నుండి కావడితో మోయడం కూడా అప్పన్న దినచర్యే!


ఇంట్లోని చిల్లర పనులు అప్పన్న సతీమణి సర్దుకుపోయేది.


ప్రతిరోజూ ఒకేవిధమైన పని కావడం మూలాన అప్పన్నకి విసుగూ - విరామం తెలియటం లేదు. తన పని నిర్విఘ్నంగా సాగిపోయిన తర్వాత ఏ రాత్రికో - అపరాత్రికో తన గుడిసెను చేరుకునేవాడు.


శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ అడవిలో భయంకరంగా మేక అరుపుల మోత.
ఆ మేక అరుపులకు బండమీద నుండి ఆత్రంగా లేచాడు అప్పన్న.


ఆదరాబాదరాగా మేకల మందనంతా చుట్టబెట్టి చూశాడు.


అక్కడక్కడా రెండేసి మేకలు కలసి మేస్తున్నాయి. ఆ అరుపు ఎక్కడినుండి వచ్చిందో అర్థం కాలేదు అప్పన్నకి. కొండరాళ్లల్లో 'పలుకురాయి 'లుండటం మూలాన మేక అరచిన అర నిముషం వరకూ ఆ అరుపులు ప్రతిధ్వనిస్తూనే వున్నాయి.
అడవంతా గాలించసాగాడు అప్పన్న.
ఆ అరుపు మేకపోతుది.


అది అసలే పిరిగొడ్డు. ఏమయిందో? ఏమిటో? అప్పన్న మనసులో భయం పీకుతోంది.


ఏ మేకైనా అలా ఎందుకు అరుస్తుందో అప్పన్నకు బాగా తెలుసు. ఏ మేకవో వాటి కళ్ల బడ్డప్పుడు బాధతో అరుస్తాయి. అలాగే ఇదీ అరచింది.
ప్రతీ తుప్పా విడవకుండా వెదుకుతున్నాడు అప్పన్న. మేకలన్నీ తమ మానాన అవి మేస్తున్నాయి. మేకలనన్నింటినీ ఒక దగ్గర గుంపుగా చేర్చాడు. గబగబా లెక్కపెట్టాడు. మొత్తం మందలో రెండు తక్కువ వున్నాయి. తన మేకల మందలో రెండు తక్కువ కనిపించేసరికి అప్పన్నకి ముచ్చెమటలు పోశాయి.


పేరుపేరునా ఒక్కోదాన్ని పరిశీలించి చూశాడు. 'బొకడపోతు ' ఎక్కడా కనిపించలేదు. దానితోపాటు 'పొడమేకా జాడ కూడా లేదు. ఆ రెండే తక్కువ .


'బొకడబొతు ' కనిపించకపోయేసరికి అప్పన్న కళ్లంబడి నీళ్ళు ఉబికాయి ,అదంటే అప్పన్నకి ప్రాణం .దాన్ని చిన్నప్పటి నుండీ తన చేతుల్తో పెంచాడు. దాని కన్న మూడోనాడే దాని తల్లిని ఈ మేకవే పొట్టన పెట్టుకుంది. చిన్నపిల్ల కావటంచేత వేరే మేకలు ఏవీ దాన్ని తమ దగ్గరకు రానిచ్చేవి కావు.


కొన్నాళ్లు బలవంతాన ఏదో తల్లి మేకని రాటకి కట్టేసి కదలకుండా కాళ్లు పట్టుకొని గోకడ మేకపిల్లని దాని దగ్గర వుంచేవాడు అప్పన్న.
బలవంతాన ఎవరూ ఎవరినైనా ఏంచేయగలరు? దేన్నైనా ఎలా సాధించగలరు?


ఆ తల్లి మేక కూడా తనని కట్టేసి బలవంతంగా వేరే మేకపిల్లకి తన పాలు త్రాగించేసరికి తన పిల్లకి కాకుండా వేరేదానికి ఇవ్వడం ఇష్టం లేక ఎగేసేపేది.


ఇలా కాదని అప్పన్న ఎలాగో తంటాలు పడి అన్ని తల్లి మేకల నుండి పాలు పితికి పెట్టేవాడు.
కొంచెం ఎదిగిన తరువాత తలపోటు నేర్పాడు. తనచేత్తో దాన్ని గుద్ది దానికి కోపం వచ్చేటట్టు చేసి పౌరుషం తెప్పించేవాడు అప్పన్న. నానా యాతన పడి చివరకు దానికి పోట్లు నేర్పాడు.


ఆ నోరు లేని జీవానికి కూడా అప్పన్న అంటే మాలమి అయింది. అప్పన్నని తప్ప వేరే ఎవ్వరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. దాన్ని చూసి భయపడేవాళ్లు అందరూ...


ఒకరోజు...
ముద్దుగా ముద్దొస్తున్నదని దగ్గరకు వెళ్లి బోకడపోతుని ముట్టుకోబోయాడు అప్పన్న యజమాని అయిన నూకరాజు. ఏమనుకుందో - ఏమోగానీ, ఒక్కసారి నాలుగడుగులు వెనక్కి వేసి ముందుకు వచ్చి ఎగిరి పొడిచింది. ఆ పోటు వూపుకు వెల్లికిలా పడిపోయాడు నూకరాజు. అంతలో అప్పన్న అక్కడే వుండడంతో పరుగున వెళ్లి దాన్ని పట్టుకున్నాడు.


ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా అప్పన్నకి నవ్వు పుట్టుకొస్తూంటుంది. బొగడపోతు కనిపించక పోయేసరికి అంత బాధలోనూ ఆ విషయం గుర్తొచ్చి నవ్వాపులేకపోయాడు.


"దానికి తనంటే ఎంత మాలిమి! అది తనకి ఎలా మచ్చిజయిపోయింది?" మనిషిని మనిషే గౌరవించని ఈ రోజుల్లో ఓ మూగజీవి తనకి విలువ ఇచ్చేసరికి ఆనందంతోపాటు ఆశ్చర్యపోయేవాడు అప్పన్న.


అలాంటి బొకడపోతు కనిపించక పోయేసరికి నిజంగానే బాధపడ్డాడు అప్పన్న. పొడమేక కనిపించకపోతే యజమాని ఏవంటాడో? అని బాధపడ్డాడు. కానీ, బొకడపోతు - ఆంబోతులాంటి బొకడపోతు కనిపించలేదంటే ఊరుకుంటాడా తన యజమాని? అగ్గిమీద గుగ్గిలవై పోడూ?! అప్పనీ, అమ్మనీ తిట్టిపొయ్యడూ?!


తన యజమాని శివతాండవాన్ని గుర్తు చేసుకున్న అప్పన్నకి కంపరం పట్టుకుంది. ఒకవేళ దాన్ని ఏ మెఖవో పొట్టన భెట్టుకుంటేనో?! అమ్మో! ఇంకేవన్నా ఉందా? - దాని ఖరీదు ఏ అయిదొందలో అని తనమీద రుద్ది ముక్కుపై గుద్ది వసూలు చెయ్యడూ?!
ఆ మందని అలాగే అక్కడ వదలి ప్రతీతుప్పా వెతుకుతూ అడవంతా గాలించాడు అప్పన్న.


అప్పటికే చీకటి తెరలు అలముకుంటున్నాయి. అది కొండ ప్రాంతం కావడం వలన చీకటి చిక్కగా వుంది.


ఎక్కడో - ఏదో మూలన తనకి బాగా పరిచయమున్న వాసన ముక్కు పుటాలను అదరగొట్టేసరికి ఆ పరిసర ప్రాంతాల్లోని తుప్పల్ని మరింత పరిశీలించి చూశాడు అప్పన్న.


ఏ కీలుకాకీలు వేరు చేయబడి తోలు తప్ప ఏవీ మిగల్ని పొడమేక శరీరం కనిపించింది. అప్పన్నకి ముచ్చెమటలు పోశాయి.


ఇంతకు పూర్వం కూడా చాలా మేకల్ని కొట్టింది మెఖం. కానీ, ఏ మేకనీ ఆనవాలు కూడా మిగల్చకుండా తిన్నదే గానీ, ఇలా వదలి వెళ్లలేదు. తన పని పూర్తి కాకుండానే ఇలా ఎందుకు వదలి వెళ్లిపోయిందో అప్పన్నకి అర్థం కాలేదు. బొఘడపోతు కోసం వెదకాలనుకున్నా అప్పటికే చీకటి దట్టంగా ఆవరించుకుపోయింది. దారి కానరాక అడవిలో చిక్కుపడితే మిగతామందని కూడా కాయడం కష్టం.


ఆ ఆలోచన మదిలో మెదిలేసరికి చచ్చిన పొడమేక శరీరాన్ని భుజాన వేసుకొని మందని మళ్లించాడు అప్పన్న.

అప్పన్న


ఎక్కడ పుట్టాడో - ఎవరికి పుట్టాడో ఎవర్కీ తెలీదు. పదేళ్ల వయసులోనే పని వెదుక్కుంటూ వచ్చిపడ్డాడు. అప్పన్న యజమాని పేరు - నూకరాజు. పేరు చివర రాజన్నంత మాత్రాన అతను రాజవుతాడా? వృత్తిరీత్యా నూకరాజు రైతు అయినా రకరకాల వ్యపారాలు చేసి కాస్త పైకెదిగిన వ్యక్తి.


పదిహేనేళ్లప్పుడు అప్పన్న తన పంచన చేరినప్పుడే అన్ని పనులూ పురమాయించి ఇంకా నీకు ఖాళీగా తోస్తే ఈ మేకను మేపుతూ ఉండమని ఒక చిన్న మేకపిల్లని ఇచ్చాడు నూకరాజు. స్వతహాగా స్వామి భక్తుడయిన అప్పన్న కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఆ మేకపిల్లని ఇవ్వాల్టికి మేకలమందని చేశాడు.


ఆనాడు - నూకరాజు అయిదు రూపాయలు పెట్టి మేకపిల్లని కొని ఇస్తే, ఈ కోజు అయిదు వేలకు పైచిలుకు ఖరీదు చేసే మేకలమందని చేశాడు అప్పన్న.


మేడిపట్టడం చేతగాని నూకరాజు తనకున్న పొలాన్ని కౌలుకు ఇచ్చేసి చిల్లరమల్లర వ్యాపారాలు సాగిస్తూ గడుపుతున్నాడు.
అప్పన్నకి ఊరికినే తిండీ - బట్టా కాక నెలకో వంద చేతిఖర్చు క్రింద చెల్లిస్తుండడం దండగనిపించి నాలుగయిదు గేదెల్ని కొని వాటిని కూడా అప్పన్నకి అప్పగించాడు. ఆ గేదెల పాలు 'టీ' దుకాణాల వర్తకులకు, ఇతర ఇళ్లకు నెలసరి వాడకం వేసి ఆ సొమ్ములి వసూలు చేసి అమ్మగారి చేతిలో పొయ్యాలి.


పొద్దస్తమానం ఎంత గొడ్డుచాకిరీ చేసినా అప్పన్నకు విసుగు అనిపించేది కాదు. చిన్నప్పట్నుండి పెరిగి - పెద్దయిన ఇంటి బాగుకోసం - కుటుంబం మేలుకోసం తనూ ఆ ఇంట్లో ఓ వ్యక్తినే అన్న భావనతో ప్రతీ పనినీ 'నాదంటూ' కష్టపడడం నేర్చుకున్నాడు అప్పన్న.
నా అన్నవాళ్లు ఎవరూ లేని అప్పన్నకు తల్లీ, తండ్రీ, దైవం సమస్తం నూకరాజే అయి పెంచడం - తన కన్న కొడుకులా చూశాడన్న నమ్మకం అప్పన్నలో నాటుకుపోయింది.


అప్పన్న వయసులో అడుగుపెట్టే సరికి ఇంటి పనిమీద కొంత శ్రద్ధ తగ్గినట్టు నూకరాజుకు అనుమానం వచ్చేసరికి వెంటనే వూర్లోనే ఉన్న మరో పాలేరు కూతుర్ని చూసి మూడుముళ్లూ వేయించేశాడు.


యజమాని తన మేలుకోరి - తనని ఇంట్లో ఒక వ్యక్తిగా తలచి కదా పెళ్లి చేశాడనుకున్నాడు అప్పన్న.


ఆ రోజునుండి ఆ దంపతులిద్దరూ నూకరాజు గార్ని దేవుడిగా భావించి సేవలు చేసుకోసాగారు.


పెళ్లయిన తర్వాత ఇంట్లో పని తన భార్యకు అప్పగించి, బైటపనంతా తను చక్కబెట్టుకొనేవాడు.


డబ్బుతో లావాదేవీలు తప్ప వేరే పనంతా అప్పగించాడు నూకరాజు. అప్పన్నకు పెళ్లయిన బరునాడే తన ఇంటి వెనుక గుడిసె చేయించి యిచ్చాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
పొద్దస్తమానం తమ పని తాము చేసుకొని రాత్రయ్యేసరికి తమ పూరిగుడిసెని చేరుకొని కష్టసుఖాలు చర్చించుకునేవారు భార్యాభర్తలిద్దరూ.
కౌలుకు ఇచ్చిన భూమిని కూడా తిరిగి తీసుకొని అప్పన్నకు అప్పగిస్తూ ఇలా అన్నాడు నూకరాజు.


"ఒరేయ్! నీకూ పెళ్లయింది. పెళ్లావూ ఉంది. ఎంతకాలం నా ఇంట్లో తిండితిని, నా కోసం బ్రతికి బట్టకడతావ్? నేనిచ్చే వందా నీకే చాలదు.
ఇకనుండి మన పొలం కూడా నీవే పండించుకో. సంవత్సరానికి సరిపడా ధాన్యం నువ్వు తీసుకొని మిగతా ధాన్యం అమ్మేసి డబ్బు అమ్మగార్కి ఇచ్చేయి. ఇకనుండీ నీకు చేతి పై ఖర్చుకి ఏభై ఇస్తూ మిగతాది నీ పెళ్లాం పేర బ్యాంకులో వేస్తాను. సరేనా?


ఆ వేళ... తన యజమాని... తనని ఆయన ఎదురుగా కూర్చోబెట్టుకొని బోధించిన బోధన సంతోషంలో ముంచెత్తింది అప్పన్నని.
అంతవరకూ అంతవరకూ తను దాచుకున్న డబ్బుల్లో ఇంట్లోకి కావలసిన వస్తువులు, పట్టిమంచం, స్టీలు సామానులు, వంట పాత్రలు ఇతరత్రా సామానులు కొని పడేశాడు అప్పన్న.


ఉదయాన్నే భార్య లేచి వంటచేసి తన యజమాని గారింటికి పోతుంది. తిరిగి సాయంత్రం వేగంగా వచ్చి వంట చేసేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చి క్షణం నడుంవాల్చి తిరిగి రెండు గంటలకల్లా అక్కడుండాలి.


'పాపం... తనపని తలు చేసుకుంటూ తనూ కష్టపడుతోంది!' అప్పుడప్పుడూ ఆ ఆలోచన వచ్చినప్పుడు బాధ కలిగేది అప్పన్నకి. ఎక్కడో పుట్టి... ఇక్కడ పెరిగి... పెళ్లి చేసుకొని తనూ... భార్య... తన ఇల్లూ... వాకిలీ... భావిజీవితం గురించి కలలు కంటూ జీవించసాగాడు అప్పన్న.

"నువ్వు మందని ఎందుకు తోలుకెళ్లావ్?!" కుర్చీలో నుండి లేవకుండానే ఘీంకరించాడు నూకరాజు. అతని ప్రక్కనే అతని సతీమణి పార్వతమ్మ నిలబడి ఉంది. నూకరాజు కుదురుగా తలపాగా చుట్టి ఉన్న తలని దించుకు నిలబడ్డాడు అప్పన్న.'


"........................................." యజమాని అన్న ప్రతీమాటా చెవులు రిక్కించుకుని విన్నా నోరు మెదపలేదు అప్పన్న.
"మందని అడవికి తోలుకెళ్లి కలలు కంటూ కూర్చుంటే ఎలా అవుతుంది? అలాంటప్పుడు చాతకాదని కాళ్లు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలి..." క్షణం ఆగి... "మెఖం దీన్ని తింటూంటే చూస్తూ కూర్చున్నావా?... ఏవిట్రా? ఉలకాపలకవ్! బంకిబుక్కడంలాగా... బట్టి కొట్టుకుపోయిందా నోట్లో. నేను అడుగుతున్నది నిన్నే. అర్థమవుతోందా?! కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ లేచాడు కుర్చీలోంచి నూకరాజు.
జరుగుతున్న తతంగమంతా వంటగది ద్వారం దగ్గర నిలబడి గమనిస్తోంది అప్పన్న భార్య సూరమ్మ. భర్త దెనావస్థని చూసేసరికి సూరమ్మ కళ్లనీళ్లు కుక్కుకుంది. మనిషంత మనిషిని పట్టుకొని నానా దుర్భాషలు ఆడుతుంటే సూరమ్మ మనసు సహించటం లేదు.


ఏదో...! జరిగిపోయిన చిన్న తప్పుకు ఎంత పెద్ద రాద్దాంతం? మనసులోనే గుణుక్కుంటోంది సూరమ్మ.


నోట్లో చీరచెంగు కుక్కుకుని నిలబడి చూస్తోంది. భర్త దీన పరిస్థితిని చూస్తోంటే సూరమ్మకి కళ్లనీళ్లు ఆతటం లేదు. కట్టలు త్రెంచుకోబోతున్న దుఖాన్ని చీరచెంగుతో నొక్కిపట్టి శిలలా నిలబడి పోయింది.


"అడివంతా గాలించానయ్యా! చీకటి పడ్డ తర్వాత పొడమేక కనిపించింది. ఇంకా చీకటి పడిన దాకా ఉంటే అడవిలో చిక్కుకుపోతామని మందని మళ్లించేశాను" ఎట్టకేలకు చిన్నగా చెప్పాడు అప్పన్న.


"ఏడిశావ్! ఆంబోతులాంటి బొకడపోతు ఏవైందో? ఏవిటో! చూడకుండా ఈ చచ్చినదాన్ని తీసుకువచ్చావ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? పోన్లే, దీన్లో మాంసం ఉందా? అంటే అదీ లేదు. అసలు ఇంతకీ... బొగడ సంగతేంటట?"


"ఇప్పుడు తిండి తిని లాంతరట్టుకెళ్తానయ్యా!"


"ఎలాగో తగలడు. నాకు మాత్రం ఉదయానికల్లా ఆ బొజడతో కనిపించాల నువ్వు. అరేయ్ అప్పన్నా! ముందు నువ్వు తిండి తినేసి చుక్కలోడి ఇంటికెళ్లి మన దగ్గర మేక ఉందని, కావలిస్తే తెల్లవారు జామునే వమ్మెయ్యమను. ఆలస్యమయితే ఇది పాడయిపోతుంది."
"అలాతే!" తలవూపుతూ అనుకున్నాడు. "చచ్చిన మేక"ని కూడా సొమ్ము చేసుకుందామని గావాల?! అసలు వచ్చినా వందో... ఏభయ్యో వస్తుంది. ఆ చుక్కలోడు ఇచ్చేది తక్కువ. ఆడు అమ్ముకొనేది చిల్లర వంతులు కదా! ఎక్కువే వస్తుంది. అసలు చచ్చిన మేక మాంసం అని తెలిస్తే ఎవరు కొంటారు?


భోజనం చేసినప్పుడు తన బాధనంతా ఏకరవు పెట్టింది సూరమ్మ. అంతవరకు దిగమ్రింగుకున్న దుఖాన్ని వెళ్లగక్కేసింది. భార్య ఆవేదన అర్థం చేసుకున్న అప్పన్న అన్నాడు. "మన తల అమ్ముకున్నోళ్లవే! తలదించుకు నిలబడ్డంత మాత్రాన మనకేవీ చిన్నతనం కాదు. నేను కొండకాసి ఎళ్లాల, నువ్వు తలుపులు వేసి పడుకో"


తన యజమాని చెప్పిన కబురు చెప్పేసి చాకిరేవు కొండవైపు బయలు దేరాడు.


చుట్టూ కటిక చీకటి. ఉండుండి గుడ్లగూబల అరుపులు. చాలా భయంకరంగా వుంది వాతావరణం. కానీ, అప్పన్న దేన్నీ పట్టించుకోవడంలేదు. అప్పన్న ఆలొచన్లన్నీ సాయంత్రం జరిగిన సంఘటన మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.


"పొడమేకని మెఖం పొట్టన బెట్టుకుంది. దాన్లోన తన తప్పేవుంది? ప్రతీ మేకనీ కాపు కాయలేలు కదా? మందనయితే అడవికి తోలుకెళ్తాను. తిరిగి మళ్లిస్తాను గానీ ఏ మేక మేస్తొందో... ఏది మెయ్యలేదో గమనించలేను కదా?!


మధ్యన ఈ ఎదవ బొకడ ఒకటీ! ఏవైందో... ఎక్కడ చచ్చిందో, కొంపదీసి దీన్ని కూడా మెఖం మేసేసిందా? ఇంకేవన్నా వుందా? నాలుగైదొందలు ఖరీదు చేసే బొకడగానీ చచ్చిపోతే తనని ఉంచుతాడా తన యజమాని?


ఆ ఆలోచన మెదిలేసరికి గబగబా అడుగులు వేయసాగాడు అప్పన్న.


కొంతదూరం నుండి ఒక ఆకారం మెల్లిమెల్లిగా కుంటుతూ తనవైపే రావడం గమనించాడు అప్పన్న. మరింత పరిశీలనగా చూశాడు.
కుంటుకుంటూ వస్తోంది బొకడ!' మనసులోనే అనుకున్నాడు. అప్పన్నకి పట్టలేని ఆనందం ఆవరించుకుంది.


సంతోషం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంటే పరుగు పరుగున వెళ్లి దాన్ని కలుసుకున్నాడు. ఆనందంగా దాని పీకని వాటేసుకున్నాడు అప్పన్న.
ఎదురుగా వస్తున్న వెలుతురు రవ్వ పరుగు పెట్టేసరికి చెవులు రిక్కించుకు నిలబడిపోయింది బొకడపోతు. ఆ వెలుతురులో తన యజమాని కనిపించేసరికి పరుగు పరుగున ఎదురు వెళ్లింది. దానికి ఆ సమయంలో కాలు బాధ తెలీలేదు.


