Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సాయంత్రం పంచామృతాలు, ఫలోదకములు, భస్మము, పసుపు, కుంకుమది సుగంధ ద్రవ్యములతో
అభిషేకము కనులపండుగగా, వైభవోపేతముగా, నిర్విఘ్నముగా చేసాము.
‘ రుద్రం దావయతీతి రుద్రం ‘ శంకరోతీతి శంకరః
రుద్రం అనగా ఏడుపు. బాధ. దుఃఖం. వీటిని మననుంచి ద్రవించ చేయగలిగినది, కడిగివేయ గలిగివది రుద్రము. శం అనగా శుభము. మనకు శుభములను ప్రసాదించగలిగిన వాడు శంకరుడు.
మేము పవిత్ర కార్తీకమాసములో వారణాసి పట్టణంలో గంగానది ఒడ్డున శివ అర్చన, అభిషేకములు
అతి ఘనంగా ఆరాధనగా పూర్వకంగా చేసితిమి.
—————————————————————-
మరునాడు ప్రాతఃకాలముననే అనగా ఉదయం నాలుగు గంటలకే మూడు బస్సులలో వారణాసి నుండి బయలుదేరాము. కాశీనుండి ప్రయాగ దూరం వంద కిలోమీటర్లు. వాస్తవంగా దీనిని త్రివేణిసంగమం అని కూడా అంటారు. గంగా, యమున మరియు సరస్వతీ నదుల సంగమమే ఈప్రయాగ.
పన్నెండు ఏళ్ళ కొకసారి కుంభమేళా జరుగును. శాక్తేయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో అలహాబాద్ శక్తిపీఠం ఒకటి. సతీదేవి వేలు పడిన దివ్యక్షేత్రమని విశ్వసించబడుచున్నది.
ఈ అమ్మవారిని మాధవేశ్వరిగను, పరమశివుడిని కాలభైరవుడుగా ఆరాధిస్తూంటారు. ఈమెను అలోపి/ లలితా దేవి అని పిలుస్తుంటారు. అలోపి అంటే అదృశ్యమైన వ్యక్తి. ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా చిహ్నం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విగ్రహం లేదు, చిహ్నం లేదు. చెక్క డోలీపై దేవత ఉందని మనము ఊహించుకోవాలి. అలోపి మాత కొత్తగా పెళ్ళయిన వదువు. దొంగలు వివాహబృందంపై దాడిచేసినప్పుడు ఆమె పల్లకి నుండి అదృశ్యమయింది. వధువు ఆశ్చర్యకరంగా కనిపించకుండా పోవడంతో ఆమెను “ అలోపి” మాతగా
పూజిస్తారు.
మొదటగా త్రివేణిసంగమంలో పుణ్యస్నానలాచరించి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ నుండి బయలుదేరి బడే హనుమాన్ మందిరము నకు వెళ్ళాము. హనుమాన్జీ నిద్రిస్తున్న స్థితిలో నున్న ఏకైక ఆలయం ఇది.
ఆలయం లోపల శయన భంగిమలోన ఉన్న హనుమంతుని దక్షిణాభిముఖ విగ్రహం ఉన్న గర్భగుడి.
మరియు సగభాగం నీటిలో మునిగి ఉండును. తల ఉత్తరాభిముఖుడై పాదములు దక్షిణవైపుగా తొమ్మిది అడుగుల వెడల్పులో ఉండును. వీరముద్ర ఆకారములో ఉండును. విశాలమైన తల, మోకాళ్ళ వరకూ చేతులు విశాలమైన వక్షఃస్థలము, తొడలు- మొత్తము మూడు అంతస్తులలో ఉండును స్వామి వారి విగ్రహము.
ఇక్కడ నుండి బయలుదేరి “ సీతామర్హి” కి వెళ్ళాము. సీతమ్మవారు ఇక్కడ దొరికిన ప్రదేశము.
జనకమహారాజు నాగలితో భూమిని దున్నుతుండగా లభించిన ప్రదేశము. ఈ జిల్లా. నేపాల్కు సరిహద్దులో ఉంది. చుట్టూ హలేశ్వర్ స్థాన్, జానకీమందిర్ కలవు. ఎంతో శోభాయమానంగా, చుట్టూ పచ్చని వాతావరణముతో చూపరులకు మంత్రముగ్దులను చేసే విధంగా ఆలయ సముదాయముకలవు.
సీతమ్మవారు తన అవతార పరిసమాప్తి అనగా భూగర్బంలోకి వెళ్ళిపోయిన ప్రదేశముగా కూడా ఇక్కడే.
ఇక్కడ తిరుగు ప్రయాణము వారణాసికి బయలుదేరాము. రాత్రి పది గంటలు దాటింది సత్రము చేరే సరికి.
————-
మరునాడు ఆదిదంపతులైన “ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము” ఎంతో కనుల పండుగగా, రమణీయంగా, శోభాయమానంగా జరిగింది.
అంబర చుంబిత మహా సంబరం..
అధ్బుతం పరమాధ్బుతం..: ఆనందం.. మహానందం
మహాదేవుడు అందరి మనస్సున కొలువైన క్షణమది..
భక్తుల మనోఫలకాలలో ఆ ఫాలనేత్రుని ; దివ్యరూపం రూపుదిద్దుకున్న క్షణమది..
మహారుద్రాభిషేకానికి .. ఆ రుద్ర స్వరూపుడు కైలాసగిరిన ..
ఆనందనర్తనం చేసిన అపురూప క్షణమది..
ప్రమదగణాలు ..మహాదేవుని దివ్యకళ్యాణాన్ని చూసి మురిసిన క్షణమది
మహాదేవుడు నీలకంఠునిగా..దిగివచ్చిన శుభలక్షణమది..
అధ్బుతం .. పరమాధ్బుతం..
ఆనందం.. మహదానందం
శ్రీశివపార్వతుల కళ్యాణంతో ఆధ్యాత్మిక నగరి వారణాసి పులకించిపోయింది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య ఆదిదంపతుల కళ్యాణం తో సత్రములో సరికొత్త శోభను సంతరించుకుంది. అశేష జనవాహిని కరతాళధ్వనుల మధ్య శ్రీశివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కల వారణాసి ఆదిశంకరులా నివాసస్థలము కూడా. ప్రణవభూమిగా కూడా
విరాజిల్లుతున్న నగరం.
పరమశివునికి ఎంతో ప్రీతికరమైన శంఖానాదంతో తొలిఅడుగు వేయడం ఆనవాయితీ. శంఖానాదంతో
మహాదేవుని కళ్యాణఘట్టం ప్రారంభమైంది. విశ్వకళాస్ఫూర్తి పరమేశ్వరుడు, ఆ నటరాజును స్తుతిస్తూ
భజనలు, కీర్తనలు మరియు పెక్కు సాంస్కృతిక కార్యక్రమాలు రసరమ్యంగా కొనసాగాయి.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఋత్విక్కులతో వేదమంత్రములతో దాదాపు. రెండు గంటల సేపు సభా
ప్రాంగణం హోరెత్తిపోయింది. భక్తులు ఉపిరి బిగియపట్టి హరహరమహాదేవ్ అని నినదిస్తుండగా నిరాటంకంగా. కొనసాగింది. ఒకవైపు వేదనాదం, మరొకవైపు ఢమరుకనాధంతో కొనసాగిన కళ్యాణఘట్టం రోమాంచితమైంది. అనేకగొంతులు శివపంచాక్షరీ పఠిస్తుండగా ప్రమధగణాలే కైలాసనాథుడిని
అర్చిస్తున్నట్టుగా అనిపిపించింది.
ప్రమదగణాలతో పరమశివుడు వెలసిన పరమపవిత్ర నగరం వారణాసి. ముక్కోటి దేవతలు దేవలోకమై మనందరి ముందు సాక్షాత్కరించిన భూకైలాలం వారణాసి. ఉఛ్వాస నిశ్వాసాలలో శివనామం ఉప్పొంగిన మహాసాగరమం.. వారణాసి.
ఇక శ్రీశివపార్వతుల కళ్యాణోత్సవ ఘట్టం అధ్బుతం.. మహాధ్బుతం. సాక్షాత్తు కైలాసమే అగు
వారణాసిలో “ మహాదేవుడు - శైలజాదేవి చేయందుకొనే కమనీయ క్షణాలని వర్ణిస్తూ ఆదిదంపతుల
కళ్యాణవిశేషాలని వివరిస్తూ సాగింది. సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైనా మన హైందవధర్మ
విశేషాలను చక్కగా ఋత్వికులు వివరించి ఈ కళ్యాణోత్సవానికి మరింత శోభను తెచ్చారు.
మరునాడు శ్రీసత్యనారాయణస్వామి వ్రతమును మేము బస చేసిన సత్రములోనే జరిగింది.
ప్రాముఖ్యత—— హిందూ మత విశ్వాసాల ప్రకారం సత్యనారాయణస్వామి వ్రతం వినడం, ఆచరించడం, చదవడం వలన ఆ ఇంటిలోన ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
ఆరోజు సాయంత్రం కార్తీకపౌర్ణమి కావున గంగాహారతి చూచుటకు ఘాట్లకు బయలుదేరాము.
ముందుగానే పడవలు బుకింగ్ లన్నీ చేశారు మా టూరిస్ట్ వాళ్ళు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
19-05-2025, 05:01 PM
(This post was last modified: 19-05-2025, 05:02 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
దీపాల వెలుగులో వారణాసి ధగధగలు——
స్వర్గం దిగివచ్చిందా అన్నట్లు కాశీలో వైభవంగా దేవ్దీపావళి ఇరవైరెండు లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగాయి ఘాట్స్ అన్నీ. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి దీపాల వెలుగులో, గంగాతీరంలో ఆకాశం నుండి స్వర్గం దిగి వచ్చిం దా అన్నట్లు కనిపించాయి. ఆరోజు ఒక్క కాశీలోనే ఇరవై
రెండు లక్షల దీపాలు వెలిగించారు. ఒక్క చంద్రవంక ఘాట్లోనే పన్నెండు లక్షల పైన దీపాలు వెలిగించారు.
వీటిలో లక్షదీపాలను ఆవుపేడతో తయారుచేశారు. పశ్చిమతీరంలోని ఘాట్స్లపై, తూర్పుతీరంలోని ఘాట్లపై దీపాలు వెలిగించారు. చెరువులు, కాశీసరస్సులు, గంగా- గోమతి ఒడ్డున ఉన్నఘాట్లలో లక్షలాదిగా దీపాలతో వెలిగిపోయాయి. ఇరవైరెండు లక్షల దీపాల కాంతితో కాశీ ప్రకాశవంతమైనది. అయోధ్య లోని రామాలయ రూపాన్ని కూడా తీర్చిదిద్దారు. పదకొండు వేల దీపాలతో
ఆకృతి చెక్కారు. ఈ రేజు దేవతలు కాశీలోకి దిగివస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాలయ దృశ్యం
చూపరులందరినీ ఆకర్షించేలా ఉంది.
కాశీలో అధ్బుతమైన దృశ్యం కనువిందు చేసింది. ఎనభైనాలుగు ఘాట్లపై ఇరవై రెండు లక్షలకు పైగా దీపాలు వెలిగించడంతో కాశీ స్వర్గాన్ని తలపింపజేసింది. కాశీలోకి అన్ని ఘాట్ల అందాలు హృదయాన్ని
ఆహ్లాదపరచాయి. భక్తుల రద్దీ అసామాన్యము. మెరిసే దీపాల వెలుగులో స్నానమాచరించే ఘాట్లు చాలా అందంగా కనబడినాయి. కాశీ ఘాట్లపై వెలుగుతున్న దీపాలను చూస్తుంటే నేలపై నక్షత్రాల రేకులు విప్పినటుల అనిపిస్తుంది. అంతే కాకండా దీపాలతో వెలిగే పురాతన ఆలయాలవైభవం కూడా మనకు కనబడుతుంది.
ఈ సారి దేవ్దీపావళి రోజున కాశీనుండి ప్రపంచం మొత్తానికి “ సనాతనీకులందరూ ఒకే వర్గం” అనే సందేశాన్ని అందించారు. ఎనభైనాలుగువఘాట్ల వద్ద జరిగే కార్యక్రమాల ధ్వారా ప్రపంచంలోని డెబ్బై దేశాల రాయబారుల ముందు ‘ ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ ‘ స్వావలంబన భారత్, ధృడభారత్ రూపాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమముతో యాత్ర ముగిసినది.
నేను యాత్ర గురించి రాసినది అణువంత—- రాయవలసింది. ఆకాశమంత.
చూసిన ప్రదేశాలు స్వల్పమే—- చూడవలసినవి ఎన్నో, ఎన్నెన్నో కలవు.
కాశీకి ఒకటి రెండు సార్లు వెళ్ళినంత మాత్రాన మనము అన్నీ చూడలేము. కనీసం అరడజను సార్లు వెళితే అప్పటికి మనము ఓ ముప్పైశాతం చూడగలము. చూసి తరించేవి, చూసి చూసి తరించేవి ఎన్నో ఎన్నెన్నో కలవు.
———————————శుభంభూయాత్——————————————————-
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
తులసీ దాసు
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన: పల్లా వెంకట రామారావు
'రామ చరిత మానస్' రచించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన రామభక్తుడు తులసీదాసు. ఈయన ఉత్తర భారత దేశంలో క్రీ. శ. 1532 సంవత్సరంలో ఆత్మారాం, హులసీ దేవి దంపతులకు జన్మించాడు. పుట్టగానే తులసి అని నామకరణం చేశారు. పుట్టుకతోనే దంతాలతో పుట్టాడు. అదికాక అందరిలాగా ఏడవలేదు. పైగా శారీరకంగా అధిక బరువుతో ఉన్నాడు.
ఈ లక్షణాలన్నిటిని గమనించిన చుట్టుపక్కల వారు, బంధువులు వీడు దయ్యం పిల్లాడని ఈసడించుకున్నారు. ఆత్మారాం కూడా అతని జాతకం చూసి ఇతడు ఒంటరి జీవితం గడుపుతాడు అని నిర్ణయించుకొని, ఎంతో వేదన చెంది, భార్యని ఒప్పించి, తులసీను మునియా అనే మహిళకు దత్తత ఇచ్చాడు.
తులసీ దూరమయ్యాడని తల్లి బాధతో కృంగి, కృషించి మరణించింది. కొన్నాళ్లకు పెంచిన తల్లి మునియా కూడా మరణించింది. అయినా సరే ఆత్మారాం కొడుకును దగ్గరకు తీయలేదు. కొన్నాళ్లకు ఆయన కూడా మరణించాడు.
ఇప్పుడు తులసీ పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. పదమూడు సంవత్సరాల వయసులో దిక్కు తోచక దేశద్రిమ్మరియై తిరుగుతున్న తులసిని నరహరి దాసు అనే ఒక సాధువు గమనించి దగ్గరకు తీసి, తండ్రిలా ఆదరించి, తన వెంటే దేశ సంచారం చేయించాడు.
అతడు రామనామ జపం చేయిస్తూ తులసి కి 'రామ్ బోలా' అనే పేరు పెట్టాడు. అతనికి శిష్యరికం చేశాడు కాబట్టి తులసి పేరుకు దాసు కూడా చేరింది. కొన్నాళ్ళకి కాశీ చేరుకుని అక్కడ 'శేష సనాతన' అనే గురువు వద్ద తులసికి విద్యాబుద్ధులు చెప్పించాడు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సంపూర్ణంగా అభ్యసించాడు తులసీదాసు.
కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురువు శేష సనాతన్ ఆజ్ఞ వల్ల గృహస్థ జీవితము స్వీకరించడానికి నరహరిదాసు వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు తులసి. గ్రామానికి వచ్చిన తులసికి ఇళ్లయితే ఉంది కానీ అందులో ఎవరూ లేరు. ఒంటరి జీవితమే గడపాల్సి ఉంది. ఇది గమనించిన ఒక గ్రామస్తుడు దీనబంధుడనే ఒక గృహస్తు కుమార్తె రత్నావళితో పెళ్లి సంబంధం మాట్లాడాడు. పెళ్లి జరిగింది. దాంతో తులసీదాసు ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు. ఇప్పుడు అతనికి రత్నావళే లోకం. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు.
ఒకరోజు రత్నావళి దగ్గరికి వారి పుట్టింటి నుండి పనివాడు వచ్చాడు. ఇంట్లో ఏదో శుభకార్యం చేస్తున్నారని రత్నావళిని తీసుకుని రమ్మన్నారని చెప్పాడు. అప్పుడు తులసీదాసు ఇంటిలో లేడు. ఆయనకు విషయం చెప్పనిది తాను రాలేనని రత్నావళి అంది. అయితే ఆయనకు సమాచారం ఇవ్వమని పక్కింటి వారికి చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు పనివాడు. తులసీదాసు వచ్చిన తర్వాత విషయం చెప్పారు పక్కింటి వారు.
