Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"ఇదేదో మంచి అవకాశమే ఉన్నట్టుంది కదా" అన్నట్టున్నాయి అరుంధతి చూపులు.
"సైన్సు చెప్పేవాళ్ళకు మీరెంతిస్తారు బాబు?" అంది అరుంధతి.
"ఇరవై వేలిస్తామమ్మా" అన్నాడు టక్కున.
"అయ్యో... మీరు సైన్సు టీచర్ గా రిటైరైనా బాగుండేది" అన్నట్టు మరోసారి చూసింది అరుంధతి.
"సరే... నా నిర్ణయం రేపు చెప్తాను" అన్నాడు పరంధామయ్య.
"చెప్పటం కాదు. మీరు తప్పక రావాలి... వస్తున్నారు" అనేసి వెళ్ళిపోయాడు జయశంకర్.
పరంధామయ్య నిట్టూర్చి 'ఏమంటావ్' అన్నట్టుగా చూశాడు.
"ఒక్కసారిగా ఇంట్లోనే ఉండాలంటే మీక్కూడా బోర్ గా ఉంటుందేమో. మంచి అవకాశం అదీగాక వెతుక్కుంటూ వచ్చాడు. ఆలోచించండి. చేతనవుతుందనుకుంటే మీ ఇష్టం..." అంది.
కాసేపు ఆలోచించాక... కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య.
***
నాలుగు నెలలు గడిచాయి.
అరుంధతికి ఉన్నట్టుండి ఓ రోజు చాతిలో నొప్పి ప్రారంభమైంది. ఆరోజు ఆదివారం కావడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు. స్ట్రోక్ ఎక్కువవటంతో హడావిడిగా తరలించారు. ఆ దృశ్యం చూసి పిల్లలు సైతం ఏడుపు మొదలెట్టారు. నానమ్మకేమో అయిందని.
ఆటోలో ఓ ఆస్పత్రికెళ్ళగానే... ఆదివారం కావటంతో డాక్టర్లెవరూ లేక ఓ జూనియర్ డాక్టర్ అన్నిరకాల టెస్టులూ చేశాడు. పరంధామయ్యలో ఆందోళన పెరుగుతుంటే కొడుకు, కోడలు ధైర్యం చెబుతున్నారు.
అరగంట తరువాత జూనియర్ డాక్టర్ ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం మంచిదని చెప్పి - "ఈ రోజు డాక్టర్లెవరూ లేరు. హైదరాబాద్ తీసికెళ్ళండి" అని చెప్పాడు.
అది విని సరోజిని "నా క్లాస్ మెట్ శ్రీలక్ష్మి ఈ ఊర్లోనే డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టింది మావయ్య. తను కూడా హార్ట్ స్పెషలిస్టు. ఆదివారమైనా కూడా నాకోసం తప్పకుండా పరీక్ష చేస్తుంది. అక్కడికెళ్దాం" అంది ఆదుర్దాగా. రాము కూడా అక్కడికే వెళ్దాం అనటంతో మళ్ళీ ఆటోలో శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ కి తరలించారు.
సరోజిని తన ఫ్రెండ్ అయిన శ్రీలక్ష్మిని కల్సింది. ఆమె హడావిడిగా వచ్చీ రాగానే అరుంధతి నాలుక కింద ఓ టాబ్లెట్ ఉంచింది. పది నిమిషాల్లో నొప్పి క్రమంగా తగ్గాక అన్ని రకాల పరీక్షలూ చేసింది.
"ఈవిడకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సినంత అవసరం లేదు. మెడిసిన్స్ రాసిస్తాను. వాడండి" అంది. తరువాత శ్రీలక్ష్మిఎంతకీ ఫీజు తీసుకోలేదు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
17-03-2025, 05:10 PM
(This post was last modified: 17-03-2025, 05:13 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అరుంధతి మామూలైపోయినా మొహంలో ఆందోళన ఇంకా తగ్గలేదు. తిరిగి అంతా ఇంటికి బయల్దేరారు. పరంధామయ్య రిలీఫ్ గా నిట్టూర్చారు. కానీ... ఆరాత్రే అనుకోని ఘోరం జరిగిపోయింది.
అరుంధతి గుండెల్లో మరోసారి వచ్చిన నొప్పి... ప్రాణాల్ని పైపైనే తోడేసింది. నొప్పి తీవ్రమవుతుంటే బాధగా, నిస్సహాయంగా భర్త వైపు, కొడుకూ, కోడలి వైపూ, పిల్లలవైపు చూస్తూనే చనిపోయింది.
నెలరోజులదాకా ఆ ఇంట్లో స్మశాన స్తబ్ధత విలయతాండవం చేసింది. తరువాత అరుంధతి జ్ఞాపకాలు ఇంట్లో రోజురోజుకీ బాధపెడుతుంటే కనీసం కాలేజికెళ్తేనన్నా బావుంటుందేమోనని బయల్దేరాడు పరంధామయ్య, అప్పటికే తనూ వెళ్ళిపోవడానికి తయారైన వైదేహి సూట్ కేస్ తో వచ్చింది.
"నాన్న... నేనూ వెళ్తున్నాను. ఆయనకి వంటకి ఇబ్బంది అవుతుంది" అంది.
" సరేనమ్మా... మీ అన్నయ్య క్యాంపులకీ, మీ వదిన ఆఫీస్ కీ, పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళాక నాక్కూడా ఈ ఇంట్లో మీ అమ్మ జ్ఞాపకాలు బాధపెడుతున్నాయి. అందుకే నేను కూడా మళ్ళీ ఈ రోజు నుంచి కాలేజీకెళ్తున్నాను" అన్నాడు.
"సరే నాన్నా..." అంటూ ఆగింది.
"ఏంటమ్మా... బస్టాండ్ వరకూ రావాలా?" అనడిగాడు.
"అదికాదు నాన్నా. ఆరోజు నేనొచ్చేసరికి అమ్మని పాడెపై ఉంచారు. అమ్మ మీద నాలుగు తులాల పుస్తెలతాడు ఉండాలి. అన్నయో, వదినో తీసుంటారు. తల్లి మీది సొమ్ములు కూతురికే చెందుతాయని ఆయన వచ్చేటప్పుడు చెప్పారు" అంది.
పరంధామయ్య మనసులో గుండు పిన్నుతో గుచ్చినట్లయింది.
"మీ అమ్మ చనిపోయిన బాధలో నాకా విషయమే తెలీదు. బహుశా సరోజిని తీసుండొచ్చు. మళ్ళీ వచ్చిన్రోజు ఆ విషయం ఆలోచిద్దామమ్మా" అన్నాడు బయల్దేరుతూ.
"వదిన మాటవరసకైనా ఈ ప్రస్తావన తేలేదు నాన్నా" అంది కొంచెం కోపంగా.
"మీ అమ్మ పోయాక ఇంటిపని, వంటపని, ఆఫీస్ తో సరోజినిక్కూడా తీరికలేదమ్మా మర్చిపోయిందేమో. ఆమె అలాంటిది కాదులే" అన్నాడు. బయటికి వచ్చాక ఆటోని పిలిచి వైదేహినెక్కించాడు.
కాసేపు ఆలోచించాకా... కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య.
***
ప్రిన్సిపల్ జయశంకర్ అటెండర్ తో పరంధామయ్యని తన గదిలోకి పిలిపించాడు. అప్పటికే స్టాఫ్ మీటింగ్ ప్రారంభమైంది. పరంధామయ్య గదిలోకి రాగానే, "కూచోండి మీరు ఇంటర్ ఫస్టియర్ లో సుజల అనే అమ్మాయిని చాలా సీరియస్సయ్యార్ట" అనడిగాడు.
"అవునండీ. ఆ అమ్మాయి ప్రవర్తన బాగాలేదు. ఆపిల్లతో క్లాసంతా డిస్టర్బ్ అవుతోంది అన్నాడు.
"అంతమాత్రానికే మీరు సీరియస్సయితే ఎలాగండీ? ఒకవేళ ఆ అమ్మాయి వేరే కాలేజీలో జాయినైతే ఎంత నష్టమో తెల్సా? ఏటా ముఫ్ఫయ్ అయిదువేలు, అంటే అంటే రెండేళ్ళకి డెబ్బయ్ వేలు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఎవర్నీ ఏమి అనకండి. ఇక మీరు వెళ్ళొచ్చు" అన్నాడు కొంత సీరియస్ గా.
పరంధామయ్యకి మిగతా స్టాఫ్ ముందు అవమానంగా అనిపించింది. లేచి వస్తుంటే వెనకనించి జయశంకర్ మాటలు విన్పించాయి. "వీళ్ళబ్బాయి నా క్లాస్ మెట్ కమ్ రూమ్మేట్. మా నాన్న ఖాళీగా ఉంటున్నార్రా. నీ కాలేజీలో జాయిన్ చేస్కో అని పోరుపెడితే తీసుకున్నా. కాని ఈ ముసలాడు చెప్పే హిందీకి ఆ మూడువేలు కూడా వేస్టే" అన్నాడు.
పరంధామయ్య నిశ్చేష్టుడయ్యాడు. రిటైరయ్యాక కూడా తన కొడుకు తన సంపాదనపై...???
ఇంకా ఆలోచించలేకపోయాడు.
కాలేజీ నించి బయటపడి, రోడ్డుపైకొచ్చాడు.
భారంగా ఇంటివైపు నడక సాగిస్తుంటే "నమస్కారం మేస్టారూ. నేను అటే వెళ్తున్నాను. కూచోండి" అని స్కూటర్ ఆపాడు ఓ అబ్బాయి.
పరంధామయ్య అనుమానంగా చూస్తుంటే "నేను ఒకప్పుడు మీ స్టూడెంట్ ని. ఇప్పుడు డాక్టర్ నయ్యాను. శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాను.
స్కూటరెక్కండి. ఇంటిదగ్గర దింపేస్తాను." అనటంతో పరంధామయ్య కూచున్నాడు.
స్కూటర్ వేగంగా నడుపుతూనే అతడు "మాస్టారూ... మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను" అన్నాడు.
"చెప్పు బాబూ!"
"అమ్మగార్ని ఆ రోజు హాస్పిటల్ కి తీసికొచ్చాక నిజానికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. కాని మీ కోడలు, డాక్టరమ్మ ఫ్రెండవడంతో 'రేపో మాపో చచ్చే ఈ ముసలావిడకి హార్ట్ సర్జరీ చేసి రెండు లక్షలు ఖర్చు చేయటం ఎందుకని ఒప్పించింది." అన్నాడు.
పరంధామయ్య గుండెల్లో బ్లాస్టింగ్ లా పేలిందామాట.
కళ్ళు చీకట్లు కమ్మాయి.
ఇంకా అతడేదో చెప్తున్నా విన్పించట్లేదు. పావుగంటలో అతడు ఇంటి ముందు దింపేసి వెళ్ళాడు.
ఇంట్లోకి నడిచే ఓపిక కూడా లేక వరండాలోని వాలు కుర్చీలో కూలబడ్డాడు.
మనసు అల్లకల్లోలమైంది.
ఇంటిముందు క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా వచ్చి "తాతయ్యా... మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి?" అనడిగారు.
"బుకీలంటే ఎవరు తాతయ్య?" అనడిగాడు మరో మనవడు.
"బుకీలంటే... ఆ డాక్టరమ్మా, ఆ ప్రిన్సిపాలూ, నా అల్లుడు రా... మానవ సంబంధాలపై బెట్టింగ్ ఆడుతున్నారే మీ అమ్మ, మీ ఆంటీ వీళ్ళంతా ఫిక్సర్లు, జాతినీ, దేశాన్నీ ప్రేమించే సంస్కృతి కనుమరుగైపోతుంటే ఆటలే కాదు. కుటుంబాలే విచ్చిన్నమైపోతాయ్. ఇంతకన్నా విచారకరమైంది మరేదీ కాదేమో. ఇంతకన్నా శాంతిభద్రతల సమస్య ఇంకేది లేదేమో. ఆటకన్నా కుటుంబం చాలా గొప్పది. మానవీయ మూలాల్ని చెల్లాచెదురు చేసే ఈ ఫిక్సింగ్ లని ఎదుర్కోవడానికి ముందు ముందు మీరు అగ్ని పరీక్షలే కాదు, అణుపరీక్షల్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్రా పిల్లలూ..." పరంధామయ్య చెప్పలేదు.
మనసు ఘోషించింది.
కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతమయ్యాయి.
"అదేంటి తాతయ్యా... మ్యాచ్ ఫిక్సింగ్ గురించి అడిగితే నువ్వేడుస్తున్నావ్?"
అన్నారు భుజాలు పట్టి కుదుపుతూ...
అతడి కళ్ళు మూతపడ్డాయి. వాలు కుర్చీలోనే ఒరిగిపోయాడు. 'మ్యాచ్ ఫిక్సింగ్' అంటే తాతయ్యకి కూడా తెలీక నిద్రపోయాడనికొని... వాళ్ళు క్రికెట్ ఆటలో మునిగిపోయారు...
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
మంచులోయ - ఒమ్మి రమేష్ బాబు
చలికాలంలో అరకువ్యాలీ మంచులోగిలిలా వుంది.
ఈ కొండలోయల్లో ఆమె ఒక సుడిగాలిలా వుంది.
- ఈ చెట్టు, పొడుగాటి నీడలు, చల్లని పువ్వులూ, వాటి పరిమళమూ - అన్నీ నాకోసమే అనిపించే రోజు ఇన్నాళ్ళ తర్వాత తారసపడినట్టుగా వుంది. ఇంతకాలం నెనెఉ కఠినమైన నిశ్శబ్దానికే అలవాటు పడ్డాను. కానీ ఇక్కడి ఆకాశం నన్ను నిశ్శబ్దంగా ఉండనివ్వడం లేదు. నీడలా, చల్లగా, లోతుగా నన్నెవరో తట్టిలేపుతున్నట్టే వుంది. ఈ పొగమంచు లోయలో ఎవరిననైనా కావలించుకుని గట్టిగా ఏడవాలనిపిస్తోంది. గట్టిగా నవ్వాలనిపిస్తోంది.
ఎంత ఒంటరితనం నాది? ఇన్నాళ్ళూ ఈ ఒంటరితనాన్ని ఎలా భరించాను?
నగరంలో, దయార్ద్రమైనదేదీ కానరాని కాంక్రీట్ కీకారణ్యంలో బతికాను. అక్కడ ఆజీవితంలో ఎలాంటి జీవనానందాలు లేవు. రోజు ఒకేరకపు దైనంది. వ్యాపకం - వార్తలు రాస్తూ, చదువుతూ, రాస్తూ, టీలు తాగుతూ, మళ్ళీ రాస్తూ - రోజూ ఒకేరకమైన వ్యవహారాల శైలి. ఎప్పుడో, ఏ అర్ధరాత్రో రూముకి చేరుకొని, ఆకలి కూడా చచ్చిపోయి - నిస్సత్తువుగా నిద్రలోకి జారిపోయే జీవితం నాది. నా నవనాడులనూ కుంగదీసిన బాధకీ, నరాలన్నీ పెకలించుకుపోయిన రోతకీ కారణాలు ఇవీ అని నేను ఏనాడూ నిర్దారించుకోలేదు. అంతా ఒకే సుదీర్ఘమైన నిస్త్రాణలోకి కూరుకుపోయాను.