అప్పుడు... ఆ తర్వాత చూశాడప్పన్న. బొకడ ఎందుకు మెక్కుతున్నదీ కనుక్కుందామని వొంగొని కాళ్లవైపు చూశాడు. ముందర రెండు కాళ్లల్లో ఒకదానికి గాయమై ఉంది. రక్తం ధారలా కారుతోంది. గభాలున తలపాగా విప్పేసి రక్తం కారకుండా దాని కాలికి గట్టిగా కట్టాడు.
ఆ మూగజీవి తన బాధని... తను పడ్డ శ్రమని చెప్పుకోలేకపోయినా అప్పన్నకి అర్థమయిపోయింది.


'పొడమేకని మెఖం చంపుకు తింటున్నప్పుడు చూసిన బొకడపోతు ఆ మెఖంతో పోరాడి దాన్ని తరుముకుంటూ వెళ్లుంటుందని గ్రహించగలిగాడు. అలాంటప్పుడే మెఖం దీనిపైబడి కరిచినట్టుంది ' అనుకున్నాడు అప్పన్న.


అది నిజవన్న విషయం ఆ బొకడపోతుకే తెలుసు.

ఆ రోజు...


తన పనంతా పూర్తి చేసుకొని ఎనిముదయ్యేసరికి మందని అడవికి తోలుకువెళ్లడానికి బయలుదేరాడు అప్పన్న. అంతలోనే తన పెళ్లాం ద్వారా యజమాని కబురు పెట్టేసరికి వెళ్లి కలుసుకున్నాడు.


"ఇకనుండీ రోజూ రాత్రుళ్లు మన అనాసతోటలో పడుకోవాల్రా! ఇది అనాసకాయల సీజను కదా! దొంగలంజాకొళ్లు... దొంగవెధవలు కోసుకుపోతారు. ఇవాళ నువ్వు మందనుండి వచ్చిన వెంటనే తిండి తిని తోటలోకి వెళ్లిపో!"


యజమాని చెప్పింది విని తలవూపుకొని యాంత్రికంగానే మందతో బయలు దేరాడు అప్పన్న.

గుడిసెలో ఇవాళ నుండీ సూరమ్మ ఒక్కర్తీ పడుకోవాల? పాపం! అదొక్కర్తీ ఎలా పడుకుంటుందో ఏమో?

ఆ రోజంతా అన్యమనస్కంగానే సాయంత్రం వరకూ అడవిలో గడిపాడు. మందని మళ్లించి ఇల్లు చేరుకున్నాడు.


మేకలమందని శాల్లోకి తోలి తడికేసి గుడిసెలోకి పోయి, విచారంగా కూర్చున్నాడు అప్పన్న.


'దేవుడి కొండకి ఇప్పుడు తిండి తిని ఎలా వెళ్లడం? ఇప్పటికి ఉదయం నుండీ ఆయిసుపు లేకుండా పోయింది. ఎదవ ఒక దగ్గర ఉండి ఛస్తేనా? అడ్వంతా త్రిప్పించాయి. ఈరోజు మందని మళ్లించే సరికి తలప్రాణం తోక్కొచ్చింది. మందని మళ్లించేసరికి ఎంత కష్టమనిపించింది?


ఇటు తోలితే అటూ, అటు తోలితే ఇటూ... ఈ మేకలకంటే గొర్రెలు నయం. ఉంటే అన్నీ ఒక్కదగ్గరే ఉంటాయి. మేస్తే ఒక్కదగ్గరే మేస్తాయి' ఆలోచిస్తూ అలాగే నడుం వాల్చాడు అప్పన్న

.
నులకమంచం నుసికి... నొప్పికి ఎవరో మర్దనా చేస్తున్నట్టనిపించింది అప్పన్నకి.
అసలు సూరమ్మని వొదిలి వెళ్లడానికి మనసొప్పలేదు అప్పన్నకి.


అవును ఎలా వెళ్తాడు? అప్పన్న ఏవైనా ముసలోడా? పాతికేళ్ల వయసుగల పడుచుజంట. పెళ్లయి మూన్నాళ్లు కాకుండానే విడిగా ఉండమంటే ఉండగల్రా?


అదే కుర్రవయసు అప్పన్ననీ చిత్రవధ చేస్తోంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇటు యజమాని ఆదేశం - అటు మనసు ఆరాటం.

వెట్టిచాకిరీ బ్రతుక్కి అతుక్కుపోయిన అప్పన్నేం చేయగలడు? మనసు చంపుకొని మనడం తప్ప వేరే మరేం చేయగలడు?


ఆ రాత్రంతా అనాసతోటలో సూరమ్మ ధ్యాసలోనే గడిపాడు అప్పన్న. అతనితోపాటు ఆ చుత్తుప్రక్కల తోటలను కాపు కాయడానికి వచ్చిన అప్పన్నలాంటి వాళ్లంతా ఒక్కదగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.


తెల్లవారు ఝామున వస్తూనే గుడిసెలోకి పోయి ముసుగుతన్ని పడుకుండిపోయాడు అప్పన్న. భర్త వచ్చిన అరగంట పోయింతర్వాత లేచి ఇంటిపనీ, వంటపనీ పూర్తయిందనిపించి యజమానిగారింటికి పనికి వెళ్లిపోయింది సూరమ్మ. రాత్రంతా నిద్ర ఉండి ఉండదన్న ఉద్దేశంతొ అప్పన్నను లేపటం మానేసింది.


ఎండ నడినెత్తికెక్కేసరికి మెలకువ వచ్చింది అప్పన్నకి. అప్పటికి పది దాటిపోయింది. బద్దకంగా లేచి పందుంపుల్ల తీసుకొని గడ్డిమేటు దగ్గరకు వెళ్లాడు అప్పన్న.


అప్పుడే నిద్రలేచి బైటకు తోటలోకి వెళ్లివస్తున్న నూకరాజు, అప్పన్నని చూస్తూనే చిర్రుబుర్రులాడాడు.


"ఏరా ఇవాళ మేకలకి పస్తేనా?! ఎన్నడూ లేనిది దొరగారు ఇవాళ ఇంత ఆలస్యంగా లేచారేవిటీ? పెళ్లాం మోజులో ముసుగుతన్ని పడుకున్నావేమిటి? మనం గిన్నెడు మెక్కగానే సరికాదు. ఆ నోరులేనివి ఏవి తింటాయని అడవికి తోలుకెళ్లడం మానేశావ్?! అప్పుడే నీక్కూడా జిడ్డు బలిసిపోయిందన్నమాట. నిన్ననేపని లేదురా! నాది... నాదిరా బుద్ధి తక్కువ. దిక్కుమాలిన లంజాకొళ్లని నెత్తికుక్కించుకొంటే ఇలాగే ఉంటాది " అని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు నూకరాజు.


తన యజమాని ఎన్ని మాటలు అన్నా వినీవిననట్టు తలవంచుకొని పందుంపుల్ల కుంచలా నములుతూనే నిలబడిపోయాడు అప్పన్న.
నూకరాజు తిట్టిన తిట్లకి పూర్వం అయితే పట్టించుకొనేవాడు కాదు. కానీ... ఇప్పుడు ఓ ఇంటివాడే. ఓ ఇంటికి, ఇల్లాలికి యజమానే. అతనిలోనూ చీమూ, నెత్తురూ ఉంది.


నూకరాజు అన్న ప్రతీమాటా అప్పన్న గుండెల్లో సూటిగా నాటుకు పోయింది. కానీ, ఏంచేస్తాడు? ఏంచేయగలడు?
అప్పుడే చూశాడు తలెత్తి... ఎదురుగా చేటతో చెత్తపట్టుకొని నిలబడ్డ భార్యని చూశాడు.


'ఇప్పుడు జరిగిన సన్నివేశం అంతా నేనూ చూశాను ' అనడానికి సాక్ష్యంగా ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రున సుళ్లు తిరిగాయి. అప్పన్న మనసు కలుక్కుమంది.


మొహం కడుక్కోవడం పూర్తయిన వెంటనే 'దోని ' (చెట్టుపైగల ఆకుల్ని క్రింద నుండే కోసేందుకు ఉపయోగపడే సాధనం) పట్టుకొని వెళ్లి రెండుమోపుల రావి ఆకులు తీసుకువచ్చాడు అప్పన్న. మేకల మందని ఉంచిన శాల్లో ఆ రెండు మోపుల ఆకులూ పడేసి... గోళాంలో నీళ్లు కూడా పెట్టి బైటకొచ్చాడు.


అంతలోనే అప్పన్నని కేకేస్తూ పోస్ట్ మేన్ అప్పలస్వామి వచ్చాడు. వస్తూనే నూకరాజు దగ్గరకు వెళ్లాడు పోస్ట్ మేన్. ఏవిటో, ఏందుకో అర్థంకాని అప్పన్న ఆత్రుతగా అక్కడకు వెళ్లాడు. అప్పటికే తన పేరున వచ్చిన రిజిస్ష్టరు పోస్టు కవరు సంతకం పెట్టి తీసుకున్నాడు నూకరాజు.
"ఇదిగో! నువ్వు ఇక్కడ నిశీని వెయ్యి " అప్పన్న చేతికి ఇంకో కవరిచ్చి స్టేంప్ పాడ్ అందించాడు పోస్ట్ మేన్ అప్పలస్వామి.
"ఎందుకూ? ఎందుకు సావిగారూ!"


"మన అనాసతోటల గురించిరా! వెయ్యి" నూకరాజే కల్పించుకొని అన్నాడు. యజమాని సమాధానం విని మరి మారు మాట్టాడలేదు అప్పన్న. ఆ కవరు ఏవిటో, ఎందుకో అర్థమయిపోయింది. కానీ, దేనికో అర్థం కాలేదు అప్పన్నకి.


పోస్ట్ మేన్ వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా అడిగాడు అప్పన్న.


"దేనికయ్యా ఈ కవిరిప్పుడొచ్చింది?" తల గోక్కుంటూ అన్నాడు.
"రేపు అనాసతోటల అధికార్లు వస్తారట! మనల్నందర్నీ పంచాయతీ ఆఫీసుదగ్గర పదికల్లా ఉండమన్నారు. నువ్వు రేపుకూడా అడవికెళ్లకు "
'ఎందుకూ, ఏవిటీ?' అని మరడగలేదు అప్పన్న.


అప్పన్న చేతిలో ఉన్న కవరు తీసుకొని బీరువా దగ్గరకు వెళ్లాడు నూకరాజు.
"నేను గుడిసెకు పోతానయ్యా!" నెమ్మదిగా అన్నాడు అప్పన్న.


"ఊ! సాయంత్రం వేగంగా లేచి మేకలకి ఆకులూ గట్రా సంపాదించి ఉంచు " వెనుతిరక్కుండానే అన్నాడు నూకరాజు.
గుడిసెలో...!


నులకమంచం మీద వెల్లికిలా పడుకొని గుడిసె పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు అప్పన్న. అతని ఆలోచన్లు మూడేళ్ల క్రిందకు మళ్లాయి.
ఆ ఆలోచనలన్నీ అనాసతోటలు, కవర్లు... ఇలాంటి సంతకాల కవర్ల గురించే.... ఆలోచిస్తున్నాడు అప్పన్న.

మూడేళ్లనాటి మాట -


అడవినుండి మందని మళ్లించి ఇల్లు చేరుకున్నాడు అప్పన్న. అప్పటికింకా అప్పన్నకి పెళ్లి కాలేదు. ఆసరికే అప్పన్న కోసం ఎదురు చూస్తున్న నూకరాజు అప్పన్నని కేకేసి పిల్చాడు.


బల్లమీద కాగితాలు ముందరేసుకొని కూర్చొని ఉన్నాడు నూకరాజు. ద్వారం దాటి లోపలకు వస్తూ అన్నాడు అప్పన్న.
"ఏవయ్యా! పిల్చావు?" తలపాగా చుట్టుకుంటూ అన్నాడు అప్పన్న.


"ఏవీ లేదురా! ఇక్కడ నీ సంతకం వేయించుకుందామని"


"ఎందుకయ్యా!... ఏమిటీ?" ఆత్రంగా నవ్వుమొహంతో అన్నాడప్పన్న. 'ఇన్నాళ్లకి, ఇన్నేళ్లకి తన సంతకం... తన అవసరం కావలసి వచ్చింది. ఎవరికో కాదు తన యజమానికి ' ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు అప్పన్న.


"గవర్నమెంటోళ్లు ఒకో మనిషి పేరునా ఒకో ఎకరం భూమి దేవుడికొండ మీద ఇస్తున్నారు. నీ పేరున కూడా ఒక ఎకరానికి పెడదామనీ..."
"అదెందుకయ్యా?!"


"ఎందుకేవిట్రా? అనాసతోట వెయ్యాలి. అనాసతోటలు పండేది కూడా ఎక్కడనుకున్నావు? కొండప్రాంతంలోనే కదా! అందుకని ఒకో రైతుకూ ఒకో ఎకరం ఇస్తూ మూడువేల రూపాయలు అప్పుక్రింద గవర్నమెంటే ఇస్తుంది. పంట చేతికందిన తర్వాత ఆ అప్పును సక్రమంగా జమచేస్తే ఆ భూమి కూడా మనకే దక్కుతుంది. పట్టా కూడా రాసిస్తారు"


"................................." నవ్వుతూ అంతా విని నిశాని వెయ్యమన్నచోట వేసేశాడు అప్పన్న.
"రేపు బ్యాంకు ఆఫీసర్లు వస్తారు. సాయంత్రం వేగంగా మందనుంచి వచ్చెయ్!"


"అలాగే!" అంటూ వచ్చేశాడు అప్పన్న.
ఆ తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొదటి పంట చేతికందినప్పుడు అప్పన్న పేరున ఓ రిజిష్టరు కవరు వచ్చింది. ఆ తర్వాత మరో మూడు కవర్లు వచ్చినప్పుడు భయంతో అప్పన్న గాబరా పడిపోయాడు. తన యజమాని మాటపై విశ్వాసం పోయి పోస్ట్ మేన్ అప్పలస్వామిని అడిగాడు అప్పన్న.


గవర్నమెంటు వాళ్ళు ఇచ్చిన భూమి, అప్పు నీ పేరనే ఉందని...ఆ బాకీ చెల్లించే బాధ్యతయినా, హక్కు అయినా అప్పన్నకే ఉందని పోస్ట్ మెన్ అప్పలస్వామి చెప్పిన తర్వాత చాలాసార్లు ఆ అనాస తోట అప్పు గురించి తన యజమానితో ప్రస్తావించించాడు అప్పన్న. అలా ప్రస్తావించమని సలహా ఇచ్చింది కూడా పోస్ట్మెన్ అప్పలస్వామే. !


"నీపేర భూమి ఉన్నప్పుడు నిన్ను పట్టుకుంటారు తప్ప అతన్ని ఎందుకు అడుగుతారు? ఎప్పుడైనా ఆ అప్పుకు బాధ్యుడవు నువ్వే.! ఇవాళ కాకపోయినా రేపైనా గవర్నమెంటు తన అప్పు వసూలు చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆఖరికి నీ ఇల్లు , ఆస్తి జప్తు చేసైనా అప్పు వసూలుకు ప్రయత్నం సాగిస్తుంది.


ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం మీ అయ్యని అడిగి చూడు. "
ఆ రోజు పోస్ట్ మెన్ అప్పలస్వామి గీతోపదేశానికి అర్జునుడిలా చేతులు జోడించి నమస్కారం చేస్తూ కూర్చుండిపోయాడు అప్పన్న.

సూరమ్మ కుదుపులకు కళ్ళు తెరిచాడు అప్పన్న. ఆలోచిస్తూ ..ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో తెలీదు. కళ్ళు తెరిచి చూసేసరికి ప్రక్కన భార్య సూరమ్మ నిలబడిఉంది. ఎందుకో కడుపులో మంటగా అనిపించింది అప్పన్నకి. తను మధ్యాన్నం తిండి తినలేదన్న విషయం గుర్తొచ్చి చిర్రెత్తుకొచ్చింది ఎదురుగా సూరమ్మని చూసేసరికి ఒళ్ళు మండుకొచ్చింది అప్పన్నకి.


" తిండికి లేపడానికి ఏవొచ్చింది నీకు!"


" బాది..బాది విసిగిపోయి ఆకలైతే నువ్వే లేస్తావని ఊరుకొన్నాను..."అంటూనే " లేవయ్యా!ఏవిటా మొద్దు నిద్ర అవతల ఆ ఏటగాళ్ళు (పోతుల్ని కొని తామే నరికి మాంసం అమ్ముకునేవాళ్ళు) కూర్చున్నారు"


" ఎందుకూ!? అక్సురుకున్నాడు అప్పన్న.


" ఎందుకేటి? మేకపోతుని కొనుక్కున్నారు. దాన్ని తీసుకు వెళ్ళడానికి....!"


" ఏపోతూ...?"


"బొకడ-బొకడపోతు తెలీదా? ఇంకేపోతుందని పోతానంటున్నావ్?"


" అమ్మేశారా?!"


" ఆ...! కొనుక్కున్నారు కాబట్టే దాన్ని తీసుకెళ్దామని దగ్గరకు వెళ్ళారు. ఒక్కోడికీ నాలు పోట్లు పొడిచింది. పాపం.. ఎవరూ దాని జోలికి పోలేక పోయారు. " నవ్వాపుకుంటూ అంది సూరమ్మ.


"......." మౌనంగా లేచాడు అప్పన్న.


" ఏగంగా ఎల్లి దాన్ని ఆల్లకు అప్పగించేసి రా...అయ్యగారు కూడా కసురుకుంటున్నారు ఎల్లు " గుడెసెలో నుండి బైటకు తోస్తూ అంది సూరమ్మ.

బొకడపోతును తీసుకుని ఆ ఏటగాళ్ళతోబాటు ఇంటివరకూ తోలుకెళ్ళాడు అప్పన్న. అప్పటికే అక్కడ బాన, కత్తీ గట్రా సిద్ధం చేసి ఉంచారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే ఒకడు బొకడపోతు వెనక రెండు కాళ్ళూ ఒడిసి పట్టుకున్నాడు. రెండో వాడు అప్పన్న చేతిలో ఉన్న మెడకన్ని( మెడకు కట్టే త్రాడు) పట్టుకొని ముందుకు బలంగా లాగుతూ నిలబడ్డాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
వెనక వ్యక్తి కాళ్ళూ ...ముందు వ్యక్తి మెడకు కట్టిన కన్నీ బలంగా లాగుతూ నిలబడే సరికి ఎటూ కదలలేకుండా ..కదల్లేకుండా శిలలా నిలబడిపోయింది బొకడపోతు అనబడే మేకపోతు.

మూడో వ్యక్తి ఏటకత్తి ఎత్తి మూడుసార్లు క్రిందకూ మీదకూ ఎత్తి ఒకే ఒక్క బలమైనా దెబ్బ మెడమీద వేశాడు.


ఆ కత్తిదెబ్బకు మొండెం నుండి తల వేరయ్యింది. ఓ రెండు నిముషాల పాటు కాళ్ళు కొట్టుకొని ప్రాణం వదిలింది బొకడపోతు.


దాని తలమీద కత్తివేటు పడ్డప్పుడు..అప్పటికే తన చావు దానికి అర్థమయ్యేసరికి ఒకసారి బేలగా అప్పన్న కళ్ళల్లోకి చూసింది..దాని కళ్ళల్లో నీళ్ళు సుల్లు తిరిగాయి
.
ఆదృశ్యం చూసిన అప్పన్నకి మనసు ముక్కలైపోయింది.
దాని స్థానంలో తనే ఉంటే ఎలా ఉండేదో ఊహించుకొనేసరికి శరీరం గగుర్పొడిచింది అప్పన్నకి.
తనమీద విశ్వాసంతో ..భక్తితో దాని ప్రాణం తన చేతుల్లో పెట్టి కళ్ళు మూసుకుందా మూగజీవి.
అదే దుస్థితి మనిషికీ సంభవిస్తే...?



ఆ మరునాడు-
పంచాయితీ అఫీసులోని మీటింగ్ కు సమితి అఫీసర్లు, ఆర్ధిక సహాయం చేసిన బ్యాంక్ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులూ అందరూ హాజరయ్యారు.
రైతులందరూ కూడా హజరై మీటింగ్ హాల్లో ఆశీనులై ఉన్నారు.


ఆ మహాసభ రైతులంద్ర్నీ ఉద్దేశించి పెట్టిన సభ కావటం చేత అంతా వాళ్ళ కష్టసుఖాలు గురించి మాట్లాడుతూ ముగించారు. ఆ సభ ముగిసే ముందు బ్యాంకు ఆఫీసర్లు చేసిన హెచ్చరిక మాత్రం అప్పన్న మనసులో నాటుకుపోయింది.


" మీకు భూమినిస్తూ..అప్పులిచ్చింది ఎందుకు? ,ఈరు బాగుపడి..దేశాన్ని బాగు చేస్తారని. మీరు బాగుపడితే దేశం ఆర్థికంగా మెరుగు పడ్డట్టే కదా.!


"ఆ దగ్గర ఏదో సొమ్ము మూల మూలుగుతుందని కానీ, మీరిచ్చే వడ్డీల మీదే బ్యాంకు ఆధారపడి ఇచ్చిందని గానీ అపోహ పడకండి. మీకు అప్పులిచ్చి అన్ని సౌకర్యాలూ సమకూర్చింది ..కేవలం దేశానికి వెన్నముకలైన మీరు బాగుపడాలని.
మీరు కూడా మీ మీ బాధ్యతలు నెరిగి పంట చేతికందిన వెంటనే పంటనమ్మిన మొత్తం లో సగం మాత్రం అప్పుక్రింద జమ చేయండి. మిగిలినది మీ ఇంటి ఖర్చుల క్రింద వాడుకోండి. కనీ, అసలు పైసా కట్టకుండా ఎగ వెయ్యడానికి, గవనమెంటు సొమ్మే కదా అడిగే నాధుడు లేడని భ్రమపడి జమ చేయడం మానకండి. ఆ అప్పుల విషయాలలో మీ ఇల్లు..ఆస్థులు సమస్తం జప్తు చేసే వరకూ వస్తుంది. దయచేసి మమ్మల్ని మీ ఇంటి వరకూ రానివ్వకండి. !"


ఆ వారం తర్వాత...


అనాస తోటలో మొదటి పంట దిగినపుడు ఇంటికి ఆరుకాయలు తెస్తూ సూరమ్మకి ఒకటి ఇచ్చి మిగిలిన అయిదు పళ్ళూ యజమానురాలికి అందించాడు అప్పన్న.