దాంతో తులసీదాసు స్థిమితంగా ఉండలేకపోయాడు. విరహం భరించలేక మామ గారి ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పుడు జడివాన కురుస్తోంది. అయినా లెక్క చేయకుండా నది తీరానికి వచ్చాడు. పడవ వాడు వరద వచ్చేటట్టుగా ఉందనీ ఈ జోరు వానలో పడవ నడపలేను అని చెప్పాడు. అయినా తులసీదాసు ఆగలేదు. నదిలో దూకి ఈదడం మొదలుపెట్టాడు. తర్వాత చేతికి ఏదో తగలగా దానిపైన ఎక్కి నదిని దాటాడు. నది దాటిన తర్వాత చూస్తే అది ఒక శవం. దాన్ని ఆసరా చేసుకుని ఇంతసేపు నదిలో ఈదాడు.
తర్వాత భార్య ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. ఆ జోరు వానలో అతని పిలుపులు ఎవరికి వినిపించలేదు. దాంతో అతను చుట్టూ తిరిగి గోడ ఎక్కడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో చెట్టు మీదుగా ఒక తాడు లాంటిది వేలాడుతూ కనిపించింది. దాన్ని పట్టుకుని గోడ అవతలికి దూకాడు. తర్వాత చూస్తే అది ఒక పాము.
అతని రాక రత్నావళిని ఆశ్చర్యపరిచింది. ఇంత మోహావేశం పనికిరాదంటూ ఆమె అతనికి జీవిత పరమార్థాన్ని బోధించింది. తనపై ఇంత ప్రేమానురాగాలు చూపే బదులు శ్రీరాముని పైన భక్తి చూపితే ఇహపరాల్లో ఉన్నత స్థానానికి చేరగలవని బోధించింది. ఆ బోధనలు సూటిగా తులసీదాసు హృదయాన్ని చేరాయి. దాంతో తులసి కి జీవిత పరమార్ధం ఏమిటో అర్థం అయింది.
అప్పటినుంచి ఆయన శ్రీరాముని సేవే తన జీవిత లక్ష్యంగా భావించాడు. శ్రీరాముని కీర్తనలు గానం చేస్తూ ఊరూరు తిరగ సాగాడు. ఆ సమయంలోనే అతనికి హనుమంతుని సాక్షాత్కారం లభించిందని చెబుతారు. శ్రీరాముడు కూడా దర్శనమిచ్చాడని అంటారు.
అలా భారతదేశం మొత్తం తిరిగి దక్షిణాదిన రామేశ్వరం వరకు కూడా పర్యటించాడు. కంబర్ రామాయణం, ఏకనాథుని రామాయణం, మలయాళ రామాయణం ఇలా ఎన్నో రామాయణాలను పఠించాడు. తర్వాత రామచరిత మానస్ ను రచించి అజరామర కీర్తిని పొందాడు తులసీదాసు.
సమాప్తం
[font=var(--ricos-font-family,unset)] [/font]
[font=var(--ricos-font-family,unset)] [/font]
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
భానుమతి - అహంయాతి
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
యాదవ వంశంలో ఒక శాఖ హైహయ వంశం.
హైహయ వంశం అనగానే హయగ్రీవ స్వామి గుర్తుకు వస్తాడు.
"జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిం !
ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే!!"
అన్న మంత్రం మెదడును పదును పెడుతుంది. ఆలోచనలను విజ్ఞానవంతం చేస్తుంది. పవిత్ర సూర్య కిరణాల తేజస్సున హయగ్రీవ తేజస్సు వేద సంరక్షక తేజస్సులా దర్శనం ఇస్తుంది. సదాలోచనలు హయంలా పరుగులు తీస్తాయి. అలాంటి మహోన్నతమైన సూర్య తేజం హైహయ వంశానికి బీజం అయ్యింది.
ఒకనాడు నక్షత్రాలు అన్నీ శుభ ఫలితాలను ఇచ్చే ప్రదేశంలో ఉన్న వేళ సూర్య నారాయణుడు ప్రకాశ వంతమైన రేవంతుని రూపంలో వైకుంఠానికి పయన మయ్యాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న రేవంతుని చూసిన దేవతలందరూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రేవంతుని నుండి ఉదయించే తేజోవంతమైన కిరణాలు ఏడు తలలతో ఎగిరే గుర్రం ఉచ్చైశ్రవం లా ఉన్నాయి.
గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లుగల సప్తాశ్వాల కిరణాలు సప్త చంధస్సులు గా మారి శృతిలయలతో రాగయుక్తంగా సంచరిస్తున్నాయి. పవిత్రమైన నవ భావ జాలాన్ని గణ బద్దం చేసి వేద మంత్రాలు గ మలుస్తున్నాయి.
వికుంఠ అనే మాతృమూర్తికి జన్మించిన పుత్రుడు దేవతల కోసం, తన కోసం వైకుంఠాన్ని నిర్మించాడు. పాల సంద్ర వైకుంఠ గోడలు ఇంకా గట్టి పడలేదు. వాటిని గట్టి పరచడానికే శ్రీ సూర్య నారాయణుడు రేవంత తేజంతో అక్కడకు వచ్చాడు.
శ్రీ సూర్య నారాయణ కిరణ తేజస్సు తో వైకుంఠ గోడలు తదితరాలు బాగా ఎండి బంగారు వర్ణం తో కళకళలాడ సాగాయి. బంగారు గోడల వైకుంఠం లో పాల సంద్రం. ఆ సంద్రంలో ఆది శేషుని శయన స్వరూపం. భాను తేజం. నూతన వైకుంఠం. వర్ణనలకు అందని వైకుంఠ నారాయణ తేజో స్వరూపం.
వికుంఠ కుమారుడు వైకుంఠుడనే పేర వైకుంఠం లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవతలందరూ వైకుంఠ నారాయణుని పలు రీతులలో స్తుతించారు. వైకుంఠ నారాయణుని వైకుంఠం చూసి నానా విధ స్తుతులతో వైకుంఠం ను ప్రశంసించారు. అది చూసిన శ్రీ సూర్య నారాయణుడు తాను వచ్చిన పని పూర్తయ్యిందని సంతోషించాడు.
వైకుంఠుని ధర్మపత్ని శ్రీ మహా లక్ష్మీదేవి. శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో మరికొంత కాలం ఉంటే తన లక్ష్మీ కళ మరింత యశసిస్తుంది అని అనుకుంది. అది గమనించిన వైకుంఠ నారాయణుడు శ్రీమహాలక్ష్మి ని కొంత కాలం భూమి మీద నివసించి, శ్రీ సూర్య నారాయణ తేజస్సు లో తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. వైకుంఠ నారాయణుని సలహా శ్రీ మహా లక్ష్మి కి బాగా నచ్చింది.
"ఆహా! భూలోక వాసులు ఎంత అదృష్టవంతులు. శ్రీ సూర్య నారాయణ తేజస్సున సమస్త రోగాలను పోగొట్టుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. చక్కని కళలతో ప్రకాశిస్తున్నారు." అని శ్రీ మహా లక్ష్మి మనసులో అనుకుంది.
శ్రీ మహాలక్ష్మి, వైకుంఠ నారాయణుడు అయిన విష్ణుమూర్తి సలహా తో భూలోకానికి వచ్చింది. తమసా కాళిందీ నదుల సంగమ స్థలంలో నిలబడింది. ఆమెకు తన తండ్రి సాగరుడు గుర్తుకు వచ్చాడు. అలాగే సమద్రంలో ఉన్న బడబానలం గుర్తుకు వచ్చింది. అంత బడబ అనే పేరు గల ఆడ గుర్రం రూపంలో తపస్సు చేయసాగింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కొంత కాలం తర్వాత మహా శివుని కోరిక మేరకు విష్ణుమూర్తి అశ్వ రూపంలో బడబ ను కలిసాడు. బడబ తపస్సు ఉన్నత స్థాయికి చేరింది అనుకున్నాడు.
ప్రకృతి పరవశించింది. కొండకోనలు ప్రశాంతంగా ఉన్నాయి. పర్ణశాల ల్లో లేళ్ళు కుందేళ్ళు చెంగు చెంగున ఎగిరెగిరి గంతులు వేస్తున్నాయి. రతీమన్మథులు రస విహారం చేస్తున్నారు. అశ్వ రూపంలో ఉన్న విష్ణు మూర్తి, బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ని చూసాడు.
ఒక శుభ ముహూర్తాన లక్ష్మీ దేవికి విష్ణు మూర్తి కి ఒక దివ్య మగ శిశువు జన్మించాడు. భూమి మీద జన్మించిన ఆ దివ్య శిశువు భూమి మీద జీవిస్తేనే బాగుంటుంది అని బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి అంది. ఆ దివ్య శిశువు ను పెంచగల పుణ్యాత్ముడు ఎవరు? అని విష్ణుమూర్తి ఆలోచించాడు. అతనికి యదు మహారాజు గుర్తుకు వచ్చాడు.
విష్ణుమూర్తి ఆ శిశువు ను సంతానం కోసం తపస్సు చేస్తున్న యయాతి మహారాజు కుమారుడు యదు మహారాజు కు ఇచ్చాడు. అంత విష్ణు మూర్తి " యదు మహారాజ! నీ తండ్రి యయాతి మహారాజు ఆవేశంలో యాదవులకు రాజ్యార్హత లేదు అని శపించాడు. సృష్టి లో లోక కల్యాణం కొరకు ఇచ్చే శాపాలు జరుగుతాయి కానీ స్వార్థం కోసం ఇచ్చే శాపాలు జరగవు. ఎందరెందరో యాదవ మహా రాజులను కాల చక్రం చూస్తుంది." అని విష్ణుమూర్తి యదు మహారాజు ను ఆశీర్వదించాడు.
యదు మహారాజు ఆ మగ శిశువు కు జాతకాదుల ను చూపించి ఏకవీరుడు అని పేరు పెట్టాడు. ఏకవీరుని కొందరు హైహయుడు అని కూడా అంటారు.
హైహయుని కుమారుడే కృతవీర్యుడు. ఇతని భార్య పద్మిని. పద్మినీ కృతవీర్యులకు పుట్టిన కుమార్తె భానుమతి.
కృతవీర్యుని భార్య పద్మిని దత్తాత్రేయ స్వామి భక్తురాలు. దత్తాత్రేయ స్వామి ని పూజించని దే ముద్ద కూడా ముట్టదు. భానుమతి కి కూడా భక్తి విషయంలో తల్లి పోలికలే వచ్చాయి. " ఓం నమో దత్తాత్రేయాయ" అని భానుమతి అష్టాక్షరీ మంత్రాన్ని అను నిత్యం జపిస్తుంది.
పద్మిని కి చాలా కాలం వరకు సంతానం కలగ లేదు. అప్పుడు పద్మిని అత్రి మహర్షి భార్య అనసూయ దేవిని కలిసి పుత్ర సంతానం కలిగే మార్గాన్ని చెప్పమని ప్రార్థించింది. పద్మిని ప్రార్థనకు చలించిన అనసూయ, మంచి పుత్రుడు పుట్టేందుకు తపస్సు చేయవలసిన పంచమి, సప్తమి, నవమి, ఏకాదశి వంటి తిథుల గురించి సవివరంగా చెప్పింది.
పద్మిని, అనసూయ చెప్పిన రీతిన తన భర్త కృతవీర్యుని తో కలిసి తపస్సు చేసింది. వారి తపస్సు మహా జ్ఞాన వంతంగా మారింది. వారి తపస్సు కు మెచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.
దత్తాత్రేయ స్వామి తో కృతవీర్యుడు, " స్వామి నువ్వు తప్ప మరెవరూ ఓడించలేని, సమస్త ప్రపంచాన్ని పాలించే కొడుకు మాకు కావాలి. " అని అన్నాడు.
దత్తాత్రేయ స్వామి కృతవీర్యుని కోరికను విని చిన్నగా నవ్వుకున్నాడు. "ఈ భూమి మీద జన్మించిన సురులవైన, నరులవైన, అసురులవైన మరెవరివైన కోరికలు మాత్రం మహా విచిత్రం గా ఉంటాయి." అని మనసులో అనుకున్నాడు. అనంతరం కృతవీర్యుని
కోరికను మన్నించి " తథాస్తు" అన్నాడు.
కొంత కాలానికి పద్మిని పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువుకు వేయి చేతులు ఉన్నాయి. ఆ శిశువును చూసి, అందరూ ఈ శిశువు కారణ జన్ముడు అని అనుకున్నారు.
కృతవీర్యుడు మగ శిశువు కు కార్తవీర్యార్జునుడు అని పేరు పెట్టాడు. ఇతనికి వేయి చేతులు ఉండటం చేత ఇతనిని సహస్ర బాహు అర్జునుడు అని కూడ అనేవారు. ఆపై పద్మిని మరి కొంత మంది మగ సంతానానికి జన్మనిచ్చింది. ఆపై భానుమతి కి జన్మనిచ్చింది.
పద్మినీ కృతవీర్యుల సంతానంలో చదువు సంధ్యలలో తదితర విషయాల్లో కార్తవీర్యార్జునుడు, భానుమతి మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నారు.
భానుమతి అనునిత్యం సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించేది. వారి కరుణాకటాక్ష వీక్షణలకై అనుక్షణం తపించేది.
తమ వంశ మూల తేజంలో శ్రీ సూర్య నారాయణ ప్రస్తావన కూడా ఉందని తెలుసుకున్న పద్మిని తన కుమార్తె భానుమతి సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించడం చూసి మహా మురిసిపోయేది.
కుమార్తె పూజకు తను అందించగలిగినంత సహాయం అందించేది. త్రివర్ణ పుష్పాలను, త్రిముఖ పుష్పాలను భానుమతి పూజ కోసం పద్మిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది.
సూర్య భగవానుని కృప భానుమతి ని మహోన్నత తేజస్విని చేసింది. మహా తేజస్విని అయిన భానుమతి తన తండ్రి కృతవీర్యుడు దత్తాత్రేయ స్వామి ని సంతానం నిమిత్తం కోరిన కోరికను తల్లి పద్మిని ద్వారా తెలుసుకుంది.
అంత తల్లి పద్మిని తో భానుమతి "భగవంతుని అనుగ్రహం అందరికి లభించదు. అది లభించిందంటే వారు మహా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఇక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంటే త్రిమూర్తుల అనుగ్రహం లభించింది అనే అర్థం. భగవంతుని భక్తులు ఇల పై మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకునే సంతానం కావాలని కోరుకోవాలి గానీ నా సంతానానికి మరణం ఉండరాదని లేదా అందరిని చంపే సంతానం కావలని ఇలా గొంతెమ్మ కోరికలు కోరుకోరాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తిని సవినయంగా స్వీకరించాలి. ఆ శక్తితో సాధ్యమైనంతగా లోకానికి మేలు చేయాలి. " అని అంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పద్మిని తన కుమార్తె భానుమతి సదాలోచనలను విని మహదానందపడింది.
శ్రీ సూర్య నారాయణ తేజస్సు తో, దత్తాత్రేయ స్వామి దరహాసం తో ప్రకాశించే భానుమతి ని చూడగానే కొంతమంది ప్రజల చర్మ వ్యాధులు మటుమాయం అయ్యేవి. మరి కొందరి మంద బుద్ధి నశించేది. ఇంకొందరి శారీరక శక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది.
వరాంగి సంయాతి ల పుత్రుడు అహంయాతి.
వశిష్ట మహర్షి దగ్గర అహంయాతి సమస్త విద్యలను అభ్యసించాడు. సమరంలో తనకు తానే సాటి అన్నంత పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నాడు. అహంయాతి తన కండ బలం తో కొండలను పిండి చేయగలడు అని పుర ప్రజలందరూ అనుకునేవారు. అయితే అహంయాతి తలిదండ్రుల వద్ద వినయ విధేయతలను ప్రదర్శించేవాడు కానీ పరుల దగ్గర మాత్రం కొంచెం అహంకారాన్ని ప్రదర్శించేవాడు. తను కాబోయే రాజును అన్న అహంకారం అహంయాతి లో ఉండేది.
కుమారుడు అహంయాతి తత్వాన్ని పసిగట్టిన వరాంగి కుమారుని పై బాధ్యత పెరిగితే గానీ ఆ అహం కారం తగ్గదనే భావనకు వచ్చింది. అదే విషయాన్ని కుల గురువు వశిష్ట మహర్షి కి చెప్పింది.
వశిష్ట మహర్షి కి వరాంగి సూచన బాగా నచ్చింది.