నా బాష ఎవరికీ అర్ధం కాదు. యంత్రాల భాష నాకు రాదు. నేను కోరుకునే స్వస్థానపు ప్రశాంతి నగరంలో నాకు దొరకలేదు. అదొక తాత్కాలిక మజిలీగానే భావించాను.
నాది విప్పారే స్వభావం కాదు. నాలోకి నేను ముడుచుకుపోతాను. ఒకవేళ ఎవరైనా నన్ను కదిలించబోతే, తాకబోతే నాలోకి నేను పారిపోయి తలుపులు మూసుకుంటాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే - నా ఒంటరితనానికి మూలం నాలోనే ఉంది. ఎప్పుడూ బిడియపడే నా మనసులోనే ఉంది. అందుకే నా సహోద్యోగులైన అమ్మాయిలు నన్ను పలకరించబోయినప్పుడల్లా నేను ముఖం తిప్పుకునేవాణ్ణి. వాళ్ళ ముఖాలలోకి నేరుగా చూడాలంటే నాకు చేతనయ్యేది కాదు. చిన్నప్పటినుంచీ నేను అలాగే పెరిగాను. అలాగే మిగిలాను.
అలాంటి నన్ను, ఒంటరి తనపు నన్ను - జలపాతంలోకి తోసేసినట్టుగా వుందిప్పుడు. ఎంత సముదాయించుకున్నా ఊపిరి ఆడటం లేదు. నిరంతరం నా మనస్సు ఆమె స్మరణలోకి సంలీనమవుతోంది.
ఇంతకీ ఎవరామె? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకి నేరుగా జవాబు చెప్పలేకనే కదా ఇంత ఆత్మగత ప్రసంగం!
నిజానికి ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. ఆమె ఎదురుపడ్డాక నన్ను నేనే శోదించదలచుకున్నాను - అంతే!
ఆమెను సీతాకోకచిలుకతో పోల్చవచ్చునేమో. ఆ సీతాకోకచిలుక అలవోకగా ఎగురుతూ వచ్చి అనామక గడ్డిపువ్వులాంటి నా మీద వాలివుండవచ్చు. ఆనాటి నుంచి ఆ గడ్డిపువ్వు ఎంతగా మురిసిపోతోందో మీకు చెప్పలేను నేను.
ఈనాటికి సరిగ్గా పదిరోజుల క్రితం నేనీ కొండప్రాంతానికి వచ్చాను. ఒంటరిగా రాలేదు. నా ప్రాణమిత్రుడు శ్రీవాత్సవ వెంటవచ్చాను. శ్రీవాత్సవకి కొత్తగా పెళ్లయింది. ప్రేమ జంట. ఆ జంట విహారయాత్రకి బయలుదేరింది. చిరకాల మిత్రత్వపు చనువుతో నన్నూ. తోడురమ్మని బలవంతం చేస్తే వాళ్ళ వెంట వచ్చాను. వాళ్ళకది హనీమూన్. నాకు మాత్రం ఒక అన్వేషణ.
గడగడలాడించే చలికాలంలో అరకువ్యాలీకి రావడం ఒక అనుభవమే. ఇక్కడికి వచ్చాక, ముందే బుక్ చేసుకున్న కాటేజీలలోకి దిగాం. కొత్త దంపతుల వెంట నేను రానంటే శ్రీవాత్సవే కాదు, రేణుకా అంగీకరించలేదు.
"ముగ్గురం వెళ్ళాల్సిందే, లేదంటే, టూర్ ప్రోగ్రాం కాన్సిల్ చేసేద్దాం" అని మంకుపట్టు పట్టింది. నేనూ రాక తప్పలేదు.
'ఆమె' అని నేను ఇంతకు ముందు వరకూ సంభోదిస్తూ వచ్చిన వ్యక్తి - కరుణ.
ఆమెని కరుణ అని ఊరికే చెప్తే సరిపోదు. నిజంగా ఆమె కారుణ్యరేఖ. అరకువ్యాలీలో మేం దిగిన కాటేజీకి ఎదురుగా వున్న వూరిల్లే ఆమె నివాసం. ఆమె నివసించే ఇంటిని పూరిల్లని చెప్పడం కష్టంగానే వుంది నాకు. నేనైతే ఈ కొండప్రాంతమే ఆమె సొంతమని చెప్పగలను. ఈ కొండలోయలకి మల్లే నన్ను కూడా ఆమెకి సమర్పించుకోగలిగితే ఎంత ధన్యత!
కాటేజీలకి దగ్గరలోనే మంచి హొటళ్ళు నాలుగైదు ఉన్నాయి. భోజనానికి లోటులేదు. కూడా తీసుకెళ్ళిన ప్లాస్కు మమ్మల్ని ఎంతగానో ఆదుకుందని చెప్పాలి. వేడివేడి కాఫీ దానినిండా తీసుకొచ్చుకుని చలిగాలికి వొణికే మనసుని వెచ్చబరచుకునే వాళ్ళం. రెండు రోజులు సజావుగానే, ఆనందంగానే గడిచాయి. మూడోరోజు ఉదయం నుంచీ ముసురు ప్రారంభమయ్యింది. ఉధృతంగా మంచుగాలులు వీచనారంభించాయి. బయటికి కదిలే మార్గమే లేదు. కనీసం తలుపులు తెరవాలన్నా వీలుకాలేదు. అలాంటప్పుడు మాకు కరుణ ఆపద్బాంధవిలా కనిపించింది. మా ఇబ్బందిని ఆమె తనకు తానుగా గ్రహించి సేవలందించింది. తలకు మప్లర్ చుట్టుకుని, రెయిన్ కోటు వంటి వస్త్రాన్ని ఒంటినిండా కప్పుకుని ఆమె మాకు భోజనాలు తెచ్చిపెట్టేది. అలా తెచ్చిపెట్టినందుకు మా నుంచి ఎలాంటి ప్రతిఫలమూ ఆశించలేదామె. ఆమె నిజంగానే ఏమీ ఆశించడం లేదని నాకు మరీ మరీ అర్ధమయ్యింది. అదొక చిత్రమైన శైలి. డబ్బుకి విలువ ఇవ్వని, డబ్బుతో కొలవలేని జీవితం!
ముసురు వాతావరం మూడు రోజుల వరకూ వదలలేదు. పైగా మరింత పెరిగింది. ఆకాశం నుంచి వానచినుకులు కాదు. వడగళ్ళే కురిశాయి. అప్పుడు కరుణ సైతం హోటల్ కి వెళ్ళే సాహసం చేయలేదు. తన ఇంట్లోనే, తనకున్న దాంట్లోనే మాకింత వండి పెట్టింది. టీ, కాఫీలు చేసి ఫ్లాస్కుల్లో నింపి ఇచ్చింది.
నగరాలలో, ఇసకవేస్తే రాలనంత జనం మధ్య నాకు అరుదుగా కూడా ఎదురుపడని మనిషితనం ఇక్కడ ఈ మంచులోయలో కనిపించింది. ఆమె ఎవరో, ఎక్కడ నుండి వచ్చిందో నాకెందుకూ? కనీసం ఇక్కడయినా నేనూ ఒక మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమెను గురించిన ఆరాలు తీయకూడదని నన్ను నేను ఎంతగా కట్టుదిట్టం చేసుకున్నానో చెప్పలేను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ముందే చెప్పాను కదా - నేను మహా బిడియస్తుడినని. ఆపైన కొత్తగా పెళ్ళయిన జంట మధ్య వుండటం - నాకు బలే ఇబ్బందిగా ఉండేది. శ్రీవాత్సవ, రేణుకల ఏకాంతానికి భంగం కలిగించకూడదని మొండిగా అనుకునేవాడిని. అందుకే నాకోసం వేరుగా తీసుకున్న కాటేజీలో నేనొక్కడినే వుండేవాడిని. శ్రీవాత్సవకి నా సంగతి బాగా తెలుసు. అందుకే నన్ను దేనికీ బలవంతం చేసేవాడు కాదు. నా మానాన నేను నా కాటేజీలో ఒంటరిగా కాలక్షేపం చేసేవాడిని. అప్పుడూ భోజనాల వేళ, ఉదయాన్న కాఫీ తాగేప్పుడు నేనూ వాళ్ళ మధ్యకు వెళ్ళి కూర్చొనేవాడిని. భోజనాలప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఏకాంతంగా వుండాలని కోరుకుంటున్నారేమోనని నాకు అనిపించేది. అందుకే నేను త్వరగానే నా భోజనాన్ని ముగించి లేచివచ్చేసే వాడిని. నన్ను వుండమని రేణుక అడుగుతున్నా ఎందుకనో అంగీకరించలేక పోయేవాడిని. తొందరగా భోజనం ముగించిన సందర్భాలలో నాకు తర్వాత కాసింత ఆకలనిపించేది. ఆకలిని దాచుకోలేక సాయంత్రమప్పుడు కొండ దిగి టీ బంకుకి వెళ్లి టీయో, టిఫినో తీసుకొని వచ్చేవాణ్ణి.
ముసురు దినాలన్నిటా మమ్మల్ని కరుణ ఆదుకుంది. ఆ పరిచయం అంతటితో తెగిపోలేదు. చిరపరిచితమన్పించే ఆ ఆదరాభిమానాలు తొందరగా పోవేమో!
అక్కడున్నవాళ్ళూ ఆమె మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంది. ఆహారాన్ని నోట కరిచిన తల్లిపక్షిలా ఆమె తరచూ మా కాటేజీలో వాలుతుండేది. వేడివేడి అన్నమో, ఆవిర్లు చిమ్మే తేనీరో మాకు అందించి త్వరత్వరగా వెళ్ళిపోయేది. మా మధ్య సంభాషణలు కూడా అరుదే. చిరునవ్వే కళ్ళు, చిరునవ్వే పెదవులు - ఇవే మా అందరికీ అనుసంధాన భాష, మనుషులు నిశ్శబ్దాన్ని అనుభవించడంలోనూ ఆనందం పొందవచ్చునని నాకు అప్పుడే అర్ధమయ్యింది.
ముసురు తగ్గింది. మళ్ళీ మేం హొటల్ భోజనాలకు అలవాటుపడ్డాం. అయినా ఏ చీకటివేళనో కరుణ ఇచ్చే తేనేటి విందు కోసం నేను తపించేవాడిని. ఎంత కాదనుకున్నా మా దైనందిక ఆలోచనలన్నీ కరుణ చుట్టూ అల్లుకుపోయేవి. మాకు తెలియకుండానే మా మాటల్లో ఆమె ప్రస్తావన దొర్లిపోయేది. ఇది స్వాభావికంగా మాలో వచ్చిన మార్పు కాదు. మా లోపలి లోకాలలోకి అల్లుకపోవడం ద్వారా కరుణ సాధించిన గెలుపు.
ఒకరోజు శ్రీవాత్సవ, రేణుక కొండల దిగువకు బయలుదేరారు. నాకు ఒంట్లో నలతగా ఉండడంతో 'రానని' చెప్పి కాటేజీలోనే ఉండిపోయాను. మధ్యాహ్నమయింది. బయట వరండాలో నీరెండలాంటి వెలుతురు పడుతోంది. కాటేజీ లోపల చలిగా ఉంది. నేను రగ్గుని ముసుగుకప్పి పడుకుని పుస్తకం చదువుతూ కనులు మూశాను. కవిత్వకన్యక సుకుమారంగా నా వేపు అడుగులు వేస్తూ వస్తున్నది. నాలో కలవరపాటు, కవిత్వపదధ్వనులు, కళ్ళు మూసుకుని ఆనందకరమైన వేదనానుభూతిని నాలోకి అనువదించుకుంటున్నాను.
దూరం నుంచి అడుగుల సవ్వడి దగ్గరకు చేరుతోంది. రాను రాను అది మరింత సామీప్యానికి చేరుకుంది. ఎవ్వరో నామీద చేయివేసి మెల్లమెల్లగా తట్టిలేపుతున్నారు. కళ్ళు తెరిచాను. ఎదురుగా కరుణ. నా వేపే స్థిరంగా చూస్తోంది. తలమీదికి కొంగుని కప్పుకుని మానవ సహజ సౌందర్యానికి ప్రతీకలా నిల్చొని నవ్వీ నవ్వకుండా నవ్వుతోంది. నేను ఆశ్చర్యచరితుడనయ్యాను. మంచం మీదే లేచి కూర్చున్నాను. రగ్గుని భుజాల మీదుగా కప్పుకుని పుస్తకాన్ని పక్కన పెట్టి ఆమె వైపు పలకరింపుగా చూశాను.
రండి... భోజనం చేద్దురుగాని, ఈవేళ మా ఇంట్లో వంటచేశాను, మీ కోసం"
నేను కాదనలేదు.
పర్ణశాల వంటి గృహావరణలోకి తొలిసారి అడుగుపెట్టాను. మట్టిగోడలు, నాపరాళ్ళు పరిచిన అరుగు, కొన్ని వంట పాత్రలు, ఒక మూలగా దండెం మీద వేలాడుతూ ఆమె దుస్తులు - జీవితంలోని వెలుగు చీకట్లన్నీ అక్కడే పరివేష్టించి ఉన్నాయి.
"కాళ్ళు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను"
ఆమె నాతోనూ, నేను ఆమెతోనూ నేరుగా మాట్లాడుకున్న మొదటి సందర్భం ఇదేనేమో! కాళ్ళు కడుక్కుని వచ్చాను. ఆమె అన్నం వడ్డించింది. చిన్నప్పుడు మా అమ్మ వడ్డించిన భోజనం గుర్తుకు వచ్చింది నాకు. అచ్చంగా అలాంటి భోజనమే ఇన్నాళ్ళకి దొరికింది. కమ్మని కూరల వాసన చుట్టూ వ్యాపించింది. ఎంత అదృష్టవంతుణ్ణి!
ఇష్టంతో అన్నం కలుపుతూ కరుణ వేపు చూశాను - ఆమె దూరంగా గడప మీద కూర్చుని బయటికి చూస్తోంది. నాకు కావలసినవన్నీ నా దగ్గరగా అమర్చే ఉన్నాయి. తను నా ఎదురుగా ఉంటే నేను బిడియపడతానని ఆమెకు ఎలా తెలుసూ? నాకు పరిచయమైన నాలుగు రోజుల్లోనే నా స్వభావం మొత్తాన్ని గ్రహించినట్టే ప్రవర్తిస్తోంది.
ఇదెలా సాధ్యం?