బజార్లో మొదటిపంటలో దిగిన అనాస పళ్ళు అన్నీ వందల ప్రకారం తట్టలకెక్కించి అమ్మేసి ఇంటికి చేరుకున్నాడు నూకరాజు.
"ఏమేవ్?? ఇప్పుడు అప్పన్నగాడు తెచ్చిన అనాస పళ్ళు ఆరూ మనకనుకొని కోసెయ్యకు. పంచాయితీ ప్రెసిడెంటు గారింటికి పంపాల!" ఆయాసంతో కూర్చుంటూ అన్నాడు నూకరాజు.


" ఆరేటి?..? అయిదు. అదిగో అక్కడ పెట్టాను తీసుకుపోండి?" మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ అంది
అతని భార్య.


"అయిదా? ఆరు కదా పంపించాను" గొణుక్కున్నాడు నూకరజు.
" ఆ ఒకటీ తన ముద్దుల పెళ్ళానికి ఇచ్చాడు.. వెళ్ళి అడగండి"


" అమ్మడియమ్మా! ఎంతకైనా తెగిస్తాడే!" కోపం పట్టలేకపోయాడు నూకరాజు.


అప్పుడే అక్కడకు వస్తున్న సూరమ్మ భార్యాభర్తలిద్దరూ అనుకున్న మాటలన్నీ వింది. తిన్నగా వెళ్ళి గుడిసెలో ఉన్న అనాస పండు తీసుకువచ్చి అయిదు పళ్ళున్న దగ్గరపెట్టి వెళ్ళ్బోయింది. అదంతా బల్లమీద కూర్చుని చూస్తున్న నూకరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఏవీ అన్లేదు.


ఆ సాయంత్రం మంద నుండి వస్తూనే యజమాన్ని కలిసాడు అప్పన్న.


" ఎందుకైనా మంచిది! ఆ గవర్నమెంటోళ్ళ బాకీకి కొంత సొమ్ము కట్టెయ్యండయ్యా!" అన్నాడు.


" నీకెందుకురా వెధవ బోడి సలహాలూ నువ్వూనూ" అని కొట్టిపారేసి బజార్లోకి వెళ్ళిపోయాడు నూకరాజు.


ఆ అనాసతోట పంట సీజను అయిన మరుసటి వారమే జప్తుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు. ముందుగా నూకరాజును కలిసి అప్పన్న గుడెసె దగ్గరకు వచ్చారు.


" ఈ జాగా నాదండీ. గుడెసె ఏసుకుంటానంటే దయతలిచి ఇచ్చాను.ఇంక ఈ ఇంట్లో ఏ వస్తువుతోటీ నాకు సంబంధం లేదు"అంటూ తన ఆస్థి వివరాలు చెప్తున్నాడు నూకరాజు.


ఈ హడావుడికి సూరమ్మ పని చేసుకుంటున్నదల్లా గుడెసె దగ్గరకు వచ్చింది. అప్పుడే మందతో బయలుదేరడానికి సిద్ధమౌతున్న అప్పన్నకి నోట మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.


గుడెసెలో ఉన్న సమస్త వస్తువులు జాబితా వ్రాసుకొని తీసుకువెళ్ళి పోయారు బ్యాంకు వాళ్ళు. పూచికపుల్ల కూడా విడవకుండా తీసుకుపోతూ అప్పన్న చేతిలో ఒక నోటీసు కాగితం పెట్టి మరీ వెళ్ళిపోయారు.


ఆ నోటీసులో బ్యాంకు చట్టం ప్రకారం చేస్తామనీ ....వాటి తాలూకా నియమ నిబంధనలకు మీరు బద్ధులు కావాలని హెచ్చరిస్తూ తెలియజేయబడింది.


గుడెసె నూకరాజు ఆస్థి కావడం మూలాన దాన్ని వాళ్ళు సీజ్ చేయలేదు.
ఆ రాత్రంతా భార్యా భర్తలిద్దరూ నిద్ర లేకుండా గడిపారు.


'ఎంతో ముద్దుగా ...ముచ్చట తీరా తమ సంసారం కోసం సరంజామా అంతా సర్దుకుంది ఇన్నాళ్ళూ. దాన్ని ఈ రోజు వీళ్ళు గద్దలా తన్నుకు పోయారు. అది వాళ్ళ తప్పు కాదు. మరెవరిది? ఆ తప్పెవరిదో వాళ్ళకు తెలుసు. కానీ, సంఘం దృష్టిలో ...చట్టం దృష్టిలో తామే దోషులు.గవర్నమెంటు వారు ఇచ్చిన ౠణాన్ని జల్సా చేసి జబర్దస్తీగా తిరగేస్తున్న కుండాకోర్లు.
అందుకే అప్పన్న శిలా ప్రతిమలా నిలబడిపోయాడా క్షణం.


ఆ రాత్రంతా అప్పన్నని నానా దుర్భాషలాడింది సూరమ్మ అతని చేతకానితనాన్ని, అమాయకత్వాన్ని పొడిచి..పొడిచి చంపేసింది.
ఆ మరునాడు తూర్పు నెమ్మదిగా ఎర్రబారుతోంది.


అప్పన్న లేస్తూనే భార్యతో చెప్పల్సిందంతా చెప్పి మందతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే నూకరాజు నుండి కబురు వచ్చేసరికి వెళ్ళ్క తప్పదని వెళ్ళాడు అప్పన్న.


" ఒరేయ్ అప్పన్నా! అయిందేదో అయిపోయింది. వెధవ సామాన్లు పోతేపోనీ..మళ్ళా సంపాదించుకోవచ్చు."
అన్నాడు నూకరాజు.


అతనిముందు అప్పన్న చేతులు కట్టుకుని నిలబడలేదు. చేతులు నులుముకుని నిలబడలేదు. నిర్వికారంగా ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు. అప్పన్న కళ్ళల్లోకి తేరిపార చూసాడు నూకరాజు.


ఎర్రగా మండుతున్నాయి. కానీ బాధ గుండెని పిండుతుందేమో ఆ ఎర్రబడ్డ కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా జాలువారుతున్నాయి.
" నా పెళ్ళాం వస్తుంది దానికో పదిసేర్లు బియ్యం ఇప్పించండి అని వేడుకో లేదు. మామూలుగానే అన్నాడు అప్పన్న.
" అమ్మగార్ని అడిగి తీసుకుపొమ్మను. నువ్వు మందతో పో!"


నూకరాజు మాటవిని వెనుదిరగలేదు అప్పన్న. తన మానాన తను వెనక్కి తిరిగి వచ్చేసి మందని తోలుకుని బయలుదేరాడు.
భర్త చెప్పిన ప్రకారం తొమ్మిదయ్యేసరికి చాకిరేవు కొపండదగ్గరకు చేరుకుంది సూరమ్మ. ఆమె చేతిలో పదిసేర్ల బియ్యం....ఒక తపేలా.. చిన్న మూట ఉన్నాయి.


భార్య భర్తలిద్దరూ మందని తోలుకుంటూ చాకిరేవు కొండని దాటిపోయారు. అలా కొండల్ని దాటుకుంటూ అడవి మార్గాన్నే ప్రయాణం సాగిస్తున్నారు.


" ఆ నూకరాజు గాడికి .. ఆడి మనుషులకి అందనంత దూరంగా పారిపోవాలి" అదే భార్యా భర్తలిద్దరి ఆలోచన.


ఆలోచిస్తూ నడుస్తున్న అప్పన్నకు ఒకానొకప్పుడు బొకడపోతు తన యజమాన్ని పొడిచిన సంఘటన గుర్తుకొచ్చేసరికి నవ్వు పుట్టుకొచ్చింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఆ మరునాడు-
పంచాయితీ అఫీసులోని మీటింగ్ కు సమితి అఫీసర్లు, ఆర్ధిక సహాయం చేసిన బ్యాంక్ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులూ అందరూ హాజరయ్యారు.
రైతులందరూ కూడా హజరై మీటింగ్ హాల్లో ఆశీనులై ఉన్నారు.


ఆ మహాసభ రైతులంద్ర్నీ ఉద్దేశించి పెట్టిన సభ కావటం చేత అంతా వాళ్ళ కష్టసుఖాలు గురించి మాట్లాడుతూ ముగించారు. ఆ సభ ముగిసే ముందు బ్యాంకు ఆఫీసర్లు చేసిన హెచ్చరిక మాత్రం అప్పన్న మనసులో నాటుకుపోయింది.


" మీకు భూమినిస్తూ..అప్పులిచ్చింది ఎందుకు? ,ఈరు బాగుపడి..దేశాన్ని బాగు చేస్తారని. మీరు బాగుపడితే దేశం ఆర్థికంగా మెరుగు పడ్డట్టే కదా.!


"ఆ దగ్గర ఏదో సొమ్ము మూల మూలుగుతుందని కానీ, మీరిచ్చే వడ్డీల మీదే బ్యాంకు ఆధారపడి ఇచ్చిందని గానీ అపోహ పడకండి. మీకు అప్పులిచ్చి అన్ని సౌకర్యాలూ సమకూర్చింది ..కేవలం దేశానికి వెన్నముకలైన మీరు బాగుపడాలని.
మీరు కూడా మీ మీ బాధ్యతలు నెరిగి పంట చేతికందిన వెంటనే పంటనమ్మిన మొత్తం లో సగం మాత్రం అప్పుక్రింద జమ చేయండి. మిగిలినది మీ ఇంటి ఖర్చుల క్రింద వాడుకోండి. కనీ, అసలు పైసా కట్టకుండా ఎగ వెయ్యడానికి, గవనమెంటు సొమ్మే కదా అడిగే నాధుడు లేడని భ్రమపడి జమ చేయడం మానకండి. ఆ అప్పుల విషయాలలో మీ ఇల్లు..ఆస్థులు సమస్తం జప్తు చేసే వరకూ వస్తుంది. దయచేసి మమ్మల్ని మీ ఇంటి వరకూ రానివ్వకండి. !"


ఆ వారం తర్వాత...


అనాస తోటలో మొదటి పంట దిగినపుడు ఇంటికి ఆరుకాయలు తెస్తూ సూరమ్మకి ఒకటి ఇచ్చి మిగిలిన అయిదు పళ్ళూ యజమానురాలికి అందించాడు అప్పన్న.


బజార్లో మొదటిపంటలో దిగిన అనాస పళ్ళు అన్నీ వందల ప్రకారం తట్టలకెక్కించి అమ్మేసి ఇంటికి చేరుకున్నాడు నూకరాజు.
"ఏమేవ్?? ఇప్పుడు అప్పన్నగాడు తెచ్చిన అనాస పళ్ళు ఆరూ మనకనుకొని కోసెయ్యకు. పంచాయితీ ప్రెసిడెంటు గారింటికి పంపాల!" ఆయాసంతో కూర్చుంటూ అన్నాడు నూకరాజు.


" ఆరేటి?..? అయిదు. అదిగో అక్కడ పెట్టాను తీసుకుపోండి?" మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ అంది
అతని భార్య.


"అయిదా? ఆరు కదా పంపించాను" గొణుక్కున్నాడు నూకరజు.
" ఆ ఒకటీ తన ముద్దుల పెళ్ళానికి ఇచ్చాడు.. వెళ్ళి అడగండి"


" అమ్మడియమ్మా! ఎంతకైనా తెగిస్తాడే!" కోపం పట్టలేకపోయాడు నూకరాజు.


అప్పుడే అక్కడకు వస్తున్న సూరమ్మ భార్యాభర్తలిద్దరూ అనుకున్న మాటలన్నీ వింది. తిన్నగా వెళ్ళి గుడిసెలో ఉన్న అనాస పండు తీసుకువచ్చి అయిదు పళ్ళున్న దగ్గరపెట్టి వెళ్ళ్బోయింది. అదంతా బల్లమీద కూర్చుని చూస్తున్న నూకరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఏవీ అన్లేదు.


ఆ సాయంత్రం మంద నుండి వస్తూనే యజమాన్ని కలిసాడు అప్పన్న.


" ఎందుకైనా మంచిది! ఆ గవర్నమెంటోళ్ళ బాకీకి కొంత సొమ్ము కట్టెయ్యండయ్యా!" అన్నాడు.


" నీకెందుకురా వెధవ బోడి సలహాలూ నువ్వూనూ" అని కొట్టిపారేసి బజార్లోకి వెళ్ళిపోయాడు నూకరాజు.


ఆ అనాసతోట పంట సీజను అయిన మరుసటి వారమే జప్తుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు. ముందుగా నూకరాజును కలిసి అప్పన్న గుడెసె దగ్గరకు వచ్చారు.


" ఈ జాగా నాదండీ. గుడెసె ఏసుకుంటానంటే దయతలిచి ఇచ్చాను.ఇంక ఈ ఇంట్లో ఏ వస్తువుతోటీ నాకు సంబంధం లేదు"అంటూ తన ఆస్థి వివరాలు చెప్తున్నాడు నూకరాజు.


ఈ హడావుడికి సూరమ్మ పని చేసుకుంటున్నదల్లా గుడెసె దగ్గరకు వచ్చింది. అప్పుడే మందతో బయలుదేరడానికి సిద్ధమౌతున్న అప్పన్నకి నోట మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.


గుడెసెలో ఉన్న సమస్త వస్తువులు జాబితా వ్రాసుకొని తీసుకువెళ్ళి పోయారు బ్యాంకు వాళ్ళు. పూచికపుల్ల కూడా విడవకుండా తీసుకుపోతూ అప్పన్న చేతిలో ఒక నోటీసు కాగితం పెట్టి మరీ వెళ్ళిపోయారు.


ఆ నోటీసులో బ్యాంకు చట్టం ప్రకారం చేస్తామనీ ....వాటి తాలూకా నియమ నిబంధనలకు మీరు బద్ధులు కావాలని హెచ్చరిస్తూ తెలియజేయబడింది.


గుడెసె నూకరాజు ఆస్థి కావడం మూలాన దాన్ని వాళ్ళు సీజ్ చేయలేదు.
ఆ రాత్రంతా భార్యా భర్తలిద్దరూ నిద్ర లేకుండా గడిపారు.


'ఎంతో ముద్దుగా ...ముచ్చట తీరా తమ సంసారం కోసం సరంజామా అంతా సర్దుకుంది ఇన్నాళ్ళూ. దాన్ని ఈ రోజు వీళ్ళు గద్దలా తన్నుకు పోయారు. అది వాళ్ళ తప్పు కాదు. మరెవరిది? ఆ తప్పెవరిదో వాళ్ళకు తెలుసు. కానీ, సంఘం దృష్టిలో ...చట్టం దృష్టిలో తామే దోషులు.గవర్నమెంటు వారు ఇచ్చిన ౠణాన్ని జల్సా చేసి జబర్దస్తీగా తిరగేస్తున్న కుండాకోర్లు.
అందుకే అప్పన్న శిలా ప్రతిమలా నిలబడిపోయాడా క్షణం.


ఆ రాత్రంతా అప్పన్నని నానా దుర్భాషలాడింది సూరమ్మ అతని చేతకానితనాన్ని, అమాయకత్వాన్ని పొడిచి..పొడిచి చంపేసింది.
ఆ మరునాడు తూర్పు నెమ్మదిగా ఎర్రబారుతోంది.


అప్పన్న లేస్తూనే భార్యతో చెప్పల్సిందంతా చెప్పి మందతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే నూకరాజు నుండి కబురు వచ్చేసరికి వెళ్ళ్క తప్పదని వెళ్ళాడు అప్పన్న.


" ఒరేయ్ అప్పన్నా! అయిందేదో అయిపోయింది. వెధవ సామాన్లు పోతేపోనీ..మళ్ళా సంపాదించుకోవచ్చు."
అన్నాడు నూకరాజు.


అతనిముందు అప్పన్న చేతులు కట్టుకుని నిలబడలేదు. చేతులు నులుముకుని నిలబడలేదు. నిర్వికారంగా ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు. అప్పన్న కళ్ళల్లోకి తేరిపార చూసాడు నూకరాజు.


ఎర్రగా మండుతున్నాయి. కానీ బాధ గుండెని పిండుతుందేమో ఆ ఎర్రబడ్డ కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా జాలువారుతున్నాయి.
" నా పెళ్ళాం వస్తుంది దానికో పదిసేర్లు బియ్యం ఇప్పించండి అని వేడుకో లేదు. మామూలుగానే అన్నాడు అప్పన్న.
" అమ్మగార్ని అడిగి తీసుకుపొమ్మను. నువ్వు మందతో పో!"


నూకరాజు మాటవిని వెనుదిరగలేదు అప్పన్న. తన మానాన తను వెనక్కి తిరిగి వచ్చేసి మందని తోలుకుని బయలుదేరాడు.
భర్త చెప్పిన ప్రకారం తొమ్మిదయ్యేసరికి చాకిరేవు కొపండదగ్గరకు చేరుకుంది సూరమ్మ. ఆమె చేతిలో పదిసేర్ల బియ్యం....ఒక తపేలా.. చిన్న మూట ఉన్నాయి.


భార్య భర్తలిద్దరూ మందని తోలుకుంటూ చాకిరేవు కొండని దాటిపోయారు. అలా కొండల్ని దాటుకుంటూ అడవి మార్గాన్నే ప్రయాణం సాగిస్తున్నారు.


" ఆ నూకరాజు గాడికి .. ఆడి మనుషులకి అందనంత దూరంగా పారిపోవాలి" అదే భార్యా భర్తలిద్దరి ఆలోచన.


ఆలోచిస్తూ నడుస్తున్న అప్పన్నకు ఒకానొకప్పుడు బొకడపోతు తన యజమాన్ని పొడిచిన సంఘటన గుర్తుకొచ్చేసరికి నవ్వు పుట్టుకొచ్చింది.


ఆరోజు దాన్ని కసాయి వాళ్ళకు అప్పగిస్తున్నప్పుడు అది తనని కూడా పొడిచుంటే...?! కాళ్ళతో కుమ్మేసి ఉంటే...?? అప్పన్న శరీరంలోని రక్తం గడ్డకట్టుకు పోయింది....

[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
లేడిగాడు - దవులూరి కృష్ణ మనోహర్ రావు
[Image: l.jpg]
అతని పేరు "లేడు" వాళ్ళింటి పేరు కర్రి.ద్రాక్షారం ఆకులోరి వీధిలో ఓ సందులో ఉంటాది వాళ్ళిల్లు. అతనికా పేరు ఎలా వచ్చిందంటే - అతని కంటే ముందు పుట్టినోళ్ళను పుట్టినట్టు యములోళ్ళు తీసుకుపోతుంటే, వాళ్ళమ్మ పుట్టినోడు ఇక్కడ లేడు అనుకొని యములాళ్ళు వెళ్ళిపోతారని ఆ పేరు పెట్టింది. అలానే యములాళ్ళు వాడు ' లేడు ' అనుకొని వెళ్ళిపోయేవారు.

అలా బతికి బట్ట్కట్టిళ్ళే అబద్దం, పెంటయ్య వగైరాలు. మా ప్రాంతంలో ఒకడు పుట్టింది అబద్దమైతే మరొకడ్ని పెంట మీద పారేసి తిరిగి తెచ్చుకున్నారు. పెంటయ్య పేరు పెట్టి.

కానీ వాడికైదేళ్ళప్పుడు కోటి పల్లి శివరాత్రి స్నానాలకెడితే అక్కడ యములాళ్ళు కాడు కనబడ్డాడు. ఆ పేరెట్టి తమని బురిడ కొట్టించేసిందని వాడినొదిలేసి వాళ్ళమ్న్ను పెనాల్టీగా వాళ్ళనాన్నను గోదాట్లో ముంచేసి తీసుకు పోయారు యములాళ్ళు.

వాడికెనకాల ఎనిమిదెకరాల మాగాణి, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వలన చుట్టాల్లో వాడ్నెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కల్సి పెంచేరు.

ఆ ఆస్తే లేకపోతే ఏదో అనాధాశ్రమంలో చేర్చేసి చేతులు దులుపేసుకొనేవారు. కానీ నిజంగా అనాధని చూసినట్టే చూసారు. అందరూ లేడిగా అని పిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా అందరికీ అలానే అలవాటైపోయింది. లేడిగాడికి ముగ్గురు పినతల్లులు. ముగ్గురు మేనత్తలు ఉన్నారు. వాడింట్లో ఒకరి తర్వాత ఒకరు రెండేసి నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్లు వాడి ఆస్తిమీదొచ్చేది సమానంగా పంచుకొనేటట్లు ఒప్పందానికొచ్చారు. గుడి దెగ్గర ఉన్న వాడి కొట్టు వెచ్చా కోమట్ల చేతిలో ఉంది. లేడు తండ్రి ఎవర్నో పట్టుకుని పెద్ద కమెనీకి హోల్ సేల్ రైట్ పొందాడు. ఆ కంపెనీ సరుకులు ఆ కొట్లో పెట్టి నడుపుతూ ఆ పని తన వలన కాదని వెచ్చా వారి కొట్టుకు నెలనెలా అద్దె ఇచ్చేటట్లు ఆ కంపెనీ సరుకుల మీద లాభంలో ప్[అదో వంతు వెచ్చా వారిచ్చేట్లు అగ్రిమెంటు చేసుకున్నాడు. వాడి చదువు మీద ఎవరూ శ్రద్ధ పెట్టలేదు, అయినా పదో తరగతి వరకు చదివాడు హై కాలేజ్లో అందరూ చిన్నప్పట్నుంచీ లేడిగాదు అని పిలుస్తూంటే లేడిలా పరిగెత్తాలనుకొని అన్ని పనులూ తొందరగా చేసేవాడు. లేడిగాడికి పద్దెనిమిదేళ్ళు వచ్చాక మేనత్తలు మా పిల్లను చేసుకో మా పిల్లను నీకోసమే కన్నాం. అంటూంటే ఆపీడ పడలేక స్నేహితుడు మాచర్రావు ద్వారా వెంకట్టయ పాలెం తోతొఋఈ అమ్మాయిని చేసుకున్నాడు. లేడుగాడు అంత తెలివి తక్కువ వాడేం కాదు. తన చుట్టల చూపంతా తన ఆస్తి మీదే ఉందని తెలుసు. పెళ్ళి అయ్యాక చుట్టాలనందరినీ తరిమేసాడు.

అనుకొన్న పని అనుకొన్నట్టు తొందరగా చేసేయడమే కాని వెనక్కి చూసే ప్రశ్నే ఉండేది కాదు.మాట తొందర, మనసు మాణిక్యం. అందరూ లేడు అంటున్నారని ఉన్నాననిపించుకోవాలని ఎక్కడలేని సందడి పుట్టించేవాడు. కలకత్తాలో కొన్నాళ్ళుండి వచ్చిన సేత్ తో స్నేహం చేసి బెంగాలి పంచె కట్టు నేర్చుకున్నాడు. పంచె కొసలు లాల్చీ జేబులో దూర్చే నేర్పు సంపాదించాడు.