వశిష్ట మహర్షి అహంయాతి ని పిలిచి యజ్ఞ శాలలను సంరక్షించే బాధ్యత ను అహంయాతి కి అప్పగించాడు.
అహంయాతి కుల గురువు వశిష్ట మహర్షి మాటలను కాదనలేక యజ్ఞ సంరక్షణ బాధ్యత లను స్వీకరించాడు.
వశిష్టాది మహర్షుల మీద ఉన్న గౌరవంతో తన బాధ్యత లను సక్రమంగా నిర్వహించాడు.
అహంయాతి యజ్ఞ సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తూ, ఋషుల, మహర్షుల ప్రవర్తనా సరళిని గమనించసాగాడు. వారి ఆద్యాత్మిక ప్రసంగాల వలన, వారి శాంతియుత ఆలోచనల వలన అహంయాతి లో ఉన్న అహం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోసాగింది.
కర్కోటక నాగుడనే నాగ జాతికి చెందిన రాజు కృతవీర్యుని సంపదను చూసి సహించలేక కృతవీర్యుని మీద యుద్దం ప్రకటించాడు. కృతవీర్యుని, అతని సోదరులను, పుత్రులను సమస్తం మట్టు పెట్టాలనే నిర్ణయానికి కర్కోటక నాగుడు వచ్చాడు. కాలకూట విషంతో కూడిన అస్త్రాలను కృతవీర్యుని మీద, కార్తవీర్యార్జునుడు మీద ప్రయోగించాలని కర్కోటక నాగుడు నిశ్చయించుకున్నాడు. కాలకూట అస్త్రాలను అనేకం తయారు చేయించాడు.
ఇది తెలిసిన భానుమతి సూర్య భగవానుని అనుగ్రహం తో సూర్య కిరణ అస్త్రాలను తయారు చేసింది. ఆ అస్త్రాలను ప్రయోగించే రీతి పది మందికి నేర్పింది. వాటిని సమరంలో కర్కోటక నాగుని సైన్యం మీద ప్రయోగించింది.
భానుమతి ప్రయోగిస్తూ, ప్రయోగింప చేసే సూర్య కిరణ అస్త్రాలకు, కార్తవీర్యార్జునుడు ఒకేసారి వేయి చేతులతో ప్రయోగించే అస్త్రాల ధాటికి కర్కోటక నాగుని సైన్యం తట్టుకోలేక పోయింది. అయినప్పటికి పట్టిన పట్టును వదలకుండా కర్కోటక నాగుడు అధర్మ యుద్దం లో కృత వీర్యుని బంధు వర్గం సమస్తాన్ని, కృతవీర్యుడే ప్రాణం అనుకునే సైన్యాన్ని ఎక్కడికక్కడ సంహరించాలనే దృఢ నిర్ణయం తో రాక్షస యుద్దం చేయసాగాడు.
వరాంగి సంయాతి లకు వశిష్ట మహర్షి ద్వారా కర్కోటక నాగుని అధర్మ రాక్షస యుద్దం గురించి తెలిసింది. వెంటనే కృతవీర్యునికి, కార్తవీర్యార్జునునికి యుద్దంలో సహాయపడమని అహంయాతి ని పంపారు.
అహంయాతి మహా సైన్యం తో ఆహవ రంగాన కాలు పెట్టాడు అహంయాతి సైన్యం కర్కోటక నాగుని సైన్యం ను ఊచకోత కోయడం చూచిన కృతవీర్యుడు రథంలో నుండే అహంయాతి కి నమస్కరించాడు. అహంయాతి ని చూచిన భానుమతి, కార్తవీర్యార్జునులు కూడా అహంయాతి కి కృతజ్ఞతా భావంతో నమస్కరించారు. అహంయాతి సమర కౌశల్యాన్ని చూసిన కర్కోటక నాగుడు సమరంలో తనకు ఇక అపజయం తప్పదు అనుకున్నాడు.
కర్కోటక నాగునికి కార్తవీర్యార్జునునికి జరిగిన భయంకర యుద్ధంలో కర్కోటక నాగుడు మరణించాడు. ఆతని మహిష్మతి పట్టణం కార్తవీర్యార్జునుని వశం అయ్యింది.
సమర అనంతరం వరాంగి బంధు వర్గం, కృతవీర్యుని బంధు వర్గం విందు వినోదాలలో మునిగి తేలారు. ఆ విందు వినోదాలలోనే భానుమతి అహంయాతి ల అంగీకారం తో వారిద్దరికి వివాహం చేయాలని ఇరు వర్గాల పెద్దలు అనుకున్నారు.
వరాంగి సంయాతి లు అహంయాతి కి ముందుగా పట్టాభిషేకం చేసారు. ఆ పట్టాభిషేకానికి భానుమతి బంధువర్గం సమస్తం వచ్చింది.
భానుమతి అహంయాతి లు ఒంటరిగా కలుసుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మనల్ని ఆవహించిన రతీమన్మథులు మన చెప్పు చేతల్లో ఉండాలి కానీ వారి చెప్పు చేతల్లోకి మనం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా అతి సర్వత్ర వర్జయేత్ అనుకున్నారు.
ఋషులు, మహర్షులు, రాజర్షులు, జ్యోతిష్య పండితులు రెండు రాజ కుటుంబాల మాటలను అనుసరించి భానుమతి అహంయాతి ల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ శుభ ముహూర్తాన భానుమతి అహంయాతి ల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఆ వేడుకకు అనేక దేశాల రాజులు, సామంతులు, తదితరులందరూ వచ్చారు. వశిష్ట మహర్షి, గర్గ మహర్షి వంటి మహర్షులు వధూవరులతో అనేకానేక పరిణయ యాగాలు చేయించారు.
భానుమతి వివాహం జరిగిన కొద్దిరోజులకే అనారోగ్య కారణంగా కృతవీర్యుడు మరణించాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కృతవీర్యుని సోదరులు కొందరు పెద్దల సహాయంతో కృతవీర్యుని రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూసారు. అయితే రాజ్యంలోని ఎక్కువమంది పెద్దలు వారికి సహకరించ లేదు. కృతవీర్యుని రాజ్యం అతని సంతానానికి చెందడమే ధర్మం అన్నారు.
కొందరు మహర్షులు, పుర పెద్దలు అల్లుడు అహంయాతి ని రాజును చేయమన్నారు. కార్తవీర్యార్జునుడు అతని సోదరులు కూడా అహంయాతి నే రాజును చెయ్యమన్నారు.
అహంయాతి తన ధర్మపత్ని భానుమతి తో సంప్రదించి "విస్తృతమైన నా సామ్రాజ్య సంరక్షణా బాధ్యత నాకుంది. కాబట్టి మహిష్మతీ ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు పరిపాలన చేస్తేనే బాగుంటుంది " అని అన్నాడు.
భానుమతి తన భర్త మాటలే తన మాటలు అని అంది.
గర్గ మహర్షి, వశిష్ట మహర్షులు భానుమతి మాటలకే తమ మద్దతును ప్రకటించారు. అయితే కార్తవీర్యార్జునుడు ముందుగ రాజ పదవిని నిరాకరించాడు. " ప్రజలందరికి మేలు చేయని రాజు అసలు రాజే కాదు. రాజ్యం లోని ప్రజలందరికి న్యాయం చేయగలను అనే నమ్మకం నాకు లేదు. " అని కార్తవీర్యార్జునుడు బంధువులతో, మహర్షులతో, పుర పెద్దలతో, భానుమతి తో అన్నాడు.
సోదరుని మాటలను విన్న భానుమతి దత్తాత్రేయ స్వామి ని ప్రసన్నం చేసుకుంది. సోదరుడైన కార్తవీర్యార్జునుని ఆలోచనా సరళిని మార్చమని దత్తాత్రేయ స్వామి ని వేడుకుంది.
దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుని మనసు మార్చి అతనికి సుపరిపాలన కు ఉపయోగ పడే ఎనిమిది వరాలను ఇచ్చాడు.
ఎనిమిది వరాలు లభించగానే కార్తవీర్యార్జునునికి తన మీద తనకు కొంచెం నమ్మకం కలిగింది. కార్తవీర్యార్జునుని నమ్మకాన్ని భానుమతి ద్విగుణీకృతం, త్రిగుణీకృతం చేసింది.
కార్తవీర్యార్జునుడు మహిష్మతి కి రాజయ్యాడు.
గర్గ మహర్షి, భానుమతి సుపరిపాలనను ప్రజలకు అందించవలసిన తీరును కార్తవీర్యార్జునునికి తెలిపారు. కార్తవీర్యార్జునుడు గర్గ మహర్షి, భానుమతి లు చెప్పినట్లు కొంత కాలం నడుచుకున్నాడు. అటు పిమ్మట తన స్వంత నిర్ణయాల తో రాజ్య పరిపాలన చేయసాగాడు.
కార్తవీర్యార్జునుని సుపరిపాలన చూసి గర్గ మహర్షి, భానుమతి, అహంయాతులు మిక్కిలి సంతోషించారు.
భానుమతి మాటలను అనుసరించి అహంయాతి, కార్తవీర్యార్జునుడు దుర్మార్గులైన అనేకమంది రాజులను ఓడించారు.
తన భర్త, తన సోదరుడు చేసే యుద్ధాలకు భానుమతి అనేక సూర్య కిరణ అస్త్రాలను తయారు చేయించి ఇచ్చింది.
కార్తవీర్యార్జునుడు, అహంయాతి దురితులైన రాజులను సంహరించి, ఆయా రాజ్య ప్రజలను దుర్మార్గులైన రాజుల నుండి సంరక్షించారు. అందుకు ఆ రాజ్య ప్రజలు మిక్కిలి సంతోషించారు. ఆపై ఆయా రాజ్య ప్రజల నుండి వారికి వద్దన్నా సువర్ణం వచ్చి పడింది.
భానుమతి తమకు సంక్రమించిన సువర్ణం లో అధిక శాతం నిరుపేదలకు దానం చేసింది. ఆపై సువర్ణ యజ్ఞ శాలలను నిర్మింప చేసింది. ఆ సువర్ణ యజ్ఞ శాల ల్లో భానుమతి మాటలను అనుసరించి, అహంయాతి సహాయంతో కార్తవీర్యార్జునుడు 700 యజ్ఞాలు చేసాడు.
కార్తవీర్యార్జునుడు చేసిన ధర్మ బద్ధమైన యజ్ఞాలను చూసి మిక్కిలి సంతసించిన దత్తాత్రేయ స్వామి భానుమతి అహంయాతి కార్తవీర్యార్జునులకు ఎగిరే రథాన్ని బహుకరించాడు. ఆ రథంలో ముగ్గురు ఆనందంగా విహరించారు.
భానుమతి అహంయాతి ల సుపుత్రుడు సార్వ భౌముడు.
శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సునంద
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కేకయ మహారాజు సునందకుని ముద్దుల కుమార్తె సునంద. చదువు సంధ్యలలో, అందచందములలో సునందకు సాటి సునందయే అని ఆమెను చూసిన వారంతా అనుకుంటారు. ఆమె అందాన్ని చూసి అప్సరసలు కుళ్ళు కుంటారు. దేవతలు సునంద అందంలో సుర కళ దాగి ఉంది అనుకుంటారు. సునంద ఎక్కడ ఉంటే అక్కడ అందమైన ఆహ్లాదం సుందరంగా నర్తిస్తుందని కొందరు అంటారు.
అందం ఉన్నచోట మానవత్వం ఉండదు. మానవత్వం ఉన్నచోట అందం ఉండదు. అందం అహంభావాన్ని తెచ్చి పెడుతుంది అని అనుకునేవారు సునందను చూసాక వారి అభిప్రాయాలను మార్చుకుంటారు. అందం మానవత్వం సశాస్త్రీయ విజ్ఞానం కలబోసిన సురసుమకళిక సునంద అని ఆమె గురించి తెలిసినవారంతా అనుకుంటారు.
కేకయ రాజు, సునందకు వేద పురాణేతిహాసాల తో పాటు క్షత్రియోచిత విద్యలను కూడ నేర్పాడు. రాజుల వలే కత్తి తిప్పడం, ధనుస్సు ను ప్రయోగించడం, గదను పట్టడం, సుదర్శన చక్రాల్లాంటి చక్రాలను ప్రయోగించడం, త్రిశూల ప్రయోగం వంటి విద్యలలోనూ, అశ్వం మీదన ఉండి యుద్దం చేయడం, గజం మీదన ఉండి యుద్దం చేయడం, రథం మీదన ఉండి యుద్దం చేయడం, భూమి మీదన ఉండి యుద్దం చేయడం వంటి వివిధ యుద్దాలలో సునంద మంచి ప్రావీణ్యం పొందింది. ముఖ్యంగా సునంద ఎగిరే ఏడు తలల గుర్రం మీదన ఉండి, గరుత్మంతుని మీదన ఉండి యుద్దం చేసిందంటే విజయ లక్ష్మి ఆమెను వరించినట్లే అని ఆనాటి వీరులు అనుకునేవారు.
కేకయ రాజ వంశంలో పుట్టిన కైక లా అనేకానేక దేవాసురుల సమరంలో సునంద దేవతల తరుపున తండ్రితో కలిసి పోరాడటానికి సమర రంగంలో కాలు పెట్టింది. పలు అస్త్ర శస్త్రాలతో యుద్దం చేసింది. ఎగిరే ఏడు తలల గుర్రం మీదన, ఎగిరే రథం మీదన ఉండి యుద్దం చేసి, విజయ పతాకం ఎగర వేసింది. రారాజు లలో తన తండ్రిని ఉన్నత పథాన నిలబెట్టింది. కేకయ రాజ్యం మీదకు యుద్ధం అంటే తన శత్రువులు భయపడేటట్లు చేసింది.
కేకేయ రాజు, కుమార్తె సునంద సహాయ సహకారాలతో గాంధార రాజ్యాన్ని జయించాడు. ఇంకా అనేకమంది దుర్మార్గ భావనలు ఉన్న రాజులను ఓడించాడు.
సునంద కేకయ రాజ్యాన్ని ఆనుకుని ప్రవహించే సుధామ నదిని పరిశుభ్రం చేయించింది. సుధామ నది నీళ్ళు కేకయ రాజ్యంలోని పల్లెటూర్లకు ప్రవహించేటట్లు చేసింది. ప్రతి పల్లెటూరు కు పుష్కలంగా మంచి నీళ్ళు అందేలా చూసింది.
సునంద కృషి ఫలితంగా కేకయ రాజ్యం పాడిపంటలతో కళకళలాడ సాగింది. వ్యవససాయ దారులకు నీరు పుష్కలంగా లభించడంతో ఆయా కాలాల్లో వేయవలసిన పంటలను వేసారు. అన్ని రకాల పంటలను పుష్కలంగా పండించసాగారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సునంద కాలంలో కేకయ రాజ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో ప్రకాశించింది.
సునంద సరోవర తీరాన చక్కని పర్ణ శాలను నిర్మించుకుని అంతఃపురంలో కంటే అక్కడే ఎక్కువ గా ఉండసాగింది. భానుమతి అహంయాతి ల పుత్రుడు సార్వ భౌముడు తన పట్టాభిషేకం జరిగిన అనంతరం వివిధ రాజ్యాల రాజుల ఆహ్వానాల మేర ఆయా రాజ్యాలకు వెళ్ళాడు. ఆయా ప్రాంతాల రాజులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
సార్వ భౌముడు ఆతిథ్యాన్ని స్వీకరించే ముందు, రాజు స్వీకరించే ప్రతి పదార్థమును అతని అనుచరులు నలుగురు స్వీకరించేవారు. కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఈ పని జరుగుతుంది అని సార్వ భౌముడు ఆయా రాజులకు చెప్పేవాడు.
సార్వ భౌముని మాటలను విన్న ఆయా రాజులు కుల గురువు వశిష్ట మహర్షి ముందు చూపు అమోఘం అని అనుకునేవారు. అలా సార్వ భౌముడు అనేక మిత్ర రాజ్యాల ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
అలా సార్వ భౌముడు కేకయ రాజ్యానికి వచ్చాడు. కేకయ రాజు, సార్వ భౌముని తగిన రీతిలో సత్కరించాడు. సార్వ భౌమునికి పెట్టిన ఆహారం ముందుగా అతని అనుచరులు రుచి చూసారు.
దానికి గల కారణాలను సార్వ భౌముడు కేకయ రాజుకి వివరించాడు. సునందకు సార్వ భౌముడు చెప్పిన కారణాలు నచ్చలేదు. అయినప్పటికి యింటికి వచ్చిన అతిథిని గౌరవించాలని మౌనంగా ఉండి పోయింది. సార్వ భౌముని తో ముక్త సరిగా మాట్లాడిన సునంద తన పర్ణశాలకు వెళ్ళిపోయింది.