నే నెప్పుడో చదివిన ఒక నవలలోని పాత్రలా ఉంది నా జీవితం. వాస్తవానికీ... వూహల ప్రపంచానికీ మధ్య ఎక్కడో తప్పిపోయినట్టే ఉంది.
ఇష్టంగా భోజనం ముగించాను. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు. వచ్చేస్తూ మనస్ఫూర్తిగా అన్నాను: "మేం వెళ్ళిపోయేలోగా మళ్ళీ ఒకసారి నీ చేతి వంట తినిపించాలి సుమా!"
గిన్నెలు సర్దుతూ నవ్వుతూ చూసింది నా వొంక - అంగీకారంగా.
నేను నా కాటేజీకి వచ్చేశాను.
అరకువ్యాలీ వచ్చి అప్పటికి వారం రోజులు గడిచాయి. శ్రీవాత్సవ, రేణుక ఈ ప్రపంచాన్ని కొత్తకళ్ళతో చూస్తున్న చిన్న పిల్లల్లా మారిపోయారు - ఆనందంగా వున్నారు. వాళ్ళ ఆనందం నాలోకీ అప్పుడప్పుడూ ప్రవహిస్తోంది. నేను నా కిష్టమైన కవితా సంపుటాలన్నీ కూడా తెచ్చుకుని మళ్ళీ చదువుతున్నాను.
కరుణ మాత్రం మా అందరిలోకీ కురుస్తూనే వుంది.
మా అందరి ఇష్టాయిష్టాలు ఎరిగిన మనిషిలా సహకరిస్తూనే వుంది. మరీ ముఖ్యంగా రేణుకకి మంచి తోడు దొరికినట్టయింది. రోజూ సాయంత్రవేళ రేణూకి ఏకాంతాన్ని కానుకగా సమర్పించి తిరిగి వెళ్ళిపోయేది.
చలి వాతావరణం నా ఒంటికి పడలేదు. జ్వరం తగిలి బాగా నీరసించాను. అయినా ఒక రాత్రి బాగా చీకటి పడ్డాకా నేను కాటేజీలోంచి బయటకు వచ్చాను. మంచుతో నిండిన లోయల సౌందర్యాన్ని చూడాలని బయలుదేరాను. నాకు తోడుగా కరుణ వస్తే బావుంటుందనిపించింది.
కాటేజీ మెట్లు దిగి ఆమె ఇంటి తలుపు తట్టి విషయం చెప్పాను.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆమె అంగీకరించలేదు.
"మీకు జ్వరం తగ్గాకా ఈ లోయలన్నీ తిప్పుతాను. కొండలన్నీ చూపుతాను" అని వారించింది.
"ముసురు తగ్గి రెండు రోజులైనా కాలేదు. కాలిబాటలన్నీ బాగా తడితడిగా, బురదపట్టి వుంటాయి. చీకటిలో వెళ్ళటం అంత మంచిది కాదని" నచ్చచెప్పింది. నేను అంగీకారంగా కాటేజీకి తిరిగి వచ్చాను. బయలుదేరిన ఉద్దేశం నెరవేరకపోయినా, నాకు వెలితి అనిపించలేదు. మంచులోయని పలకరించడానికి బయలుదేరి, కరుణని పలకరించి వచ్చాను. రెంటికీ పెద్ద తేడాలేదు నా దృష్టిలో.
కరుణ మాటని నేను జవదాటలేదు.
కరుణ కూడా నాకిచ్చిన మాటని మర్చిపోలేదు.
ఒక రాత్రి - లోయ అంతటా మంచు వెన్నల కురుస్తున్న రాత్రి నా కాటేజీకి వచ్చింది. "రండి. లోయని చూపిస్తాను. కూడా రగ్గు తెచ్చుకోండి. చలిగాలి తగలకుండా వుంటుంది" అని నన్ను బయలుదేరతీసింది. నా నుదుటిని తాకి జ్వరం తగ్గిందో లేదో పరీక్షించి సంతృప్తిగా నిట్టూర్చింది. ముందు తన ఇంటికి తీసుకువెళ్ళి వేడివేడి తేనీరు ఇచ్చింది. తర్వాత తను చుట్టుకునే మఫ్లర్ ని నా చేతికిచ్చి తలకి చుట్టుకోమంది.
మా అమ్మ మాటల్లాగే ఆమె మాటలూ నాకు శిరోధార్యలు.
మేం నడుస్తున్నాం.
మహానిశ్శబ్దపు లోయ. మసకవెన్నెల. పొగలా రగులుతున్న వెన్నెల. ఆకాశంలో వెలిగించిన దీపంలాంటి వెన్నెల - ఎన్ని పోలికలు చెప్పినా ఆ సౌందర్యం పట్టుబడదు గాక పట్టుబడదు. మనసులో మెత్తని ఊసులు మొదలవుతున్నాయి. లోయలో కొద్దిగా అనువైన ప్రదేశాలలో మాత్రమే కాటేజీలు వున్నాయి. కొన్నిచోట్ల చిన్న చిన్న పూరిళ్ళు ఉన్నాయి. కాటేజీలలోనూ, పూరిళ్ళ లోనూ దీపాలు వెలుగుతున్నాయి. మిగతా ప్రదేశమంతా మసక చీకటి వ్యాపించి ఉంది. ఆ మంచు వెన్నెలలో అప్పుడప్పుడూ నా చేతిని పట్టుకుంటూ కరుణ కాలిబాట వెంట నడుస్తోంది. తనకి అలవాటైన మార్గం కావటంతో కాసింత చొరవగా అడుగులు వేస్తోంది. పరుగులాంటి నడకతో నన్ను జలపాతంలా లాక్కుని పోతోంది. అలా కొండల జారులోంచి, వాలులోంచి నడిపిస్తూ నడిపిస్తూ - ఒక పెద్ద వృక్షం ముందు నిలబడిపోయింది.
మా శరీరాలు చల్లనైనాయి. మా ఊపిరిలోకి పొగమంచు చొరబడి వణుకు పుడుతోంది. కొండవాలులో నిర్భయంగా పెరిగిన ఆ వృక్షం కింద కరుణ ఎందుకు నిలబడిపోయిందో నాకు అర్ధం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నాకు మాత్రమే వినిపించేంత మెల్లగా ఇలా చెప్పుకొచ్చింది.
"ఈ చెట్టుని చూస్తే నాకు గుండెలో బాధగానూ, భయంగానూ వుంటుంది. ఈ చెట్టు కిందనే నా చెల్లి శాంత చనిపోయింది. అయిదేళ్ళ క్రితం, కొందరు పిల్లలు విహారానికి వచ్చి ఆకాటేజీలలో దిగారు. డిసెంబర్ చివరి రోజులు. మంచు విపరీతంగా కురుస్తోంది. వచ్చిన పిల్లల్లో ఒకరికి జ్వరం వచ్చింది. ఎంతకీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. పైగా తిరగబెట్టింది. శాంతా, నేనూ కంగారుపడ్డాం. అర్ధరాత్రప్పుడు డాక్టర్ని తీసుకురావడానికి శాంత ఒక్కర్తే కొండదిగువకు బయలు దేరింది. అలా బయలుదేరిన మనిషి ఎంతకీ తిరిగిరాలేదు. ఆమెని వెతుకుతూ వెళ్ళిన మా నాన్న కూడా ఎంతసేపటికీ తిరిగిరాలేదు. చివరికి ఆ ఇద్దరి కోసం వెదుకుతూ నేను బయలుదేరాను. తీరా ఈ చెట్టు కిందకి వచ్చాకా శవంగా మారిన నా చెల్లి, అసహాయంగా ఏడుస్తూ మిగిలిన నాన్న కనిపించారు. డాక్టర్ కోసం బయలుదేరిన శాంత ఎలా చచ్చిపోయిందో ఈనాటికీ అంతుబట్టలేదు. దాని శరీరం నల్లగా కమిలిపోయి వుంది. పాముకాటు వల్లే చనిపోయిందని చాలామంది అన్నారు. ఏ కారణమయితేనేం, ఈ చెట్టు కిందే నా చెల్లి నాకు కాకుండా పోయింది."
ఆ చీకటిలో ఆ మాటలు చెబుతున్నప్పుడు కరుణ కళ్ళలో ఏ భావాలు సుడితిరుగుతున్నాయో నేను గుర్తించలేకపోయాను. నిజమే - ఈ కొండవాలులో ఈ చెట్టు అంతులేని రహస్యంలా, అంతుబట్టని దుఃఖంలా నిలబడి వుంది. చెట్టు కింద నుంచి కరుణ నా చేయి పట్టుకుని ముందుకి నడిచింది. కొండ కిందకి ఏటవాలుగా వుంది కాలిబాట. కాలు జారితే ప్రాణానికి హామీలేదు. నన్ను జాగ్రత్తగా నడిపిస్తూ కరుణ ముందుకు, మున్ముందుకు సాగుతోంది.
ఒకానొక అలౌకిక జగత్తు మంచు తెరల్లో తేలియాడుతున్నట్టే వుంది నాకు. నాకు తెలియని లోకాలకి కరుణ నడిపించుకపోతున్నట్టే వుంది. జీవితమూ, కవిత్వమూ కలగలిసిన గొప్ప సుఖదుఃఖాల సందర్భమిది. ఇలాంటి అనుభవాన్ని అందుకోవడం కోసమే కదా ఇన్నినాళ్ళ నా నిరంతరాన్వేషణ.
నా జీవితంలో కొత్తపుటలు తెరుచుకుంటున్నాయి. కరుణ నా చేతిని వదిలిపెట్టినా నేను కరుణ చేతిని వదిలిపెట్టినా - అ లోయలోకి, చీకటిలోకి జారిపోక తప్పదు. మా చేతులు విడిపోలేదు.
జీవితంలోని మలుపుల్లాగే కాలిబాట కూడా ఎన్నో మలుపులు తిరిగింది.
మలుపు మలుపునా కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు...
కరుణ చిన్నతనాన్నే తల్లిని కోల్పోయింది. మృత్యువృక్షం కింద ఆమె చెల్లి చనిపోయింది. మొన్నటేడాది శీతాకాలంలో ముసలి తండ్రి కూడా ఊపిరి వదిలాడు. ఇప్పుడు ఒకే ఒక్క కరుణ మిగిలింది - అనామక గడ్డిపువ్వులకి మల్లే నిండు జీవితాన్ని దర్శించడానికి.
ఏటవాలు కాలిబాట వెంట బాగా ముందుకి నడిచాక దూరంగా కొండచరియలు కనిపించాయి. నిటారుగా ఆకాశంవేపు గురి చూస్తున్న ఆ కొండ పరిచయలని చూస్తూ కొద్దిసేపు కరుణ కొద్దిసేపు అనిర్వచనీయంగా వుండిపోయింది. నా చేతిని పట్టుకున్న ఆమె చేతివేళ్ళ వెచ్చదనంలోంచి ఆ అనుభూతి నాలోకి ప్రవహించింది.
ఓ క్షణం తర్వాత ఇలా చెప్పింది:
"ఆ కొండ చరియల్ని చూశారా, ఎంత పొగరుగా నిల్చున్నాయో! అవంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. చిన్నప్పుడు ఆన్నింటికన్నా ఎత్తున్న కొండచరియని ఎక్కి ఎలుగెత్తిన గొంతుతో నా పేరుని నేనే పిలిచే దాన్ని. నా అరుపు ఈ కొండలోయలో ప్రతిధ్వనించి పోయేది. ఏ అర్ధరాత్రో ఈ కొండలనెక్కి నన్నెవరైనా అలా పెద్దగా పిలుస్తారని ఎదురు చూసేదాన్ని. అదంతా నా చిన్నతనపు ఆకతాయితనం"
ఆ మాట చివర మురిపెంగా నవ్వింది. కరుణ. నవ్వుతూ మురిసిపోయింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆమె చూపిన కొండశిల నాకు ఒట్టి కొండశిలలా కన్పించలేదు. అది ఈ లోయ అంతట్నీ వశం చేసుకోగల మహాశిఖరంలా కనిపించింది.
ఒక పక్క మృత్యువు నీడలాంటి పడగ, మరోపక్క మణిమయ కాంతులతో వెలిగే జీవనకాంక్ష.
కొండ చరియల్ని చూసిన కళ్ళతోనే కరుణ వైపు చూశాను. ఆమె ఓ అమాయికలా కనిపించిందా క్షణాన. నిండైన యవ్వనాన్ని పోగేసుకున్న అమాయిక. నిష్కపటంగా మనసు విప్పే అమాయిక.
ఆమె ఈ లోయ ఆత్మకథని చెప్పడం ఆపేసింది. సవిస్తారమైన లోయ కళ్ళముందు పరుచుకుని వుంది. మనసు వెచ్చగా వెలుగుతోంది. నులివెచ్చని అనుభూతుల మధ్య కళ్ళల్లోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి.
కొద్దిసేపు ఇద్దరం ఆ కాలిబాట పక్కనే రాళ్ళమీద మౌనంగా కూర్చున్నాం. దట్టమైన మేఘాల్ని చీలుస్తూ చిమ్మ చీకటిని జయిస్తూ బంగారు కాంతుల వెన్నెల జారుతోంది. అంతటా!
నా చేతికి వాచీలేదు. కాలాతీతం.
గాలి తెరల్లోంచి సన్నసన్నగా సెలయేటి పాట తేలివస్తున్నది.
"చాలా పొద్దుపోయింది. రండి వెళ్దాం. మీ కోసం కొంచెం టీ ఉంచాను. తాగి వెళ్దురుగాని"
కరుణ లేచింది. ఆమె వెనుకనే నేనూ. వెనుదిరిగాం. తిరుగు ప్రయాణంలో మా చేతులు మళ్ళీ కలుసుకున్నాయి. నా భుజానికి తన భుజాన్ని దరచేర్చి మెల్లమెల్లగా నడిపించుకువచ్చింది.
ఇల్లు చేరుకున్నాకా కరుణ చిదుగుల మంటల్ని రాజేసింది. ఆవిర్లు చిమ్మే వేడి వేడి టీ అందించింది. టీ తాగి వీడ్కోలు తీసుకుని కాటేజీకి తిరిగి వచ్చాను - ఒక్కన్నీ. వస్తున్నప్పుడు ఆమె చేతిని అందుకుని మనసారా ముద్దు పెట్టుకోవాలన్పించింది. కానీ ఆ పని చేయలేదు. ఆమె చేయి అందుకోవాలంటే ఈ లోయకి నన్ను నేను సమర్పించుకునేంత ఎదగాలి. లోయ ప్రతిధ్వనించి పోయేలా కరుణని ఎలుగెత్తి పిల్చుకోవాలి.
మరుసటి రోజు ఉదయమే శ్రీవాత్సవ, రేణుక, నేను - తిరుపతికి బయలుదేరాల్సి వుంది. తెల్లారుజామున శ్రీవాత్సవ నిద్రలేపితే - నేను తిరుపతి రావడంలేదని చెప్పాను. ఆశ్చర్యపోయాడు.