తెల్లగా సన్నగా పొడువుగా పొడుగాటి ముక్కుతో నోట్లో సిగరెట్టు బెంగాలి పంచెకట్టు లాల్చీతో ద్రాక్షరం సెంటర్లో లేడిగాడు హడావుడిగా తిరుగుతూంటే ఫేమిలీ లేడీస్ కూడా సినిమాకు పోతూ మొగుడు చూడకుండా వెనక్కి తిరిగి వాడ్ని చూసేవారు.

పెళ్ళయిన అయిదేళ్ళలో ఇద్దరు కూతుర్లని కని పెద్ద కూతురుకు పదిహేడు వచ్చేటటప్పటికి పిచ్చికుక్క కరిచి లేడిగాడి భార్య చనిపోయింది. ఆమె సంవత్సరీకం వెళ్ళే లోపలే ఒకే పందిరిలో ఇద్దతు కూతుళ్ళూవీరమ్మ, సత్తెమ్మలకు పెళ్ళిళ్ళు చేసేసేడు. వీరమ్మకు 18ఏళ్ళు, సత్తెమ్మకు 16 ఏళ్ళు. వీరమ్మను తోటపేట, సత్తెమను వెలంపాలెం ఇచ్చాడు.

ఇద్దరికీ చెరో రెండెకరాలూ రాసేసేడు. చెరో పదివేల బాంక్ లో వాళ్ళ పేరు మీద వేశాడు. భార్య నగలు చెరో ఇరవై కాసులు ఇచ్చేశాడు.కాపురాలకు పంపించే ముందు పరోక్షంగా ఆడదిక్కులేని ఇల్లు కనక తరచు రావద్దని చూడాలనిపిఒస్తే తానే వస్తానని చెప్పివేశాడు.

వాళ్ళు తమతో వచ్చి ఉండమని బలవంతం చేశారు వాళ్ళు రమ్మంటున్నది తన డబ్బు దక్కించుకొందామనే కానీ తనమీది ప్రీతితో కాదు అనుకొన్నాడు డబ్బు మీదున్న ప్రీతి, మనిషి మీదుండదని సోయంగా గ్రహించినవాడతను. వెచ్చాషావుకార్లు బేంక్ లో వేసిన డబ్బు అంతా తీసి ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. నెల్నెలా కొట్టు అద్దె వస్తుంది. కౌలుకిచ్చిన భూమి మీద శిస్తు వస్తుంది. లేడిగాడి పని దర్జాగా నడిచిపోతుంది. వెచ్చావారిచ్చే 10శాతం ఎలాగూ వస్తుంది.

రెండుపూట్లకు ప్రొద్దుటే తనే వండుకొని భోజనం చేసేసి పదిగంటలకు ద్రాక్షారం రాగానే ముందు గుడిలోకెళ్ళి భీమేశ్వరుని దర్శించుకొంటాడు.పేరుపేరునా పంతుళ్ళను పలకరించి వస్తాడు. పదకొండింటికి సెంటరుకొస్తాడు. లేడిగాడు రాగానే సెంటర్లో సందడి పెరిగిపోతుంది. వచ్చిందొకడైనా పాతికమందొచ్చినట్లుంటుంది. బ్రాకెట్ ఆడేవాళ్ళతో ఓపింగు, క్లోసింగు నెంబర్ల గురించి దీరీలు తీస్తాడు. రాజకీయలలో ఇంట్రెస్టు ఉన్నవాళ్ళతో వాతో వాటి విషయం చర్చిస్తాడు. రాజకీయ పాఠాలు నేర్పుతాడు.

సినిమాల విషయానికొస్తే సాంఘికాలలో నాగేశ్వరరావు అభిమాని. పౌరాణికాలలో రామారావు అభిమాని. వాళ్ళ మీద ఈగ వాలనీయడు. మధ్యాన్నం రెండు గంటల వరకు అదే కాలక్షేపం. దునే నారాయణ గారి షోడాకొట్టు వద్ద ఒక ఆర్టోస్ వింటో కొని అదేదో విస్కిలాగా అరగంట తాగేవాడు. చవకఅని డక్కన్ సిగరెట్లు కాల్చేవాడు. మరో విధమైన ఖర్చు చేసేవాడు కాడు. మాఘమాసం, కార్తీక మాసాల్లో గుడి చాలా హడావుడిగా ఉంటుంది. అందువలన మధ్యాన్నం రెండు వరకు గుడిలోనే ఉండేవాడు. అందర్నీ క్యూలలో నిలబెట్టడం, భక్తులు అవసరాలేమన్న ఉంటే కనుక్కొని సహాయం చెయ్యడం అతని డ్యూటీ. అక్కడ డ్యూటీ చేసే ఉద్యోగులంతా అధికారంతో డ్యూటీ చేస్తుంటే, లేడిగాడు ఆత్మీయంగా చేసేవాడు.

మధ్యాన్నం రెండు గంటలకు తన సొంత బిజినెస్ ప్రారంభించేవాడు. సెంటర్ లో టీ త్రాగి బేగ్ పట్టుకొని బయలుదేరేవాడు. మొత్తం బజారంతా అతని బిజినెస్ ఏరియానే. అతనిది రోజువారీ వడ్డీవ్యాపారం. అంటే వంద రూపాయలు కావాలంటే 90 రూపాయలిస్తాడు. రోజు రోజూ పదేసి చొప్పున పదిరోజులు కట్టాలి. ఇబ్బందుల వలన బడ్డీ కొట్టు వాళ్ళు, జంగిడీ షావుకార్లు షోడాబళ్ళ వాళ్ళు సరిగ్గా కట్టక పోయినా పెద్ద ఇబ్బంది పెట్టేవాడు కాదు. అందరూ కొంచెం ముందో వెనకో కట్టేవారు. కష్టసుఖాలు తెలిసున్న మనసున్న మనిషి అని అందరూ అతని వద్దే డబ్బు తీసుకునేవారు. ఎవరైనా ఇబ్బందితో కట్టలేకపోతే ఉదారంగా వదిలేసేవాడు కానీ, రాద్దాంతం చేసేవాడు కాడు. ఎవరిదగ్గరా ఆ మాట మాత్రం అనొద్దని మాట మాత్రం తీసుకునేవాడు.

అసలల్లంటి చిల్లర వ్యాపారం చేయాల్సిన అవసరం లేడిగాడ్కి లెదు. లేడిగాడు సెంటర్లో ప్రతి ఒక్కరినీ పలకరించడానికి, వాళ్ళ బాగోగులు కనుక్కోడానికి అవసరమైతే, సహాయం చేయడానికి ఈ వ్యాపరం ఎన్నుకొన్నాడు.

ఎవర్నీ పేరుపెట్టి పిలిచేవాడు కాడు. బావా, అన్నయా, తమ్ముడూ, మావయ్యా, చెల్లీమ్మా, అంటూ వరసలు కలుపుకొని కబుర్లు చెప్పుకోవడానికి బిజినెస్ బాగుండేది. తనకంటే చిన్నావిడను కూడా అక్కయ్యా అని పిలిచినా, పెద్దవాడిని తమ్ముడూ అని పిలిచినా నవ్వుకునేవారే కానీ, కోపగించుకునేవారు కాదు.

లేడి గాడికో చిన్న సరదా ఉండేది. జేబుల్లోంచి రూపాయి తియ్యాలన్నా జేబులో ఉన్న మొత్తం డబ్బు దొంతర తీసేవాడు. అందులో సగం వడ్డీ వ్యాపారం తాలూకు పద్దులే. నైసుగా వంద రూపయల నోట్ల సైజులో కత్తిరించి వంద నోట్ల మధ్య పెట్టేవాడు. అందరూ ఆ బొత్తి అంతా డబ్బే అనుకోవాలని తాపత్రయం అతనిది. సాయంత్రం అయిదింటికి బిజినెస్ అయిపోయేది.

హై కాలేజీకి జూనియర్ కాలేజీకి పెద్ద గ్రౌండు ఉంది. అయిదింటి నుంచి పిల్లలు ఆ గ్రౌండులో రకరకాల ఆటలు ఆడేవారు.

లేడిగాడు అయిదింటికి అక్కడ ప్రత్యక్షమైపోయేవాడు. ఎంతదూరం వెళ్ళినా నడకే దేవుడిచ్చిన బండి ఉండగా ఇంకో బండి ఎందుకురా అనేవాడు.

వయస్సైపోవస్తున్నా కుర్రోళ్ళలొ కుర్రోడై సలహాలిస్తూ వాళ్ళతో ఆటలాడేవాడు. సరదాగా ఉంటుందని వాళ్ళు కూడా లేడిగాడ్ని తమ టీంలలో ఆడనిచ్చేవారు.


ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
"బాల్ బేడ్మెంట్లలో షాటిలా కొట్టాలి..అలా కాదురొరేయ్.." అనేవాడు.

ఫుట్ బాల్ లో "ఇంకా బలంగా తన్నాలిరా..నీ పెళ్ళాం నిన్నింతకంటే గట్టిగా తన్నుతుందిరొరేయ్..." అనే వేళాకోళం చేసేవాడు. చీకటిపడే వరకు పిల్లలతో కాలక్షేపం చేసి వచ్చేసే ముందు వాళ్ళందిరికీ శనగలు, బిస్కత్తులు, కొనిపెట్టి, వాళ్ళు ఆనందంగా తింటుంటే సంతోషించేవాడు. అక్కడి నుండి పిల్లలెళ్ళిపోయినాక కాళ్ళీడ్చుకొంటూ రత్తమ్మ కంపనీకొచ్చేవాడు.

అదెలా జరిగిందంటే, లేడిగాడు పక్కింట్లో ఉండే సుందరమ్మ మొగుడు గల్ఫ్ ఎల్లిపోయినాడు. వెళ్ళేడన్నమాటే గానీ రూపాయ పంపే స్థితి లేదు.

అందుకు సుందరమ్మ ఏమన్నా సర్దగలడని లేడిగాడ్కి లైనేయడం మొదలెట్టింది. " మగాడివి, వంటేం చేసుకుంటావు? పోనీ అదన్నా చేసిపెడతాను .." అంది. దానికీ దీనికీ లేడిగాడు ఒప్పుకోలేదు.

దాంతో సుందరమ్మ లేడిగాడు ఆడంగోడు, అసలా కూతుర్లు వాడికే పుట్టారా అని పుకారు లేవదీసింది. స్వయంపాకం కనుక ఆ పుకారు త్వరగా పాకింది. అసలే లేడి అంటే ఆడది అనే అర్థం ఉంది ఇంగ్లీషులో.దాంతో లేడి గాడికి దిగులట్టుకొంది. అందరూ కరంటుపోయిందనుకొంటున్నరని ఆ మాట, మాటల సందర్భంలో తన స్నేహితుడు , రత్తమ్మ కంపనీ ఓనర్ మచర్రావుతో చెప్పి బాధ పడ్డాడు.

"పెళ్ళి చేసుకో " సలహా ఇచ్చాడు మాచర్రావు.

"ఈ వయస్సుల్లో నాకు పెళ్ళేంటి? దాన్ని కాపలా కాసే కుక్క బ్రతుకైపోతాది నాది.."

"పోనీ దేన్నైనా ఉంచుకో "

"తెల్ల ఏనుగును ఇంటిముందు కట్టుకొన్నట్లవుతుంది దాన్ని మనమెక్కడ పోషించగలం? "

"పోనీ ఇంకా మగాడినేనని అనిపించుకున్నట్లుంటుంది. ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అలాంటి కేసు చూసాతాను. సరేనా..? "

సరేనన్నాడు లేడిగాడు.

రత్తాలుతోపాటే పెద్దాపురం నుంచొచ్చిన దాని చెల్లెలు సీతాలు రత్తాలు కంపనీలో చిల్లర పనులు చేస్తూ కాలం గడుపుతుంది. రంగెలిసిపోయింది కనుక ఎవరూ వాడరు.

సీతాలు నుంచుకోమన్నాడు మాచర్రావు.

" మరీ అంత ముసలి డొక్కునా..?"

" నీవు మగాడివి. ముండ ఉంది, అంతేకానీ అది ముసలిదా, ముతకదా అని ఎవడిక్కావాలి? ఇదైతే రోజుకు పది రూపాయలు పారేస్తే సరిపోతుంది. అది నీకో ళ్లెక్కలోది కాదు. నీకూ మగతనం ఉంది ..ముండని మైంటైన్ చేస్తున్నావని సెంటర్లో అంతా అనుకొంటారు." అని ఒప్పించాడు మాచర్రావు.

లేడిగాడు సీతాల్ని ఎప్పుడూ ముట్టుకోలేదు. బిజినెస్ తో, పిల్లలతో ఆటల్తోటీ అలసి పోయిన కాళ్ళను పిసిగించుకొంటూ నాలుగు సరదా కబుర్లు చెప్పుకొంటూ ఒక గంట గడిపి పది రూపాయలిచ్చేసి పెద్ద పొడిచేసినోడిలా సెంటరుకొచ్చేవాడు రాత్రి పది గంటలకు. పది రూపాయలిచ్చినా ఏ మంగలీ కాళ్ళు పట్టడానికి ఆ టైముకి రాడు. వచ్చినా కరక్టు టైముకి రాడు. అయినా ఆడదాని చేతులు స్పెషలే కదా.

"ఎందుకు బావా ! నీకింకా ఈ సెటప్ " అనెవరైనా అడిగితే " బేటరీ ఇంకా దిగిపోలేదు, ఏం చేయమంటావు " అని ఎదురు ప్రశ్న వేసేవాడు. తన కూతుర్లిద్దరూ ఊర్లో ఉన్నా వాళ్ళిద్దరి దగ్గరకు అంతగా వెళ్ళేవాడు కాడు. ఎంతసేపూ ఆ ఎప్పుడో ఇచేది ఇప్పుడే ఇచ్చేయకూడదా వడ్డీ వ్యాపారం చేసుకొంటానని సతాయిస్తాదని"

చిన్న కూతురు సత్తెమ్మ మొగుడు పనికిరాని పోరంబోకు కనుక పిల్లలకు బట్టలూ అవీ కొనేవాడు.

లేడిగాడు లేకుండా ఊర్లో ఏ శుభకార్యం అయ్యేది కాదు. ఊర్లో పెద్దలు " లేడిగాడెక్కడ ఉన్నాడో చూడండ్రా! ఆడు లేకపోతే ఏ పని అవదు. ఉన్నచోటుండడు. వీడ్ని వెతకటానికి ఇద్దర్ని పెట్టాల్సొస్తుంది. " అని సరదాగా విసుక్కొనేవారు.

గుడిలో జరిగే పెళ్ళిళ్ళ కన్నిటికీ లేడిగాడే పెద్ద. పై గ్రామాల నుండి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళకన్ని విధాలా సాయం చేసేవాడు. రద్దీ ఎక్కువుండడం వలన పొరవాట్న పెళ్ళి కూతుర్ని మార్చేసేడు. సరైన టైములో వాళ్ళు చూసుకొన్నారు. కనుక సరిపోయింది. లేకపోతే కొమ మునిగేది.

రాత్రి పది గంటలకు రత్తమ్మ కంపనీలో డ్యూటీ ముగించుకొని మాచర్రావు , లేడిగాడు బోసు సెంటర్లో కొచ్చి కొప్పిశెట్టి స్వామి నాయుడు షాపు దగ్గర కూర్చొన్నారు.

సప్త గోదారి మీదనుంచొచ్చిన చల్లని గాలిని రావి చెట్లు విసన కర్రాల్లా విసురుతున్నాయి

సెంటర్లో సందడి తగ్గలేదు. ఎప్పుడో రాబోయే పార్లమెంటు ఎలక్షన్ల గురించి పనికిమాన్నోళ్ళంతా కుస్తీపట్లు పడుతున్నారు. ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేవకపోయినా పర్వాలేదుగానీ కాబోయే పార్లమెంటు సభ్యులే ముఖ్యం వాళ్ళకి. పిల్లల చదువు సంధ్యలెలా ఉన్నాయో అవసరం లేదు గానీ పార్లమెంటుకెవరిని పంపాలన్న ఆలోచనే ముఖ్యం.భీమేశ్వరాలలో సీతారముల కళ్యాణం చూతము రారండి పాట వేస్తున్నారు.అందులో ముత్యాల ముగ్గు ఆడతా ఉంది.

"తమ్ముడూ సినిమాకెళ్దామా " అన్నాడు మాచర్రావు లేడిగాడిని. అంతకు ముందు మాచర్రావు లేడిగా అని పిలిచేవాడు గానీ సీతాలును తగిలించిన తర్వాత తమ్ముడూ అని పిలవడం మొదలెట్టాడు. అందర్నీ వరసలతో పిలుచుకొనే లేడిగాడికి అది క్రొత్తగా అనిపించలేదూ. బాగానే ఉన్నట్టనిపించింది.

" హీరో ఎవరు ? " లేడిగాడడిగాడు.

శ్రీధర్ అనేవోడులే "నేను ఎంటీ ఆర్, ఏ ఎన్ ఆర్ ల సినిమాలు తప్ప వేరేయి చూడను కదా.."

" అది కాదు, రావు గోపాల రావు కేరెక్టరు చాలా గొప్పగా ఉంటుందట.. అందరూ చెప్పుకొంటున్నారు.

" అసలాడేవూరంట? "

మన పిఠాపురం దగ్గరే పల్లెటూరు. పైగా డైరక్టరు బాపుగారు. గొప్ప పేరు.

బాపు గారు అంటే నాగేశ్వర రావు తో బుద్దిమంతుడు సినిమా తీసినాయినేనా?


"అవున్మ్రా బాబూ "

"అయితే సరే "నాగేశ్వర రావునే డైరక్టు చేసేడని బాపూ మీద గౌరవం తోనూ రావు గోపాల రావు తూ.గో జిల్లా వాడన్న అభిమానం తోనూ సినిమాకెళ్ళడానికి ఒప్పుకున్నాడు లేడిగాడు.

అందులో రావు గోపాల రావు డైలాగు " మనిసన్నాక కాస్తంత కాస్త కలా పోసనుండాలి లేకపోతే మనిసికీ,గొడ్డుకి తేడా ఏటుంటది? " అన్న డైలాగు లేడిగాడికి బాగా వంటబట్టింది.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
సీతాలు నుంచుకొని కొంత కల్లాపోసన చేస్తున్నట్టు కనబడుతున్నాడు కనుక దానిలాగే తక్కువ ఖర్చుతో కలాపోసన చేయాలని డిసైడైపోయాడు.

ఆమాటే మాచర్రావుతో అన్నాడు.

"కల్లపోసన చేసేవోల్లంతా గుళ్ళదగ్గర అడుక్కుంటున్నారు. ఆజోలికి పోవద్దురా తమ్ముడూ " అన్నాడు మాచర్రవు.

"డిసైడైపోయాక మడం తిప్పటం మగతనం కాదు.."

"అయితే ఈలపాట రఘురామయ్య గారి కురుక్షేత్రం తెప్పించమంటావా"

"చవితి పందిర్లలోనూ కార్తీక దీపారాధనకి చాలాసార్లు ఏసేరు. అయినా పౌరాణికాలొద్దు.

రామారావు గాని కృష్ణుడుగా, చూసిన కళ్ళతో ఈ సన్నాసుల్ని చూడలేను. అందుకే మరోటి ఆలోచించు. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం లాంటివైతే ఎలాగుంటాయి?

చీచీ..కోడిపందేలు గురించి, మనుషుల్ని చంపుకొనే వాళ్ళంటే నాకు చిరాకు.

మరేదీ నచ్చకపోతే నీవే ఏదో ఒకటి చెప్పుచ్చు కదా

ఏదన్నా సాంఘిక నాటకం చూడు ఏయిద్దాం.

అయితే దుర్గా ఆర్టు వాళ్ళచేత వేయిద్దామా?

ఆళ్ళెప్పుడూ గాలివానతోనే కొట్టుకు పోతాఉంటారు అయినా టిక్కెట్టెట్టి ఆ పాత దెవడు చూస్తాడు?

ఏంటీ టిక్కెట్టు నాటకమా? సాంఘిక నాటకం టిక్కెట్టు కొని ఎవడు చూస్తాడు? ఇదేం రక్త కన్నీరు కాదుగా..

మనం అలవాటు చేయాలి అన్నయ్యా అందుకే మనమే కొత్తది వేయాలి

ఏడ్చినట్టుంది ఈలోపలే నీవారిపోతావు.

మంచిపని చేసేప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేయాలి తప్ప నీరు కార్చకూడదని మాచర్రవుని బతిమాలేడు లేడిగాడు.

అయితే డిసైడైపోతే అయిపోయారు గానీ ఇద్దరికీ దానిగురించి ఏమీ తెలియదు..

..కళాపోసన గురించి ఎబిసిడిలు నేర్చుకొంటున్నాడు లేడి గాడు.

ముందో బేనర్ పేరు సెలెక్టు చేయాలి అన్నాడు ఏసుబాబు.

లేడు, లేక పోలేదు. హైకాలేజ్ పిల్లల గుండెల్లో లేడిలా గంతులేస్తానే ఉన్నాడు. చొట్టూ వున్న చెట్ల మీద కూర్చుని వాళ్ళ ఆటల్ని చూస్తూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.

లేడు లేకపోలేదు, చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళను బావా, అన్నాయ్యా అని ఆప్యాంగా పలకరిస్తూనే ఉన్నాడు. కషటం లో వున్న వాళ్ళకు జ్ఞాపకం వస్తూనే వున్నాడు. అతని ఆత్మ సెంటర్ లో అందర్నీ భుజం తట్టి పిలుస్తూనే వుంది.

గుడి తెరవగానే భీమేశ్వరుని మొదటి దర్షించేది లేడిగాడి ఆత్మే అని నమ్ముతారు. ద్రక్షారంతో మమేకమైన లేడిగాడి ఆత్మ పున్ర్జన్మ పొందితే తప్పక ద్రాక్షారం లోనే పుడతానని ఘాడంగా విశ్వసిస్తారు.

[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
అసతోమా సద్గమయ - బి.వి. రమణరావు
[Image: a.jpg]
యట హోరుమని ప్రళయగర్జన చేస్తూ వర్షం కురుస్తూంటే నిశ్చలంగా, తదేకధ్యానంతో పేకాటలో నిమగ్నులై వున్నాం క్లబ్బులో. తపోభంగానికి అవతరించిన మేనకలాగా, బిలియర్డ్స్ రూంలోంచి ఊడిపడి సరాసరి మా టేబుల్ దగ్గిర కుర్చీలో కూలబడి "ఇంకా మూర్తిగాడు రాలేదురా?" అంటూ వో ఉరుం ఉరిమేడు పాపారావు.