పది రోజుల పాటు తమ ఆతిథ్యం స్వీకరించమని కేకయ రాజు సార్వ భౌముని ప్రార్థించాడు. సార్వ భౌముడు అందుకు అంగీకరించాడు.
సార్వ భౌముడు కేకయ రాజ్యాన్ని పరిశీలించాడు. అక్కడి సిరిసంపదలను చూసి కేకయ రాజును ప్రశంసించాడు. అక్కడి వ్యవసాయాభివృద్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం లో తాము అంత అభివృద్ధి చెందడానికి తమ యువరాణి సునందయే కారణమని రైతులందరూ సార్వ భౌమునికి ముక్త కంఠంతో చెప్పారు. సార్వ భౌముడు అక్కడి చిరు ధాన్యాలు అన్నిటినీ పరిశీలిస్తూ, సునంద పర్ణశాలకు వెళ్ళాడు. అక్కడి వాతావరణం సార్వ భౌమునికి బాగా నచ్చింది. సునంద సార్వ భౌమునికి స్వాగతం పలికింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పర్ణశాలలోని రకరకాల పళ్ళను పక్షులు రుచి చూసాక వాటిని సునంద సార్వ భౌమునికి ఇచ్చింది. సునంద ఇచ్చిన పళ్ళన్నిటిని సార్వ భౌముడు మనఃపూర్వకముగా ఆరగించాడు. సార్వ భౌముడు రకరకాల వ్యవసాయ పంటల దిగుబడి గురించి, చిరు ధాన్యాలు గురించి సునందను అడిగి తెలుసుకున్నాడు. సునంద వ్యవసాయం మీద సార్వ భౌమునికి ఉన్న ఆసక్తిని గమనించింది.
సార్వ భౌముని మనసు సునంద మీదకు మళ్ళింది.
నాలుగు రోజుల అనంతరం అదే విషయాన్ని సార్వ భౌముడు కేకయ మహారాజు కు చెప్పాడు. తన కుమార్తె కు ఇష్టమైతే తమని అల్లునిగా చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కేకయ మహారాజు సార్వ భౌమునితో అన్నాడు.
సార్వ భౌముడు, "రాజ! బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, రాక్షసి, పైశాచిక " అని వివాహాలు అనేక పద్దతులు ఉన్నాయి. మీరు ఏ వివాహాన్ని ఆమోదిస్తారు?" అని కేకయ మహారాజు ని అడిగాడు.
సార్వ భౌముని మాటలను విన్న కేకయ మహారాజు, "రాజ! మా రాజ్యం లో అనేక బ్రహ్మ వివాహాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. కట్న కానుకలకు అతీతంగా పెద్దలందరి అంగీకారం తో వధూవరులు ఒకటవ్వడం బ్రహ్మ వివాహం. ఇవి ఇప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్నాయి.
ఇక మా రాజ్యం లో దైవ వివాహాలు కూడా కొన్ని జరిగాయి. ఈ వివాహం లో తండ్రి తన కుమార్తెను దక్షిణ రూపంలో ముందుగా పురోహితునికి ఇస్తాడు. ఆపై ఆ స్త్రీని మరొక వ్యక్తి మనువాడతాడు.
మా రాజ్యం లో దైవ వివాహాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. వర్ణ అహంకారం వలన ఈ మార్పు వచ్చింది. పురోహితులు తమ ఉదర పోషణార్థం ఈ సంప్రదాయాన్ని పెట్టారు. తర్వాత తర్వాత సమాజంలో వచ్చిన మార్పు వర్ణ అహంకారం ఈ పద్దతి నశించడానికి కారణం అయింది.
ఇక అర్ష వివాహం కూడా మా రాజ్యం లో నేడు పూర్తిగా తగ్గిపోయింది అనే చెప్పాలి. అర్ష వివాహం లో వధువు తండ్రి తన కుమార్తెను ముందుగా ఒక ఋషికి ఇవ్వవలసి ఉంటుంది. ఆపై రెండు తక్కువ కాకుండా ఆవులను ఋషికి ఇచ్చి వధువును తీసుకోవలసి ఉంటుంది. ఋషులు తమ జీవనాధారం కోసం ఈ పద్దతిని ప్రవేశ పెట్టారు. అయితే ఈ సంప్రదాయం నేడు పూర్తిగా తగ్గు ముఖం పట్టింది.
పురోహితులు, ఋషులు చేసే ధర్మ కార్యాలకు కావల్సిన సమస్తం రాజులమైన మేమే చూస్తున్నాం. అయినా అక్కడక్కడ కొందరు స్వార్థ పరులైన పురోహితులు, ఋషులు సంప్రదాయాల పేరుతో కొందరు మనుషులను మోసం చేస్తూనే ఉన్నారు. వారి గురించి మాకు తెలిసిన వెంటనే మేము వారిని కఠినంగా శిక్షిస్తున్నాము.
ఇక కన్యాదానం లేని ప్రజాపత్య వివాహం మా రాజ్యం లోని అధిక శాతం మంది జనం ఆచరిస్తారు. అయితే ఇందులోని అనాచారాలను తొలగించి అనుసరిస్తారు.
ఇక కన్యను కొనుగోలు చేసే అసుర వివాహం, కామం నుంచి పుట్టిన గాంధర్వ వివాహం, వధువును అపహరించి వివాహం చేసుకునే రాక్షస వివాహం, వరుని అపహరించి వివాహం చేసుకునే రాక్షసి వివాహం, మగువ, మత్తులో ఉన్నప్పుడు ఆమెను అత్యాచారం చేసి వివాహం చేసుకునే పైశాచిక వివాహం లు అప్పుడప్పుడు మా రాజ్యంలో జరుగుతూనే ఉంటాయి.
అందరి బుద్ది ఒకే విధంగా ఉండదు కదా? అందుకే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా వివాహం చేసుకున్నవారికి ఇక్కడ కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. " అని అన్నాడు.
సార్వ భౌముడు కేకయ మహారాజు అభిప్రాయం తీసుకున్న పిమ్మట తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని ప్రేమను తిరస్కరించింది. అందుకు ప్రధాన కారణం సార్వ భౌమునికి తనే సార్వ భౌముడుని అనే అహంకారం అధికంగా ఉందన్నట్లు తనకు అనిపించింది అంది. అది నిజం కాదని సార్వ భౌముడు సునందతో అన్నాడు. అయినా సునంద సార్వ భౌముని నమ్మలేదు.
సార్వ భౌముడు సునంద మనసులోని మాటను కేకయ మహారాజు కు చెప్పాడు. కేకయ మహారాజు బాగా ఆలోచించి తన తోటలోని తులసి చెట్టు తో సార్వ భౌముని వివాహం జరిపించాడు. అనంతరం సార్వ భౌముని తో, "రాజ, సార్వ భౌమ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నేను నీకు తులసి చెట్టు ను ఇచ్చి వివాహం చేసాను. ఇక నువ్వు నా కుమార్తె సునందను రాక్షస వివాహం చేసుకున్నను తప్పులేదు. అయితే నా కుమార్తె మీద పైశాచికత్వం ప్రదర్శించమాకు" అని అన్నాడు.
కేకయ మహారాజు మాటలను విన్న సార్వ భౌముడు చిరునవ్వుతో సునంద పర్ణశాలకు వెళ్ళాడు. తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని మాటను మన్నించలేదు. సార్వ భౌముడు సునందను పలు విధాలుగా బతిమిలాడాడు.
"నీమనసులో ఇంకవరన్నా ఉన్నారా? వారిని తీసుకు వచ్చి నీ చరణాల ఉంచుతాను" అని సునందను సార్వ భౌముడు అడిగాడు.
"నా మనసులో ఎవరూ లేరు " అని సునంద అంది.
సార్వ భౌముడు బలవంతంగా సునందను తన రథం లో ఎక్కించుకున్నాడు. సార్వ భౌముడు సునందను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి బలవంతంగా రాక్షస వివాహం చేసుకున్నాడు.
భానుమతి అహంయాతులు సునందను దగ్గరకు తీసుకున్నారు. ఆమె ఆవేశాన్ని తగ్గించారు. తన కుమారుని పేరు సార్వ భౌముడు యే కాని అతనిలో నేనే సార్వ భౌముడు ని అనే అహంకారం అణుమాత్రం కూడా లేదన్నారు. కొంత కాలం ఓపిక పట్టి నిజం తెలుసుకో అన్నారు . సునంద మనసు సార్వ భౌముని మీదకు మళ్ళేటట్లు చేసారు.
కాలం గడుస్తున్న కొద్దీ సునందలో మార్పు వచ్చింది. సార్వ భౌముని లోని మంచిని గమనించింది. రాజకీయ విషయాలలో కూడా సునంద సార్వ భౌమునికి సహాయ పడసాగింది. వారిరువురికి పుట్టిన సంతానమే జయత్సేనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సుశ్రవస
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
సునంద సార్వ భౌముల కుమారుడు జయత్సేనుడు. సునంద తన భర్త సార్వ భౌముని మనస్తత్వం ముందుగా తెలుసుకోలేక పోయినా, కాలం గడుస్తున్న కొద్దీ భర్త మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంది. తన భర్తలో తనే సార్వ భౌముడుని అనే గర్వం కించిత్ కూడా లేదని గమనించింది. భర్త నిరాడంబర జీవితాన్ని చూసి తను చాలా అదృష్ట వంతురాలను అని అనుకుంది. శాంతి యుతమైన తన భర్త ప్రజా పరిపాలన ను చూసి సునంద మిక్కిలి సంతోషించింది.
సునంద సార్వ భౌములు ఇరువురు కలిసి తమకు పుట్టిన బిడ్డకు జయత్సేనుడు అని పేరు పెట్టారు. వారి కుల గురువు వశిష్ట మహర్షి కూడా జయత్సేనుని నామకరణ విషయం లో సునంద కే అధిక ప్రాధాన్యత ను ఇచ్చాడు. కుల గురువు వశిష్ట మహర్షి తనకిచ్చే ప్రాధాన్యతను కళ్ళార చూసే సునంద, తన జన్మకు సార్థకత లభించిందని మహదానంద పడింది.
జయత్సేనుడు, తల్లి సునంద ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరిగాడు. ఏ వయస్సు లో నేర్చు కోవలసిన విద్యలను ఆ వయస్సులో క్షుణ్ణంగా నేర్చు కున్నాడు. ఉత్తమ పురుషుడు గా ఎదిగాడు. మాతృ దేవోభవ అన్న ధర్మాన్ని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా అనుసరించాడు. కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర సమస్త వేద పురాణేతిహాస విద్యలను అభ్యసించాడు. తండ్రి సార్వ భౌముని దగ్గర యుద్ద విద్యలన్నిటిని నేర్చాడు.
సార్వ భౌముడు తన సామంత రాజులందరి వద్దకు జయత్సేనుని పంపాడు. వారి వారి దగ్గర ఉన్న ప్రత్యేక సమర విద్యలన్నిటిని కుమారునికి నేర్పించాడు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జయత్సేనుడు నానా విధాల సమర విద్యల నిమిత్తం ప్రత్యేక సమర విద్యా నైపుణ్యం కల వారందరి వద్ద శిష్యరికం చేసాడు.
జయత్సేనుని వినయ విధేయతలను చూసిన సామంత రాజులు, యోధులు తదితరులందరు మహా మురిసి పోయారు. తలిదండ్రులకు తగిన బిడ్డ జయత్సేనుడు అని అనుకున్నారు.
"ఇంద్రుని అంశలో నాలుగవ వంతు అంశ మంచి మహా రాజులో ఉంటుంది. మన జయత్సేనుని లో ఇంద్రుని అంశలో నాలుగవ అంశ మించి ఉంది. జయత్సేనుడు కారణ జన్ముడయిన మహారాజు "అని అందరూ అనుకున్నారు.
విదర్బ రాజ తనయ సుశ్రవస అందచందాల లోనూ, వినయ విధేయతలలోనూ, ఉన్నత విద్యల లోనూ ఆనాటి రాజ వంశాల యువరాణులలో మిన్న అన్న విషయం జయత్సేనుని చెవిన పడింది. ముఖ్యంగా యుగధర్మం బాగా తెలిసిన మహిళ సుశ్రవస అని జయత్సేనుడు తన గూఢచారుల ద్వారా సుశ్రవస గురించి తెలుసుకున్నాడు.
జయత్సేనుడు సుశ్రవస యుగ ధర్మ నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి మారు వేషంలో విదర్భ రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నాడు. కుల గురువు వశిష్ట మహర్షి కి, తలిదండ్రులకు తన మనసులోని మాటను చెప్పాడు.
"యుగ ధర్మ దేవత భూమి మీద ఆవిర్భవిస్తే, ఎలా ఉంటుందో సుశ్రవస అలా ఉంటుందని అందరూ అంటారు. సుర నర కిన్నెరాదులు కూడా అదే మాట అంటారు. అందుకే నీ చిత్ర పటాన్ని విదర్భ రాజు కు పంపాను. సుశ్రవసకు చూపించి ఆమె మనోభిప్రాయం కనుగొనమన్నాను" అని కుల గురువు వశిష్ట మహర్షి జయత్సేనుడితో అన్నాడు.
"అన్నీ మంచి శకునములే " అని జయత్సేనుడు మనసులో అనుకున్నాడు.
సుశ్రవస- మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు మహానుభావులందరి ఆశీర్వాదాలను తీసుకుంది. అనంతరం చెలికత్తెలందరితో కలిసి ప్రజల దగ్గరకు వెళ్ళింది. యుగ ధర్మాన్ని అనుసరించవలసిన రీతిని వారికి తెలియచేసింది. సత్తెకాలపు మనుషులను చైతన్య పరిచింది. కలికాలపు మనుషుల కర్కశత్వాన్ని కాలరాసింది. యుగ ధర్మ జీవన విధానం లోని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందరికీ తెలియ చేసింది.
యుగ ధర్మాన్ని మనం అనుసరిస్తే, యుగ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పింది.
సుశ్రవస 26 వ కలి పురుషుని లక్షణాలను ప్రజలకు తెలియ చేసింది. కలి యుగం లో మానవుడు ఆలోచించే రీతిని తెలియచేసింది. కలియుగంలో తలిదండ్రులు బిడ్డలను ఎంత నిర్లక్ష్యంగా పెంచుతారో తెలియచేసింది. అలాగే బిడ్డలు తలిదండ్రులను ఎంత కౄరంగా శిక్షిస్తారో తెలియ చేసింది.
కలియుగం లో మనిషి ఆలోచనలు, ఆశలు ఎలా శృతిమించి ఆకాశాన్ని అంటుతాయో తెలియచేసింది. కలి యుగం వచ్చే సరికి భౌగోళిక సంపద ఎలా తరిగిపోతుందో జనభా సమస్య ఎలా చెలరేగి పోతుందో తెలియ చేసింది. ప్రకృతి ఎంత కాలుష్యమైపోతుందో తెలియ చేసింది.
సుశ్రవస 26 వ కలి యుగం లో జరిగిన అనేకమంది వృత్తాంతాల మాటున ఉన్న రాక్షసత్వాన్ని మించిన కౄరత్వాన్ని ప్రజలకు తెలియ చేసింది.
సుశ్రవస ప్రజలకు బోధించే విషయాలను మారు వేషంలో ఉన్న జయత్సేనుడు విన్నాడు.. మనసుకు హత్తుకునేటట్లు ఆమె చెప్పే మాటలను విన్నాడు.
సుశ్రవస చెప్పే కలి పురుష లక్షణాలు జయత్సేనుని మనసును బాగా ఆకర్షించాయి. యుగ ధర్మం ప్రకారం నడుచుకునే మానవుడే మాధవుడు అవుతాడు అని అనుకున్నాడు. అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న అని అనుకున్నాడు. అదే సమయంలో కలి పురుషుడు సుశ్రవసను చూసాడు. సుశ్రవసను తన స్వంతం చేసుకుంటే మిగతా మూడు యుగాల ముక్కు పిండి కదిలే కాల చక్రం లో తను ముందుగానే ప్రవేశించ వచ్చును అనుకున్నాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
కలి పురుషుడు సుశ్రవసను జాగ్రత్తగ గమనిస్తూ, ఆమెను అనుసరించాడు. అయితే కలి పురుషుడు సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించ లేకపోయాడు. సుశ్రవస అంతఃపురానికి ప్రవేశించలేక పోవడానికి కారణం సుశ్రవస అంతఃపురం కృత త్రేతా ద్వాపర యుగ ధర్మాలతో కూడి ఉన్నదన్న యదార్థం కలి పురుషునికి తెలిసింది. సుశ్రవస తనువును ఎలా ఆక్రమించాలా? అని కలి పురుషుడు ఆలోచించాడు.
"మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఒక మహర్షి చేసే తపస్సు లో ఆరవ వంతు తపో ఫలం రాజుకు లేదా రాజ్య పరిపాలన చేసే యువరాణి మొదలైన వారికి చెందుతుంది. తమ తఫో ఫలాన్ని రాజుకు ధారపోయని మహర్షులు సంచరించే చోట కలి యుగ ధర్మం విచ్చలవిడిగా సంచరిస్తుంది. కాబట్టి అలాంటి మునుల చేత తపస్సు చేయించాలి. "అని కలి పురుషుడు అనుకున్నాడు.
మారు వేషంలో ఉన్న జయత్సేనుడు సుశ్రవస అంతఃపురంలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. జయత్సేనుని ప్రయత్నం చాలా సులభం అయ్యింది. అంతఃపురంలో మహర్షుల తపో తేజం జయత్సేనునికి శిరసు వంచి నమస్కరించింది. జయత్సేనుడు విషయాన్ని గమనించాడు. జయత్సేనుడు మారు మాట్లాడకుండా కరవాలాన్ని పక్కన పడేసి మహర్షుల తపో తేజానికి సాష్టాంగ పడి నమస్కారం చేసాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన సుశ్రవస మారువేషంలో ఉన్న జయత్సేనుని చూసింది. అంతకు ముందే సుశ్రవస జయత్సేనుని చిత్ర పటంలో చూసి ఉండటం చేత జయత్సేనుడు మారు వేషంలో ఉన్నప్పటికీ అతని స్వస్వరూపమును పోల్చుకోగలిగింది.
"జయత్సేన మహారాజ! స్వాగతం సుస్వాగతం. మీరు మహా గొప్ప పరిపాలకులన్న వాస్తవాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం. మీ రాజ ధర్మం అజరామరం. అనిర్వచనీయం.. అమోఘం.
‘బలం లేనివానికి రాజు బలం, రక్ష కావాలి. బలం ఉందని చెలరేగేవానికి రాజు బలం శిక్ష కావాలి. రాజే అహంకార బలం తో చెలరేగి పోతే ఆ రాజు వంశానికి చెందిన వారు ముఖ్యంగా అలాంటి రాజును ఆ రాజు భార్య శిక్షించాలి. అలాంటి భార్యలే పతివ్రతల కోవకు వస్తారు..’ వంటి మీ రాజ ధర్మాలు అందరూ అనుసరించదగినవి.
మీరు యుగ ధర్మ మూలాలు తెలుసుకోవడానికి వచ్చారన్న నిజం మా మహర్షుల తపో తేజం మాకు ఇంతకు ముందే తెలియచేసింది. ఇక్కడ మీ ఇష్టం ఉన్నంత కాలం ఉండవచ్చు. మమ్మల్ని ఆజ్ఞాపించండి. మీరు కోరిన సేవలు అందిస్తాం." అని జయత్సేనుడితో అంది సుశ్రవస.
జయత్సేనుడు తన మారు వేషాన్ని తొలగిస్తూ, " యువరాణి సుశ్రవస.. నేడు అన్ని రాజ్యాలలో మీ యుగ ధర్మం గురించే మాట్లాడుతున్నారు. అదెలా ఉంటుందో చూడాలనిపించింది. మారు వేషంలో వచ్చి చూస్తే నిజం నూటికి నూరు శాతం బహిర్గతం అవుతుంది అనిపించింది. అందుకే మారు వేషంలో వచ్చాను. మీ అంతఃపురాన్ని మీ యుగ ధర్మమే కాపాడుతుంది అని తెలుసుకున్నాను. " అని సుశ్రవసతో అన్నాడు.
"మీరిక్కడ నాలుగు రోజుల పాటు ఉంటే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. " అని సుశ్రవస జయత్సేనుని తో అంది.
సుశ్రవస మాటలను అనుసరించి రాజ భటులు జయత్సేనుని కి ప్రత్యేక విడిది మందిరాన్ని ఏర్పాటు చేసారు.
"నాలుగు పాదాల ధర్మం నడిచే కృత యుగం లో భూమి మీద పుట్టిన మనిషి అసలు తప్పుడు ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. భౌగోళిక సంపద, జీవ ఉత్పత్తి అన్ని సమపాళ్ళలో ఉంటాయి కనుక కనీస అవసరాల నిమిత్తం ఎవరిని ఎవరూ దోచుకోవలసిన అవసరం ఉండదు. అలా దోచుకునే ఆలోచన ఎవరన్నా చేస్తే ప్రకృతే వారి ఆలోచనలను శిక్షిస్తుంది. కర్రే పామై కరుస్తుంది.
మూడు పాదాల ధర్మం నడిచే త్రేతా యుగంలో భూమి మీద పుట్టిన మనిషి యుగ ధర్మాన్ని అనుసరించే నేపథ్యంలో సామాన్య మానవునికి తప్పనిపించే కొన్ని పొరపాట్లను చేయవలసి ఉంటుంది.
అయితే పరుల మాటల గురించి కాక యుగ ధర్మం గురించి ఆలోచిస్తూ ముందడుగు వేసేవారే దైవాలు గా చరిత్రకు ఎక్కుతారు. ఇక ధర్మం రెండు పాదాల మీద నడిచే ద్వాపర యుగ ధర్మం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇక ఒంటి కాలి మీద ధర్మం నడిచే కలియుగంలో అన్ని ధర్మాలు మిళితమైపోయి అసలు ధర్మం ఏమిటో తెలియకుండా పోతుంది. అది తెలుసుకున్నవారే పుణ్యాత్ములు. " అంటూ సుశ్రవస చెప్పే ధర్మాలను వంట పట్టించుకుని మసలే ప్రజలను చూసిన జయత్సేనుడు, " సర్వ కాల సర్వావస్తలయందు ప్రజలు యుగ ధర్మాన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది?" అని అనుకున్నాడు.
కలి పురుషుడు మహా స్వార్థం గల వంద మంది మునులతో కపట యాగం చేయించసాగాడు. అది తెలిసిన సుశ్రవస యాగ శాల దగ్గరకు వచ్చింది. సుశ్రవసను జయత్సేనుడు అనుసరించాడు.
సుశ్రవస తన తపోశక్తి తో కపట యాగం చేస్తున్న వంద మంది మునుల నోట మంత్రాలు రాకుండా చేసింది. అది గమనించిన కలి పురుషుడు సుశ్రవసను ఆక్రమించాలని చూసాడు.
ఒంటి కాలి ధర్మం తో ప్రకాశించే కలి పురుషుని సుశ్రవస తన ధర్మ బలంతో పాతాళానికి తొక్కేసింది. అది గమనించిన జయత్సేనుడు సుశ్రవసను పలు రీతుల్లో అభినందించాడు. ఆపై జయత్సేనుడు సుశ్రవస అనుమతితో, ఆమె పెద్దల అనుమతితో అందరి సమక్షంలో సుశ్రవసను వివాహం చేసుకున్నాడు. సుశ్రవస జయత్సేనుడుల సంతానమే
అవాచీనుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సప్త చిరంజీవులు
రచన: సిహెచ్. సీఎస్. రావు
మన హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం ఏడుగురు మహనీయులు కృత త్రేతాయుగ ద్వాపర యుగాలకు చెందినవారు. వారు ఈ కలియుగమునందున చిరంజీవులు.
సప్త - ఏడు అను సంఖ్య చాలా ప్రభావితమైనది.
1. సప్త ఋషులు:- శతపద బ్రాహ్మణము, బృహదారణ్య కోపనిషత్తులలో కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అత్రి, జమదగ్ని, వశిష్టుడు, విశ్వామిత్రుడు సప్త ఋషులని వివరించబడియున్నది.
2. సప్త సాగరములు: లవణ (ఉప్పు) సముద్రము, ఇక్ష (చెరకు) సముద్రము, సురా (మద్యం, కల్లు) సముద్రము, సర్పి (ఘతం / నెయ్యి) సముద్రము, క్షీర (పాల) సముద్రము, దధి (పెరుగు) సముద్రము, నీరు (మంచినీటి) సముద్రము.
3. సప్త వర్ణములు :- తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వక్కఛాయ.
4. సప్త ద్వీపములు :- జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మనీ ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, (ఇవి బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో భాగవతంలోని వివరణ)
5. సప్త స్వరములు :- స,రి,గ,మ,ప,ద,ని....స షడ్బమం (నెమలి క్రేం కారం) రి - రిషభం(ఎద్దురంకె) గ - గాంధర్వం (మేక అరుపు), మే - మధ్యమం (క్రౌంచ పక్షి కూత), ప - పంచమం (కోయిల కూత), ద - దైవతం / గుర్రం సకిలింపు), ని- నిషాదం (ఏనుగు ఘీంకారం)
6. సప్త వారములు : ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని
7. సప్త చిరంజీవులు : బలి చక్రవర్తి, శ్రీవ్యాసుడు, పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు, ఆశ్వత్దామ.
దిగువన సప్త చిరంజీవుల చరిత్ర, ఘనత వివరాలు :
1. బలి చక్రవర్తి వారు:- వీరు భక్త ప్రహ్లాదుల మనుమడు. వీరికి బాలి, ఇంద్రసేనన్, మావేలి అను మారుపేర్లు కలవు. వీరు కశ్వప ఋషి వంశస్థులు. వీరి తండ్రిగారి పేరు వీరోచనుడు. వీరి తల్లి దేవాంబ. భార్య ఆశన. వీరు దాననిరతిలో శిబి చక్రవర్తి అంతటివాడు. వీరి గురువు శుక్రాచార్యులు. ముల్లోకాలను జయించిన మహా పరాక్రమశాలి. గొప్పదాత.
శ్రీ మహావిష్ణుమూర్తి వీరి దానగుణమును పరీక్షించదలచి వామరూపము వటువుగా వారి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను అర్థించాడు. ఇస్తానన్నాడు బలి. గురువు శుక్రాచారుయులు వారించాడు. కానీ బలి చక్రవర్తి గురువు వాక్కును వినిపించుకోలేదు. కమండల జలంలో మూడు అడుగులు, శ్రీ మహావిష్ణువుకు ధారపోయబోయాడు.
శుక్రాచార్యులు కమండల ద్వారానికి తన నేత్రాన్ని అడ్డుగా పెట్టాడు. ఆవటువు కమండ జల ప్రవాహ మార్గమును దర్భంతో పొడిచాడు. అడ్డుగా వున్న శుక్రాచార్యుల నేత్రం పోయింది. నీరును వటువు చేతిలో పోసి బలి దాన విధిని ముగించాడు. శ్రీహరి త్రివిక్రమ రూపధారియై ఒక పాదమును యావత్ భూమిమీదను, రెండవ పాదమును గగనతలముననూ వుంచి... అడిగాడు.. ’బలీ!... మూడవ పాదము ఎక్కడ మోపవలె!"
దాన గ్రహీత శ్రీ మహావిష్ణుమూర్తి అని గ్రహించి, మహా జ్ఞాని బలి చక్రవర్తి.... తన శిరమును చూపి.... ’ప్రభూ!.... మూడవ పాదమును ఇచ్చట మోపండి’ అన్నాడు పరమానందంగా.
జగత్ రక్షకుడు శ్రీమన్నారాయణులు బలిచక్రవర్తి దాన గుణానికి సంతసించి, వారికి ప్రసన్నుడై భార్యా పిల్లలతో పాతాళ లోకవాసిగా, చిరంజీవిగా వర్ధిల్లమని శ్రీ మహావిష్ణుమూర్తి, బలిచక్రవర్తిని ఆశీర్వదించారు, వరం ఇచ్చారు.
2. వేదవ్యాసుల వారు:- బెస్త స్త్రీ సత్యవతికి, పరాశర మునీంద్రులకు జన్మించినవారు వ్యాసమహర్షి. మన పూర్వులు పంచమవేదమని పిలవబడు ఇతిహస మహాకావ్యము శ్రీ మహాభారము. అది పదునెనిమిది పర్వములు. అది కౌరవ పాండవుల కథ. వీరు చంద్ర వంశస్థులు. పరీక్షిత్తు మహారాజు వారి భార్య మద్రావతి. తండ్రి అభిమన్యుడు, తల్లి ఉత్తర, కుమారుడు జనమేజయుడు. వీరికి ముగ్గురు సోదరులు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతిసేనుడు. జనమేజయుడు అర్జునునికి ముని మనుమడు.
వ్యాసులు ప్రియ శిష్యులు వైశంపాయనుడు. వీరు మహా భారత కథను జనమేజయులకు వివరించినారు.. జనమేజయులకు ఇరువురు కుమారులు. జనమేజయుల తండ్రి పరీక్షిత్ మహారాజు పాముకాటు వలన మరణించు శాపము కలిగినది. అది ఎట్లనిన శమీక అను ఋషి తపమునందుండగా అడవికి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు ఆ ఋషిని చూచి దాహము తీర్చుకొనుటకు నీటికి అడిగినాడు. జపమునందున్న ఋషి పలుకలేదు. అవేశంలో పరీక్షిత్తు చనిపోయిన ఒక పాము కళేబరమును శమీక ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు.
శమీక ఋషి తనయుడు శృంగి, ఏడవరోజున పాము తక్షకుడు నిన్ను కాటువేసి చంపుగాక, అని శపించినాడు. అదే రీతిగా పాముల రాజు తక్షకుడు పరీక్షిత్తును కరచి చంపినాడు. ఆ కారణముగా జనమేజయునికి పాములు అంటే ద్వేషం. వారిని సర్ప యాగమును చేసి చాలా పాములను చంపినారు. ఈ పంచమ వేద రచయిత శ్రీ వ్యాస మహర్షుల వారు. శ్రీ మహా విష్ణువు చిరంజీవిగా వరం ఇచ్చినారు..
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
3. పరశురాముడు: శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేత్రాయుగ ఆరంభంలో జరిగినది. మహావీరుడు. పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. వీరికి నలుగురు మగపిల్లలు. చివరివాడు పరశురాముడు. అసాధారణమైన బలపరాక్రమశాలి. వీరి చరిత్ర చాలా విచిత్రమైనది. వీరి తాతగారు ఋచీకుడు, ఋషి. వారు గాధి రాజు వద్దకు వెళ్ళి రాజకుమారి సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరినారు.
సత్యవతిదేవి గాధి మహారాజు ఏకైక పుత్రిక. ఆమె వివాహమును గాధి మహారాజు సర్వశక్తి సంపన్నుడైన మునిబిడ్డ రుచికునికి ఇచ్చి వివాహమును జరిపించెను. సత్యవతి తాను క్షత్రియకుల కాంత కావున, తనకు జన్మించే సంతానం కూడా క్షత్రియ బుద్ధులతో పుడతాడు. అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు అని భావించి, రుచికునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావలయునని విన్నవించెను.
అలాగే, మగ సంతానములేని తన తల్లితండ్రులకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని కోరెను. సత్యవతి కోరిక మేరకు, అత్తకు..... భార్యకు సంతతిని ఇవ్వదలచి రుచికుడు, యాగము చేసి రెండు కుండల్లో పరమాన్నమును నింపి, ఒకటి అత్తగారికి మరొకటి భార్యకు ఇచ్చి, ఎవరిది వారు భుజించవలయునని చెప్పెను.
రుచికుడి ఉద్దేశ్యము, క్షత్రియకుల సతి అయిన గాధిరాజు భార్యకు (అత్తగారికి) క్షత్రియు గుణములు కల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములు ఉండు ముని బాలుడు పుట్టవలెననే ఉద్దేశ్యము. కానీ... అల్లుడు రుచికుడి పైన అనుమానము కలిగిన సత్యవతి తల్లి, తనకు మంచిబిడ్డ పుట్టవలయునను ఉద్దేశ్యంతో, మునిరాజు తన భార్య కుండలో ఏవైనా గొప్ప శక్తులు నింపాడేమో అనుకొని, స్వార్థముతో సత్యవతికి ఇచ్చిన కుండలోని క్షీరాన్నమును తాను భుజించి, తనకు ఇచ్చిన కుండను సత్యవతికి ఇచ్చెను.
అవి భుజించిన వారి గర్భములలో మారు బిడ్డలు పెరుగుచుండిరి. ఆ విషయమును గ్రహించిన రుచికుడు తన భార్యకు తాను మారు శిశువును మోయుచున్నట్లు చెప్పెను. అందుకు సత్యవతి భయంతో ఆ బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందిన తన కోడలి గర్భమునకు మార్చమని, రుచికుడిని కోరెను.