నేను చేరుకోవాల్సిన చోటికే చేరుకున్నాను.
"ఈ చోటుని వదులుకునేది లేదని" చెప్పాను.
శ్రీవాత్సవ బెంగగా, బాధగా చాలా హితబోధలు చేశాడు. మా ఇద్దరి సంభాషణని ఇక్కడ ప్రస్తావించదల్చలేదు. నేను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు కనుక అదంతా అప్రస్తుతమే చివరికి:
"ఈ లోయలో పడి చావు" అని శపించాడు నన్ను. అతనిది ధర్మాగ్రహం. నేనర్ధం చేసుకోగలను.
"ఈ లోయలో బతకమని" కొండలూ, వాగులూ, మేఘాలూ దీవిస్తున్నాయి నన్ను. ఆ దీవెనలు అతనికి అర్ధం కాలేదు. గడిచిన పదిరోజుల్లోనూ నగరం వెంటాడలేదు నన్ను. ఆ బాధ, రోతా ఇప్పుడు లేవు. నేను ప్రేమించలేని యంత్రాల మోతా, యంత్రాలని పోలిన మనుషులు ఇక్కడ లేరు.
ఈ ప్రదేశం నా స్వస్థానంలా నన్ను లాలిస్తోంది.
నా భాష కరుణకి అర్ధమవుతోంది. లోయ అంతటా పరుచుకున్న జీవనమాధుర్యం నాకు అందుతోంది. అలవోకగా నాలోంచి పాటలేవో పుట్టుకొస్తున్నాయి. ఆకాశం నాకు మరీ దగ్గరయినట్టుగా ఉంది.
శ్రీవాత్సవ, రేణుకలను రైలెక్కించాను. కాటేజీకి తిరిగి వచ్చాను...
ఉదయం గడిచిపోతుంది. మధ్యాహ్నమూ గడిచిపోతుంది. పొద్దు తిరిగిపోతుంది. చీకటి విచ్చుకుంటుంది. రాత్రి చిక్కనయ్యాకా - ఈ లోయ సాక్షిగా, నక్షత్ర దీపాలా సాక్షిగా, మంచుకురిసే ఆకాశం సాక్షిగా నేనా కొండశిఖరాన్ని అధిరోహిస్తాను. నా జీవితేచ్ఛనంతా ఒకేవొక్క గొంతుగా మార్చుకుని 'కరుణా' అని ఎలుగెత్తి పిలుస్తాను.
అందుకోసమే నేను వుండిపోయాను.
అందుకోసమే నేను నిరీక్షిస్తాను.
***
![[Image: image-2025-03-28-232003406.png]](https://i.ibb.co/DfY1f3WF/image-2025-03-28-232003406.png)
upload img
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
యానాదుల దిబ్బ - నక్కా విజయరామరాజు
"మాపిటేల యానాదుల దిబ్బ దగ్గర పెద్దారం డొంక తగాదా సంగతి మాట్లాడుకుందాం మీ ఊరోల్లని పదిమందిని పిల్చుకురా" అన్నాడు ఊరిపెద్ద బసవయ్య పెద్దారం పెద్ద ఉప్పులూరి బుచ్చారావుతో.
"రత్తప్పా రేపు యానాదుల దిబ్బకిందున్న రాగిచెట్టు చేలో నాటు మరిచిపోమాక" మరీ మరీ చెప్పింది కొట్లో భాగ్యం, రత్తమ్మతో.
"అత్తో యానాదుల దిబ్బ దగ్గరున్న అయిలాపురపు కాలవలోకి కొత్త నీల్లొదిలారంట! గుడ్డలుతుక్కొత్తా ఈ బుడ్డోడ్ని గూసేపు సూత్తా వుండు" అంటూ పిల్లోడ్ని
అప్పగించి బట్టలుతుక్కొవడానికి వెళ్ళింది పంతగాని మారెమ్మ.
"రేపు అమాసకి కోడి పందాలు లంక దిబ్బ మీద కాదు. యానాదుల దిబ్బ మీద మనోళ్ళందరికీ చెప్పు" అంటూ కోళ్ళ సుధాకర్, భట్టిప్రోలు వెంకటేశ్వర్లుతో అన్నాడు. కోడిపందాల స్పాట్ నిర్ణయించేది సుధాకరే.
***
అటు పెద్దాపురం పోవాలన్నా ఇటు ఐలారం రావాలన్నా పడమటి దిక్కున కనగాల పోవాలన్నా... దక్షిణాన కూరేటిపాలెంతో పాటు దానికింద పదహారు ఊర్లు చేరాలన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్ళాల్సిందే. చుట్టుపక్కల ఊర్లకు చౌరస్తా యానాదుల దిబ్బ!
పేరుకే యానాదుల దిబ్బ గానీ, ఇప్పుడక్కడ యానాదులెవ్వరూ లేరు. అది అత్తలూరి గోపాలరావుగారి పాలెం మెరక దిబ్బ. చుట్టుపక్కల ఊర్ల జనానికదొక కొండ.
నలభై, ఏభై ఏళ్ళ కిందట అక్కడ ఐదారు యానాదుల గుడిసెలుండేవి. పిల్లా పాపల్తో కళకళలాడుతూ గుడిసెల ముందు బంగినపల్లి మామిడిచెట్టు, వెనక ఉసిరిచెట్టు, కాలువ గట్టున కుంకుడు చెట్టు, దిబ్బ చుట్టు కోటకి కాపలా కాస్తున్న సైనికుల్లా పిల్లలకోడి, గంగ భవానీ కొబ్బరిచెట్లు, గుడిసెల మీద పాకిన బీర, సొరపాదులతో పచ్చగా ఉండేది. అక్కడే వుండి చుట్టు పక్కల పొలాలన్నీ కాపలా కాసేవాడు యానాది పుల్లన్న అక్కడున్న నాలుగు గుడిసెల్లో ఒకటి అల్లుడిది, మిగిలిన రెండిట్లో కొడుకులుంటే, నాలుగోది ఆయనది. ఆయన సంతానం డజను మంది. మిగిలిన కొడుకులు సంజీవి, ఎంకన్న మాచెర్ల చెరువుకట్ట మీద గుడిసెలేసుకుని ఊళ్ళో మురికి కాలువలు శుభ్రం చేసే పని చేసే వాళ్ళు. వాళ్ళ పెళ్ళాలు కోమట్ల ఇళ్ళలో అంట్లు తోమి, ఇల్లు ఊడ్చేవారు. మిగతా పిల్లలు మునసబుగారి దిబ్బ మీదొకడు, అద్దెపల్లి సాలిచెరువు మీదొకడు, కనగాలన గుప్తా గారి కాఫీ హొటల్లో కప్పులు కడగడానికొకడు. అట్టా అందరి పెళ్ళిళ్ళయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు.
ఇంక మిగిలింది కడకూటి పిల్ల. దానికి అద్దేపల్లి బుర్ర తూము కాలువ గట్టు మీదున్న ముద్దుల లాలాలజపతిరాయ్ గారి బావి దగ్గర గుడిసె ఏసుకున్న యానాది
ఎంకన్న కొడుకుతో పెళ్ళి నిశ్చయమైపోయింది. శ్రీరామనవమి పండగ వెళ్ళిన తర్వాత రెండో రోజు పెళ్ళి.
యానాది పుల్లన్న అంటే చుట్టుపక్కల తెలీని మనుషులుండే వారు కాదు. ఆయన ఒడ్డు పొడుగు ఆ వంశంలో ఎవరికీ రాలేదు. ఆజానుబాహుడు. చెయ్యెత్తితే ఆయన ఉంగరాల జుత్తు తగిలేది కాదు. తలపాగా చుట్టడానికి మామూలు కండువాలు చాలక, ఏకంగా అతని పెళ్ళాం రంగమ్మ ఏడు గజాల చీరని చుట్టుకునేవాడు. చొక్కా తొడుక్కోవడం ఎవ్వరూ చూసింది లేదు. మొలకి గోచిలా చిన్న అంగోస్త్రం బిగించి కట్టేవాడు.
ఒకసారి అత్తలూరి గోపాలరావు గారింటి కొచ్చిన చల్లపల్లి రాజా వారు యానాది పుల్లన్న పర్సనాలిటీ చూసి "మావూరొచ్చి మా కోట ముందు వేషం వేసుకుని నిలబడరా! రెండెకరాల పొలం ఇస్తా" అన్నాడంట. "మా దిబ్బ ఈ ఊరొదిలి యాడికి రాను దొరా" అన్నాడంట పుల్లన్న. గోపాలరావు గారెంత చెప్పినా వినకుండా యానాదుల దిబ్బ మీదే వుండిపోయాడు పుల్లన్న.
యానాది పుల్లన్న తలపాగా చుట్టుకుని, బానా కర్ర వీపు వెనక పెట్టుకుని దాన్ని రెండు చేతుల్తో వెనగ్గా పట్టుకుని ఊర్లోకి వస్తే ఇళ్ళలోని ఆడోళ్ళు కిటికీలు తీసి చూసేవాళ్ళు. కోమట్లు దుకాణాల్లోంచి పిలిచి పొగాకు కాడలిచ్చేవారు. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. ఏమన్నా, కాదన్నా నవ్వి ఊరుకునే వాడు. ఆయన రోడ్డంబట వెళ్తుంటే ఆగి చూసే వాళ్ళు జనం. నెలకొకసారి మాత్రం అత్తలూరి గోపాలరావు గారి మేడకు వెళ్లేవాడు పుల్లన్న నూకలకోసం పెళ్ళాం రంగమ్మ ఊళ్ళో కోమట్లు, బ్రామ్మలు, పద్మశాలీల, కాపుల ఇళ్ళల్లో మంత్రసాని పని చేసేది.
***
సలగాలన దుర్గయ్య యానాదుల దిబ్బ మీదకి చేరేసరికి, మామిడి చెట్టు కింద కూర్చుని నల్ల కుక్క తెల్ల పిల్లి ఆడుకునే ఆటలు చూస్తున్నాడు యానాది పుల్లన్న.
"వాటి ఆటల ధ్యాసలో పడి మడిసొచ్చాడన్న సంగతే మర్చిపోయావే మామా?" అన్నాడు సలగాల దుర్గయ్య పక్కనే కూర్చుంటూ.
వాళ్ళిద్దరికీ వయసులో అట్టే తేడా లేకపోయినా అట్టా "మామా - అల్లుడు" అని పిలుచుకునే వారు చిన్నప్పట్నుంచి.
"అవంటే పేనం నాకు! ఈ 'వీరబాహుడంటే మరీను' అంటూ నల్లకుక్క వంక ప్రేమగా చూస్తూ భుజాల మీదకి కుక్కనెత్తుకున్నాడు యానాది పుల్లన్న.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"కుక్కకి, పిల్లికి పడదంటారు గందా! ఇయ్యేంటిట్టా అన్నదమ్ముల్లాగా ఆడుకుంటున్నాయి?" అన్నాడు దుర్గయ్య.
"నీది నాది ఒక కులమా? సావాసంగా లేమా? అయి అంతే! ఆ తెల్ల పిల్లి ఎలకల్ని ఉడతల్ని, ఎంటవాలని పట్టుకొత్తే, ఈ వీరబాహుడు (నల్లకుక్క) నా చేలోకి గొడ్డు, గోదా, దొంగోల్లు రాకుండా కాపలా కాత్తాడు" అన్నాడు కుక్కను వదిలేసి పుల్లన్న.
కుక్కా, పిల్లి కలిసి మళ్ళీ ఆడుకోసాగాయి, అక్కడ ఇద్దరు మనుషులున్నారన్న సంగతే మర్చిపోయి.
"పనిబడి పాలెం మీదుగా కనగాల ఎల్తున్నా... అటో సారొత్తావేంటి రెండు ముంతల కల్లు తాగొద్దాం" అన్నాడు దుర్గయ్య పొగాకు కాడ అందిస్తూ.
"దొరగారి మేడకెళ్లాలి నూకల కోసం! పద" అంటూ లేచాడు పుల్లన్న తలపాగా చుట్టుకుంటూ. పిల్లితో ఆటలు వదిలేసి పుల్లన్నను వెంబడించింది నల్లకుక్క.
***
గోపాలరావుగారి మేడ దగ్గరికొచ్చాడు పుల్లన్న ఆ సంగతి ఎట్టా తెలిసిందో, దివాణంలో పన్జేసే వాళ్లంతా ఆయన చుట్టూ మూగారు. సపోటా చెట్టు కింద విస్తరాకేసి అన్నం పెట్టించింది గోపాలరావు భార్య సుభద్రమ్మ గారు. జీతగాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. పుల్లన్న అన్నం తిన్నంత సేపు. గోపాలరావు గారి పిల్లలు డాబా పిట్ట గోడమీద నుంచి చూస్తూనే ఉన్నారు. హడావిడి విని గోల్డుప్లాక్ సిగరెట్టు కాలుస్తూ మేడ దిగాడు అత్తలూరి గోపాలరావుగారు.
"ఏరా పుల్లన్నా నెల నుండి పత్తా లేవు? మొన్న యానాదుల దిబ్బ మీదకొస్తే ఒక్కడూ లేడు! యానాదులంతా ఎటు పోయార్రా?" అన్నాడు నరసరావుపేట పడక కుర్చీలో కూర్చుంటూ. చేతి పంపుదగ్గర చెయ్యి కడుక్కుని తలపాగాకి తుడుచుకుంటూ నిలబడ్డాడు యానాది పుల్లన్న.
గోల్డు ఫ్లాక్ పెట్టెల్లోంచి ఒక సిగరెట్టు తీసి పుల్లన్న మీద గిరటేశాడు గోపాలరావుగారు. పుల్లన్న దాన్ని తీసుకుని తలపాగాలో పెట్టుకున్నాడు.
"హరి పిచ్చోడా! కాల్చకుండా దాచుకున్నావా? కాల్చు! ఏమీ కాదు! అంతా మనోళ్ళేగా! మొన్నొచ్చినప్పుడు ఒక్కడూ పత్తాలేడు ఎటు పోయార్రా?" అన్నాడు గోపాలరావు సిగరెట్ పొగ వదుల్తూ.
యానాది పుల్లన్నతో ఏదోకటి మాట్లాడితీనే నోరు తెరుస్తాడు. పుల్లన్న ఏది చెప్పాలన్నా పాటలాగా చెబుతాడు. పాటలాంటి ఆయన మాటలంటే గోపాలరావు గారికే కాదు, ఆయన దొడ్లో పన్జేసే వాళ్ళందరికీ ఇష్టం అందుకనే కావాలని ఏదేదో మాట్లాడి పుల్లన్న నోరు తెరిపించేవాడు గోపాలరావు గారు.
"యానాదు లేనాడు లెందుపోయిరే?
జిల్లేడి చెట్టు కింద జంగు పిల్లులే"
అంటూ కర్ర తిప్పుతూ ఆడి, పాడి, గోపాలరావు గారి ముందు కూర్చున్నాడు పుల్లన్న.