ఎవరూ పలకకపోయేటప్పటికి "పావుగంటలో వస్తానని కారు తీసుకుపోయి గంటయింది. ఎక్కడ చచ్చేడో!" అంటూ గొంతు చించుకున్నాడు.
"ఈ వర్షంలో ఎక్కడ చచ్చినా చావొచ్చు" అన్నాడు ఆచారి. అసలు వాడి పేరే ఆల్ కౌంట్ ఆచారి. పైగా ఆరోజు చెయ్యి మరీ భస్మాసుర హస్తం లాగుంది.

"అయినా యింత అర్థరాత్రి కళ్లజోడు కోసం వెళ్లకపోతే యేం!" అన్నాడు సుబ్బారావు.

:కళ్లజోడేమిటి?" అన్నాడు పాపారావు విసుగ్గా ఆచారి పేకట్లోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ...

:వాడి కళ్లజోడు నిన్న మధ్యాహ్నం బద్దలయిపోతే, కొత్తదానికి ఆర్డరిచ్చాడుట. ఇప్పుడు దాన్ని తెచ్చుకోడానికి పోయేడు" అన్నాడు రంగనాథం.

"కళ్లజోడున్నా వాడికి కళ్లు కనబడవు. ఎలా డ్రైవ్ చేస్తున్నాడో, ఏమిటో" అన్నాడు శంకరం కీడు శంకిస్తూ...

"వాడు చస్తే నాకేం! కారు పట్టుకుపోయి చచ్చేడు కదా!" వాపోయాడు పాపారావు.

"వాడికి డ్రైవింగ్ లైసెన్సు లేదు. ఏ సెక్యూరిటీ ఆఫీసర్ చేతుల్లోనో యిరుక్కుని వుంటాడు. అసలంటూ బతిగుంటే కాస్త ఆలస్యంగా వాడే తిరిగొస్తాడు" అంటూ సముదాయించేడు పద్మనాభం.

"ఆ గుడ్డిపీనుగ డ్రైవ్ చేస్తాడని నాకేం తెలుసు! మీరెవరైనా కూడా తగులడ్డారేమోననుకున్నాను" గర్జించేడు పాపారావు.

"ఇంతలోనే ఇంత అర్థాంతరంగా వాడి చావు ముంచుకొస్తుందనుకున్నామా?" అన్నాడు రాంభద్రం, మూర్తి చావును స్థిరపరుస్తూ...

"బుదిధ్కర్మానుసారే! పిల్లికి బిచ్చం పెట్టని పాపారావు తన కొత్త కారివ్వడం, ఆ కారు ఏక్సిడెంట్లోనే మూర్తి చనిపోవడం... హు... ఇదంతా ఘటన..." అన్నాడు పద్మనాభం.

"వాడి కాలం తీరిపోయింది. వాడు చచ్చిపోయేడు. ఇంతవరకూ మనం ఏడ్చింది వాడి ఆత్మశాంతికి చాలు. పాపారావు బాబ్జి! పోయిన కారు, మూర్తీ ఎలాగూ పోయారు. కాస్సేపు మాతో పేకాడు. నీ ఆత్మకూడా శాంతిస్తుంది" అని నేను సలహా యిచ్చేను.

"సరే కానివ్వండి. ఇంతకంటే, చెడిపోయేదేముంది!" అన్నాడు పాపారావు విచారంగా, కుర్చీ టేబుల్ ముందుకు లాక్కుని ఆచారి పేకట్లోంచి మరో సిగరెట్ తీసి వెలిగిస్తూ.

నిజం చెప్పొద్దూ, అందరి మొహాలు ఒక్కసారి మతాబాల్లాగ వెలిగిపోయాయి. చాలాకాలంగా వీడిచేత పేకాడించి, డబ్బు లాక్కోవాలన్న మా అందరి కోరికా నేటికి ఫలించే అవసాశం చిక్కిందని. చచ్చి స్వర్గానున్నవాడి తల్లిదండ్రులు ఎంతో దూరదృష్టితో వాడికా పేరెట్టి వుంటారు. ఎప్పుడూ పుణ్యానికి ఆమడ దూరంలో వుంటూ సార్థకనాముడనిపించుకున్నాడు పాపారావు.

పాపారావంటే మా అందరికీ యింత ప్రత్యేకమైన అనురాగం ఎందుకయ్యా అంటే మొదటిది.... డబ్బెట్టి పేకాడనని భీష్మించడం... రెండోది... పేకాడుకుంటుంటే వెనక్కాల కూర్చుని వొద్దన్నా వినకుండా సలహాలివ్వడం, మూడోది... స్వంత డబ్బెట్టి సిగరెట్టు కొని కాలిస్తే అది దురలవాటైపోతుందన్న సద్బుద్ధితో నియమబద్దంగా ఇతరులనే పీడించి కాల్చడం, నాలుగోది... లక్షలు లక్షలు వ్యాపారంలో గడిస్తున్నా, దానధర్మాల సంగతటుంచి, కనీసం చేబదులుకైనా చెయ్యి విదల్చకపోవడం. ఇత్యాధి శతకోటి కారణాలున్నాయి.

నేను పేకముక్కలు పంచేను. అందరూ ఉత్సాహంగా ముక్కలు అందుకున్నారు. బిక్కుబిక్కుమంటూ పాపారావు కూడా తీసుకున్నాడు. ముక్కలొకసారి సద్దుకు చూసుకొని ఆచారి పేకట్లోంచి సిగరెట్ తీసి సాలోచనగా అంటిస్తూంటే, ఆచారి "అలవాటు లేనప్పుడు అలాగ సిగరెట్ మీద సిగరెట్ కాలిస్తే టి.బి. వస్తుంది" అని బెదిరించి "జై పరమేశ్వరా" అంటూ రంగంలోకి దిగి పేకలోంచి ముక్కలాగి చూసీ చూడగానే తేలుకుట్టినట్టు "ఛీ" అయి పారేశాడు. పాపారావు ఆ ముక్కను అందుకుని కళ్లకద్దుకుని ముక్కలటు సద్ది యిటు సద్ది "డీల్ షో" చేశాడు. తర్వాత ఆచారిగాడెంత మొత్తుకుంటే ఏం లాభం? అందరం వెర్రి మొహాలేసుకుని ఆల్ కౌంట్ లిచ్చేం.

చూస్తూండగానే కౌండ్ తిరక్కుండా మరో డీల్ షో కొట్టేడు పాపారావు. మాలో సగం మందికి కళ్లనీళ్ల పర్యంతం వొచ్చాయి. భగవంతుడు ఎంత నిర్దయుడు! ఇలాంటి కటిక రాక్షసుడికా డీల్ షోలు! ఆచారి సంగతి తల్చుకుంటుంటేనే గుండె తరుక్కుపోతోంది. రోజూ ముక్తసరిగా ఒకటో, రెండో బ్యాంకులు పోవడంతో సరిపెట్టుకుంటుంటే ఇప్పటికే నాలుగు బ్యాంకులు పోయాయి. వాడి ధైర్య సాహసాలకీ, సహనానికీ మెచ్చయినా భగవంతుడు పాపారావు చేత ముచ్చటకి కనీసం ఒక్కటంటే ఒక్క ఆల్ కౌంటయినా యిప్పించకపోతాడా అని అనుకుంటూంటే ఆచారి వేసిన ముక్కతోటే ఠకీమని ముచ్చటగా మూడో డీల్ షో కొట్టేడు పాపారావు. వణికే చేతుల్తో అందరూ పాయింట్లు లెక్క పెడుతుండగా పాపారావు నీరసంగా ఆచారి పేకట్లోంచి సిగరెట్టు తీసి అంటించబోతూంటే ఆచారి వాడి చెయ్యి పట్టుకుని "కేన్సరొచ్చి ఛస్తావు" అంటూ మనసారా శపించేడు.

మొహంలో శాంతం తొణికిసలాడుతూండగా భక్తపోతన ఫక్కీలో "నాయినా ఆచారీ, తనువులు అశాశ్వతం" అంటూ చిరునవ్వుతో సిగరెట్టు వెలిగించాడు పాపారావు.

"ఒరేయ్ పాపారావూ... ఇలాగ మా సిగరెట్లు పీల్చేసి, మా డబ్బు కాల్చేసి, మా హృదయాల్ని చీల్చేసిన ఈ ఘోరానికి భగవంతుడు కూడా క్షమించడు" అని బెదిరించాడు ఆచారి.

"పాపాహం, పాపోహం! నా పాపానికి నిష్కృతి లేదు. ఇంక ఈ వెధవ పేకాట మానేస్తాను. సిగరెట్టు ముట్టను" అంటూ పశ్చాత్తాపంతో డబ్బులి జాగ్రత్తగా లెక్కపెట్టుకుని జేబులో వెసుకొని లేచాడు.

దీనికి సాయం, అదే సమయానికి మూర్తిగాడు ప్రత్యక్షమై కారు తాళాలు పాపారావు చేతుల్లో పెడుతూ "పెట్రోలు లేదని చెప్పొద్దూ! రెండు ఫర్లాంగులైనా దాటకుండా పెట్రోలైపోయింది. పది రూపాయలిచ్చి కారును తోయించాను. ఐదు లీటర్ల పెట్రోలు కొట్టించేను" అన్నాడు.

"సంతోషం. కృతజ్ఞుడణ్ణి" మనసులోనే మూర్తిని దీవిస్తూ.

"ఏభై రూపాయలయింది. ఇలా పడెయ్యి" అన్నాడు మూర్తి.

"మంచిపని చేయడమే మన ధర్మం. ప్రతిఫలాపేక్ష వుండకూడదు. అదే నిష్కాను కర్మంటే" అంటూ తన దివ్య సందేశాన్నందిస్తూ మమ్మల్నందర్నీ శిలలుగా మార్చి అదృశ్యమయ్యేడు పాపారావు.

సారధి స్పర్శతో మాలో చైతన్యం కలిగింది. బోయ్ తెచ్చిన టీ తాగేక స్పృహవొచ్చింది. సారధి లక్షాధికారయినప్పటికీ, పెద్దమనిషి, బుద్దిమంతుడూనూ... వచ్చినప్పుడల్లా స్టేటెక్స్ ప్రెస్ సిగరెట్ టిన్ తో ఠీవిగా మా టేబుల్ ముందర కూర్చ్వుని మోతాదుగా ఒకటో, రెండో బ్యాంకులు పంచి పెట్టేసి దర్జాగా వెళ్లిపోతూంటాడు. మొత్తమ్మీద దేవతలాంటి మనిషి. జరిగిందంగా విని ఇలాంటి ఘోరానికి ఒడిగట్టిన పాపారావు వొచ్చే జన్మలో.... అయి పుడతాడని చెప్పి మమ్మల్ని వోదార్చాడు.

"వొచ్చే జన్మవరకూ ఆగవల్సిందే! ఈ జన్మలో వాడు నాశనమయ్యే అదృష్టం మాకు దక్కదంటావు!" అన్నాడు ఆచారి దుఖం ప్రహిస్తుండగా.

"వచ్చేజన్మంటే జ్ఞాపకమొచ్చింది, ఆ జపాన్ గర్ల్ శుక్రవారం భద్రాపూర్ కి వస్తోంది" అన్నాడు మూర్తి.

"ఏ జపాన్? ఏ గర్ల్?" అడిగాడు రాంభద్రం.

"మొన్ననా మధ్య పేపర్లో చదవలేదూ! పేరు సీన్యా. టోకియో నుంచి వస్తోంది. ఆ అమ్మాయికిప్పుడు పదకొండేళ్లు, పన్నెండేళ్ల క్రితం భద్రాపూర్ కరణంగారి భార్య కారు ఏక్సిడెంట్ లో చనిపోయిందిట. ఆవిడే యిప్పుడు సీన్యాగా పుట్టిందిట. ఈ మధ్యనే పూర్వ జన్మస్మృతి వొచ్చి భద్రాపూర్ నీ, ఆ కరణంగారినీ, వాళ్ల చుట్టాల్నీ పన్నెండేళ్ల క్రితం ఎలావుంటే అలాగే కళ్లకి కట్టినట్టు వర్ణించిందిట. ఇప్పుడు ఆ అమ్మాయితో టోక్యో నుంచీ, ఢిల్లీ నుంచీ కూడా సైంటిస్టులొస్తున్నారు. నేను బయల్దేరి వెడుతున్నాను" అన్నాడు మూర్తి.

"భద్రాపూర్ అంటే...?"

"భెంగళూరుకో డెబ్బై మైళ్లుట" విశదీకరించాడు మూర్తి.

"పోదామంటే అందరం పోదాం పదండి, నా పెద్దకారు తీసుకొస్తాను" అన్నాడు సారధి.

"దార్లోనే కనక సాయిబాబాగారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎల్లుండి తెల్లారగట్ట బయల్దేరదాం" ముహూర్తం నిర్ణయించేడు మూర్తి.
మేమందరం ఇలా వూరెళ్లదల్చుకున్నామని, మెటర్నిటీ హోంలో వున్న మా ఆవిడకి చెప్పేను. నేను ఈ పరిస్థితుల్లో యిల్లు విడిచిపెడితే ఆ నాలుగు రోజుల్లోనూ సంభవించడానికి అవకాశముండే మా ఆవిడకి పురుడూ, మా అబ్బాయికి రోగం తిరగబెట్టడం, మా తమ్ముడికి ఉద్యోగం పోవడం, మా బవమరిదికి ట్రాన్స్ ఫర్ జరగడం, మా చెల్లెలికి పెళ్లివారు రావడం, మా వంటవాడు దాసీదాంతో లేచిపోవడం మొదలయిన తొంభయ్యేడు ప్రమాదాలు ఏకరవు పెట్టింది. వెళ్లనని మాట యిచ్చేను గానీ, మనసులో వెళ్లేందుకే నిశ్చయించుకున్నాను. వైర్ లెస్స్ మెసేజ్ అందినట్టుంది... మా అబ్బాయి కూడా రాత్రి నా పక్కలో పడుకుని వూరెళ్లొద్దని ఒకటే రాగం... వెళ్లననీ, ఆడినమాట తప్పని హరిశ్చంద్రుడంతవాణ్ణనీ అబద్దమాడి వాణ్ణి జోకొట్టేను.

ఆశ్రమంలో వాతవరణం అంతా ప్రశాంతంగా వుంది. చుట్టూ వున్న ఆవరణలో దట్టంగా పెరిగిన మామిడి, వేప, నేరేడు, యూకలిప్టస్ చెట్లున్నాయి. వాటి నీడలో వేలాదిమంది కూర్చుని వున్నారు. నిశ్శబ్దంగా కొందరు పుస్తకాలు చదువుకుంటున్నారు. కొందరు వేదాంత చర్చల్లోనూ, కొందరు స్వామి మహిమలను గుర్తించిన సంభాషణల్లోనూ నిమగ్నులై వున్నారు. ఆశ్రమం మధ్యలో నాలుగెకరాల మేర పూలతోట వుంది. వాటికి భక్తులు బిందెలతో నీళ్లు పోస్తున్నారు. పూలతోట మధ్య వున్న భవనమే ప్రశాంతి నిలయం. అందులోనే బాబా వుంటారు.

మాకదే ఆశ్రమం చూడడం మొదటిసారి. తోటలో వో చెట్టుకింద చేరేం. చల్లగా, హాయిగా వుంది. నడుం వాల్చేం. సాయంత్రం నాలుగు గంటలయింది. ఒక్కొక్కళ్లే లేచి మందిరంవైపు వెడుతున్నారు. మాకో వలంటీరుతో పరిచయమయింది. ఆయనో డాక్టరు. సారధి స్నేహితుడి తమ్ముడట. ఆయనే సారధిని ఆనవాలు పట్టి పలకరించాడు. స్వామి మహిమలను గురించి మాకు చాలా విషయాలు చెప్పాడు. తరచూ ఆశ్రమానికి వచ్చి పది పదిహేను రోజులుండి అక్కడ భక్తులకు చేయగలిగిన వైద్య సహాయం ఏమయినా వుంటే చేసి, స్వామి దర్శనం చేసుకుని వెడుతూ వుంటాడుట...

"మాకేమయినా మీ పలుకుబడితో ప్రత్యేక దర్శనం యిప్పించగలరా?" అంటూ అడిగేడు మూర్తి.

"ఇక్కడలాంటి రికమండేషన్లు లేవు. ఎవళ్లదృష్టం వాళ్లది. స్వామి బయట కొచ్చేటప్పటికి అందరూ బారులు తీరి కూర్చుంటారు. అందులో స్వామే స్వయంగా కొందరిని ఏరి వాళ్లకి ప్రత్యేక దర్శనమిస్తారు. ఇన్ని వేలమందిలోనూ రోజూ అలాంటి అదృష్టం ఏ డెబ్బయి, ఎనభై మందికో కలుగుతుంది" అన్నాడతను ఎన్నో తన అనుభవాల్ని కూడా చెప్పి.

:బాబా పిలిస్తే, మనకేమయినా కోరికలూ, సందేహాలూ వుంటే అడగొచ్చునా?" అడిగాను నేను.

"మీకలాంటి శ్రమ వుండదు. మీ మనస్సులో వున్న వాటికన్నిటికీ వారే సమాధానాలిచ్చేస్తారు" అన్నాడతను.

"నాకీ ఆల్ కౌంట్ శాపం పోయేలాగ రక్షకేకడగాలని వుంది" అన్నాడు ఆచారి.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
"ఈ జపాన్ గర్ల్ సంగతికేంగానీ, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పమని అడుగుతాను" అన్నాను నేను.

"మన కెవళ్లకవకాశమొచ్చినా పాపారావు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. ఆ కీలకమేమిటో తెలుసుకోవడం అమనందరికీ అవసరం" సలహా యిచ్చేడు రాంభద్రం.

మేమందరం వో వరసగా కూర్చున్నాం. అందరి దృష్టీ వరండాలో వున్న తలుపుమీదే వుంది. అనిర్వచనీయమైన పవిత్రత యేదో పరిమళంలాగా ఆ వాతావరణంలో సమ్మిళితమై వుంది. ఆ ప్రశాంత నిశ్శబ్దతలో భక్తి విశ్వాసాలా పదధ్వని స్పష్టంగా వినబడుతోంది.
నెమ్మదిగా తలుపులు తెరచుకున్నాయి. ఎదురుగుండా బాబా అందం, ఆనందం, శాంతం, ప్రేమ అనే పదార్థాలతో పోతబోసి బ్రహ్మ సృష్టించిన ఆ మూర్తి, అడుగులో అడుగేసుకుంటూ అందరి మధ్యనా నడుస్తూంటే, అందరూ పాద నమస్కారాలు చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు చేతులు జోడించానో నాకే తెలీదు. మావాళ్లూ అదే తన్మయావస్థలో వుండటం చూసి, ఏదో ప్రబలమైన దివ్యశక్తి ఆధీనంలో వున్నామని గ్రహించేను.

బాబా మధ్య మధ్య కొందరిని వేలుతో చూపెడుతున్నారు. వాళ్లు లేచి వరండాలొ కూర్చుంటున్నారు. వాళ్లకే ప్రత్యేక దర్శనమన్నమాట. అప్పుడే వో పాతికమందిని ఏరేరు. అందులో వికలాంగులూ, దరిద్రులూ, ఐశ్వర్యవంతులూ, వయోవృద్ధులూ, యువతీయువకులూ, సనాతనులూ, అధునాతనులూ అందరూ వున్నారు. మా వరసలోకి పాదాలు మళ్లగానే నా గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. ఎటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసా లేకుండా ఏదో వినోదం కోసం వచ్చినవాళ్లం. దూరంగా నిలబడి వో నమస్కారం చేసి వెళ్లిపోక అక్కడ చతికిలబడ్డాం. తీరా నన్ను పిలిచి ఈ పేకాటా, సిగరెట్లూ మొదలైనవి మానేసి ఏ భజనో, పూజో చేసుకోమని ఆదేశిస్తే, పదిమందిలోనూ నా బ్రతుకేంగాను! ఏమిటో చూసి చూసి యిలాంటి యిరుకులో పడ్డాను అనుకుని ఏదో పదిమందితో పాటు పాదనమస్కారం చేసుకునే భాగ్యంతో సరిపెట్టి ఎటువంటి ప్రత్యేకమైన అనుగ్రహం నామీద ఆయన చూపెట్టకుండా వుండాలని శతకోటి దేవతలకి ఆ క్షణంలో అనంతకోటి ప్రార్థనలు చేశాను. పాదాలు నా దగ్గరకొచ్చిన కొద్దీ నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వొచ్చేయి, ఆగేయి. విధి బలీయం. నా శిరస్సు మీద స్వామి దివ్యహస్తం క్షణం నిలిచింది. లేచేను. వరండా మీదకు వెళ్లమన్నాడు వలంటీరు. మా వాళ్లందరూ నాకేసి జాలిగా "పాపం! ఇక వీడు మనకి దక్కడు" అన్నభావంతో చూస్తున్నారు. విధి నిర్ణయానికి తలవొగ్గి వరండా మీదకు నడిచేను.

నా వంతు రాగానే భయంగా లోపలికెళ్లేను. బాబా ముఖంలోకి చూడగానే భయం పోయింది. వెయ్యి తల్లుల ప్రేమను మాటల్లో నింపుతూ భుజాలు నిమురుతూ "నువ్వు రావడం చాలా సంతోషం బంగారూ. జనన మరణాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ప్రథమ సోపానం. ఇప్పుడా జపాన్ బాలిక పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో బయలుదేరారు మీరంతా. అజ్ఞాతంగా మిమ్మల్ని వేధించే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి సదవకాశం. అయితే, పూర్వజన్మ వున్నట్లు మీకు నమ్మకం కలిగిన తర్వాత మీ ప్రవర్తనలో రావల్సిన పరివర్తనను గురించి ఆలోచించేరా?" అన్నారు మందహాసంతో స్వామి.

"నా పూర్వజన్మను గురించి తెలుసుకోవాలని వుంది స్వామీ" అన్నాను ధైర్యం చేసి.

"ఉన్న ఈ సంసార జంఝాటం చాలకనా నీ పూర్వజన్మ బంధువులతో ఇప్పుడు సంపర్కం!" అన్నారు మృదువుగా.

"నా పూర్వజన్మ విశేషాలను తెలుసుకుని, జీవుల జన్మాంతర సంబంధాల్ని లోకమంతా చాటుతాను. నేనో పత్రికా సంపాదకుణ్ణి" అన్నాను.