రుచికుడు ఆమె కోరికను మన్నించి ఆమె ఆశయమును నెరవేర్చెను. అత్తకు, భార్యకు కూడా సాత్విక తత్వ సంతానములు కలిగిరి. గాధి తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసెను. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అని నామకరణము చేసినది. ఆ ముని బిడ్డ జమదగ్ని క్రోద దేవతల ఆశీర్వాదంతో తనకు కోపము కలిగించిన వారిని తన క్రోదాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను.
పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. తోబుట్టువులు సుమస్వాన్, సుహోత్ర, వాసు, విశ్వవసు, భార్య ధరణ (లక్ష్మి). వీరికి పరమశివుడు, నేరస్థులను, చెడుగా ప్రవర్తించే వ్యక్తులను, తీవ్రవాదులను, రాక్షసులను మరియు గర్వంతో విర్రవీగుతున్న అంధుల బారినుండి భూమాతను విడిపించమని వారికి సలహా ఇచ్చాడు.
వీరు ఆ వర్గీయులపై ఇరవై ఒక్కసార్లు (కొన్ని వంశములను విడిచి) నాశనం చేయడం ద్వారా విశ్వ సమతుల్యాన్ని సరిదిద్దారు. అతి పరాక్రమశాలి వీరుడు. ధీరుడు ధైర్యశాలి పిత్రువాక్య పరిపాలకుడు.
ఒకనాడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీటికోసం వెళ్ళగా అక్కడ జలకాలాడుతున్న గంధర్వ కన్యలను చూచి పరవశంతో వర్తమానాన్ని మరచిపోయినది. ఎంతకూ తిరిగి ఇంటికిరాని ఇల్లాలిపై ఆగ్రహించి, తండ్రి జమదగ్ని, పరశురామునితో ‘నీ తల్లి తల నరికి తెమ్ము’ అని ఆజ్ఞాపించెను. సత్వరము పరశురాముడు తల్లి వున్న స్థలమునకు ఏగి, తల్లి తలను నరికి తెచ్చి తండ్రికి సమర్పించెను.
అంతటి కఠోర సంకల్పుడు పరశురాముడు. వీరు భీష్ములు. ద్రోణుడు, రుక్మి మరియు కర్ణులకు గురువు. వారు సమాజంలోని బ్రాహ్మణులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఇతర బలహీనవర్గాల పట్ల తన దయా దాక్షిణ్యాలను చూపారు. శ్రీ మహావిష్ణువు వరంతో చిరంజీవి అయినారు.
4. హనుమంతుల వారు:- వీరి తల్లి అంజన, తండ్రి కేసరి. వీరికి మరొక పేర్లు భజరంగబలి మరియు పవనసుత. వీరు అంజనాదేవుకి వాయువు వర ప్రసాదం. మహాజ్ఞానం, బలం, ధైర్యం, భక్తి మరియు స్వీయ క్రమశిక్షణ కలిగిన మహోన్నతులు, ఋష్యమూకాద్రి పర్వతరాజైన వాలి కొలువులోన వుండేవారు.
అభిప్రాయభేదముల వలన వాలి తన సోదరుడైన సుగ్రీవుని, రాజ్యం నుంచి తరిమేశాడు. ఆ తరుణంలో ఆంజనేయులు ధర్మ మార్గవర్తి.... సుగ్రీవునకు అండగా ఆ వర్గంలో వుంటాడు. వీరి గురువులు సూర్యుడు, రావణుడు, అరణ్య వాసమునందు వున్న సీతామాత యొక్క అందాన్ని గురించి తన సోదరి శూర్పణక చెప్పిన మాటలు విని, రావణుడు మారిచుని మాయ బంగారు లేడి రూపంలో రామాశ్రమునకు పంపగా సీతామాత ఆ లేడి తనకు కావలెనని శ్రీరాముని కోరగా, రాముడు ఆ మాయా లేడిని పట్టుకొనుటకు వెళతాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
లక్ష్మణుడు ఆశ్రమమున వుంటాడు. ’హా సీత... హా లక్ష్మణా...’ అనే దీన స్వరాన్ని మారీచుడు (లేడీ రూపమున వున్న) పలుకగా, సీతామాత భయంతో, లక్ష్మణుని ఆశ్రమమును విడచి, శ్రీరామరక్షణకు వెళ్ళమంటుంది. ’తల్లీ.... అది రాక్షస మాయ, మా అన్నయ్యను ఎవరూ ఏమీ చేయలేరు. మీరు భయపడకండి’ అని జవాబు చెపుతాడు లక్ష్మణుడు. ’మనస్సున చెడ్డ ఉద్దేశ్యంతో నీవు ఆశ్రమమును వదలిపోనంటున్నావు.’ అన్నారు సీతామాత. లక్ష్మణుని హృదయంలో ఆవేదన. మాత అనుమానం తీరాలంటే తాను వెళ్ళక తప్పదని ’లక్ష్మణ గీత’ను ఆశ్రమం ముంగిట గీసి ’తల్లీ!.... ఎటువంటి పరిస్థితిలోనూ, మీరు ఈ గీతను దాటరాదు’ అని చెప్పి, లక్ష్మణుడు శ్రీరాముని కోసం వెళతాడు.
ఆ సమయమున రావణుడు జంగం దేవర వేషంలో ఆశ్రమానికి వచ్చి ’భవతి భిక్షాందేహి’ అని యాచిస్తాడు. సీతామాత వారిని చూచింది. భిక్షను తీసుకొని, లక్ష్మణ రేఖను దాటకుండా రావణునికి ఇవ్వబోయింది. దురుద్దేశపు రావణుడు ఆ దానాన్ని అంగీకరించలేదు. గీతను దాటి వచ్చి తన జోలిలో వేయమంటాడు రావణుడు.
యాచకునకు నిరాశ, అసంతృప్తి కలిగకూడదని మాత లక్ష్మణ రేఖను దాటుతుంది. వెంటనే రావణుడు సీతామాతను తన పుష్పక విమానాన్ని ఎక్కించి, లంకకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆశ్రమమునకు తిరిగి వచ్చిన శ్రీరామ లక్ష్మణులకు మాత కనిపించలేదు. నలువైపులా వెదికారు. కానీ... ప్రయోజనం శూన్యం విచారవదనంతో రామలక్ష్మణ సీతామాత అన్వేషణను అడవిలో ప్రారంభించారు.
ఆ తరుణంలో శ్రీ హనుమంతుడు వారిని కలిశాడు. వారు, వారి దీన స్థితిని వాయునందనునికి తెలియజేశారు. హనుమ వారిని తన రాజైన సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. సుగ్రీవుడు తన దుస్థితిని రాముల వారికి తెలియజేశాడు. వాలి, సుగ్రీవుల రూపురేఖలు ఒకేరీతిగా వుంటాయి. అన్యాయమార్గ వర్తనుడు అహంకారి అయిన వాలిని వధించి సుగ్రీవునకు పట్టాభిషేకం జరపాలని శ్రీరాముడు నిర్ణయించారు. సుగ్రీవుని సందేశంగా వాలిని ద్వంద యుద్ధానికి రావలెనని సందేశం పంపారు.
వాలి యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఇరువురూ ఒకే పోలిక యున్నందువలన శ్రీరాముల వారు సుగ్రీవుని కంఠమునందు తామర పూలమాలను వేసి యుద్ధానికి దింపారు. వాలి రావణుడి కన్నా మహా బలశాలి. అతని ధాటికి సుగ్రీవుడు హడలిపోసాగాడు. వాలిని సుగ్రీవుడు గెలవలేడని గ్రహించిన శ్రీరాముడు తన బాణంతో వాలిని సంహరించాడు. సుగ్రివుడు రాజైనాడు.
సీతామాత అన్వేషణకు వానర ప్రముఖులను సుగ్రీవుడు అష్టదిక్కులకు తనవారిని పంపినాడు. ఆగ్నేయమూలకు శ్రీ ఆంజనేయుడు వెడలినాడు. లంకా రాక్షసిని చంపి లంకలో ప్రవేశించి అశోకవనమున సీతామాతను సందర్శించినారు. శ్రీరాములు ఇచ్చిన అంగిళీయకమును మాతకు చూపించి తాను శ్రీరామ దూతననే గుర్తింపును పొంది మాతను ఓదార్చి ’త్వరలో మా వానర సమూహం శ్రీరామ లక్ష్మణ సమేతంగా లంకకు వచ్చి, రావణుని వధించి మిమ్ములను తీసుకొని పోయెదమని సీతామాతను ఓదార్చినాడు.
అశోకవనమును ధ్వంసం చేసి, రావణ వన రక్షకులను చంపి, ఇంద్రజిత్ (రావణ కుమారుడు) బ్రహ్మస్త్రమున వారికి బంధీగా దొరికి రావణుని దర్బారున ప్రవేశించినారు. దూతకు ఆసనమును ఏర్పాటుచేయలేదు రావణుడు. అతన్ని పరుష భాషణలతో అవమానించాడు.
హనుమంతులవారు వాలమును కాయమును పెంచి, వాలమును ఎత్తైన (రావణుని ఆసనము కన్న) ఆసనముగా అమర్చి దానిపై కూర్చొని శ్రీరామ సందేశాన్ని రావణునకు వినిపించాడు వాయునందన. ఆగ్రహావేశాలతో రావణుడు ఆ వానరవాలమునకు గుడ్డలు చుట్టి రసాయనాన్ని పోసి వాలమునకు నిప్పును అంటింపచేశాడు రావణుడు. అగ్ని శిఖలు చెలరేగుతున్న వాలముతో పవతనయులు లంకానగర సౌధములన్నింటికీ నిప్పును అంటించాడు. లంకానగరం అగ్ని జ్వాలలకు ఆహుతి అయినది.
వాలమును సాగరమున ముంచి అగ్నిని చల్లార్చుకొని, సీతా మాతను కలిసి ఆమె ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా తీసుకొని శ్రీరాముల సన్నిధికి తిరిగివచ్చి, ’మాతను చూచితిని, మాట్లాడితిని. తల్లి క్షేమం. ఇదిగో మాత ఇచ్చిన ఆనవాలు, అని చూడామణిని (తలలో ధరించు బంగారు ఆభరణము) శ్రీరాముల వారి చేతికి అందించినాడు హనుమంతుడు. సాగరముపై రాళ్ళపై శ్రీరామ నామమును వ్రాసి విసరగా అవి నీటిపై తేలి వారధి/ సేతువుగా వెలసెను. వానర సైన్యంతో సుగ్రీవ అంగద జాంబవంత హనుమంతులతో శ్రీ రామలక్ష్మణులు లంకకు చేరి, రావణ పరివారమును అంతం చేశాడు.
రావణుని సోదరుడు సద్గుణ సంపన్నుడు విభీషణుడు, రావణునకు హిత వచనములను చెప్పి, సీతామాతను శ్రీరాములకు అప్పగించమని వేడెను. అహంకారి దుర్మార్గుడు అయిన రావణుడు, సోదరిని వచనములను పెడచెవిన పెట్టి విభీషణుని దుర్భాషలాడినాడు. ఫలితముగా సుగ్రీవుడు లంకను, రావణుని వదలి శ్రీరాముల వారిని కలిసి శరణు వేడినాడు. శ్రీరాములు అతనికి అభయమిచ్చినాడు. వారు శ్రీరాముల వారికి రావణ ప్రాణ రహస్యను తెలిపినాడు. భయంకరంగా రామ రావణ యుద్దం జరిగినది. లక్ష్మణుడు మూర్ఛ చెందినాడు.
శ్రీ హనుమంతుడు హిమాలయ పర్వతమునకు ఏగి మృత సంజీవిని తెచ్చి లక్ష్మణుని కాపాడినాడు. ఆ యుద్ధములో రావణుని సోదరులు, సుతులు అందరూ మరణించినారు. చివరగా పది తలల రావణుడు రామబాణానికి హతుడైనాడు. పరవాని పంచన వుండిన సీతామాతకు ఆ రాముడు అగ్ని పరీక్ష పెట్టినాడు. మాత ఆ పరీక్ష యందు నెగ్గి అగ్ని పునీతగా నిలిచినది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
శ్రీ రామలక్ష్మణులు సీతామాత సుగ్రీవ అంగద జావంతాదులందరూ అయోధ్య నగరమునకు చేరినారు. కులగురువు వసిష్టుల వారి నిర్ణయమైన శుభముహూర్తాన శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవము కనుల పండుగగా జరిగినది. శ్రీరాముడు అంజనాసుతుని ఆలింగనము చేసికొని.... ’చిరంజీవివై వర్ధిల్లు హనుమా!’ అని దీవించినారు. ఆ రీతిగా.... ఆ మహోన్నత శివ అంశ అంజనా కేసరి తనయుడు చిరంజీవి అయినాడు.
5. విభీషణుల వారు: శ్రీరాముల వారియందు అపరిమిత భక్తి శ్రద్ధలు, గౌరవము వున్న విభీషణునకు శ్రీరాముడు లంకా రాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిపించినాడు. వీరి తల్లి కైకేసి, తండ్రి విశ్రవఋషి. లంకలో సన్మార్గులు అందరూ కడు సంతసించారు. విభీషణుడు తన రాజ్య ప్రజలను కన్న బిడ్డలవలే అభిమానించి, గౌరవించి, వారికి సర్వ సౌకర్యములను ప్రసాదించినాడు. ఆ కారణముగా శ్రీ రాముడు మహదానందంతో, విభీషణునకు చిరంజీవి వరాన్ని ప్రసాదించారు.
6. కృపాచార్యులవారు: వీరు ఆందీరస ఋష వంశస్థులు. వీరిని తను రాజు దత్తు తీసికొన్నారు. వీరు హస్తినాపురమునకు రాజ పూజారులు. వీరి భార్య జనపది. వీరు శతానంద మహర్షి మనుమడు. వీరి సోదరి కృషి ద్రోణాచార్యుల వారి ఇల్లాలు. వీరు కౌరవపాండవులకు ఆదిగురువు. వీరు మహాజ్ఞాని. పండితుడు. మాట పట్టింపుగల గొప్ప వ్యక్తి. ద్రోణాచార్యులు వీరి బావమరిది. కౌరవ పాండవుల యుద్ధం ముగిసిన తరువాత వీరు అర్జునుని మనుమడు పరీక్షకు గురైనారు. వీరికి సామర్థ్యానికి, నీతి నియమాలకు మెచ్చి, శ్రీ కృష్ణ పరమాత్మ వీరికి చిరంజీవిగా వరమిచ్చారు.
7. అశ్వత్దామ వారు: వీరు ద్రొణాచార్యుల కుమారులు. వీరి తల్లి కృపాచార్యుల సోదరి కృషి. తండ్రి వద్ద మామ కృపాచార్యుల వద్ద అశ్వత్దామ అన్నివిద్యలూ, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొన్నారు. తపసంపన్నుడు. కురుయువరాజు రారాజు దుర్యోధనునకు గొప్ప మిత్రుడు. యుద్ధంలో కౌరవులు వారి సర్వ సైన్యం దుర్యోధన సోదరులు అందరూ చనిపోయారు.
ఆ కక్షతో పంచ పాండవులు ఐదుగురు సంతతి ఉప పాండవులను రాత్రి సమయంలో గుడారంలో ప్రవేశించి ఐదుగురు వుప పాండవులను హతమార్చాడు. అంతేకాకుండా అభిమన్యుని ఇల్లాలు ఉత్తర గర్భమునందున్న శిశువును కూడా చంప బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. విషయాన్ని గ్రహించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమునందున్న శిశువు (పరీక్షిత్)ను రక్షించినాడు.
ఆశ్వత్థామకు రక్తశిక్తమైన రణ (గాయాలు) పూరిత శరీరంలో దుర్గంధంతో కలియుగాంతం వరకు చిరంజీవిగా నరకయాతనలను అనుభవిస్తూ బ్రతకమని శపించారు శ్రీ కృష్ణ పరమాత్మ.
ఆ రితిగా అనుచిత కార్యాలు చేసినందుకు శ్రీకృష్ణ శాపంతో అశ్వథామ చిరంజీవి అయినాడు.
యధార్థంగా పై ఏడుమంది ఒకరిని మించిన మహనీయులు ఒకరు. కొందరు సత్వగుణ ప్రధానులు (బలిచక్రవర్తి, వ్యాసుల వారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు) ఆ కోవకు చెందినవారు. పరశురాముడు అశ్వత్థామ రజోగుణ ప్రభావితులు.
వీరందరికీ అంతటి మహత్తర శక్తులు. నైపుణ్యం, నేర్పరితనం సిద్ధించినది, వారు గురువులను గౌరవించి విద్యలను అభ్యసించిన రీతి, మనస్సున దీక్ష, పట్టుదల, పెద్దల యందున గౌరవం, ధ్యానం తపం, యోగ విద్యల సాధన వలన వారు అంతటి గొప్ప వారు కాగలిగారు. కోట్ల ప్రజానీకపు నోట కొనియాడబడ్డారు. దైవ దృష్టిలో ధర్మానికి రక్షణ, అధర్మానికి శిక్షణ ఎలాంటి వారికైనా తప్పదు మారదు. కారణం జగత్కర్త సదా నిస్పక్షపాతి ధర్మమూర్తి.