పెద్ద గుమస్తా బాయగోడు చిన్నయ్య వచ్చేసరికి పుల్లన్న ఆట, పాట చూస్తున్న పనోల్లంతా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. చిన్న గుమస్తా శంభుడు, నూకలు కొలిస్తే - తలపాగా కింద పరిచి దాన్ని రెండు మడతలేసి నూకలు మూటకట్టుకుని, చిన్న మూటలాగా సంకలో సంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు యానాది పుల్లన్న. నల్ల కుక్క ఆయన వెనకే కదిలింది.
***
శ్రీరామనవమి పండుగ ఊళ్లోనే కాదు చుట్టుపక్కల పదహారు గ్రామాల్లో బాగా చేసేవారు. కొత్త తాటాకు పందిల్లేసి, నాటకాలాడి, హరికథలు, బుర్రకథలు, పానకాలు, వడపప్పు, కొబ్బరిముక్కలు పెట్టి, పండగ తెల్లారి కూరేటి పాలెంలో భోజనాలు పెట్టేవారు. చాలామంది జనం వెళ్ళేవాళ్ళు. ఆ వూరిలో ఆ ఆచారం ఎన్నో ఏళ్లనుంచి వుంది. అక్కడ పప్పన్నాలు మధ్యాన్నం పెడితే, పెద్దారంలో రాత్రికి పెట్టేవారు. పెద్దారం ఊరు రెండుగా విడిపోయి పెద్దముఠా అయ్యింది. ఆ యేడాది పెసలు బాగా పండితే, భోజనాలు మీద పెసరపప్పు, పెసర పూర్ణాలు, పెసరగారెలు... అట్టా పెట్టేవారు.
ఇక పెద్ద ముఠా వాళ్ళు పాయసం పోస్తే... చిన్న ముఠా వాళ్ళు పరమాన్నం పెట్టేవాళ్ళు. ఒకళ్లు బూరెలు పెడితే, ఇంకొకళ్ళు లడ్డూలూ... అట్టా పోటాపోటీగా... ఒకరంటే ఒకళ్ళు గొప్ప అన్నట్టుగా పండుగ చేసి భోజనాలు పెట్టేవాళ్ళు.
శ్రీరామనవమి పండుగ రోజు యానాది పుల్లన్నతో పాటు మిగిలిన హోల్ ఫామిలీ వాళ్ళంతా పుల్లుగా తాగి ఎక్కడోల్లక్కడ పడిపోయారు. తెల్లారి నిదరలేచి ఎవరి పన్లోకి వారు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల చేలల్లో మినుము, పెసర పీకేశారు. పాలెం పొలం గట్ల మీదున్న మామిడిచెట్లు బంగినపల్లి, చిత్తూరు, చిన్నరసాలు, చెరకురసాలు విరగాసినయి. కూరేటిపాలెం భోజనాలకెళ్ళే జనమంతా పాలెం పొలం గట్ల మీదుగా వెళ్ళాల్సిందే!
కాయలు కోస్తారని పుల్లన్న, నల్లకుక్కతో గుడిసె దగ్గరే ఉన్నాడు. అదుంటే చుట్టుపక్కల తాటి ఆకుల మీదగానీ, కొబ్బరి బొండాల మీదగానీ మామిడికాయల మీదగానీ చెయ్యి వెయ్యడానికి ఎవరికీ ధైర్యం చాలదు. పుల్లన్న పెళ్ళాం రంగమ్మ ఊళ్ళోకెళ్ళింది. పొద్దున్నే బచ్చు వీరయ్య పెళ్ళానికి నొప్పులొస్తున్నాయంటే! గుడిసెల్లోని పిల్లలంతా నల్లకుక్కతో కలిసి చేలల్లో మినప కల్లాలలో ఎలుకలు పట్టుకుంటున్నారు. మినుములు, పెసలు తిని ఒక్కొక్క ఎలుక పందికొక్కులా బలిసింది.
గుడిసె ముందున్న మామిడి చెట్టుకింద ఈతాకుల చాప మీద కునుకు తీస్తున్నాడు పుల్లన్న. మాగన్నుగా నిద్రపట్టింది. మామిడికాయల బరువుకి కొమ్మలు వంగి నేలను తాకుతున్నాయి. గాలి వీచినప్పుడల్లా కాయలు అటూ, ఇటూ ఊగుతున్నాయి. కొబ్బరిచెట్ల నిండా గెలకి ముఫ్ఫై దాకా బొండాలు వేలాడుతున్నాయి. రెండు ఉడుతలు 'కీక్... కీక్' అంటూ కొబ్బరి చెట్టు ఎక్కుతూ దిగుతూ అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాయి. ఆ పొద్దున్నే తెల్లపిల్లి రెండు కూనల్ని ఈనింది. పిల్లల్ని వదిలి బయటికి రావడం లేదది. లేకపోతే అదికూడా ఎలుకల వేటకి నల్లకుక్కతో కలిసి కళ్ళాల్లోకి వెళ్లేదే!
సలగాలన దుర్గయ్య యానాదుల దిబ్బమీద కొచ్చేసరికి పొద్దు పడమటికి వాలింది. అప్పటికే ఊరి జనం, చుట్టుపక్కల ఊరోళ్ళు కూరేటిపాలెం వెళ్ళిపోయారు భోజనాలకి. మగతగా పడుకున్న పుల్లన్నను లేపాడు దుర్గయ్య. "రాత్తిరి బాగా ఎక్కువయ్యినట్టుంది అల్లుడు!" అంటూ లేచి సొంతకుండలో నీళ్ళు పుక్కిలించి ఊసి - ఎంత సేపయిందల్లుడు నువ్వొచ్చి, మగత కమ్మింది. పాడు నిద్దర! ఎండ పైకొచ్చినా మెలుకువే రాలేదు చూశావా?" అంటూ ఈత చాప తీసి మామిడిచెట్టునీడ వున్న చోటేసి కూర్చున్నాడు పుల్లయ్య. దుర్గయ్య ఇచ్చిన పొగాకు కాడ అందుకుంటూ.
చుట్టముట్టిస్తూ "కూరేటిపాలెం అన్నాలకెల్దామన్నావ్ మర్చిపోయావా?" అన్నాడు దుర్గయ్య. "నిన్న సందెకాల తిన్న బువ్వ దాని సంగతే మర్చిపోయా నివ్విపుడనంగానే గుర్తొచ్చింది. ఇంటిది ఊర్లోకెల్లింది. ఎవరో కోమట్లామిడ నొప్పులు పడుతుందంట. అదెప్పుడొచ్చుద్దో! మామిడితోటని వదిలేసి దగ్గరెవరు లేకుండా ఎట్ట అల్లుడూ" అన్నాడు పుల్లన్న మామిడిచెట్టు కాయల వంక చూస్తూ.
"గసిక్కర్రల్లాంటి నీ మనవళ్ళు, మనవరాళ్ళు, రేచుక్కల్లాంటి వారబాహుడు ఉండగా ఇంకా ఏంది మామ ఆలోచిస్తున్నావు? అదొక్కటే పది మంది పెట్టు" అన్నాడు. దుర్గయ్య దూరంగా చేలో ఎలుకల్ని పడుతున్న పిల్లల్ని, నల్లకుక్కని చూసి.
ఇద్దరూ బయల్దేరారు. ఎట్టా పసిగట్టిందో నల్లకుక్క పరిగెత్తుకుంటూ వచ్చి పుల్లన్న వెంట పడింది. పో గుడిసె దగ్గరుండు అంటూ వదిలేశాడు పుల్లన్న దాన్ని. నేనూ వస్తానన్నట్లు చాలాసేపు గింజుకుందది. వీరబాహుడు తోడు లేకుండా ఎక్కడికి కదలడు పుల్లన్న "పోనీ వీరబాహున్ని కూడా తీసుకుపోదామా?" అన్నాడు దుర్గయ్య దాని అరుపులు విని.
"అక్కడ భోజనాల దగ్గర ఊరకుక్కలుంటాయి. లడాయి పెట్టుకుంటే మన నల్లోడు ఊరుకోడు. ఎందుకొచ్చిన గొడవలు అల్లుడూ" అంటూ కూరేటిపాలెం వైపు బయల్దేరారు ఆ ఇద్దరు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
పిల్లలంతా కలిసి ఇరవైకి పైగా ఎలుకల్ని పట్టారు. వాటిని గుడిసె ముందు వరిగడ్డి, కొబ్బరి జీబుల్తో బాగా కాల్చారు. అరడజను మంది దాకా ఉన్నారు. పిల్లలు. అంతా పదేళ్ళలోపే! వీరబాహుతో కలుపుకుని ఒక్కొక్కళ్ళకి మూడేసి ఎలకలొస్తాయని లెక్కేసి చెప్పాడు వాళ్ళల్లో కొంచెం సన్నగా పొడుగ్గా వున్న పిల్లోడు. బాగా కాలిన ఎలుకల్ని ఆరనిచ్చి పిన్నీసుతో వాటి పొట్టలు చీల్చి, పేగులు బయటికి తీసి, దూరంగా వాడేవాడు పెద్ద పిల్లోడు. పడమటి గాలి వీస్తోంది. బాగా కొవ్వు పట్టి నూనె కారుతున్నాయి ఎలుకలు. "మినుములు, పెసలు మెక్కి బాగా బలిసినయి కదాన్నా" అంటుంది అందరిలోకి చిన్నగా వున్న చింపిరి జుత్తు పిల్ల. మామిడిచెట్టు కింద కూర్చుని ఎలుకల్ని ముక్కలుగా కోసి వాటా లేసుకుంటున్నారు. వాళ్ళంతా.
గుడిసె ముందు పిల్లలు ఆర్పిన మంటల్లో పొగరాసాగింది. దానికి పడమటి గాలి తోడై పొగ పెరిగి నిప్పు రాజుకుంది. గాలికి నిప్పు కణికొకటి ఎగిరి గుడిసె ముందున్న ఎండిన సొరపాదు మీద పడింది. అది అంటుకుని గుడిసె చూరు ముట్టుకుని చురచుర కప్పు దాకా పాకింది. గాలికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అది చూసిన పిల్లలు కాల్చిన ఎలకల్ని వదిలేసి గుడిసె దగ్గర గోలగోలగా ఏడుస్తున్నారు. కనుచూపు మేరలో ఒక్కమనిషి కనబడ్డం లేదు. యానాది పుల్లన్న కడగూటి కూతరు పెళ్ళికోసం తెచ్చిన గుడ్డలు, సరుకులు గుడిసెలోనే వున్నాయి.
"అన్నా! మన తెల్లపిల్లి దాని పిల్లలు గుడిసెలోనే వున్నాయంటూ" ఏడుపు లంకించుకుంది చింపిరి జుత్తు చిన్నపిల్ల.
గుడిసెలోనికెళ్ళడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఆ వేడికి గుడిసె దగ్గరికే పోలేకపోతున్నారు. పిల్లి పిల్లల్ని వదిలి బయటికి రావడం లేదు. అందరిలో పెద్ద పిల్లోడు... పిల్లి సంగతి నల్లకుక్కకి సైగ చేసి చెప్పాడు.
నల్లకుక్క గుడిసెలోనికెళ్ళింది. తెల్లపిల్లిని నోట కరుచుకుని బయటికి తెచ్చింది. పిల్లి మియం... మియం అనకుండా అట్టాగే పడివుంది. చచ్చిపోయిందేమోననుకుని కదిలిస్తే కొంచెం కదిలింది. 'అమ్మయ్య బతికే వుందన్న' అంటూ ఏడుపు ఆపేసింది చిన్నపిల్ల. మళ్లీ గుడిసెలోకెళ్ళింది నల్లకుక్క ఒక పిల్లి కూనని కరుచుకుని తెచ్చింది. అదింకా కళ్ళు తెరవలేదు. 'మి... మి...' అంటూ అటు, ఇటూ కదుల్తూంది. దాన్ని అమ్మ దగ్గరకు చేర్చింది చిన్న పిల్ల. మిగిలిన పిల్లలకోసం గుడిసెలోకెళ్ళింది. నల్లకుక్క... మంటలు బాగా పెరిగి గుడిసె కూలిపోయింది. అప్పటికే పక్కనున్న గుడిసెలకు పాకాయి మంటలు. మిగిలిన గుడిసెలతో పాటు మామిడిచెట్టు, కొబ్బరి చెట్లు కాలిపోయినయి. గుడిసెలోని కెళ్ళిన నల్లకుక్క బయటికి రాలేదు.
***
యానాది పుల్లన్న సలగాల దుర్గయ్య కూరేటి పాలెంలో అన్నాలు తిని బయలుదేరేసరికి దీపాలు పెట్టారు. అట్నుంచి అటే పాలెం డొంక పట్టుకుని పెద్దారం వెళ్ళారు. ముందుగా పెద్ద ముఠా వాళ్లు రాంమందిరం ముందువేసిన తాటాకు పందిర కింద తిన్నారు. ఆ తర్వాత చిన్న ముఠా దగ్గరకు చేరారు. అక్కడా తిందామనుకున్నారు. కానీ కడుపులో పెసరగింజ పట్టేంత ఖాళీ కూడా లేదు. అక్కడ లడ్లు, బూరెలు, పులిహోర పైపంచలో మూటగట్టుకుని బ్రహ్మం గారి నాటకం చూసి ఇళ్ళకు చేరేసరికి మలికోడి కూసింది.
***
దుర్గయ్య నిద్రలేచేసరికి "నిన్న మాపిటేల యానాదుల దిబ్బ మీదున్న గుడిసెలన్నీ కాలిపోయినయి. రాతిరి చెబుదామంటే నువ్వొచ్చేలోపలే నిద్దురపోయానంటూ" చెప్పింది దుర్గయ్య భార్య సుబ్బమ్మ.
"ఊరోళ్ళంతా వెళ్లారు పలకరించడానికంటున్న" ఆమె మాట పూర్తికాకముందే పరుగులాంటి నడకతో చేలకడ్డాలపడి యానాదులదిబ్బ చేరాడు దుర్గయ్య.
ఊరు ఊరంతా అక్కడే ఉంది. అంతా పుల్లన్న దగ్గర జేరి ధైర్యం చెబుతున్నారు. తోకల ఎంకటేసు, పర్రె బసవయ్య, పంచుమర్తి వెంకటేశ్వర్లు, ఎరికిల వీర్లంకయ్య, గౌండ్ల వీరస్వామి. అక్కడంతా కాలిపోయిన సొరకాయల బుర్రలు, కొబ్బరికాయలు మామిడిచెట్టు బొగ్గయిపోయింది. కొంతమంది కాలిన సామానంతా ఒకచోట గుట్టగా వేస్తున్నారు.