"నీ తరంకాదు. నీ మాటల్ని ఎవరూ నమ్మరు. నిన్ను కూడా ఆ జపాన్ గర్ల్ లాగే వింత జంతువుగా చూస్తారు. నీ ముక్కు, చెవులు, మెదడుని సైంటిస్టులు పరీక్ష చేస్తానంటారు."

"సహేతుకంగా, నిదర్శనాలతో రుజువు చేస్తాను."

"ఇదివరకూ చేశారు. ప్రయోజనం లేదు. అసలు కారణం వాళ్లకి నమ్మకం లేకపోవడం. కాదు, నమ్ముతున్నామని ఒప్పుకునే ధైర్యం లేక, నమ్మకుండా వుండే అవకాశం ఎప్పటికైనా లభిస్తుందేమోనన్న భ్రమచేత"

"పోనీ నా అనుభవం కోసమైనా, నా కోర్కె తీర్చలేరా?"

"అది నువ్వనుకున్నంత సులభం కాదు. మహాజ్ఞానులు కూడా సులభంగా తాళజాలని అనుభవం. పూర్వజన్మస్మృతి లేకపోవడమనేది భగవంతుడు మానవునికిచ్చిన వరం. కాళ్లూ, చేతులూ, ముక్కూ, చెవులూ, కళ్లూ, మేధస్సూ మొదలయిన అవయవాలతో అద్భుతమైన శరీరాన్ని ప్రసాదించిన భగవంతుడికి మానవుడికి జ్ఞాపకశక్తి ఎంతవరకు అవసరమో తెలుసు" అన్నారు స్వామి నా భుజాల్ని పట్టుకుని ప్రేమతో వూపుతూ.

"మరి, ఆ జపాన్ గర్ల్ కెలా వొచ్చిందా పూర్వజన్మ స్మృతి?"

"పూర్వజన్మలో సంస్కారం నొక్క తీవ్రమైన ప్రభావంవల్ల"

"పూర్వజన్మ సుకృతం వల్ల స్వామి దర్శనం, అనుగ్రహం లభించేయి. కష్టమో, నష్టమో నకై నేను కోరుకుంటున్నాను. నాకు పూర్వజన్మ స్మృతిని ప్రసాదించండి" అన్నాను ప్రాధేయపూర్వకంగా.

"కోరికోరి జీవితంలో సుఖశాంతులకు దూరమవుతానంటున్నావు"

"పోనీ కనీసం క్రిందటి జన్మలో నేనేవర్నో చెప్పండి స్వామీ"

"సరే విను. రహస్యంగా వుంచుకో. ఎల్లుండి రాత్రి, అంటే శుక్రవారం రాత్రి ఏ యింట్లో వుంటావో అదే క్రిందటి జన్మలో నువ్వు పుట్టి పెరిగిన యిల్లు. క్రిందటి జన్మలో నీ మొదటి భార్య పేరు లక్ష్మి. ఆమే నీ మీద మమకారంతో చనిపోయి ఈ జన్మలో నీకు అన్నగా పుట్టి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు..."

"ఈ మధ్యనే చనిపోయాడు స్వామీ"

"అవును. అతనే నీకు మళ్లీ కుమర్తెగా పుట్టబోతున్నాడు. ఎల్లుండి నువ్వు నీకు నలభయ్యో యేట నీకు విషం పెట్టి చంపిన నీ రెండో భార్యను కూడా చూస్తావు. అప్పట్లో మీ కుటుంబానికి గర్భశత్రువయిన రాఘవులు చావుని నీ కళ్లతో నువ్వే చూస్తావు. ఈ జన్మలో ఆ రాఘవులు పేరు రాజా. మరింక క్షేమంగా వెళ్లిరా" అంటూ దీవించి పంపించేరు.

పుచ్చుకున్నది వరమో, శాపమో అర్థంకాని అయోమయ స్థితిలో బయటపడ్డాను. నన్ను ఎక్కడికి వెళ్లమన్నదీ, ఎప్పుడు బయలుదేరమన్నదీ చెప్పకుండా వెల్లి రమ్మన్నారు. మావాళ్లందరూ నన్ను చుట్టుముట్టి ఆశ్రమంలో దూరంగా తీసుకుపోయి ప్రశ్నలవర్షం కురిపించేరు. పేకాటకి పనికొచ్చే వరం పుచ్చుకున్నావా అని ఒకడూ, పాపారావు మరణ రహస్యం తెలిసిందా అని మరొకడూ ఇలా రకరకాల ప్రశ్నలతో వేధించారు. నేను నోరు విప్పలేదు. దేనికి సాయం నా తిరుగు ప్రయాణం గురించి నిర్ధారణ చేసుకోలేదు. దానాదీనా "వైకుంఠానికి మన వూరి మీదుగా వెడుతూంటే వుత్తరం రాయి. కనబడి పలకరిస్తాం. నువ్వు తిరిగొచ్చేక చచ్చినా నీతో పేకాడం, ఏమయినా యిదే మా శ్రద్ధాంజలి" అంటూ నా హోల్డాల్ బయటికి గిరవటెట్టి వాళ్లు వెళ్లిపోయారు.

ఆ రాత్రి ఆశ్రమంలోనే గడిపేను. ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనం అయ్యేక నా సమస్యను గురించి ఆలోచిస్తూ ప్రార్థనా మందిరం నుంచి తిరిగి వొస్తూంటే నిన్నటి వలంటీరు ఎదురయ్యేడు. "ఎల్లుండి రాత్రి ఏ యింట్లో వుంటావో ఆ యింట్లో వో అపూర్వ సంఘటన జరుగుతుంది వెళ్లిరా అన్నారు. స్వామి మరి ఎక్కడికి వెళ్లవలసిందీ చెప్పలేదు" అన్నాను.

"ఇంకా దీన్ని గురించి మీరాలోలించవల్సిందేమీ లేదు. స్వామి వెళ్లి రమ్మంటే వెంటనే వెళ్లడమే కర్తవ్యం. ఇప్పుడైనా వెంటనీ బయల్దేరండి" అని ఆయన సలహా యిచ్చేడు.

బెంగళూరెళ్లి అక్కణ్ణుంచి బస్ మీద భద్రాపూర్ వెళ్లి మనవాళ్లను కలుసుకుని ఆ జపాన్ గర్ల్ సంగతి తెలుసుకోవచ్చునన్న ఉద్దేశంతో, రైలుకందిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బస్ ఎక్కేను. స్టేషనులో కాలెట్టగానే రైలు వెళ్లిపోయిందన్న శుభవార్త ఎదురయింది. సరాసరి బెంగళూరుకేదయినా టేక్సీ దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. విఫలమయింది. గత్యంతరం లేక అంచీల మెద్నైనా వెడదామని హిందూపూర్ వరకూ వెలుతున్న లారీ ఎక్కేను. డ్రైవరు బహు బుద్ధిమంతుడు. అయితే యేం! లారీ మహా పెంకిఘటం. పదేసి మైళ్లకోసారి పేచీ పెట్టడం, తర్వాత రాజీ పడడంతో అలా అలా రాత్రికి హిందూపూర్ కి చేరుకున్నాను.

బెంగళూరులో సమ్మెలూ, గొడవలూ గందరగోళంగా వుందని తాత్కాలికంతా రవాణా రద్దు చెయ్యడంవల్ల ఆ రాత్రి హిందూపూర్లోనే గడిపేను. మర్నాడు ఆ వూళ్లో వున్న మా పత్రిక స్టాకిస్టు వొ ప్రయివేటు కారులో మధ్యాహ్నానికి బెంగళూరుకి చేర్చేడు. కానీ, ఏం లాభం! కొందరు దేశభక్తులైన యువకులు వో టేక్సీ డ్రైవరు ముసుగు పెట్టుకుని పడుకుని వుండగా తల అనుకుని పొరపాటున కాళ్లవైపు పెట్రోలు పోసి అంటించేరుట. దానికి వాడు రెచ్చిపోయి టేక్సీలన్నిటినీ సమ్మెలోకి దింపేడుట. ఇంత చిన్న విషయంలో అంత రాద్ధాంతం చేస్తే యిక మనం రాజకీయంగా ఎలా పురోగమిస్తాం!

ఒకచోట యూనివారంలో వున్న కండక్టర్ని ముచ్చటపడి బాలికలు పచ్చడి కింద తన్నేరుట. అక్కడ బాలురు లేకపోవడంవల్ల బాలికలు కలగజేసుకోవల్సివచ్చిందనీ, ఉద్యమం అన్న తర్వాత ఇలాంటి పట్టింపులు తప్పు తప్పని నాయకులు ఎంత చెప్పినా వినకుండా బస్సు సారధులందరూ సమ్మెట!

భావి పౌరులైన విద్యార్థులై వచ్చిన వాటిని మచ్చుకొకటి చొప్పున పుచ్చుకుని మిగిలిన ఫలహారాలు "రిలే హంగర్ స్ట్రైకర్స్"కి సకాలంలో అందించాలన్న సత్సంకల్పంతో కార్యరంగంలో నిమగ్నులై వుండగా, ప్రజల కళ్లముందరే హోటల్ ప్రొప్రైటర్ తిరగబడ్డాడంటే ఇంతకంటే అరాచకం ఏముంది? దీని మూలాన్ని హోటళ్ల సమ్మెట! ఇదంతా చూసి "జగమే మాయా" పాట పాడుకుంటూ అలా బెంగళూరు రోడ్డంట ఫేడవుట్ అయిపోదామనిపించింది.

ఇంతలోకే వో లారీ డ్రైవరు నా భుజం తట్టి "కష్టసుఖాలు కావడి కుండలు. భయపడకండి. నేను సాయంత్రం లోడ్ వేసుకువస్తాను. మిమ్మల్ని భద్రాపూర్ లో దింపుతాను. ఫ్రంట్ సీటు ప్రత్యేకంగా మీకే రిజర్వ్ చేస్తాను. జస్ట్ వో చిన్న వంద రూపాయలనోటు నా మొహాన్న పారేయ్యండి" అంటూ సవినయంగా అభయహస్తమిచ్చేడు. సరేనన్నాను. అతని పేరు ప్రహ్లాదుట. మనిషి కాస్త తండ్రి పోలికేమో... హిరణ్యకశిపుడిలాగున్నాడు. ఆడినమాట తప్పకుండా సాయంత్రం ఆరింటికి లారీ తీసుగొచ్చేడు. ఎక్కి కూర్చున్నాను.

డ్రైవర్ కూనిదీర్ఘాలు తీస్తూ, సిగరెట్లు కాలుస్తూ ఊరు దాటగానే స్పీడెక్కించాడు. డ్రయివరు తాలూకు ప్రొహిబిషన్ పరిమళం వల్లనయితే యేం, సిగరెట్టు పొగ తాలూకు మేఘాలవల్లనయితేనేం, మధ్య మధ్య ఎదురయ్యే కార్లలైట్లు మొహమ్మీద కమ్మడం వల్లనయితేయేం, రోడ్ మలుపుల్లో టైర్లు చేసే ప్రణవనాదం వల్లనయితేయేం, మొదట్లో దార్లో రోడ్ పక్కనున్న చెట్లూ, కల్వర్టులూ ట్విస్టు డాన్స్ చేసినట్టు కనబడింది. స్పీడెక్కించాక అంతరిక్షయానమంటే ఏమిటో తెలిసింది. మొత్తమ్మీద భూమ్మీద ప్రయాణం చెయ్యడం లేదని గ్రహించి భగవంతుడిమీద భారం వేసి కళ్లు మూసుకుని పంచాక్షరీ మంత్రాన్ని ప్రారంభించేను. మరి, కైలాసం ఎప్పుడు చేరేమో తెలీదు గానీ, హరహరమంటూ గంగలోకి దొర్లిపోడం చూచాయగా గుర్తుంది.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ముక్కుకు ఘాటయిన వాసన తగలగానే మెలకువొచ్చి కళ్లు తెరిచాను. వరండా మీద లాగుంది... మంచం మీద పడుకుని వున్నాను. తలవొంచి కిటికీలోంచి హాల్లోకి చూశాను. గుమ్మమ్మీద గోడకి పెద్ద ఫోటో వుంది. నలభైయేళ్లుండి వుంటాయి. మంచి స్ఫురద్రూపి, బొద్దు మీసాలు, ఉంగరాల జుట్టుతోనూ మంచి ఠీవీగా కూర్చుని వున్న విగ్రహం తాలూకు ఫోటోకేసి హరికేన్ లాంతరు వెలుగులో చూస్తే ఎక్కడో చూసిన మొహంలాగ కనబడింది. "తెలివొచ్చిందా బాబూ" అన్న పలకరింపు విని ఉలిక్కిపడి తల ఎత్తి పక్కకి చూశాను. పడక కుర్చీమీద వో ఘటోత్కచుడు సావుకాశంగా చుట్ట కాలుస్తున్నాడు. "అమ్మా! ఈయనకి తెలివొచ్చింది. కొంచెం పాలు పట్రా" అంటూ గర్జించింది పడక్కుర్చీ.
నడుం వొంగిన డెబ్బయేళ్ల ముసలావిడ వో కంచు గ్లాసుతో వేడివేడి పాలు అందించింది.

నెమ్మదిగా లేచి అందుకున్నాను. "ఎంత గండం గడచింది బాబూ! పై నుంచి సిమెంటు బస్తాలు మీద పడలేదు" అన్నాడు లారీ డ్రయివరు. ఇలాంటి గండ పరంపరలు నిత్యం గడవడం, భక్త ప్రహ్లాదుడిలాగా వీడికి పరిపాటి అనుకుంటాను. "శుక్రవారం పూట మంచి వర్జంలో బయలుదేరేరు, మరీ" అంది ఆ ముసలావిడ సాగతీసుకుంటూ.

"శుక్రవారం" అన్నమాట వినగానే స్వామి చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చి వున్నుమీద తన్నినట్లయ్యి పక్కమీద నుంచి లేచి కూర్చుని పాలు గబగబా గాతేసి అందరి మొహాల్నీ కలయచూశాను.

"ఖంగారు పడకండి. లారీ బురదలో యిరుక్కోవడంవల్ల పక్కకి ఒరిగింది. మీరు కునికిపాట్లు పడుతున్నట్లున్నారు. తలుపు గడియ సరిగ్గా లేదేమో, తెరుచుకు బయటికి దొర్లిపడ్డారు. మరేమీ ప్రమాదం లేదు. స్థిమితపడ్డాక కాస్త బట్టలు మార్చుకోండి" మరో చుట్ట వెలిగించేడు పడక్కుర్చీలో ఆకారం. వీడే క్రిందటి జన్మలో నా పెద్దభార్య కొడుకనే ఆలోచన రాగానే వొళ్లు చల్లభడినంత పనయింది. సుమరు ఓ అరవై యేళ్లుంటాయి. మంచి ఒడ్డూ పొడుగూ, పెద్ద బొజ్జా... మనిషి పర్వతంలాగున్నాడు.

"ఇవిగో వేణ్నీళ్లు. కాళ్లూ చేతులూ మొహం కడుక్కోండి" వో రాగివిందు, చెంబు అక్కడ పెట్టిన ఆ ముసలమ్మ మొహంలోకి పరీక్షగా చూశాను. ఈవిడే క్రిందటి జన్మలో నాకు విషం పెట్టి చంపిన నా రెండో భార్యన్నమాట. డెబ్బయేళ్లుంటాయి. నడుం కొంచెం వొంగింది. ఆ మాట తీరిలోనూ, ఆ కళ్లలోనూ అధికారం తొణికిసలాడుతోంది. ఇంకా కర్మ పరిపక్వం కాకపోవడం మూలాన్ని లాగుంది... మృత్యువుతో పోరాడే దేహదారుడ్యం మిగిలి వుంది.

ఆ ఫోటోకేసి మళ్లీ పరకాయించి చూసి క్రిందటి జన్మలో నాకున్న ఠీవికి మురిసిపోయాను. ఇలాంటి నాకు ఈ ముసలిది విషం పెట్టి చంపిందంటే ఆశ్చర్యమేసింది. ఈ విషయం తెలుసుకుందామన్న కుతూహలంతో నెమ్మదిగా లేచి కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని బట్టలు మార్చుకున్నాను.

"ఈ రాత్రికిక్కడే విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే భద్రాపూర్ బస్ మీద వెడుదురుగానీ..." అన్నాడు మా క్రిం.జ.కొడుకు. వయస్సులో పెద్దవాడు కాబట్టి కృతజ్ఞతతో నమస్కరించి "మీకు చాలా శ్రమ ఇస్తున్నాను" అన్నాను.

"ఎంతమాట! మీలాంటి పెద్దవాళ్లు మా యింటికి రమ్మంటే మాత్రం వస్తారా! దైవికంగా యిలా వచ్చేరు"

"మీరు స్వంత వ్యవసాయం నడిపిస్తున్నారా?" అడిగేను. అతను నిర్లిప్తంగా నవ్వి "ముప్పై అయిదు సంవత్సరాలుగా నేను చేసే ముఖ్యమైన పనులేమిటంటే భొంచెయ్యడం, పడక్కుర్చీలో పడుకోవడం, చుట్ట కాల్చడం" అన్నాడు.

"జరుగుబాటుంటే అంతకంటే ఏం కావాలి! చేతికందొచ్చిన పిల్లలకి సంసార బాధ్యతల్ని అప్పగించేసి వుంటారు" అన్నాను.

"అదంతా వో కథ నాయినా! వాడికి సంసారం లేదు, చట్టుబండలూ లేదు. వాడూ, నేనూ చావలేక బతుకుతున్నాం" అంది నా క్రిం.జ.రెండో భార్య, వో పళ్లెంలో గారెలూ, ఆవడలూ పట్టుకొచ్చి అందిస్తూ...

"ఇప్పుడివన్నీ తినలేనమ్మా..." అన్నాను.

"మా యింటికి అతిథులు వచ్చి ముప్పైయేళ్లయింది. ఈరోజు మా నాన్నగారి తద్దినం. అందుకే ఈపాటి ఫలహారం యిచ్చే భాగ్యానికైనా నోచుకున్నాం" అన్నాడు.

వెన్నెలలో షికారుగా వెళ్లి కాలవగట్టున కూర్చున్నాను. నాకూడా ఆ వూరి రైతొకను సాయం వచ్చేడు. వ్యవసాయం, రాజకీయాలు, ఎలక్షన్ల మీద సింహావలోకనం అయిన తర్వాత ఈ కుటుంబం గురించి అడిగేను.

"ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం బాబూ, ఇప్పుడు చితికిపోయింది. దీనికంతటికీ కారణం ఆ ముసిల్దేనంటారు. ఈవిడ పెనిమిటి చల్లని మారాజని సెప్పుకునేవారు. మొదటి భార్య పోతే యీవిణ్ణి చేసుకున్నాడు. ఇప్పుడున్న కరణంగారి తండ్రి రాఘవులని వుండేవారు. ఆయనే ఈ సంబండం ఈయనకి అంటగట్టేడంట"

"ఈవిడకి పిల్లలు లేరా?"

"పెళ్లయిన రెండేళ్లకే ఆయన పోయేడు. ఈ సవితి కొడుకొకడు మిగిలేడు"

"పాపం!"

"పాపం, పుణ్యం దేవుడికెరుక! ఆయన చావును గురించే రకరకాల పుకార్లున్నాయి"

"ఏమని?"

"ఏ రోగం లేకుండా అర్థాంతరంగా పోయాడటండీ... రాఘవులు, యీవిడ కలసి ఆయనకి యిషం పెట్టేరంటారు"

"రాఘవులుకీ, యీవిడకీ బంధుత్వం వుందా?"

"అసలు దూరం సుట్టరికమేదో వుందట. ఆయన పోయిన తర్వాత ఈవిణ్ణీ, సవితి కొడుకునీ ఆ రాఘవులే సేరదీసి యింట్లో పెట్టుకున్నాడంట. తర్వాత ఆస్తంతా కాజేసి బయటికి గెంటేసేడంట"

"మరి, ఈ కొడుకేం చదువుకోలేదా?"

"తండ్రి పోయాక మందెట్టి సంపేద్దారని సూసేరంట. బగమంతుడి దయవల్ల బతికేడు. కానండీ, పాతిగేల్లోచ్చేవరకూ మతిలేక యెర్రిబాగులాడిలా తిరిగేవొడంట. రాఘవులు పోయేక ఈ కరణంగారు ఈళ్లకింత అదరపు సూబెట్టి ఇంటికి పంపించేసేరు. ఏదో తిండిగింజలకీ, జరుగుబాటుకీ లోటు లేదు."

"మరిప్పుడు సవితి కొడుకుతోనే వుంటోందే!"

"రాఘవులు ఆస్తంతా కాజేసింతర్వాత బుద్ధొచ్చి పిచ్చి కుర్రోణ్ణి ఆదరించింది. తర్వాత మందూ, మాకూ ఇప్పించి దగ్గిరెట్టుకుంది. ఈయన దగ్గరుండకపోతే ఎక్కడుంటాదండీ! ఊళోవాళ్లు ఆవిణ్ణి చూస్తే స్నానం చేసి మరీ అన్నం ముడతారు"

మేమిలా మాట్లాడుకుంటూ వుండగా ఏదో లారీ స్పీడుగావొచ్చి వెనకనుంచి రాసుకుపోయింది. నేను ముందుకు పడ్డాను.

"నాన్నా... నాన్నా... నిద్దట్లో పలవరిస్తున్నావు" అంటూ మా అబ్బాయి లేపేడు. మైగాడ్! ఎంత తమాషా అయిన కల!

"ఏదో లారీ చప్పుడు..." అంటూనే వున్నాను. ఇంకా లారీ చప్పుడు స్పష్టంగా వినబడుతూంటే, అది కల కాదన్న భ్రమలో.

"అవును. మన యింటిముందే ఆగినట్టుంది" అన్నాడు మావాడు. బయట ఏదో మాట సందడి వినబడితే తలుపు తీసుకుని డాబా మీదనుంచి కిందకి చూశాను. కాళ్లు గిలగిలా తన్నుకు పడివున్న కుక్క కనబడింది.

"ఏం జరిగింది?" అడిగేను డ్రైవర్ని.

"ఏదో కుంటికుక్క బాబూ. లాభంలేదు. చచ్చిపోయింది" అన్నాడు డ్రైవరు పెదవి విరుస్తూ.

"నాన్నా అది 'రాజా', పక్కవీధిలో కుక్క" అన్నాడు మా అబ్బాయి జాలిగా.

ఇంతలో టెలిఫోన్ మోగితే వెళ్లి రిసీవర్ ఎత్తగానే హాస్పిటల్ నుంచి మా బావ గొంతు వినబడింది. "బావా కంగ్రాట్యులేషన్స్! ఆడపిల్ల పుట్టింది. అంటే యింట్లో లక్ష్మి వెలిసింది."