పైవారు వారి వర్తమాన కాలంలో ఇంకా ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు. చరిత్ర నాయకులై మన భారతజాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు.
ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో పాటించవలసినది సత్వగుణం. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయం, మానవత్వం, రజోగుణ తత్వాలు రాక్షస చర్యలు. వాటికి దూరంగా వుంటూ, దైవం పట్ల విశ్వాసం, నమ్మకం, సాటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి వర్తించినవారు ఉత్తములు. పురుషోత్తములని సాటివారి చేత పిలువబడుతారు. గౌరవించబడతారు.
*
సూచన : ప్రపంచ చరిత్రలో మన హైందవ సనాతన ఋషి పరంపర వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు మానవ మనుగడ ఆదర్శప్రాయంగా సాగేదానికి మార్గ దర్శకాలు. పై సప్త మహనీయుల మూలంగా కొత మంచిని వ్రాయకలిగాను. విన్నవారు, చదివినవారు కొన్ని నిముషాలైనా మనం ఎవరం?... మన యధార్థ వునికి ఏమిటి?... ఎలా సమాజంలో నడుస్తున్నాము!... ఎలా నడుచుకోవాలి? అని ఆలోచించి ధర్మపధ వర్తనులుగా భావిలో వర్తించగలరని ఆశిస్తున్నాను.
మన భరత వాసులంతా సఖ్యతతో ఒకటిగా వర్తించి మన భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తలమాణక్యంగా ఆదర్శప్రాయంగా వెలుగొందేలా చేయడం మన అందరి కర్తవ్యం, విధి, ధర్మం.
సర్వేజనా సుగుణోభవంతు జై జై జయహో భారతావని... జయహో!!!
సమాప్తి
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
మర్యాద
[font="var(--ricos-font-family,unset)", serif] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
సుశ్రవస జయత్సేనుల కుమారుడు అవాచీనుడు తలిదండ్రుల సుపథాన్ని అనుసరిస్తూ, కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర వేద పురాణేతిహాసాల మూలాలను అభ్యసించాడు. వేద పురాణేతిహాసాలను అనుసరించి రాజ ధర్మం ను ఎలా అనుసరించాలో కూడా తెలుసు కున్నాడు. కాల ధర్మం యుగ ధర్మం, పురాణ ధర్మం, మానవ ధర్మం, మానవీయతా ధర్మం, జ్ఞాన ధర్మం వంటి ధర్మాల నడుమ వ్యత్యాసాన్ని తెలుసుకున్నాడు.
అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న. లలాట లిఖితం యుగ ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అన్న సుశ్రవస మాటలను ప్రజలందరూ మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, యుగ ధర్మాన్నే అనుసరించేవారు.
మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, పంతుళ్లు, పంతులమ్మలు కూడా యుగ ధర్మ మూలాలనే ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నించేవారు.
యుగ ధర్మ మూలాలను చక్కగా గ్రహించి, అనుసరించడానికి అందరూ సుశ్రవస దగ్గర కొంత కాలం శిక్షణ పొందాలనుకునేవారు.
తన తల్లి సుశ్రవసను సమస్త లోకం ఆదరించే విధానం చూసి అవాచీనుడు మిక్కిలి సంతోషించే వాడు. తన తల్లిని దర్శించుకునే ప్రజలందరు మహా అదృష్టవంతులు అనుకునేవాడు. తన తల్లి సుశ్రవస ప్రవచించే యుగ ధర్మ మార్గమే ఉత్తమ మార్గం అనుకునేవాడు.
ఒకనాడు సుశ్రవసను, జయత్సేనుని వారి కుల గురువు వశిష్ట మహర్షి కలిసాడు. ముగ్గురూ అవాచీనుని భవిష్యత్తు గురించి చర్చించసాగారు.
"అవాచీనుడు సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేయగల స్థాయికి ఎదిగాడు. సమస్త యుద్ద విద్యల తో పాటు వేద విద్యలను కూడ బాగానే వంట పట్టించు కున్నాడు. అతనికి పట్టాభిషేకం చేసే శుభ ఘడియలు ఆసన్నమైనవి" అని వశిష్ఠ మహర్షి సుశ్రవస జయత్సేనుల తో అన్నాడు.
వశిష్ట మహర్షి మాటలను విన్న జయత్సేనుడు "దేవి.. మీ అభిప్రాయం ఏమిటి?" అని సుశ్రవసను అడిగాడు.
"నాథ! వశిష్ట మహర్షి వారు మన వంశ పురోభివృద్ధి కోరుకునేవారు. వారి దివ్య వాక్కులు సదా ఆచరణీయమైనవి. మన అవాచీనుడు చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలడు. అతడు కొండల మీద వేగంగా పరిగెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొండలని కమ్మేసిన విష ధరుడనే రాక్షసుని సంహరించే నేపథ్యంలో అవాచీనుడు కొండల మీద వేగంగా పరుగులు తీసి విష ధరుని సంహరించాడు. అలాగే వనాల్లోని వృక్షముల మీద మన అవాచీనుడు వేగంగా పరుగులు తీసి అహంతుడనే అసురుని సంహరించాడు. ఇక భూమి మీద వేగంగా పరుగులు తీసి అనేకమంది శత్రువుల శిరములను మన రాజ్య దేవత అమ్మవారికి బలి ఇచ్చాడు.
మన అవాచీనుడు రాజ్య సంరక్షణ విషయంలో మహా వీరుడనే చెప్పాలి. అయితే ఎవరికి, ఎప్పుడు, ఎలా మర్యాదను ఇవ్వాలి అనే విషయం లో మన అవాచీనుడు నేర్చుకోవలసింది చాలా ఉంది" అని సుశ్రవస, భర్త జయత్సేనుడు తో అంది.
"అమ్మా సుశ్రవస! నిక్కము వక్కాణించావు. తల్లీ నిక్కము వక్కాణించావు. కుమారుని గుణగణాలను చక్కగా గుర్తించావు. పిల్లల గుణ గణాలను గుర్తించడంలో ఎవరైన తల్లి తర్వాతనే అనే వాస్తవాన్ని తెలియ చెప్పావు.
అవాచీనుడు అసలు మర్యాద తెలియని మనిషి అని అనలేం కానీ ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి అన్న విషయం లో నువ్వన్నట్లు కొంచెం తడబడుతుంటాడు.. ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో నువ్వే చెప్పు?" సుశ్రవస తో అన్నాడు వశిష్ట మహర్షి.
"మహర్షోత్తమ! మా విదర్భ దేశానికి చెందిన నా సోదరుని కుమార్తె మర్యాద అనే రాకుమార్తె ఉంది. ఆమె చిన్న తనం నుంచి మంచి వాతావరణం లో పెరిగి పెద్దదయ్యింది. తప్పు ఎవరు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం మర్యాదకు మెండుగ ఉంది. కొందరు ఆమెను ఆడ ప్రహ్లాదుడు అని అంటూ ఉంటారు.
మంచి చేసిన వారు చిన్నవారైన, పెద్ద వారైన వారిని తగిన విధంగా సత్కరిస్తుంది. మర్యాద పేరుకు తగిన విధంగా మంచి మర్యాద బాగా తెలిసిన మహిళామణి అని మా పుట్టింటివారి ద్వారా తెలుసుకున్నాను.
మర్యాద సూర్య వంశ రాజులకు, రాణులకు చంద్ర వంశ రాజులకు, రాణులకు యింకా వివిధ వంశాల రాజులకు, రాణులకు, తదితరవంశాల వారికి తగిన విధంగా మర్యాదలు చేసి వారి వారి మన్ననలను పొందిందట. అలాగే మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, సురులు, నరులు తదితరులందరికి తగిన విధంగా మర్యాదలు చేస్తూ వారివారి మన్ననలను పొందుతుందట.
ప్రతి సమాజానికి, సంస్కృతికి వాటి స్వంత మర్యాదలు అంటూ కొన్న ఉంటాయి. వాటిని గమనించి నడుచుకునే వారే చరిత్రలో నిజమైన మర్యాదస్తులుగా మిగిలిపోతారు. మర్యాద కు ఎక్కడ ఎలా మసలు కోవాలో బాగా తెలుసునట. అలాంటి యువతి అవాచీనునికి భార్య అయితే అతనిలో చాలా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం. మర్యాద అవాచీనుల విషయం లో మీరే పెళ్లి పెద్ద కావాలి. '" అని సుశ్రవస వశిష్ట మహర్షి తో అంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"అమ్మా సుశ్రవస.. నీ ఆలోచన దివ్యంగా ఉంది. అవాచీనుని పెళ్ళి విషయంలో నేనే పెళ్ళి పెద్దను అవుతాను” సుశ్రవసతో అన్నాడు వశిష్ట మహర్షి.
సుశ్రవస జయత్సేనుని వద్ద సెలవు తీసుకున్న వశిష్ట మహర్షి విదర్భ రాజ్యానికి వెళ్లాడు. రాజ్యం లోని ప్రజలందరూ వశిష్ట మహర్షి ని సాదరంగా ఆహ్వానించారు. వారికి ఆ సద్గుణం మర్యాద వలన వచ్చిందని పదుగురు చెప్పగా వశిష్ట మహర్షి విన్నాడు. విదర్భ రాజు వశిష్ట మహర్షి ని ఉచిత ఆసనం ఇచ్చి తగిన విధంగా సత్కరించాడు.
అనంతరం విదర్భ రాజు తన సోదరి సుశ్రవస యోగ క్షేమాల గురించి వశిష్ట మహర్షి ని అడిగి తెలుసుకున్నాడు. తన కుమార్తె మర్యాద యాగశాల ల్లో మహర్షులకు చేస్తున్న సేవలను రాజు వశిష్ట మహర్షి కి ప్రత్యక్షంగా చూపించాడు.
మహర్షులకు మర్యాద చేసే మర్యాదలు వశిష్ట మహర్షి ని బాగా ఆకర్షించాయి. అవాచీనునికి తగిన భార్య మర్యాద యే అని వశిష్ట మహర్షి మనసులో అనుకున్నాడు. తను వచ్చిన విషయాన్ని వశిష్ట మహర్షి విదర్భ రాజు కు చెప్పాడు. తన మనసులోని కోరిక అదే అవ్వడంతో విదర్భ రాజు మిక్కిలి సంతోషించాడు.
తన తండ్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్న మర్యాద వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించింది. అనంతరం "మహర్షోత్తమ! రాజ్యం లో రాజూ, రాణీ అలాగే ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజ్యాభివృద్ధికి సిరిసంపదలు ఎంత ముఖ్యమో మంచి మర్యాద తెలిసిన రాజు రాణి ప్రజలకు అంత ముఖ్యం. కొండంత బంగారం కన్నా కూసింత మర్యాద మిన్న. ప్రజలు ఉన్నవాడిని ముఖం ముందు పొగిడితే మంచి మర్యాద తెలిసిన వాడిని అన్నిచోట్ల పొగుడుతారు.
అలాగని పరుల పొగడ్తల నిమిత్తం మంచి మర్యాదలు ఉన్నట్లు నటించ రాదు. మంచి మర్యాదలు అనేవి మనసు నుంచి పుట్టాలి కానీ ఆడంబరం నుంచి పుట్ట రాదు. ఇది నాకు అలవడిన గుణం" అని మర్యాద వశిష్ట మహర్షి తో అంది.
మర్యాద మనస్తత్వం తెలుసుకున్న వశిష్ట మహర్షి పెద్దలందరితో సంప్రదింపులు జరిపి మర్యాద అవాచీనుల వివాహం జరిపించాడు.
మర్యాద తన భర్త అవాచీనుని మనస్తత్వం గ్రహించింది. ప్రజల దగ్గర, సామంత రాజుల దగ్గర, అధికారుల దగ్గర, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో మర్యాద తన భర్త అవాచీనునికి దగ్గర ఉండి నేర్పించింది.
తన భార్య మర్యాద ఆచరించి చూపించే సమస్త కార్యక్రమాలు అవాచీనునికి బాగా నచ్చాయి. మర్యాద ప్రజలను ఆదరించే తీరు అవాచీనునికి బాగా నచ్చింది.
ఒకసారి రాజ్యంలోని అధిక శాతం మంది మనుషులకు అంటు వ్యాధులు సోకాయి. అప్పుడు మర్యాద ప్రజల అంటు వ్యాధులను రూపుమాపేందుకు ముందడుగు వేసింది.
అప్పుడు ఆమెకు హిమాలయ పర్వతాలలో ఉన్న సురదళాలు అవసరమయ్యాయి. అదే విషయాన్ని మర్యాద తన భర్త అవాచీనునికి చెప్పింది. అవాచీనుడు గాలి కంటే వేగంగా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడి సుర దళాలను తీసుకుని వచ్చి మర్యాదకు ఇచ్చాడు. మర్యాద ఆ సురదళాలతో ప్రజల అంటు వ్యాధులను నయం చేసింది. ప్రజలందరూ మర్యాద అవాచీనులను దైవాలకన్నా మిన్నగా చూసారు.
సుశ్రవస, జయత్సేనుడు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న అవాచీనునికి పట్టాభిషేకం చేసారు.
మర్యాద అవాచీనుల సంతానం అరిహుడు.
[font="var(--ricos-font-family,unset)", serif] [/font]
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆంగి
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
మర్యాద అవాచీనుల సుపుత్రుడు అరిహుడు. తన తలిదండ్రుల ప్రేమాభిమానాలను అరిహుడు అమితంగా పొందాడు. అంతేగాక వారి గుణగణాలను సహితం పుణికి పుచ్చుకున్నాడు. కుల గురువు వశిష్ట మహర్షి వద్ద సమస్త విద్యలను అభ్యసించాడు. తలిదండ్రుల మాటలను అనుసరించి అభ్యసించిన విద్యల ఫలాన్ని ప్రజలకు పంచాడు. కుల గురువు వశిష్ట మహర్షి మాటలను అనుసరించి తన తపో సామర్థ్యాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాడు. తన తపోశక్తి తో దేవ లోకాలన్నిటిని సందర్శించి వచ్చాడు.
తన తలిదండ్రుల మంచితనాన్ని అలుసు గ తీసుకుని కొందరు సామంత రాజులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని అరిహుడు గమనించాడు.
కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం అరిహుడు విచ్చలవిడిగా ప్రవర్తించే సామంత రాజులను, అధికార మదంతో విర్రవీగేవారిని ముందుగా సున్నితంగా హెచ్చరించాడు. అతని సున్నిత హెచ్చరిక ఆంతర్యం అర్దం చేసుకుని కొందరు సామంత రాజులు, అధికారులు తమ ప్రవర్తనను మార్చుకున్నారు. మరికొందరు సామంత రాజులు, అధికారులు అరిహుని ఆగ్రహోదగ్ర హెచ్చరికను చూసి మారారు.
పదుల సంఖ్యలో సామంత రాజులు, అధికారులు అరిహుని సున్నిత హెచ్చరికను, ఆగ్రహోదగ్ర హెచ్చరికను అసలు పట్టించుకోలేదు. వారు అరిహుని పై యుద్దాన్ని ప్రకటించడానికి సిద్దమయ్యారు. అది తెలుసుకున్న అరిహుడు శత్రువుల కంటే ముందుగానే తను యుద్దాన్ని ప్రకటించాడు.
ఆ యుద్దంలో అరిహుడు తండసిరి, బండనాథ, గుండుగండి వంటి రాజులను ఓడించాడు. వారిని తన దారికి తెచ్చుకున్నాడు. మహా పరాక్రమ వంతులైన తండసిరి, బండనాథ, గుండుగండిలను అరిహుడు ఓడించాడని తెలియగానే మిగతా రాజులందరూ భయంతో అరిహునికి బానిసలయ్యారు.
అరిహుడు చుట్టుపక్కల రాజ్యాల రాజులందరిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. యుద్దంలో తనకు తగిలిన గాయాలకు అరిహుడు రాజ వైద్యుల దగ్గర తగిన లేపనాలను తీసుకున్నాడు. ఆ సమయంలో అరిహుని తో ధన్వి అనే రాజ వైద్యుడు, ' మహారాజ! సమరంలో శత్రువుకు ఎదురుగా మహా ధైర్యం తో నిలిచిన వారి తనువుకు గాయాలు అవ్వడం సహజం.