దిగులుగా కూర్చున్న యానాది పుల్లన్న చుట్టూ కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పెళ్ళికోసం అద్దేపల్లి నుంచొచ్చిన చుట్టాలు, వియ్యంకుడు, వియ్యపురాలు, అల్లుడు చేరారు. చూడ్డానికి వచ్చిన కొంతమంది పలకరించి వెళ్ళిపోతున్నారు.
ఇంకా మంచి గుడిసెలేసుకోచ్చని ధైర్యం చెబుతున్నారు. కొంతమంది. పుల్లన్న ఏమీ మాట్లాడకుండా దీనంగా కూర్చున్నాడు.
"ఏమేమి కాలిపోయినయి యానాది పుల్లన్న" అంటూ అత్తలూరి గోపాలరావుగారి పెద్ద గుమస్తా బాయిగాడు చిన్నయ్య అడిగాడు. "నిట్టాటి గుడిసెలేసుకోవడానికి దొరగార్నడిగి తాటాకులు కొట్టుకొందువులే" అని ధైర్యం చెప్పాడు. మాట్లాడలేదు పుల్లన్న.
"ఇంకేమన్నా కాలినయా పుల్లన్నా? అంటూ పర్రె బసవయ్య అడిగాడు. కదలకుండా అట్టాగే కూర్చున్నాడు.
అప్పుడే అక్కడికొచ్చిన సలగాల దుర్గయ్యను వాటేసుకుని కొంచెం సేపు ఏడ్చాడు పుల్లన్న. అంత పెద్ద మనిషి ఏడుస్తుంటే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. ఆయన కూతుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు - శోకాలు పెట్టి ఏడ్చారు.
కొంచెం నెమ్మగిల్లినాక... "పిల్లగాల్లకేం కాలేదు గందా? ఏమేం కాలినయి మామా!" అంటూ అడిగాడు సలగాల దుర్గయ్య. లేచి కాలిబొగ్గయిన మామిడిచెట్టు కానిచ్చిన బానకర్ర తీసుకుని తలపాగా చుట్టుకున్నాడు. యానాది పుల్లన్న. కర్రని అటూ ఇటూ తిప్పుతున్నాడు. కుడిచేతిలోంచి ఎడమచేతిలోకి, ఎడమచేతిలోంచి కుడిచేతిలోకి.
మళ్లీ మెల్లగా అడిగాడు దుర్గయ్య పక్కనున్న వియ్యంకుడు యానాది ఎంకట సోమన్నని. "ఏమేమి కాలిపోయాయి యానాదెంకటి సోమన్న" అని - ఎత్తుకున్నాడు పుల్లన్న కర్ర తిప్పుతూ.
"ఏమేమి కాలిపోయే
యానాదెంకటి సోమన్నా!! యానాది పుల్లన్నా!
తిర్రికాలే! మొర్రి కాలే!!
తిరిగిమోత సట్టికాలే
కూతురికి దాచుకున్న కొత్తకోక కాలిపోయే!
అల్లుడికి దాచుకున్న గళ్ళలుంగీ కాలిపోయే
కోడలికి దాచుకున్న కుంకుంబరిణి కాలిపోయే
ఇంకేమి కాలిపోయే యానాదెంకటి సోమన్న! యానాది పుల్లన్నా!!
వియ్యపురాళ్ళకు దాచుకున్న ఈరుప్పని కాలిపోయే
చుట్టాలకు దాచుకున్న చుట్టపీకెలు కాలిపోయే
గజాశూలాల్లాంటి గసికర్రలు కాలిపోయే
మనవడిలా పెంచుకున్న మామిడిచెట్టు కాలిపోయే
కూతురులా చూసుకున్న కుంకుడుచెట్టు కాలిపోయే
పేనానికి పేనమైనా నా పేనానికి పేనమైనా నా వీరబాహు కాలిపోయే!!
ఇంకేమి కాలిపోయే యానాదెంకటి సోమన్న... యానాది పుల్లన్నా"
అంటూ పుల్లన్న, ఎంకటసామి కలిసి ఆడి పాడుతుంటే జనాలకి దుఃఖం ఆగలేదు. మిగిలిన యానాదులంతా కల్లుతాగి వారితో కలిసి ఆరోజల్లా వీరంగం వేస్తూనే వున్నారు. ఆ రోజుకే పిల్ల పెళ్ళయి పోయినట్టుగా తేల్చుకున్నట్టున్నారు. అమ్మాయి, అబ్బాయి కలిసి వీరంగం వేశారు. వారితో పాటు మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు కలిశారు. పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు.
ఆ రాత్రంతా యానాదులు పాడుతున్న పాటలు, డమరుక మోతలు వినపడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత యానాది పుల్లన్న మాచెర్ల చెరువుకట్ట మీదున్న పెద్దకొడుకు సంజీవి దగ్గర ఇంకో గుడిసె వేసుకున్నాడు. ఆ ఏడాది దసరా పండక్కి సంజీవి కల్తీ సారా తాగి చచ్చిపోతే... ఆయన పని పుల్లన్న చాలాకాలం చేశాడు.
***
యానాదుల దిబ్బ మీద మళ్లీ ఏ యానాది గుడిసె వేయలేదు. ఎప్పుడన్నా యానాదుల దిబ్బ మీదుగా వెళ్తుంటే గీ... అని గాలి రోద పెట్టేది. "ఇంకేమి కాలిపోయే యానాది ఎంకటిసోమన్నా! యానాది పుల్లన్న అన్నట్టుండేది ఆ రోద!
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
10-04-2025, 08:49 AM
(This post was last modified: 16-04-2025, 12:52 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పటికి రెండోవాయ చంద్రకాంతులు నూనెలో వేస్తూ... గంభనంగా నవ్వునాపుకుంటూ - "అలాగే జరిగింది" - అనింది నాతో అమ్మమ్మ, నా ప్రశ్నలన్నింటికీ జవాబుగా! నాకయితే అంత మురిపెంగా చెప్పిన అమ్మమ్మని మెడచుట్టూ చేయివేసి ఒక్కసారిగా కావలించుకోవాలన్పించింది గానీ... ఇప్పటికీ, మామూలుగా మధ్యాహ్నం వేళ, పలహారాలు తయారుచేస్తున్నా సరే... మడి గట్టుకుని చేసి, తొలి వాయుదేవుడికి నైవేద్యం పెట్టిగాని అమ్మమ్మ తనని ముట్టుకోనివ్వదు. ఈ విషయంలో మాత్రం రూల్సు దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసినదానినే గనకా నా కోరికను అలా అర్ధాంతరంగానే ఆపుకుని, మళ్లీ సంభాషణని పొడిగించాను.
"అయితే అమ్మమ్మా! నీ మనసుకి కష్టం కలిగేది కదా?" అన్నాను. మా సంభాషణ అంతా తాతయ్య నడివయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది.
తాతయ్యకి ఇతర స్త్రీలతోటి సంబంధాలని గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతోందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంక ఉండబట్టలేక "అమ్మమ్మా! ఇవాళ నీ వయసు మళ్ళినప్పటి సంగతివేరు.
ఆనాటికి నువ్వు చిన్నదానివే కదా! నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాలు గురించి కష్టమే కలగలేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు?? అన్నాన్నేను రెట్టించి.
అమ్మమ్మకీ నాకూ మధ్య ఉన్న నలభై ఏళ్ళ వ్యత్యాసం మా స్నేహానికి ఏనాడూ అడ్డు రాకపోవడం వింతగా ఉంటుందేమోగానీ, మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు.
"కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్యా ఉండే ఆకర్షణ మీదా... అవసరం మీదా ఆధారపడి ఉంటుందే అమ్మాయీ..." అంది అమ్మమ్మ. "మీ తాతయ్యకీ నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగింది లేదు.
ఆ మాట అంటున్నప్పుడు అమ్మమ్మ గొంతులో ఏ కాస్త తడబాటు లేదు. వేదనా లేదు. నిరాశా నిర్లిప్తతా కూడా లేవు. అమ్మమ్మ చాలా స్పష్టంగా మాట్లాడిన ప్రతీమాటనీ అత్యంత ఆసక్తితో విన్నాన్నేను.
"అది అలా జరిగింది మరి" అంది అమ్మమ్మ. "నాకు పెళ్లయ్యేనాటికే మీ తాత. బహిరంగంగానే మాలక్ష్మి ఇంటికి వెళ్లి వస్తూండేవారు. ఆయన కులాసా పురుషుడని ఆనోటా ఈ నోటా విన్నా - మా వాళ్ళు దాన్నంత గణనలోకి తీసుకోలేదు. నాకప్పటికి పధ్నాలుగేళ్ళు. ఏ విషయమూ తెలిసీ తెలియని వయసు. వంటినిండా అణుకువా... భయమూ ఉండేవి తప్ప దేని గురించీ ప్రశ్నలే తలెత్తేవి కావు. పైగా నా లోకమంతా సత్కావ్యమయం!" అంటూ కాసేపాగింది అమ్మమ్మ. "మరి తాతయ్యో?" అన్నాన్నేను. మీ తాతయ్యకేవీ?! పరమ లౌకికుడు. నాలా కాక పుస్తకాల అవసరం దాటినవాడూనూ" అంది హాస్యంగా.
అమ్మమ్మని తిరిగీ సంభాషణలోకి మళ్లించటంలో ఏ మాత్రమూ ఏమరిపాటు చూపలేదు నేను. అందువల్ల అవీ ఇవీ మాట్లాడి జారిపోకుండానూ అమ్మమ్మ దారి మళ్ళకుండానూ నా ప్రశ్నలతో కాచుకుంటూ వచ్చాను నేను. నన్ను నిరాశ పరచకుండా నా సందేహాలన్నీ తీరుస్తూ అమ్మమ్మ మాట్లాడింది.
"నేను పుష్పవతినయ్యాకా కాపురానికైతే వచ్చాను గానీ... మరీ చిన్నదాన్ని. ఆటపాటల మీద ఉన్నంత శ్రద్ధ నాకు ఆయన మీద ఉండేది కాదు. ఆయన కూడా అప్పట్లో నన్ను చిన్నపిల్లగానే చూశారు. అదీగాక మా మధ్య వయసు తేడా చాలా ఉంది. మీ తాతయ్య నాకన్నా పదిహేనేళ్లు పెద్ద. పురుళ్లకనీ, పుణ్యాలకనీ నేనెక్కువ పుట్టింట్లోనే ఉండేదాన్ని. పైగా మా ఇంట నేనొక్కతనే ఆడపిల్లని. ఎంతసేపూ మా జట్టు పిల్లలతో ఏటిదాకా పోయి తోట్లంటా దొడ్లంటా తిరగటం, ఏటిలో ఈతలు కొట్టడం, అప్పల్రావుడి కన్ను గప్పి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకోవడం ఈ పన్లంటే చాలు మనసు ఉరకలేసేది నాకు. మరి కాస్త పెరిగాకా ఆరోజుల్లో నా మనసునెక్కువ నాకర్షించినవి సంస్కృత కావ్యాలూ, నాటకాలూనూ!!
"నీకు తెలుసుకదా! మా పుట్టింట అంతా సురభారతీ సేవకులే! మా ముత్తాతలు, తాతలూ సంస్కృత పండితులు. కావ్య తర్క వ్యాకరణాలలో రచ్చగెలిచి ఔనన్పించుకున్న వాళ్ళూనూ! మా ముత్తాతగారువీధి సావిట్లో - వాలు కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని, అలా శిష్యులు వల్లెవేసే శ్లోకాలవైపూ సూత్రాలవైపూ ఒక చెవివేసి వింటూ, తలపంకిస్తూ ఉంటే... ఆయన ఎదురుగా అప్పటికే తలనెరిసిన మా తాతగార్లందరూ ఆయన ముందు చాలా వినయంతో మసలటం నాకింకా జ్ఞాపకం ఉంది. సంస్కృత నాటకాలని మా చిన తాతగారు పాఠం చెబుతూ ఉంటే వినడం ఎంత బాగుండేదనీ!! అందరూ కాళిదాసు శకుంతల అంటారుగానీ... నాకు శూద్రకుడి వసంతసేన మీదనే ఎక్కువ మక్కువ ఏర్పడింది."
మా నాయనమ్మ చాలా శ్రావ్యంగా అష్టపదులు మొదలుకొని, తరంగాలనించి, ఆధ్యాత్మ రామాయణం దాకా తన్మయత్వంతో పాడుతూ ఉండేది. "అచ్యుత మాధవహరి రామేతి కృష్ణానంద పరేతి" - అంటూ పాడుతూ కళ్ళు మూసుకుని, తన గాత్ర మాధుర్యంలో తానే లీనమయ్యే నాయనమ్మ ముఖం ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతుంది. నాయనమ్మ పాటతో పెరిగిన దాన్ని నేను. "జయదేవుడంటే ఎంతో అనురక్తి ఏర్పడింది నాలో! నన్ను నేను వసంతసేనగానూ, గోపికగానూ భావించుకునేదాన్ని. ఎంత చక్కగా అలంకరించుకునేదాన్నో తెలుసా"? సంతోషంగా అంది అమ్మమ్మ.
అటూ ఇటూ కదులుతూ, పనిచేస్తూ ఇలా మాట్లాడుతున్న అమ్మమ్మని గమనిస్తున్నాను నేను. అమ్మమ్మ అందం వాసి తగ్గలేదిప్పటికీ! సన్నగా పొడవుగా కంచుకడ్డీలా ఉంటుంది అమ్మమ్మ శరీరం. పట్టుచీరని అడ్డకచ్చ కట్టుకుని, తనువంతా పసుపురాశి పోసినట్టు పచ్చగా ఉంటుంది అమ్మమ్మ. నిత్యమూ పసుపుతో విరాజిల్లే... అమ్మమ్మ పాదాలని కప్పుతూ వెండి కడియాలూ... వెండి గొలుసులూ, అమ్మమ్మ కంటానికి అతుక్కుని బంగారపు నానూ, పట్టెడ, మంగళసూత్రం, నల్లపూసల కుత్తిగంటూ, చేతులకీ బంగారు గాజులు, వాటిమధ్య ఎర్రటి మట్టి గాజులూ ఆవిడ శరీరంలో ఒక భాగమైనట్టుగా మెరుస్తూ ఉంటాయి. నెరసిన బారెడు పొడవైన తన తల వెంట్రుకలని జారు ముడి వేసుకుంటుంది. మడి మధ్యలో ఎర్రటి ముద్దమందార పువ్వుని ఎప్పుడూ వాడకుండా చూసుకుంటుంది. ఆవిడ తన ఆకర్నాంత నేత్రాలనలా భావస్ఫోరకంగా కదుపుతూ ఉంటేనూ... అటూ ఇటూ తల తిప్పుతూ మాట్లాడుతున్నప్పుడల్లా ఆవిడ ముక్కున పుష్యరాగ పొడితో తళుక్కుమంటూండే, ఆ నిమ్మగుత్తి ముక్కుపుడక మీద కిరణాలు పడి చెదిరి పోతుంటేనూ... విశాలమైన ఆవిడ నుదుటిమీద ఎర్రటి కుంకంబొట్టూ, కళ్ళకి కాటుకా, తాంబూలంతో పండిన ఆ పలచటి పెదాలూ... గడ్డం కింద సదా ఎండిన గంధపుచారా... తన ఒక్క శరీరంలో ఇంత వైవిధ్యాన్ని ఆవిడ ఎలా నిలుపుకుందో ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే!!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఆవిడ రూపాన్ని అలా గమనిస్తూ ఉండగా శరీరమంతా నిండిన ఎరుపుల మిశ్ర వర్ణాలతో ఆవిడ నిజంగా కుందనపు ఆకాశాన పొద్దుపొడుపు సూర్యుడిలా కన్పించింది. అలా ఆవిడని చూస్తూ 'ధన్యోస్మి' అనుకున్నాను.