[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
మహిత - సామాన్య
[Image: m.jpg]
'బుజ్జమ్మా! ఒక రవ్వంత ఇది చదువు నాయన, కంటిచూపు ఆనటం లేదాని నాయనమ్మ పిలిస్తే చదవదామని పోతా ఉండానా, అంతలోకి మా నాయనొచ్చి మొన్న చూసిపోయిన పెళ్ళిచూపులోళ్ళ గురించి చెప్పడం మొదలుబెట్టేడు.

ముందుగా మీకు మా గురించి చెప్పనీయండి. నా పేరు మహిత. ఆ పేరు మా అత్త కూతురు చెప్పింది. నాకిప్పుడు పదహారేళ్ళు. మొన్ననే నా పదోతరగతి రిజల్ట్స్ తెలిశాయి. నేను లెక్కల్లో, సైన్సులో ఫెయిలయ్యాను. అందరికీ ముందుగానే తెలుసు కాబట్టి నన్నెవరూ తిట్టలేదు. అదీకాక ఒకేళ్ పాసయినా మా ఊరి నుండి టౌనుకు పోయి చదవడం మా నాయనకు రొవ్వంత కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడసలే కాలం బాలేదు కదా, ఏమయినా అయితేనో... దారిలో ఎవడైనా నన్ను ఏమైనా చేస్తేనో అని మా నాన్నకి భలే భయం.

సైగ్గా మీకో విషయం చెప్పాలి, అదేంటంటే... . నేను నిజంగానే అందంగా వుంటా. పదోతరగతి వచ్చాక రవనాడ్డోళ్ళ పెద్ద కొడుకు నా క్లాసులోనే చిన్నప్పటినుంచి చదవతా వుండాడా, ఇప్పుడేమో నా పక్క అదొక రకంగా చూడ్డం మొదలుబెట్టేడు. వాడట్ట చూడ్డం నాకేం బాగుండదు. కానీ, ఎంతైనా నేను అందమైన దాన్ని కాబట్టే కదా అట్టా చూస్తావుండాడు. నా ప్రక్కన కూర్చునే ప్రసూనని చూస్తా వుండాడా? చూట్టం లేదు కదా! అనిపిస్తది. నాకు సన్నటి నడుము, నడుం పై నడిచే జడ ఉన్నాయి... జడంటే మామూలు జడ కాదు. ఈంత లావు, ఈంత పొడుగు జడ నాది... నా జడ చూసి మా అత్తలు మహితకి జుట్టు మాదొచ్చింది అంటారా, మా అమ్మేమో చాటుగా, ఏది బాగుంటే అదంతా వీళ్ళ పోలికలే అని తిట్టుకుంటది. కానీ నిజంగా నా జడ మా అత్తల పోలికే. అంత పొడుగు జడకి జడకి కుచ్చులు పెట్టుకుని ఎప్పుడైనా పైటా, పావడా వేసుకుంటే భలే బాగుంటా.

పదహారేళ్ళకే పెళ్ళేందని మా అత్త కూతురు మా నాయన దగ్గర నస పెడతా వుంటది గానీ, నాకు మాత్రం పెళ్ళంటే ఇష్టమే. చదవడం, పరీక్షలు రాయడం నాకేం ఇష్టం గా అనిపించవు. మా ఇంట్లో ఆ పక్క వస్తువు ఈ పక్కకి, ఈ పక్క వస్తువు ఆ పక్కకి జరిపినా మా అమ్మ ' నీ ఇంటికి పోయిన పాట నీ ఇష్టప్రకారం చేసుకుందువులే గానీ ఇప్పటికి అట్ట ఉండనియ్యమ్మా, ' అంటది. ఆ మాట ఇని ఇని నాగ్గూడా పెళ్ళి చేసుకుంటే బాగానే వుంటది అనిపిచ్చింది. అప్పుడు చామంతి పూల తొట్ట్లు నా కిష్టమైన చోట పెట్టగలను కదా అని నా ఉద్ధేశం. బాగా పూసిన పూల తొట్టిని ఎవరైనా జనాలకి కనిపించకుండా పెట్టుకుంటారా? మా అమ్మకి చెప్పినా అర్ధం కాదు. వచ్చేపోయే దారికి అడ్డమంటది. నా కోసం రోజు వచ్చే కుంటి కాకి అంటే కూడా అమ్మకి ఇష్టమే వుండదు. ' ఎందుకు మే దాన్ని పోతును మేపినట్టు మేపతా వుంటా ' వంటది. ' పాపం అది కుంటిది కదా, మళ్ళీ అక్కడా, ఇక్కడా తిరగడమెందుకు, మనమే పెడదామా, అని చెప్ప్పినా మా అమ్మకి అర్ధమే కాదు. తరిమి పారేస్తది.

మా అమ్మయేమంటదంటే, మా నాయన ఏడు మున్నోరు కాలం చేనుకి చాకిరి చేస్తానే ఉంటాడంట గానీ, అదేం మాయో అంతెత్తున కనిపించే పంట కూడా చేతికొచ్చేసరికి చిటికంత, నోటికొచ్చేసరికి నలుసంత అయిపోతదంట. ' ఏదో ఒకటి అమ్మకపోతే అమ్మి పెళ్ళి జేయడం ఎట్ట కుదురద్ది... ' అని నేను ఎనిమిదోతరగతిలోకి వొచ్చినప్పటి నుండి మా అమ్మ అదే పనిగా కయ్యను అమ్మెయ్యమని మా నాయన దగ్గర నస మొదలుబెట్టింది. మా నాయన మా అమ్మ మాటలకి 'ఊ' అనో 'ఆ' అనో అనకుండానే నేను పదోతరగతి ఫెయిలయిపోయా.

ఇది ఇట్ట జరగతా వుండగా ఒకరోజు మా అమ్మకి వాళ్ళ దూరపు చుట్టాలెవరో ఒక సంబంధం గురించి చెప్పేరు. 'ఒకడే కొడుకంట, ముగ్గురు అప్పజెళ్ళెళ్ళు, ముగ్గురికీ పెళ్ళిళ్ళయిపోయీనాయంట . మీరెప్పుడంటే అప్పుడు పెళ్ళిచూపులు పెట్టుకుందాం' అన్నారు. ఆ సబంధం విషయం ఆ రోజే మా నాయనకి చెప్పిని మా అమ్మ. "పెళ్ళి చేయడానికి మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏదో ఒకటి అమ్మితే తప్ప చెయ్యాడే వసతి లేదు. మంచి, చెడ్డ ఇచారించుకుని చేద్దాం. తొందరపడమాక." అన్నాడు మా నాయన.

ఆ పై వారానికి మళ్ళీ వచ్చేరు వాళ్ళు. అన్ని మాటలు విన్న మా నాయన "అట్టేలే ఒకసారి ఆ ఊరికి బొయ్ చూసుకొద్దాం. ముందూ, ఎనకా ఇచారించాలి కదా" అన్నాడు.

ఆ పై శుక్ర వారం సాయంత్రం అయిదు గంటలకి పెళ్ళి చూపులకి వచ్చారు. ఈ సారి పెట్టినవి తింటూ పిల్ల నచ్చింది అని చెప్పారు. పెద్దోళ్ళు ముహూర్తాల గురించి మాట్లాడకుంటా వుండారు. అట్టా మాఘమాసం పద్నాలుగో తేదీన పెళ్ళయిపోయింది. మా కొనగట్ట చేన అమ్మి మా నాయన నా పెళ్ళి ఘనంగా చేసినాడు, మూడు రాత్రులు విచిత్రంగా గడిచాయి. ఎలాగంటేవ్.. నాకు మల్లెపూల జడ వేసి, పాల గ్లాసుతొ లోపలికి పంపారు. ఎళ్ళి చూద్దును గదా మా ఆయన సుబ్బరంగా గోడ పక్కకి తిరిగి పొడుకుని కనిపించాడు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. తరువాత తెల్లవారగానే అందరూ అడిగిన ప్రశ్నలకి ఏం జరిగిందో, జరగలేదో, చెప్పొచ్చో లేదో అర్ధంకాక నేను చెప్పకపోయినా కొందరు పెద్దోళ్ళు ఏం జరగలేదని కనిపెట్టారు.' పిల్ల చిన్నది కదా ఆ యబ్బయ్య బయపడి ఉంటాడ్లే. ' అన్నారు. ఇంకొన్ని రోజులకి నేను వాళ్ళ ఊరికి బయల్దేరా. ఆరుగురు కూర్చోవాల్సిన కార్లో పన్నెండు మందిమి కూర్చున్నామా ఒకటే ఉమ్మదం. వాళ్ళ ఊరికి చేరేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. ఇల్లు మా నాయన చెప్పినట్లు బాగానే ఉంది కానీ బయటకి మాత్రమే బాగుంది. లోపల చీకటి గుయ్యారం. ఆ ఇంటి ఎనకమాల ఇంకో ఇళ్ళుంది. ఆ తరువాత అంతా అడివే.

నాతో పాటు వొచ్చినోళ్ళందరూ ఒకట్రెండు రోజులుండి ఎళిపోయినారు. కడాన మా అమ్మ బయలుదేరింది. మా అమ్మ పోతావుంటే మటుకు నాకు బాగా ఏడుపు వచ్చింది. ఏడస్తావుంటే మా అమ్మ నన్ను ఇదిలిచ్చుకోని "అమ్మిని బాగా చూసుకో అమ్మ. ఇంక అండెన, దండెన అంతా నీదే." అని అత్తతో చెప్పి ఎనక్కి తిరిగి చూడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఎళ్ళిపోయింది.

పెళ్ళయిన తరువాత మా వాళ్ళంతా అనటం మొదలెట్టారు. మహిత అత్తగారు భలేగుంది. లేస్తే కూచోలేదు కూచుంటే లేవలేదని, మా అత్త అంత లావు . ఇంతకాలం ఈ ఇంటి పనంతా ఎట్టజేసుకుందో నాకు ఒక్క రొంత కూడా అర్ధంకాలేదు. కూచున్న కాడ్నించి లేవకుండా కళ్ళు నా మీదేసి మా అత్త, నేను చేసిన ప్రతి పనికి వంకలు పెడతా వుంటది.

మా అమ్మ ఎళ్ళిపోయిన మూడు రోజులకి మా ఆయన ఇంటికొచ్చాడు. మా ఆయనకి రొయ్యల ఫీడు అమ్మే యాపారం ఉంది. దానికోసమో ఏమో ఏదో పని మీద గూడూరికి పొయ్యాడని మా అత్త చెప్పింది. కానీ పోతా పోతా ఆయన నాకేం చెప్పిపోలా. గూడూరుకాడె మా నడిపి ఆడబిడ్డ ఉంటది. పొద్దుకూగే యాళకి ఇంటికొచ్చాడు మా ఆయన. ఒచ్చిన కాడ్నించి ఆయన నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన తిని లేసిన తరువాతా, మా యత్తకు పెట్టి, నేను తిన్న. ఆ చీకటింట్లో అయిదు రూములు ఉన్నాయి. మూడో రూము మా అయన పొడుకునేది. నేను ఆడనే పొడుకోవాలనేది నాకు తెలుసు. అందుకని ఆ రూములోకి పొయ్యా. మ ఆయన మంచం మీద పొడుకోనున్నాడు. నేను పోగానే గడిపెట్టి ఇట్రా అన్నాడు. నాకు బలే సిగ్గేసింది. అయినా మా ఆయన కాడికి పోయి నిలబడ్డా. ఆయన ఒక్క మాటన్నా మాట్లాడలే. ఆయన్నే నా రొమ్ముల మీద చెయ్యేసాడు. వెంటనే నేను గట్టిగా రైకని పట్టేసుకుని గింజుకోవడం మొదలుపెట్టా. మా ఆయన అటు గుంజుడు, నేను ఇటు గుంజుడు. ఇంతలో ఒక సిటంలో నా చెంప పేలిపోయింది. నేను మంచం మీద పడ్డా. తరువాత ఏం జరిగిందో నాకు అర్ధం కాలే. పొద్దులకి నాకు ఒళ్ళు ఎచ్చబడి లేవబుద్దికాలా. ఆయన పొద్దున్నే లేచి ఎట్టబోయ్యాడో తెలీదు. నాకు కనిపిచ్చలా. ఆ రోజు పోయినోడు మా ఆయన తరువాత వారానికొచ్చాడు. మా ఆయన్ను చూడగానే ఘోరంగా భయమేసింది. తప్పించుకోని తప్పించుకోని తిరగతావుంటే మా అత్త ' సాల్లే నీ సింగినాదపు సిగ్గులు. వాడికేం కావాలో వైనంగా చూడు.' అన్నది.

మా ఆయన అన్నం తిని ఊళ్ళోకి పోయాడు8. మా మావ చేలోకి పొయ్యాడు. ఏడున్నరకి మా ఆయన ఇంటికొచ్చాడు. నేను పీట వాల్చి అన్నం పెట్టాను. వంటింట్లో అన్ని సర్ది నిదానంగా మా ఆయన రూములోకి పొయ్యా. ఆయన నిద్దరపోతావుండాడు. నాకు బలే సంబరమేసింది. అబ్బ ఈ రోజుటికి బాధ తప్పింది అని. శబ్ధం కాకుండా ఒక మూలగా చాపేసుకుని పడుకున్నా. పడుకున్నానేగాని మనసులో భయం. ఈ రోజైతే సరే రేపెట్టా?... పోనీ అమ్మకు చెప్తేనో. ఆలోచిస్తావుంటే నిదరపట్టింది.

ఒక రాతికాడ ఏదో కుట్టినట్టు సుర్రుమంటే అబ్బా అని లేసి కూచున్నా. ఎదురుగా మా ఆయన. నిదర మత్తులో ఏమి అర్ధం కాలేదు. తలెత్తి మా ఆయన్ను చూసే లోపల ఇంకోసారి అదే పని జరిగింది. ఆ రోజు మా అయ్యన ఏం చేసాడొ నేను మీకు నోరు తెరచి చెప్పలేను. మా ఆయన చేతిని తోసేసోలోపల నా చెంప మళ్ళీ పేలిపోయింది. కళ్ళ నీళ్ళు తెరిపి లేకుండా కారిపోయినాయి. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తావుండాయి. ఇటువంటి మనుషులు కూడా వుంటారా అనిపించింది. పొద్దటికి భగభగమని మండిపోతా జరమొచ్చింది. మా అత్త వచ్చి చూసి, "ఇదేం చోద్యమో చీటికీ మాటికీ జరమని మంచమెక్కద్ది. వొచ్చిందమ్మా భలే కోడలా," అన్నది.


ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఆ రోజు సాయంత్రం మా అత్త పెట్టిపోయిన కాఫీ కొన్ని గుక్కలు తాగి, దొడ్లోకని చెప్పి బయటకొచ్చి, మా ఇంటికి నాలుగిళ్ళ అవతల వాళ్ళింట్లో ఫోనుందని మా అత్త ఒకసారి ఎవరికో చెప్తుంటే ఇన్నా, దొడ్డిదారిన వాళ్ళింటికి పోయి ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా అని అడిగా. నా అవతారం చూసి ఏమనుకున్నారో చేసుకోమ్మా అన్నారు.

అవతల మా నాయన ఫోన్ ఎత్తాడు. నాకు ఇంకా ఏడుపు ఆగలే. ఒకటే ఏడుపు, ఒకటే ఎక్కిళ్ళు. ఆ ఎక్కిళ్ళ మధ్యే అంతా చెప్పా. అవతల మా నాయన గొంతు వజవజా వణికిపోతుంది. "ఇదిగో నాయనా ఈ బస్సుకే బయల్దేరతావుండా, బయపడబాక, ఆ పెళ్ళీ వద్దు, పెటాకులూ వద్దు. ఇంక ఆ ఇంటికి పోబాక ఊర్లో ఏదన్నా గుడో, బడో వుంటే కూర్చో తల్లా మా అమ్మా... వొచ్చేస్తా వుండా," అన్నాడు మా నాయన. నేను మా నాయన చెప్పినట్టే ముత్యాలమ్మ గుడిలో కూర్చున్నా. మా ఊరి నుండి ఈ ఊరికి రావడానికి సమయానికి బస్సు చిక్కితే సరిగ్గ నాలుగంటల ప్రయాణం. కానీ మా నాయన బస్సులో రాలే. కారు బాడుక్కి తీసుకుని వచ్చాడు. గుడి కాడ ఆగాడు. కార్లో మా నాయన, మా చిన్నాయన, మా అత్త వచ్చినారు. కార్ లో నెను మా నాయన పక్కన కూర్చుని, మా అత్త ఒళ్ళో తల పెట్టుకున్నా, ఒకరొంత దూరం లోనే కారాగితే తలెత్తి చూసా మా అత్తోళ్ళిళ్ళు. నాకేం అర్ధం కాలే. అందరూ కార్లోంచి దిగారు. నేను మాత్రం దిగలే. పెద్దపెద్దగా అరుపులు, అంతా గోలగోలగా వుంది. రొంత సేపటికి అందరూ కారెక్కారు. మేం మా ఊరికి బయలుదేరినాం.

ఏమైనా మా ఊరికి ఒస్తావుండే నాకు సంతోషంగా వుంది. పోంగానే మా యమ్మ నా మహితే అంటా ఏడవడం మొదలెట్టింది. మా ఇళ్ళు చూసే సరికి నాకు చానా ధైర్యమొచ్చింది. అందుకని. మా యమ్మని యాడవబాకుమా, అని మా అమ్మని నేనే ఓదార్చా. ఇంకేముందిలే. అబ్బా ఒచ్చేసాం. అని నా ప్రాణానికి హాయిగా అనిపించింది. మా అమ్మా, నాయన నన్ను ఆ ఇంటికి పంపనని, అదే మాట మీద నిలబడ్డారు. రెండేళ్ళు గడిచిపోయినాయి.

రెండేళ్ళకి ముందు నాకు పెళ్ళయ్యింది అన్న మాట గుర్తు తెచ్చుకోవాలన్నా నాకు భయంగా ఉంటది. ఇంకొక నాలుగు రోజులు పోతే సంక్రాంతి. ఏకోజామునే లేసి మా ఇంటిముందర ముగ్గేసి రంగులద్దతావుండా, నేను ముగ్గు పూర్తి చేసి,మా నాయన ముఖం కడిగి కాఫీ తాగాక నిదానంగా.. నాయనా ఎంకురెడ్డి సచ్చిపోయినాడంట అన్నా.. మా నాయనకి మొదట ఏ ఎంకురెడ్డో గవనానికి రాలే. 'ఏఎంకురెడ్డి పాపా" అన్నాడు. నాకు మా మావ అని చెప్పడానికి మనసు రాలే. అందుకే వాళ్ళే నాయనా అరెంపాలెపు ఎంకురెడ్డి అన్నా అప్పుడే మళ్ళ ఫోనొచ్చింది. ఈ సారి మాట్లాడలేదు. మా అమ్మకి విషయం చెప్పాడు. మా అమ్మ కూడా ఏం పట్టించుకోలేదు. మానాయన మా అమ్మని పిలిచి, "ఒకసారి పావనిని తీసుకుపొయ్యి నీళ్ళు చల్లిచుకుని వద్దాం. సావు కాడ పగలెందుకే. పోయినోడెట్ట పోయే.." అన్నాడు మా నాయన.

పదకొండు గంటల ట్రిప్పుకు ముగ్గురం బయలుదేరినాము. ఆ ఇల్లు, ఆ మొహాలు చూడ్డం నాకు ఒక్క రవ్వంత కూడా ఇష్టమనిపించలే. మా నాయన వస్తా వస్తా ఓ పూల మాల కొన్నాడు. దాన్ని తీసుకుని పోయి నన్ను వేయమన్నాడు, కానీ నేను పోను నాయనా అని నువ్వే వేసిరా అన్నాను, మా నాయనే పోయి పూలమాల వేసొచ్చాడు. మా ఆయన ఎక్కడా కనిపించలే. నేను ఆ తతంగాలంతా చూస్తూ షామియానా కింద ఏసిన కుర్చీలో కూర్చున్నా, వాళ్ళ ఏదుపుల్ని చూస్తా వున్ననే గాని, అదే అరుగుపైన ఇంకో రెండు వారాల్లో నేను శవమై పడుంటానని మా అమ్మ నాయన నా మీద పడి యాడస్తా వుంటారని నాకు ఒక్క రొంత ఆలోచన కూడా లేదు.

అన్ని తతంగాలు అయిపోయాకా. మా నడిపి ఆడపడుచు మా నాయంతో, అయ్యిందేదో అయ్యింది మావా, ఈ సారి అట్ట జరక్కుండా మేం జూస్తాం. అమ్మిని ఈడే వుండిచ్చండి. అని ఒకటే బతిమిలాడింది. మానాయన నా వైపు చూసి "ఏం నాయనా మహితా ఉంటావా" అన్నాడు. నేనేం మాట్లాడలే. "అక్కోల్లు అందరూ వున్నారు గదమ్మా, ఇంకో పదేను రోజులుండురోజులు చూడు. నీకంత వుండలేననిపిస్తే వచ్చేద్దువుగాన్లే. నా ఫోను కూడా నువ్వే పెట్టుకో అమ్మ, ఏ కష్టమొచ్చిన చిన్నాయనకి ఫోన్ చెయ్యి నిముషంలో లగెత్తుకొచ్చేస్తాం." అన్నాడు
అందుకు మా చిన్నాడపడుచు "ఈ సారి అంత కష్టం రానీములే మావా" అన్నది. నాకేం చెప్పాలో తోచలే. మనసులో చాలా భయంగా వుంది. అయినా సరే సరే అని తలూపాను. ఎందుకంటే... మా నాయనంటే నాకు ప్రాణం. మా నాయన మాటకు ఎదురాడ్డం నాకు ఇష్టముండదు.

అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇంటినిండా మనుషులుండడంతో మా ఆయనతో మాట్లాడడం కుదరలేదు. కానీ చిన్నగా ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోవడం మొదలెట్టారు.