అలాగే సమరానంతరం చికిత్స పొందడం సహజం. అయితే ఆంగి అనే రాజ కుమార్తె తనువుకు పూసే లేపనము వలన సమరమున కరవాల దెబ్బలు తగిలిన ఆ తనువుకు గాయములు కావు. అలాంటి దివ్య ఔషదం ను తయారు చేసే విద్య ఆంగి కి ఉంది. నేను ఆమెను ఒకసారి కలిసాను. ఆమె తయారు చేసిన లేపనం చూసాను. ఆ లేపన ప్రభావం అద్భుతమనే చెప్పాలి. నేనెంత ప్రయత్నం చేసిన ఆ లేపనం తయారు చేయలేక పోయాను " అని అన్నాడు.
ధన్వి మాటలను విన్న అరిహుడు ఆంగి యొక్క పూర్తి సమాచారం సేకరించాడు. అలాగే ఆంగి చిత్రకి పటమును తెప్పించాడు. ఆంగి చిత్ర పటమును అరిహుడు తలిదండ్రులకు చూపించాడు.
మర్యాద అవాచీనులు అరిహునికి పట్టాభిషేకం జరిపించారు. ఆ పట్టాభిషేక మహోత్సవానికి ఆంగి కూడ వచ్చింది. మర్యాద ఆంగి విశ్రాంతి తీసకోవడానికి ప్రత్యేక అంతఃపుర మందిరాన్ని ఏర్పాటు చేసింది.
అరిహుని పట్టాభిషేక మహోత్సవం ముగిసిన పిమ్మట మర్యాద ఆంగిని తన కుమారుడు అరిహుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ఉద్యానవనం నకు తీసుకు వెళ్ళింది.
ఆంగి సువాసనలు విరజిమ్మే అరిహుని ఉద్యానవనం ను చూసింది. అక్కడి పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసి మైమరసిపోయింది. అక్కడ అనేక రకాల దేవతా వృక్షాలు ఉన్నట్లు గ్రహించింది. అక్కడి దేవతా వృక్షాల చరిత్ర గురించి ఆంగి మర్యాదను అడిగింది.
మర్యాద ఆంగికి అక్కడి దేవతా వృక్షాలను చూపిస్తూ, తన కుమారుడు అరిహుడు వైకుంఠం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో, కైలాసం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో, బ్రహ్మ లోకం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో వివరించి చెప్పింది. అక్కడి దేవతా వృక్షాలను చూసిన ఆంగి వాటిని ఉపయోగించి జీవాల తనూ తేజం ఎలా పెంచుకోవచ్చునో మర్యాదకు వివరించి చెప్పింది.
మర్యాద అవాచీనులు ఆంగి తలిదండ్రులను సంప్రదించి ఆంగిని తమ కోడలిగ చేసుకోవడానికి తమ సుముఖతను చూపించారు. ఆంగి కూడ అరిహుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది.
ఆంగి అరిహుల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఆంగి అరిహులు కొంత కాలం పాటు ప్రముఖ పుణ్య క్షేత్రాలను అన్నిటిని సందర్శించి వచ్చారు. అనంతరం అరిహుడు ఆంగికి తన ఉద్యానవనం లో ప్రత్యేక మందిరాన్ని కట్టి ఇచ్చాడు.
ఆంగి ఉద్యానవనం లోని సుర తరు దళాలను ఉపయోగించి అనేక రకాల ఔషదాలను తయారు చేసింది. ఆ ఔషదాల ప్రభావం తో తమ రాజ్యం లోని సైనికులందరు ధృడమైన శరీరం కలవారయ్యారు. కరవాల దెబ్బలను కూడా తట్టుకోగల శరీరం కలవారయ్యారు.
ఆంగి అరిహులకు పండంటి మగ శిశువు జన్మించాడు. అతని పేరు మహా భౌముడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సుపుష్ట
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
రాజా ప్రసేన జిత్ రాజ్యంలో గో సంపద సంవృద్దిగా ఉండేది. ప్రసేన జిత్ రాజ్యంలోని నిరు పేదలందరికి గోదానం చేసి, వారికి బతుకు తెరువు కల్పించాడు. ప్రసేన జిత్ భార్య మహా భామ కూడా గోపూజ చేయడం అంటే మిక్కిలి మక్కువ చూపించేది.
సంతానం కోసం ఆ పుణ్య దంపతులు అనేక నోములు నోచారు. క్రమం తప్పకుండా గో పూజలు జరిపించారు. అన్నదానాలు చేసారు. ధన కనక వస్త్ర దానాలు చేసారు. యజ్ఞ యాగాదులను చేయించారు. మహర్షుల సభలను, సుకవుల సభలను, కళాకారుల సభలను ఏర్పాటు చేసి వారిని తగిన విధంగా సత్కరించారు. వారి సత్కార్యాల ఫలంగా వారికి శ్రీవాణీగిరిజల తేజం తో ఒక ఆడ శిశువు పుట్టింది. ఆడ శిశువు ను చూసి ఆ పుణ్య దంపతులు మహా మురిసి పోయారు. జ్యోతిష్య పండితులను పిలిచి శిశువు జాతకం చూపించారు. జ్యోతిష్య పండితుల సూచన మేర శిశువుకు సుపుష్ట అని నామ ధేయం చేసారు.
మహా భామ, ప్రసేన జిత్ పుణ్య దంపతులు సుపుష్టను అల్లారు ముద్దుగా పెంచసాగారు. సుపుష్ట గురువుల దగ్గర వేదవేదాంగాది సమస్త విద్యలను అభ్యసించింది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ధర్మాన్ని అనుసరించి తను ఆరోగ్యం గా ఉంటూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి తన వంతు సహాయం నిరంతరం అందించసాగింది. తన రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూసింది. యుద్ద విద్యలందుకూడ మంచి నైపుణ్యాన్ని సంపాదించింది.
సుపుష్ట అశ్వగజరథాదుల మీద నిలబడి శత్రువులను చీల్చి చెండాడటం లో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. అశ్వం మీద, గజం మీద నిలబడి యుద్దం చేసే విద్యలో ఆ రోజుల్లో సుపుష్ట ఒక్కతే మహా నైపుణ్యం గల వీరనారి అని సుపుష్ట శత్రువులు సహితం అనుకునేవారు.
సుపుష్ట అనేక రకాల గోపూజలు చేసింది. గోలోకం సందర్శించి వచ్చింది.
సుపుష్ట పరుల శక్తి సామర్థ్యాలను, మంచి చెడులను ధృవీకరించడంలో ఎప్పుడూ తప్పటడుగు వేసేది కాదు. ఆమెను మంచి మాటలతో మోసం చేయాలని ప్రయత్నించే వారే కడకు మోసపోయేవారు.
ఒకసారి నిగమ కంఠుడు అనేవాడు సుపుష్ట దగ్గరకు వచ్చి, "అమ్మా సుపుష్ట, నేను వేదాలన్నిటిని ఔపాసన పట్టాను. ఉదరవ్యాది తో బాధ పడుతున్నాను. నిరుపేదను. నన్ను ఆదుకుని నా ప్రాణాలను రక్షించు. " అని అన్నాడు.
నిగమ కంఠుని వాలకం గమనించిన సుపుష్ట నిగమ కంఠుడు పని దొంగ అని గమనించింది. అంత నిగమ కంఠుని వేద పాఠశాల లో ఉండమంది. నిగమ కంఠుడు అలాగేనని వేద పాఠశాల లో ఉన్నాడు.
వేద పాఠశాల లోని విద్యార్థులు నిగమ కంఠుని వేద మంత్రాల గురించి అడగసాగారు. అప్పుడు నిగమ కంఠుడు "వేద మంత్రాలన్నీ చచ్చు మంత్రాలు. వాటిని చదివితే అనారోగ్యం మెండుగా దండిగా వస్తుంది. ఫలితం ఇసుమంతైనా రాదు. దేవుడు లేడు. గీముడు లేడు. నాలాంటి వారిని దేవునిగా కొలిచేవారికే మేలు జరుగుతుంది. ఇవి దొంగ మాటలు కావు. జ్యోతిష్య శాస్త్ర మాటలు. ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు. ముందు జాగ్రత్త తో మెలగాలి. రేపటిని తలచుకుని భయంతో మరింత అధికంగా సంపాదించాలి " అని అన్నాడు.
నిగమ కంఠుని గురించి విద్యార్థులు చెప్పిన మాటలను విన్న సుపుష్ట తను ఊహించినట్లుగానే నిగమ కంఠుడు వేదం కూడా చదవలేదని గ్రహించింది. అనంతరం సుపుష్ట నిగమ కంఠుని గోశాలలో ఉండమంది. అలాగే అని నిగమ కంఠుడు గోశాల కు వెళ్ళాడు. అక్కడ నిగమ కంఠుడు గోవులను కాసే గోపాలుర వృత్తిని కించపరిచాడు..
అప్పుడు గోపాలురు నిగమ కంఠుని చేతికి ముల్లుకర్రను ఇచ్చి, “మీకు ఇష్టమైన వృత్తిని నీతి తప్పకుండా మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేయండి” అని అన్నారు.
నిగమ కంఠుడు “నాకు ఉదర సంబంధ వ్యాధి ఉంది. నేను ఏ పనీ చేయలేను” అన్నాడు.
అప్పుడు గోపాలురు "అయ్యా! ఎన్ని చిన్న చిన్న వ్యాధులు తన శరీరానికి సోకినా గోమాత గడ్డి మేసి పాలు ఇస్తుంది. ఆ పాలను మనం తాగుతున్నాము. యజ్ఞ యాగాదులలో ఉపయోగిస్తున్నాము. ఇంకా రకరకాలుగా గో క్షీరాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇలా గోమాత మనకు ఉపయోగపడుతుంది. మరి నేను ఎలా ఎవరికి ఉపయోగ పడతాను? అని మీరు ఆలోచించరా? మన యువరాణి సుపుష్టమ్మ గారు మీకు ఏ వ్యాధీ లేదు. మీరు పనిదొంగ అని ఏనాడో ధృవీకరించారు. మీలో మార్పు కోసం వారు మిమ్మల్ని ఇక్కడకు పంపారు. మీరు ఇక్కడ కూడా మారకుంటే, తదుపరి మీకు వరాహ సంరక్షణ బాధ్యతను అప్పగిస్తారు. "అని అన్నారు.
గోపాలుర మాటలను విన్న నిగమ కంఠుడు భయపడ్డాడు. సుపుష్ట గోపాలురను కలిసి నిగమ కంఠుని మాటల గురించి తెలుసుకుంది. అలాగే నిగమ కంఠుని తో గోపాలురు అన్న మాటలను కూడా తెలుసుకుంది. అనంతరం నిగమ కంఠుని కలిసింది.
"నిగమ కంఠ, నీలో అనుమానం, భయం అధికం. కారణం నువ్వు పని దొంగవు కావడం. తన శక్తి మేర ఏదో ఒక పని చేసేవానికి అనుమానం, భయం ఉండవు.
తన మీద తనకు నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలం దక్కలేదని అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. అసలు పని చేయకుండా అసంతృప్తి తో సమాజాన్ని నిందించేవారి వలననే సమాజంలో హింస, మోసం, దుర్మార్గం, కపటత్వం, నయవంచన, దైవనింద వంటి జాడ్యాలు పెరుగుతాయి. నువ్వు ఆ మార్గాన సంచరించకు" అని నిగమ కంఠుని తో సుపుష్ట అంది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,750 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
నిగమ కంఠుడు బుద్ది తెచ్చుకుని గోసంరక్షణ చేస్తూ సుపుష్ట మన్ననలను అందుకున్నాడు. సుపుష్ట కీర్తి ప్రతిష్టల గురించి ఆంగి అరిహుల కుమారుడు మహా భౌమునికి తెలిసింది. మహా భౌముడు సుపుష్ట చిత్ర పటమును తెప్పించి చూసాడు.
మహా భౌముని కి సుపుష్ట నచ్చింది. చిత్ర పటమును తలిదండ్రుల కు చూపించాడు. సుపుష్ట రూపం అందరికి నచ్చింది.
అరిహుడు మహా భౌముని చిత్ర పటమును ప్రసేన జిత్ కు పంపాడు. మా కుమారుడు మీకు నచ్చితే మీతో వియ్యమందడానికి సంసిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపాడు. ప్రసేన జిత్ వర్త మానం తీసుకు వచ్చినవానికి వివిధ రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి నూతన వస్త్రాదులతో సన్మానించాడు. త్వరలోనే శుభ సందేశం పంపుతామని అరిహ మహా రాజు కు చెప్పండి అని అన్నాడు. అనంతరం ప్రసేన జిత్ ముద్దుల కుమార్తె సుపుష్టకు, తన భార్యకు మహా భౌముని చిత్ర పటం చూపించాడు.
సుపుష్ట మహా భౌముని చిత్ర పటం చూసింది. మహా భౌమునిలోని సాత్విక రాజసం ఆమెకు నచ్చింది. ఆ రాజసంలోని మంచి చెడులన్నిటి గురించి చెలికత్తెలతో చర్చించింది.
సుపుష్ట తండ్రి ప్రసేన జిత్ తో, "తండ్రీ.. కాబోయే మహా భౌమ రాజు నాకు తెలిసి అన్ని విషయాలలో నాకు తగిన వాడే అని అనిపిస్తుంది. అయితే మహా భౌమునిలో కించిత్ యాగ తేజం స్వల్పం గా ఉందని నాకు అనిపిస్తుంది. వారిని ముందుగా సుపుష్ట యాగం చేయమని వర్తమానం పంపండి" అని అంది.
ప్రసేన జిత్ సుపుష్ట అభిప్రాయాన్ని అరిహునికి తెలియ చేసాడు. అరిహుడు సుపుష్ట యాగం గురించి సంపూర్ణ సమాచారం తెలుసుకు రమ్మని కుల గురువు వశిష్ట మహర్షిని సుపుష్ట దగ్గరకు పంపాడు.
వశిష్ట మహర్షి ప్రసేన జిత్ ను సుపుష్టను కలి సాడు. వశిష్ట మహర్షి ని ప్రసేన జిత్ తగిన రీతిలో సత్కరించాడు. అనంతరం సుపుష్ట, వశిష్ట మహర్షి సుపుష్ట యాగం గురించి చర్చించుకున్నారు. సుపుష్ట యాగం వలన రాజ్యానికి, రాజుకు జరిగే పుష్టి ఫలితాల గురించి కూడా ముచ్చటించు కున్నారు. వారి ముచ్చట్ల లో గోలోక ప్రస్తావన వచ్చింది. వివిధ రకాల గోవులిచ్చే క్షీర ప్రస్తావన కూడా వచ్చింది.
కుల గురువు వశిష్ట మహర్షి ఆధ్వర్యంలో అరిహ మహారాజు సుపుష్ట యాగం జరిపించాడు. ఆ యాగానికి ప్రసేన జిత్ మహారాజు, అతని భార్య, సుపుష్ట, ప్రసేన జిత్ బంధువులు, తదితరులందరూ వచ్చారు.. ఆ యాగంలో గోవులు కూడా ప్రధాన పాత్ర వహించాయి.
యాగ అనంతరం అరిహ మహారాజు తన కుమారుడు మహా భౌమునికి పట్టాభిషేక మహోత్సవం కూడా జరిపించాడు. ఆ రెండు శుభ కార్యాల్లో సుపుష్ట ప్రధాన పాత్ర వహించింది. శుభ కార్య సమయంలో సుపుష్ట మహా భౌముని తో గోవులను పరిశుభ్రం చేయించింది. సురభి మార్తాండ సంతానమైన గోవుల సంరక్షణలో మెలకువలు గురించి. ముచ్చటించింది. శాస్త్రోక్తంగా గో పూజ చేయించింది.
మహా భౌముడు సుపుష్ట చేయించిన గో పూజ ప్రభావాన, గోవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుని, మూపురం లో శివుని, పాదాలలో దేవతలను, కడుపులో అగ్ని దేవుని, పాల పొదుగు లో సరస్వతీ దేవినీ, పాలలో బ్రహ్మ దేవుని, కన్నులలో సూర్య నారాయణుని గోవు తదితర అవయవాలలో లక్ష్మీ దేవిని, పార్వతీ దేవుని, భృగుని, సిద్దులను, యమ ధర్మరాజు ను, మహా విష్ణువు ను తదితర దేవతలందరిని చూసాడు.
మహా భౌముని రాజ్యంలోని ప్రజలందరూ సుపుష్టను సుపుష్ట అని కాకుండా. సుయజ్ఞ అని పిలవ సాగారు. మంచి శుభ ముహూర్తాన సుపుష్ట మహా భౌముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మహా భౌముని రాజ్యంలోని ప్రజలు మాత్రం సుపుష్టను సుయజ్ఞ మహారాణి అనే పిలవ సాగారు.
ఆ పుణ్య దంపతుల కుమారుడు ఆయుతానీకుడు.
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|