మా అమ్మమ్మది చాలా అందమైన నవ్వు. ఎంత అందమైన నవ్వంటే... నవ్వుతూ ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఆవిడ ముఖం మీంచి చూపు తిప్పుకోవటం కష్టం. ధనుస్సు వొంగినట్టుగా మెలికలు తిరిగిన పెదాల మధ్య నించి, అలవోకగా... చంద్రవంకలా... నవ్వగలదావిడ! ఆవిడ నవ్వొకటి చాలు కదా! ఆనాటి మగవాళ్ళు తమ చూపు తిప్పుకోలేకపోవడానికి అనుకుని, ఆ మాటే అడిగాను అమ్మమ్మని. దానికావిడ ముసిముసిగా నవ్వి, మాటదాటవేసి - ఎలా ఉండేదాన్నా? అచ్చం నీలాగే ఉండేదాన్ని... ఆ ఎడం బుగ్గమీద నవ్వినప్పుడు పడే సొట్టతో సహా! అంది... నా వైపు మురిపెంగా చూస్తూ!!... తన కనుకొలకుల్లో కొంటెదనాలని కూడా మేళవించి మరీ!!
"అయితే అమ్మమ్మా! మా లక్ష్మిని చూసేవా నువ్వు?" అన్నాను. "అయ్యో! చూడకేవే! ఛామన ఛాయ అన్నమాటేగానీ చూడచక్కనిది తెలుసా!" అంది అమ్మమ్మ. "మంచి పాటగత్తె అది. ఎంతటివాళ్లు గాని మా లక్ష్మి పాడితే చాలు మైమరచి పోవలసిందే" అని నిశ్శబ్దంగా ఊరుకుంది కాసేపు. అప్పటికే చనిపోయిన మా లక్ష్మిని తలచుకుని కాబోలు అమ్మమ్మ కళ్ళు తడి అయ్యాయి. కాసేపయ్యాక ఆలోచనల్లోంచి తేరుకుని "మాలక్ష్మి చాలా చక్కనిది కమలా!" అని మళ్లీ అంది అమ్మమ్మ ఆవిడ గొంతులో తన మొగుడు వలచిన ఆ మరో ఆడది తనకీ ధీటైనదే గానీ, ఏమంత అల్లాటప్పా మనిషి కాదు సుమా అన్న కించిత్ అతిశయం తొణికిశలాడింది కూడా! తాతయ్యకే కాదు అమ్మమ్మకి కూడా మాలక్ష్మి అంటే ఇష్టమని అర్ధమైంది నాకు. ఆడది మెచ్చిందే అందం అనుకున్నాన్నేను. తరువాత అమ్మమ్మ తన మాటల్లో - పెళ్లంటే చేసుకోలేదు గానీ, కడదాకా వాళ్లిద్దరూ ఎంతగా కలిసి మెలిసి ఉన్నారో... వివరంగా చెప్పుకొచ్చింది. మాలక్ష్మి పోయాకా తాతయ్య ఎంత ఒంటరివాడయ్యాడో అర్ధమైంది నాకు.
ఆలోచిస్తూ నేను... పీటమీద మోకాళ్ళని దగ్గరగా మడచి, వాటిమీద నా గడ్డం ఆన్చుకుని మౌనంగా కూచున్నాను. వాళ్ళకాలంలో ఇంత సంక్లిష్టమైన విషయాలని ఇంత సజావుగా మామూలుగా ఎలా తీసుకున్నారన్నదే నాకింకా అంతుపట్టడంలేదు. బహుశా వారికి మల్లే నా జీవితంలో అంతగా ఆకర్షించిన పరిచయాలేవీ ఇంకా ఎదురు కాలేదేమో?! అనుకున్నాను. అంతలో నాకు పతంజలి జ్ఞాపకానికొచ్చాడు. నేనూ పతంజలీ యూనివర్సిటీలో సోషియాలజీలో రిసెర్చ్ స్కాలర్లమి. నేనంటే చాలా ఇష్టపడే వాడు పతంజలి. పైగా నాతోపాటే రిసెర్చ్ చేస్తున్నవాడూ, బ్రాహ్మడూ కూడా గనుక, మా ఇంట్లో వాళ్ళంతా అతడి పట్ల సుముఖంగానే ఉండేవారు.
కానీ, నాకు రెండేళ్లు జూనియర్ - రమేష్ అని. ఒక నాయుళ్ల కుర్రాడు ఉండేవాడు. అతడు పతంజలి అంత తెలివైనవాడు కాదుగానీ, చాలా చలాకీ అయినవాడు. ఆ అబ్బాయికీ నేనంటే ఇష్టముండేది. నేను కూడా పతంజలి కన్నా ఈ రమేష్ తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని. అతడితోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. రమా రమా! అని పిలిచేదాన్నతడిని. అనేక విషయాల వల్ల మేమిద్దరం కలగలిసిపోగలిగే వాళ్లం. అలాంటి సమయాల్లో పతంజలి ముభావంగా దూరంగా ఉండేవాడు నాకు. పతంజలి అలా ఉడుక్కుంటూ ఉంటే చూడటం నాకు సరదాగా ఉండేది. పతంజలి మీద నాకు ఆసక్తి కన్నా - రమేష్ తో నాకున్న స్నేహం... చనువూ మాత్రం పతంజలితో ఉండేది కాదు. యూనివర్సిటీలో వాళ్ళు నేను పతంజలినో, రమేష్ నో తప్పక పెళ్ళి చేసుకుంటానని ఊహాగానాలు చేస్తుండేవారు. అందరూ అనుకున్నట్టుగా నేను అటు పతంజలికి గానీ, ఇటు రమేష్ కి గానీ, పెళ్లి దగ్గరవలేదు. డాక్టరేట్ డిగ్రీ తీసుకుని, ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకోమంటున్న ఇంట్లోవాళ్ల వత్తిడి నించి కొంతకాలమైనా తప్పించుకుందుకని.
నా ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ... "కాఫీ తాగుతావే అమ్మాయి" అంది అమ్మమ్మ. నన్ను కలపనివ్వదని తెలిసినా... "కాఫీ నేను కలపనా? అమ్మమ్మా!" అని అడిగాను నేను. "ఎంతసేపే! ఈ పాటిదానికి." "నువ్వలా కూచో" అనేసి, నిజంగానే రెండు నిమిషాల్లో నా ముందు కాఫీకప్పు పెట్టింది అమ్మమ్మ. తరువాత లేచి వెళ్లి సావిట్లో ఉయ్యాల మంచం మీద కూచున్న తాతయ్యకి వేడివేడిగా చేసిన చంద్రకాతాలని వెండిపళ్లెంలో పెట్టి ఇచ్చి... కాసేపు మాట్లాడుతూ ఇక్కడే నించుంది.
దూరాన్నించీ వాళ్లిద్దరినీ పరిశీలిస్తూ కూచున్నాను నేను. కోసుగా ములితిరిగిన తెల్లని బుంగమీసాలు, తాతయ్య సగం బుగ్గల దాకా ఆవరించి ఉన్నాయి. అచ్చం ఆదిభట్ల నారాయణదాసుమీసాలకు మల్లేనే! తాతయ్యది వంకీల జుట్టు. మధ్య పాపిడి తీసుకుని తల దువ్వుకుంటాడు. సూదిముక్కు ముఖానికంతటికీ ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. విశాలమైన ఆయన కళ్ళనించి చూపు తీక్షణంగా ఉంటుంది. ఆయన కళ్లలో నిరంతరం ఒక ఎర్రజీర - మలిసంధ్యలా వ్యాపించి ఉంటుంది. తాతయ్య చెవులకి కెంపుల తుమ్మెట్ల అతుక్కుని ఉంటాయి. తాతయ్యకి వేషంలోనేగానీ, వ్యవహారంలో మాత్రం ఏ కోశాన వైదిక సంప్రదాయాలేవీ అలవడలేదు. మిగతా వాటిల్లో ఆయన పూరా లౌక్యుడే.
ఆయన ఖాళీ ఛాతీకి అడ్డుగా జంధ్యం వేళ్లాడుతూ ఉంటుంది. చిరుబొజ్జ... పంచె కట్టుని దాటి పైకి కన్పిస్తూ ఎర్రటి మొలతాడు, కూచుంటేనే అంత ఎత్తు కనిపించే ఆజానుబాహుడాయన. ఏమేం జ్ఞాపకాలని నెమరు వేసుకుంటాడో... ఇంట్లో ఉన్నంతసేపూ ఏకాంతంలో ఉంటాడు. వయసులో ఈయన సూదంటురాయిలా ఆడవాళ్లని ఆకర్షించే ఉంటాడు - అనుకున్నాన్నేను. నాకు తాతయ్య దగ్గిర బొత్తిగా చనువులేదు. ఎప్పుడన్నా పలకరిస్తే ఔననో... అలాగేననో... సరేననో... జవాబుచెప్పి ఆయన ముక్తసరి ప్రశ్నలకి తలూపడం తప్పిస్తే... మాట పెగిలి వచ్చేది కాదసలు. చేతికర్రని విలాసంగా ఊపుకుంటూ ఆయన వీధిలో నడిచి వెడుతూ ఉంటే ఆ ఊరి రైతులు ఎంతో మర్యాదగా "బుగతా!" అంటూ అనుసరించడం మేమంతా ఎరుగుదుం. బయట వాళ్ళందరికీ తలలో నాలుకలా మసలే ఆయన ఇంట్లో మాత్రం పరమ గంభీరంగా ఉండేవాడు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
ఇంతలో అమ్మమ్మ తిరిగొచ్చి మళ్లీ పొయ్యిదగ్గర కూచుంది.
"అమ్మమ్మా! తాతయ్య నిన్నెలా చూసుకునేవాడూ?" అని అడిగాను.
దానికి నవ్వేసి "ఒక మొగుడిలా... ఇంకెలా?" అనేసింది అమ్మమ్మ. అమ్మమ్మ గొంతులో వ్యంగ్య మేం లేదు. విషాదమూ లేదు. చివరికి కొంచెం కోపాన్ని నా కంఠంలో వొలికిస్తూ...
"నీకు మా లక్ష్మి గురించి తెలిస్తే... నువ్వేమైనా అనుకుంటావనైనా ఆలోచించలేదా తాతయ్య?" అన్నాను. అమ్మమ్మ నేనెంత కవ్వింపు చూపినా లొంగిరావడం లేదు నాకు. "ప్రేమ ఉన్నచోట ఒకరు అనుకుంటారనీ, అనుకోరనీ ఆలోచించే అక్కర ఉండదే! అది నాకు స్వానుభవంగా తెలుసు" అంది అమ్మమ్మ. "సరే విను. నేనూ... మీ తాతయ్య బాగా పరిచయస్థులమైన అపరిచయస్థులం అనుకో! ఆయనా, మా లక్ష్మి కలిసి ఒక ప్రపంచం. వాళ్ళ ప్రపంచాన్ని నేను అలాగే ఒప్పుకున్నాను. నేను అడ్డు వెళ్లదలచుకోలేదు. గొడవ పడదలచుకోనూ లేదు. అదలా జరిగిపోయింది అంతే!" అంది అమ్మమ్మ.
"ఇదంతా ఎలా సాధ్యమైంది అమ్మమ్మా! నీ త్యాగం వల్లనేగదా?" అన్నా నేను 'త్యాగం' అన్న పదాన్ని వత్తి పలుకుతూ అక్కసుగా! ఎలాగైనా అమ్మమ్మలో ఒక కోప వీచికని చూడాలన్నది నా కోరిక.
లేదమ్మా కమలా! నేను అడ్డుపడినా... గొడవపడినా... తాతయ్యని నా చుట్టూ తిప్పుకోలేను నేను. ఆయన మనసులో మాలక్ష్మి ఉంది. నాకూ అక్కడ ఇంత చోటిప్పంచమని నేను ప్రాధేయపడదలచుకోలేదు. పోటీ పడదలచుకోలేదు. ఎందుకో చెప్పనా? నాకు శృంగారం మీద గౌరవం ఉంది గనుకనే!" అంది అమ్మమ్మ.
నాకు ఈసారి నిజంగానే కోపం వచ్చింది. "అంత సౌమ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? అదే నీకే ఇంకో సంబంధం ఉంటే... తాతయ్య నీ అంత విశాలంగా ఆలోచించి ఒప్పుకోగలిగి ఉండేవాడా అమ్మమ్మా?" అన్నాన్నేను. నా మనసులో పతంజలి ముభావం మెదులుతూండగా!
మా సంభాషణ అంతా ఏకాంతంలో మృదువుగా... నెమ్మదిగా... సాఫీగా... సాగుతోంది. మా చుట్టుపక్కల ఏ అలికిడీ... ఆటంకమూ లేకనే... ఆ సాయంత్రాన వాతావరణం... ఇద్దరాడవాళ్ల అంతర్ లోకాల అల్లకల్లోల కెరటాన్వితమయ్యింది. పెరట్లో... నూతి చప్టా పక్క... పున్నాగ చెట్టుమీద పక్షుల కలకలం తప్ప మరే శబ్దమూ లేదు. ఈ సారి నేనడిగిన ప్రశ్న అమ్మమ్మని కొంచెం కలవర పెట్టినట్టే ఉంది. కొంత సమయం గడిచాకా... నా ప్రశ్నకి అమ్మమ్మ ఇలా జవాబు చెప్పింది.
"తాతయ్య ఒప్పుకోవడం... మానడం అన్నదానికన్నా ముఖ్యం, అసలాయన దృష్టిలో - ప్రేమ, శృంగారానుభవం ఉన్న సంగతులు, కేవలం మగవాడికే సొంతమన్న అహంకారం తరచూ వ్యక్తమయ్యేది. అది నాకు నచ్చని విషయం. సంసారం లోపలి ఆడవాళ్ళకీ శృంగారాలనుభవాలనేకం కలగగలవన్న ఆలోచనకే ఆయనలో చోటులేదు. అందునా వాళ్ల వాళ్ల సంసారాల్లోని ఆడవాళ్లంటే... వాళ్ల దగ్గిర శృంగారపు ప్రసక్తే రాదసలు. అదొక నిషిద్ధ విషయం. - జీవితమంతా నటించాల్సిందే వాళ్ళ ముందు వాళ్ళ ఆడవాళ్ళు!" ఈ మాటని ఎంత మామూలుగా అందామనుకున్నా అమ్మమ్మ గొంతు తడబడింది. ఆమెకున్న నచ్చనితనం బలంగా వ్యక్తమయింది ఆ మాటల్లో!