చాన్రోజులకి తలారా స్నానం చేసి అరుగు మీద కూర్చున్నా. ఏదేదో ఆలోచిస్తావుంటే గేటు శబ్ధం అయ్యింది. చూద్దును కదా... మా అమ్మ, తాత. నన్ను చూసిపోదామని వచ్చారు. మా అమ్మా, తాత నాకు జాగ్రత్తలు చెప్పి ఆయంత్రం కల్లా వెళ్ళిపోయారు. ఈ రోజు మా ఆయన వస్తాడు అని మా యత్త చెప్పింది. అందుకని మా అమ్మ తెచ్చిన ఎండు చేపల్లో వంకాయేసి కూరొండా. మా అమ్మ పోయిన రెండు గంటలకు మా ఆయనొచ్చాడు రావడం రావడమే ధుమధుమలాడతా వొచ్చేడు. మా అత్తని బూతూ బొండూ తిట్టేడు. నాకు భయమేసింది. నేనేం తల దూర్చలా. సక్కా పోయి పడుకున్నా... ఒక రాత్రికాడ గట్టిగా తన్నినట్టనిపిస్తే దడుసుకుని లేసా. చూస్తే ఎదురుగా మా ఆయన. ఈసారి నాకు కోపమొచ్చింది. ' ఎందుకు తంతా వుండావు? మీరంతా ఉండమని పీకులాడితేనే ఇక్కడుండా. రేపే ఎళిపోతా... కొట్టడం గిట్టడం కుదరదు. అని ధైర్యంగా అన్నాను. మా ఆయంకి కోపం పెరిగిపొయ్యింది. దిండు తీసుకుని నా మొహం మీద పెట్టి అదమడం మొదలు పెట్టేడూ. నేను చేత్ల్తోటి గిచ్చడం మొదలుపెట్టా. మా ఆయన ఎక్కి నా గుండెల మీద కూర్చున్నాడు. మోకాళ్ళు నా చేతుల మీదేసి అదిమేసాడు. నాయ్నా..నాయ్నా అని అరుద్దామనిపిచ్చింది. గింజుకుని గింజుకుని నాకు పూర్తిగా ఊపిరాడ్డం మానేసింది.

పదకొండు గంటలకి మా ఊరి నుండి బంధువులందరూ దిగిపొయ్యారు. మా నాయన కారు కాడ్నించి పరిగెత్తతా వొచ్చేడు. రాంగానే నన్ను, నాశవాన్ని జూసి నా కాళ్ళ దగ్గర కూలబడిపొయ్యి నాయినా మహితా... మహితా... మహిలూ లెయ్ నాయనా.. నాయనా సచ్చిపోబాకమ్మా... నా బంగారు తల్లీ.... మహిలూ...' అని యాడవడం మొదలుబెట్టాడు. మా అమ్మ వచ్చి నా పక్కన పడిపోయింది. ఏడుపూ లేదు, ఏం లేదు. ఒకటే ఎర్రి చూపు. మా అత్తలు గుండెలు బాదుకుని యాడస్తా ఉండారు. నాకు మళ్ళా ఏడుపొచ్చింది. ' నాయనా నేనేం జేసేది నాయనా, యాడవకు నాయనా' అని చెప్పాలనిపించింది.

మా మావలు, చిన్నాయన్లు, ఇంకా ఊర్లో పెద్ద మనుషులు జరగాల్సిన తతంగం గురించి మాట్లాడుకుంటూ ఉండారు. ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేశారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఫోన్ జేసిన ప్రెతీ తడవా ' ఇదిగో వస్తా వుండాం, అదిగో వస్తా ఉండాం' అంటా ఉండారు. ఎవరెవరో ఎవరెవరికో ఫోన్లు జేసుకుంటా వుండారు.

చివరికి ఆ మూలుండే పెద్ద మనుషులు మా నాయన్ని నా దగ్గర్నుండి లేపి అవతలికి తీసుకపొయ్యి ' ఏణు రెడ్డా! ఏడిసిన పాట పోయిన అమ్మిగాన తిరిగొస్తదా? మొగోడివి జరగాల్సినవి చూడొద్దా? ' అన్నారు. మా నాయన ఆ మాటిని ' అనా! నేను మొగోడ్ని కాదనా...నేను మొగోడ్ని కాను. నాకు నా బిడ్డ కావాలనా! నా బిడ్డ కావాల...నా బిడ్డని నాకు దెచ్చియన్నా అని నేల మీద కూలబడ్డడు. పెద్ద మనిషి మా నాయన్ని లేపి కుర్చీలో కూచోబెట్టి ' ఏణు రెడ్డా! చెప్పేదిను. కేసులు గీసులంటే పోయిన బిడ్డ తిరిగొస్తదా.మీరు పెట్టినయ్యంతా రాబట్టుకుందాం. రెండెకరాలమ్మి గదా బిడ్డ పెళ్ళి జేస్నావు. ఆ రెండెకరాలకి ఇంకో రెండెకరాలు కలిపి కొనుక్కునేట్టు డబ్బులడుగుదాం. లేకపోతే కేసు పెడతామని బెదిరిద్దాం. ' అన్నాడు.

ఆ మాటింగనే మా నాయిన ఆమన్నే లేసి నిలబడి ' అన్నా! అమ్మి పోయిందన్నా...ఆస్తి నేనేం జేసుకొనేదన్నా? బంగారు తల్లి గదంటన్న పిల్ల..కాపరం జెయ్యాలని మేమనుకోలేదే.... అదిగో తా తల్లి , మావా పూచీ నాదీ అని అంటే గదాబిడ్డనీడ వదిలిపెట్టిపోయింది. అమ్మ ప్రవీణమ్మ తల్లీ ఏమమ్మా ఆరోజు నాదీ పూచీ అంటివే? ఇదేనా తల్లీ పూచీ అంటే? అని యాడవడం మొదలుపెట్టాడు.

పెద్దమనుషులు ' ఏణయా మేం జెప్పేది ఇను ఆడదానికంటే ఘోరంగా ఉండావే, కేసులు గీసులని ఏమొస్తది. అయిందేదో అయింది. మన డబ్బైనా మనం రాబట్టొద్దా అన్నారు. తాటి చెట్టంత పొడుగు కదా నేను, అందుకని డిక్కీలో పట్టలా. నాకాళ్ళూ చేతులూ వంచి, వంచి డిక్కీలో కూర్చి డిక్కీ ఏసేసినారు. ఇప్పుడు నేను మహితను కాను. మహిత శవాన్ని. అందుకని డిక్కీలో కూడా ఉండొచ్చు. ఊపిరాడదనే భయం లేదు. మా ఆయన ఎప్పుడో నిన్న రాత్రే నా ఊపిరి తీసేసాడు కదా అందుకు. మా పెద్దమ్మ ఒకామే టౌన్ లో ఉండేది. హాస్పిటల్ ఎంక వీధుల్లో వాళ్ళిల్లు ఉండేది. వాళ్ళింటికి పోవాలంటే రోడ్లో బస్సు దిగి హాస్పిటల్ గుండా పోతే దగ్గర దారి తొందరగా ఎల్లిపోవచ్చు. అందుకని మా నాయ్న ఆ దార్లో తీసుకపొయ్యేవాడు. ఆ దార్లో పాడుబడినట్టు ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. ఒకసారి మా నాయన్ని ' అదేంది నాయనా' అనడిగితే అక్కడ శవాల్ని కోస్తారని దాని మార్చురీ అంటారని చెప్పి అదిప్పుడు వేరే బిల్డింగ్ కీ మారిందిలే భయమేం ళెడూ ఆణీ ఛేప్పేడు. అయినా సరే ఆ బిల్డింగు వచ్చిందంటే నాకు భయమేసిపోయేది. ఆ పక్క తల తిప్పకుండా పోయేదాన్ని.

నన్ను మార్చురీకి తీసుకొచ్చేసరికి రాత్రి ఏడున్నరయింది. మా ఆయన తరపనోళ్ళు గూడా ఎవరో వొచ్చేరు. డాక్టర్లు ముగ్గురు నన్ను కోయడం మొదలుపెట్టారు. వాళ్ళలో మగ డాక్టరు నా జడ, మొహము జూసి, ఎంత చిన్నపిల్లో, ఎంత పెద్ద జడో! పాపం ఆ జడ పెరిగినన్ని రోజులు కూడా పట్టలా సచ్చిపోవడానికి.' అన్నాడు.మా ఆయన తరపువోళ్ళు డాక్టరుతో ఏవో మంతనాలాడారు. డాక్టరు అది విని ' ఏమయ్య, అంత పసిబిడ్డ, అన్యాయంగా చంపి పారేస్నారు. పొమ్మంటే పొయ్యి, ఎట్నో ఒకట్ట బతుక్కోబోయిందా, ఇప్పుడు తప్పుడు రిపోర్టు రాసి మీ దగ్గర డబ్బు తీసుకుంటే జీసస్ నన్నెప్పటికీ క్షమించడు, పొండి అవతలబడ...!'అన్నాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
నన్నీసారి అంబులెన్సు లో ఎక్కిచ్చేరు. నా శవాన్ని మా అత్తింటి నుండి తీసుకొచ్చేటప్పుడు, వాళ్ళవైపు బంధువులంతా నానా రభసా చేసేరు. పెళ్ళైన ఆడది సత్తే అత్తగారూర్లోనే తగలబెట్టాలంట. అమ్మగారింటికి తీసుకుపోగూడదంట. అరిష్టమంట. అదిని మా నాయిన ' మాకింతకంటే అరిష్టమింకేముంటది తల్లా. ముత్తెమంటి బిడ్డని మీ యాదానేశాం. చాలమ్మా, మా బిడ్డని మేం తీసకపోతాం.అని తెచ్చేశాడు. తీసుకరాకుంటే, నేనా ఊర్లోనే తగలబడిపొయ్యేదాన్ని.

మా ఊరికి రాగానే మా బంధువులంతా యాడుస్తా ఎదురొచ్చినారు.ఫాదెశీణాఆౠ. ఘొదూఘొదూమని ఒకళ్ళనొకళ్ళు బట్టుకుని యాడ్వడం మొదలుబెట్టేరు. నేను నిండా మార్చురీ కట్లతో ఉండా కదా అందుకని నాకు శవ స్నానం జేయించకుండా పసుపుగుడ్డ, చీర మీదేసి నిండా పూలు బెట్టేరు. పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా. మా కరగాడల్లో పూసే ముళ్ళగోరింట, నాగమల్లి పూలని కూడా వదిలేదాన్ని గాదు. నా జడలో పూలు నాకు కనిపిచ్చవు కదా. అట్ట చూసుకుంటా వుంటే అంత పూల పిచ్చి వుంటే మొగడు జస్తాడంట అనేది మా రెండో అత్త. మా అత్తకి గుర్తుందో లేదో. నా జడనిండా పూలుబెట్టి మా రేండో అత్త్ని బట్టుకుని ఓమని యాడవడం మొదలుబెట్టింది. ఆ తరవాత నన్ను పాడె మీద పండబెట్టి స్మశానానికి తీసుకపొయ్యేరు. మా నాయనే కొరివి పెట్టేడు.

నేను ఇంట్లోనే పుట్నానంట. అనుకోకుండా పుసక్కన పుట్టేస్తే మొదట మా నాయనే నన్ను ఎత్తుకున్నాడంట. మా నాయన్ ఆ మాట ఎప్పుడూ జెప్పేవోడు. ఇప్పుడు మా నాయనే నాకు కొరివి పెట్టేసరికి నా గుండెంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే నేను ఎటుమంటి చిడిముడి పెట్టకుండా సుబ్బరంగా కాలి బూడిదయ్యా.

నా ఎముకల్ని ఒక కుండలో పెట్టి తెచ్చుకుని మా ఇంటి నిమ్మ చెట్టు మొదట్లో పాతాడు మా నాయిన. మళ్ళీ అందరూ అరిష్టం అరిష్టం అన్నారు. అయినా మా నాయిన ఇన్లా. ఇప్పుడు మా నాయినకి పొద్దున్నే లేవగానే ఒకటే పని, నిమ్మచెట్టు కాడికొచ్చి ఆమ్న్నే ఆ మట్లో నా ఎముకలు పూడ్చిన ద్గ్గర కూర్చొని ' ఏం నాయనా మహిలూ నన్ను తిట్టుకుంటా ఉండవామ్మా, మా నాయ్నే గదా నన్ను ఎముకలు జేసింది అనుకుంటా ఉండావామ్మా, ' అని యాడవడం. మా నాయన కంటే మా అమ్మే మేలు. ఒకరొంత మనుషుల్లో పడ్డది. మా నాయన ఏడవడం జూస్తే నాకు యాడవద్దు నాయినా ' అని ఓదార్చాలనిపిస్తది.

మా ఆయన, అత్త జైల్లో పడ్డరోజు మాత్రం మా నాయన చానా సంతోష పడ్డాడు. నిమ్మ చెట్టు దగ్గర కూర్చోని చానాసేపు ఏడ్చి ' అమ్మ మహిలు ఎంత ఖర్చయినా కేసు వదలనమ్మ. వాడు జైల్లోనే ఉండిపోయేట్టు జేస్తా' అన్నాడు. మూడు నెలలు జైల్లో ఉండి బెయిలు మీద బటకొచ్చేరు మా ఆయన, అత్త.

కేసు కోర్టులో నడస్తా ఉంది. మా నాయన రోజురోజుకీ మంచానికి అంటకపొయ్యి లేవడం లేదు. బంధువులంతా అట్టయితే అత్ణయ్యా అని చెప్తా ఉండారు. ఎవరేం చెప్పినా మా నాయన ఓమని ఏడ్చేవోడు. రోజంతా ఆమ్న్నే పొడుకోనుండేవాడ, కోర్టు వాయిదా రోజు మాత్రం లేసి కోర్టుకు పొయ్యేవాడు.

నేను సచ్చిపోయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత సంగతి ఇది. పది గంటళేళ మా అమ్మ కుంటి కాకికి అన్నం పెట్టి కడిగి దబ్బిళిచ్చిన దబర్లు ఇంట్లోకి తీసుకు పోతా ఉంది. నేను సచ్చిపోయిన తరవాత మా అమ్మకి కుంటికాకి మీద ప్రేమ పెరిగింది. యాడకన్నా పోవాల్సి వస్తే ' ఒకరొంత మహితమ్మ కాకికి అన్నం పెట్టండి ' అంజెప్పి పోతది. ఆరోజు కాకి తింటా ఉండిందల్లా కా..కా..మని అరస్తా గెంతతా నీళ్ళ తొట్టి పక్కకి పోయింది. మాయమ్మ ఇంటిలోపల్నుండి తొంగి చూసింది. ఎవరన్నా వొచ్చేరా..ఎట్టా అని.

నిజమే ఎవరో వొచ్చేరు. ఒక పెద్దాయన, వురామరిగ్గా నా ఈడు పిల్లే. అంటే సచ్చిపొయ్యె రోజు నా వొయసు పజ్జెనిమిదేళ్ళ నాలుగు నెలలు గదా అంతనమాట. మా అమ్మ బయటికొచ్చి 'ఎవరమ్మా, ఎవరు గావాల?' అన్నది. ఆ పిల్ల నేను నరేంద్ర రెడ్డి భార్యనమ్మ ' అన్నది. మా అమ్మకి నోట మాట రాలా. ఉలుకూ పలుకూ లేకుండా నిలబడిపోయిన మా అమ్మని జూసి ఆ పెద్దాయన ' ఎండంబడి వొచ్చినాం తల్లా ఒక చెంబుడు నీళ్ళీ నాయన దాహంగా ఉందీ అన్నాడు. మా అమ్మ యాప చెట్టు కింద మంచం వాల్చి లోపలికి పోయి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వచ్చినోళ్ళు నీళ్ళు తాగినారు.

తరవాత ఒకరొంత సేపటికి ఆ పెద్దాయన ' అమ్మ మీరెవరో నాకు దెలీదు. నేను ఈ అమ్మికి నాయిన్ని. నరేనంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్ళిజేసే వరకు మాకు కేసుల సంగతి తెలీదు తల్లీ. రొయ్యలు గుంటలు బెట్టి ఉండిందంతా కారనూక్కున్నాం. చేనూ డొంకా అప్పులోళ్ళ పాల్జేసి ఎదిగిన బిడ్డ పెళ్ళెట్టా జేద్దాం దేవుడా అనుకుంటా ఉంటే నరేంద్ర రెడ్డి అక్క, ఈ అమ్మి ఆడబడుచు ప్రవీణమ్మ ఉందే, ఆ యమ్మ వొచ్చి అడిగింది. మా తమ్ముడి భార్య పాము కరిసి సచ్చిపోయింది. మీ కూతుర్ని ఇస్తారా.కట్నాలు గిట్నాలు ఏమీ బళ్ళా..తరవాత సల్లంగా అన్నీ కానిచ్చేసుకుని కేసు సంగతి జెప్పి మీ కాళ్ళు పట్టుకోమని జెప్పి అంపిచ్చినారు. అది నాయనా సంగతి. న్యాయం, ధర్మం ఆ భగమంతుడు ఎట్టయినా జూస్తడు. చూడకుండా పోడు కదమ్మ. కానీ నా బిడ్డ పైన కనికరం బెట్టి ఆ కేసు వొదులుకోండమ్మా' అన్నాడు. మా అమ్మ ఎలవరబోయింది. తేరుకుని వలవలా యాడస్తా ' ఏమయ్యా పెద్ద మనిషీ ఇదిగో నీ కూతురుందే ముత్తెమాలా...అట్టే ఉండేది నా కూతురు. దాన్ని శవం జేసి పంపిచ్చినాడు. వాడ్నెట్ట వొదిలి పెడ్తామయ్యా. ప్రసక్తే లేదు.' అన్నది.

అదిని ఆ పిల్ల ' పెద్దమ్మ! మీ పెట్టుపోతలుగాక ఇంకో రెండెకరాలు గూడా కలిపి ఇస్తారంట ఆయన చెప్పమన్నారు. మీ అమ్మినే అనుకోని దయజూడు పెద్దమ్మ ' అన్నది.

మా అమ్మ ఆ మాటలీని , ' పాపా, నా బిడ్డనన్నావు, నా బిడ్డే అనుకుంటా. వాడొక సైతాను. నేను బతికినన్ని రోజులు నీ తిండికి, గుడ్డకి లోటు లేకుండా సాకుతా..దా..వొచ్చి నాదగ్గరుండు. అంతే కేసు గురించి మాత్రం మాట్లాడబాక. ఇంకోమాట..సచ్చిపోవడానికి రెండున్నర సంవత్సరాల ముందే నా బిడ్డ ఇంటికొచ్చేసింది. కట్టుగుడ్డతో వచ్చిన బిడ్డని మళ్ళీ అంపిచ్చలా మేం. దాని పట్టు చీరలు, నగలు ఆడే ఉండిపోయాయి. వాళ్ళీలా. మేమడగలా. ఆరోజు అడగనోళ్ళం, ఈరోజు నువ్వొచ్చి డబ్బాశ జూపిస్తే వొప్పుకుంటామా?వొప్పుకునేవాళ్ళమైతే, శవం తీయకుండానే రావాల్సింది వొసూలుజేసుకునేవోళ్ళం...ఇంక మీరు పోయి రాండమ్మ,' అని లేసి ఇంట్లోకొచ్చేసింది. నాకు ఆ పిల్లని జూస్తే జాలేసింది. పాపం ఆ పిల్లది మాత్రం తప్పేముంది? అనిపిచ్చింది.

కేసు చానా రోజులు నడిసింది.

ఆ రోజు ఆఖరి తీర్పు అని మా నాయన అమ్మకి జెప్తా వున్నేడు. పొద్దుటి నుండి చానా ఇచారంగా ఉణ్ణేడు మా నాయన. నిమ్మ చెట్టు కాడికి వొచ్చినాడు కానీ ఏమీ మాట్లాడలా. మా వకీలు పేరు ఆదిశేషా రెడ్డంట. ' అమరా వకీలు చానా రోజుల నుండి మారి పోయినాడు. ఇంతకు ముందు లాగా ధైర్నంగా మనం గెలుస్తామని చెప్పటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నేను కోర్టుకు పోలేను మే ' అన్నాడు. మా అమ్మ ఇదంతా విని ' సరేలే అయ్యా, పోకపోతే పోయినావులే. తెలిసేదెట్టా తెలవదా.. దిగులుపడబాక. ఈ లోకంలో తప్పిచ్చుకున్నా పై లోకమనేది ఒకటుంటది. ఆడవరకూ ఎందుకు? ఇది కలి యుగం. ఆ కాలంలో అప్పటిది ఎప్పుడో అయితే ఈ కాలంలో ఇప్పటిదిప్పుడే అంట. వాడికి మన కడుపుకోత పాపం తగలకుండా పోదు. ' అన్నది. మా నాయన ' ఏం దేవుడు లే మే. మొన్న కేసు గెలుస్తామా ఓడిపోతామా అని ఎంకయా సామి ముందర చీట్లు పెడితే ఓడిపోతామని వచ్చింది. మనమేం పాపం జేసామని వొకీలు కాడ్నించి దేవుడి వరకూ అందరికీ మనమంటే లోకువ,' అన్నాడు.

మా అమ్మేమీ మాట్లాడలా. కొన్సేపు మెదలకుండా కోచ్చోని ఆపట లేచి పూలచెట్ల కాడికి పోయింది. నేను సచ్చిపోయిన తరవాత పటం కట్టిచ్చడానికి ఫోటోలు ఎతికేరు. పెళ్ళి తరవాత నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు. పెళ్ళి ఫోటోలు చూడడం కూడా మా అమ్మోళ్ళకు ఇష్టం లేదు., అందుకని పదోతరగతి పరీక్ష కోసం తీయించుకున్న పాస్ పోర్ట్ ఫోటోనే పెద్దది తీయించి పెట్టారు. దాంట్లో యూనిఫాం రైక తో రిబ్బన్ తో ఎత్తి కట్టిన రెండు జడలతో బాగుంటాను ప్చ్..! చదువుకోనుంటే పొయ్యుండేది. పదోతరగతి తరవాత నేను బతికింది రెండున్నరేళ్ళే కదా. అందుకని ఆ ఫోటోకి పటం కట్టిచ్చుకున్నారు. మా అమ్మ పూలు తీసుకొచ్చి నా పటానికి పెట్టి పోయి పొడుకున్నడి. ఆ రోజుకింక పొయ్యి ఎలిగించే పని లేదని దానర్థం.

మా నాయన గోడంచుగా, నిమ్మ చెట్టుకాడ మంచం వాల్చుకుని, తుండుగుడ్డ తలకింద పెట్టుకుని, చెయ్యి కళ్ళమీద పెట్టుకుని పొడుకున్నాడు. కేసు ఏమవతదో మా నాయనకి అప్పటికే తెలిసిపోయినట్టుంది. అంతెందుకు ఏమవతదో పసిబిడ్డని నాక్కూడా తెలిసినట్టే అనిపిస్తా ఉంది.

[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
వంశీ మెచ్చిన కథలు సమాప్తం

సెలవు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)