నా ఆలోచనల్లోని లోపం కూడా నాకు కొట్టొచ్చినట్టు తెలిసింది ఈ మాటలతో. ఔను నిజమే కదా! నేను మాత్రం? ఇంతసేపూ... తాతయ్యకి మాలక్ష్మితో ఉన్న సంబంధం గురించే ప్రశ్నించానుగానీ... నా అనుభవాల గురించే ఆలోచించుకుంటున్నాను గానీ... ఎక్కడా... అమ్మమ్మ జీవితంలో కూడా ఆవిడకే సొంతమైన కొన్ని అపురూప అనుభవాలుండొచ్చు నేమో!? అన్న ఊహకి కూడా పోలేదు కదా! అనుకున్నాను.. తప్పు చేసినట్టు.
నేను మరేవీ ప్రశ్నించకుండానే... నా సందిగ్ధతలన్నీ తాను చదివినట్టుగానే... నా ముఖంలోకి చూస్తూ... "గాడమైన శృంగారానుభవం కలిగితే జీవితంలో సమతుల్యత దానికదే సాధ్యమవుతుందే మనవలారా!" అంది అమ్మమ్మ నా మీద ప్రేమ ఉట్టిపడే గొంతుకతో.
"అలాంటి అనుభవాలు నాకున్నాయి గనుకనే నేను మీ తాతయ్య శృంగార జీవితపు లోతులని అర్ధం చేసుకోగలిగేను. ఎప్పుడని, ఎలాగని ప్రశ్నించకు. కథలు అనేకం. ఎవరి అనుభవం వారిదే"! అంది మళ్లీ. అంతదాకా లేని గాఢత ఒకటి అమ్మమ్మ మాటల్లో వ్యక్తమయింది. వివరంగా చెప్పమని బతిమాలి అడిగాను నేను.
అమ్మమ్మ తనకోసమే మాట్లాడిందో... నా కోసమే మాట్లాడిందో కూడా నాకు తెలీదుగానీ.. ఏనాడూ నాతో మాట్లాడనంత నిగూడంగా మాత్రం మాట్లాడింది. ఆవిడ అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే జ్ఞాపకం పెట్టుకున్నాను నేను.
"నా పెళ్లయ్యాకే! మా పుట్టింట్లో.. నాకు మీ అమ్మ పుట్టిన తరువాత... ఆదిరాజు వారి కుర్రాడు.. మా ఇంట సంస్కృతాధ్యయనాని కొచ్చిన కుర్రాళ్ళందరిలోనూ చురుకైనవాడు... ఎవరినీ ఒక పట్టాన మెచ్చుకోని మా పెదతాతగారు సైతం మణిపూసలాంటివాడని ప్రత్యేకంగా అభిమానించేవారు తెలుసా?" అంటూ తనలో తాను మాట్లాడుకున్నంత నెమ్మదిగా మాట్లాడింది అమ్మమ్మ.
వయసులో నాకన్నా కొంచెం చిన్నవాడే అనుకుంటాను. ఎంతటి ధీమంతుడో... చురుకైనవాడో చెప్పలేను నేను..." ఈ మాటలంటున్నప్పుడు అమ్మమ్మ పెదవి కొనల్లొ మెరిసిన నునుసిగ్గు హాసరేఖని సరిగ్గా అందుకోగల చిత్రకారులున్నారో... లేదో... నాకు తెలీదు గానీ, నేను మాత్రం ఆ క్షణంలో ఆవిడలోని ఆ హఠాత్ సౌందర్యాన్ని నా చూపుతో పట్టుకుని భద్రపరచుకున్నాను. నేను మరే ప్రశ్నలు వేయనక్కరలేనంత వివరంగా అమ్మమ్మ తన ప్రణయాన్ని నా ముందు రేకురేకుగా విప్పి చెప్పింది.
"శృంగార స్పర్శ చాలా బలమైనదే అమ్మాయీ! ఇవాళ్టి దాకా నేనతడి స్పర్శని మరచి పోలేదు సుమా! అందునా ఆ కార్తీకమాసపు తెల్లారగట్ట... ఏటి గట్టున... ఆకాశం కింద... శుక్రుడి సాక్షిగా... ఏకమైన దేహాల మధ్య... ఎంతటి తీవ్ర శృంగార కలాపం అదీ?!! జన్మానికంతకీ వన్నె తెచ్చిన అనుభవం అది... మా ఇద్దరికీనూ" అంది కనులరమోడ్పుగా అమ్మమ్మ. "రెండు జ్వాలలు పెన వేసుకుని వెలిగినట్లనుకో! ప్రసూన,మాలలా శరీరాలు ఆవ్యక్తసుగంధాలని వెదజల్లే కామమే నిజమైన కామం. దానికి దోసిలి పట్టాలి... ఎదురెళ్లి దాసోహమనాలి... ఆ స్థితిలో, ఈ లోకంలో చెలామణీ అయ్యే మతాలకీ... ధర్మాలకీ... శాస్త్రాలకీ ఏ విలువా లేదు. అదొక రసఝరీయోగం అంతే!! కావ్యానుభావాన్ని అక్షరాలుగా పఠించడం కన్నా అణువణువులోంచి గ్రహించడం అన్నదే ఎక్కువ విలువైనదన్న విషయం నాకు ఆ రాత్రే తెలిసింది. ఆ తరువాత మరి నేను సంస్కృత కావ్యాల మీద మునుపటి మొహాన్ని వదిలేసుకున్నాను. కావ్యాన్ని చదవడం కన్నా కావ్యంగా మిగలటం మరీ మధురం" అంది అమ్మమ్మ మరీ మధురంగా!! నేను విభ్రమతో మిగిలాను.
నా లోపల అపరిష్కృత అనేక ప్రశ్నలకి జవాబు దొరికినట్లయ్యింది. అప్పటిదాకా నాకెదురైన శృంగారానుభవాలనన్నీ తిరగదోడుకుని ఆలోచించుకున్నాను. ఎందుకనో గాని, "ప్రేమ" అన్న భావంలోనే... శృంగారపు గాఢతలోనో... నేను ఇంతదాకా నిజంగా సంలీనమయ్యానన్పించిలేదు నాకు. అసలీభావాలు స్థిరమనీ... శాశ్వతమనీ కూడా నేననుకోలేదు.
ఏదో వెలితి, చాలా చదువుకున్న తర్వాత కూడా - విజ్ఞానమూ నా లోపలి శూన్యాలనీ పూడ్చలేని వెలితి తాలూకు కొస అంచులేవో ఇప్పుడు అమ్మమ్మ మాటల్లో దొరుకుతున్నట్లే అన్పించింది నాకు. మేము మసక చీకట్లని వెలిగించుకోగల దీపశిఖగా ప్రజ్వలింప చేసుకోలేకపోయామా? అనుకున్నాను. ఇలా చదువుల వెంటా, ఉద్యోగాల వెంటా పేరు ప్రఖ్యాతుల వెంటా, ప్రపంచాలు తిరుగుతూ పరుగులు పెట్టే తొందరలో ప్రాణధారమైన వాటినెన్నో జారవిడుస్తున్నామా? అని కూడా అనుకున్నాను. నాలో ఎంతకీ వదలని అసంతృప్తుల ఆది మూలాలేవో అమ్మమ్మ ఇలా చెప్పకనే చెప్పి నన్ను మేల్కొలిపిందా? ఏమిటి కావాలి నాకు? ఎందుకీ భయాలు నాలో? వేటి గురించి? ఇంత అనుభవం తర్వాత కూడా??!
వెన్నెల్లో పడుకుని. ఆలోచిస్తూ చాలాసేపు ఒంటరిగా అలా మిగిలిపోయాను. ఎప్పుడో... తాతయ్య నిద్రపోయిన తరువాత నా ప్రక్కనే వచ్చి, నిశ్శబ్దంగా పడుకుని నా తల నిమురుతూ... నా భయాలన్నీ తనకి తెలుసన్నంత నమ్మకంగా నన్ను దగ్గిరికి తీసుకుంది అమ్మమ్మ. ఎక్కడా దొరకని విశ్రాంతి - అమ్మమ్మ గుండెల్లో మొహం దాచుకుంటే దొరికింది. నాకు. నా వీపు మీద చేయి వేసి రాస్తూ... చెవిలో గుసగుసగా అమ్మమ్మ నాతో మాట్లాడిన ఒక్కొక్క మాటా నేను మరిచిపోలేనివి.
మా అమ్మమ్మ రసోచిత వ్యక్తిత్వం వెనక దృశ్యాదృశ్యంగా తారాడే ఆయనెవరో తెలుసుకోవాలన్న కోరికని అణచుకోలేకపోయాను. ఇంకా... నిద్రలోకి జారుకోబోయే క్షణాన... చివరికి చొరవ సేసి... "అమ్మమ్మా! ఆ... ఆదిరాజు వారి కుర్రాడూ..." అంటూ... ఆర్ధోక్తిలో ఆగిపోయాన్నేను.
చిక్కటి చీకట్ల మధ్య పాలపుంతవైపు తల తిప్పి చూస్తూ... తన చూపులో నక్షత్రాలు ప్రతిఫలిస్తుంటే... "నీలకంఠరావు" అంది అమ్మమ్మ!
మా మావయ్య పేరు ఎవరిద అప్పటికి నాకు అర్ధమైంది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
వారసత్వం - చొప్పదండి సుధాకర్
నాంపల్లి ఆవులిస్తూ నిద్రలేచాడు!
అప్పటికి ఉదయం ఏడు గంటలయింది.
అసలు ఏడయినా నిద్ర లేచేవాడు కాదు గానీ, చింత చెట్టు నీడ జరిగి మొహమ్మీద చుర్రుమని ఎండ పడడంతో మెలుకువ వచ్చింది.
"చాయ్ పెట్ట మంటావుటయ్యా!" ఇల్లాలు రంగశాయి అడిగింది.
"ఆ పెట్టు మొఖం కడుక్కొచ్చుకుంట" బద్ధకంగా లేచి, చిరిగిపోయిన పంచెను లుంగీలా మలచి కట్టుకొని, నోట్లో వేప పుల్ల వేసుకుని ఫర్లాంగు దూరంలో ఉన్న వాగు కేసి నడిచాడు.
నాంపల్లికి సుమారు పాతికేళ్ళు ఉంటాయి. అందంగా కాకపోయినా సన్నగా ఓ మోస్తారుగానే ఉంటాడు. వాళ్లది గంగిరెద్దుల కులం. వాడి బతుకుతెరువు కూడా గంగిరెద్దలను ఆడించడమే. ఒక చోటంటూ లేదు. సంవత్సరం పొడవునా జిల్లా అంతటా తిరగడం, దొరికినదాంతో పొట్టపోసుకోవడం అంతే!
ఇల్లూ లేదు, వాకిలీ లేదూ! సంపాదన లేదూ, చుట్టుబండా లేదూ!!
ఇప్పుడు వాళ్లున్నది ఓ మూడు రోడ్ల కూడలి!
దానికి ఇరుపక్కలా చింత చెట్లూ! మామిడి చెట్లు! వాటి కిందే వాళ్ళ కాపురం!
ఆ చోటు పూర్తిగా అడవి కాదు! పూర్తిగా ఊరు కాదు! పొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది దాకా వచ్చిపోయే జనంతో, బస్ ల కోసం వేచి ఉండే ప్రయాణికులతో నానా సందడిగా ఉంటుంది. రాత్రి ఎనిమిది దాటితే ఆ ప్రదేశంలో నాంపల్లి కుటుంబం తప్పితే ఎవరూ ఉండరు.
నాంపల్లి మొఖం కడుక్కొని వచ్చాడు. రంగశాయి చాయ్ పోసింది. "ఇయ్యాల ఎక్కడికి పోతవయ్యా బిచ్చానికి?" నాంపల్లి చాయ్ తాగుతుంటే పక్కన కూచుని అడిగింది.
అతడు ఏమీ బదులివ్వలేదు.
చాయ్ తాగడం ముగించి గ్లాసు పెల్లానికిచ్చాడు.
"ఎటు పోతావయ్యా బిచ్చానికి?" మళ్లీ అడిగింది.
నాంపల్లి నిట్టూర్చాడు.
"ఏమోనే! గట్ల ఊరు మీద పడిపోత. ఏ ధర్మరాజు కన్నా కనికరం కలగదా?"
"ఏమి కనికరమో ఏమో? ఎడ్లు మేతలేక, మనకి తిండి లేక సస్తున్నామ్!" కోపంగా అంది రంగశాయి.
"ఏం చేద్దామే! ఆ ఎములాడ రాజన్నకు మనమీద దయలేదు."
"ఏ ఎములాడ రాజన్న ఏం జేత్తడు! తప్పు మనది బెట్టుకొని" లేచి పొయ్యి దగ్గరకు పోతూ అంది.
నాంపల్లి ఏం మాట్లాడలేదు. గొంగళి భుజాన వేసుకొని కొదురుపాక ఊళ్ళోకి నడిచాడు. నిజానికి అతడికి ఆశలేదు ఎవరో ఏదో దానం చేస్తారని. అయినా వెళ్ళకతప్పదు. తనని నమ్ముకొని రంగశాయితో పాటు నాలుగు ఎడ్లు, ఓ ఆవు ఉన్నావాయె!
రోడ్డు మీద నడుస్తున్నాడన్న మాటేగాని అతడి మనసు మనసులో లేదు.
ఛ! తనది ఏం బతుకు అనిపించింది. ఎవరిని చూసినా ఎంతో ముద్దుగా ఇల్లు, వాకిలి, సంసారంలో రోజు రోజుకి ఎదిగిపోతున్నారు. తనే ఎంతకీ బాగుపడడం లేదు! తన చుట్టాలు, తెలిసిన వాళ్ళంతా ఈ గంగెద్దలాట వొదిలి పట్నాల్లో హొటళ్లలో జీతాలుండి, రిక్షాలు తొక్కుతూ దొరబాబుల్లా బతుకుతున్నారు.
"అంటే ఈ పని ఇడిశిపడితే తానూ బాగుపడిపోతాడా?"
ఆ అనుమానం నాంపల్లికి ఇప్పటికి వెయ్యిసార్లన్నా వచ్చి ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఆలోచించడు.
ఎందుకంటే అతడికి ఈ వృత్తి విడవాలన్న ఆలోచన కలలో కూడా రుచించదు!
అతడికి ఇప్పటికీ బాగా గుర్తు! గంగిరెద్దులను ఆడించడంలో వాళ్ల అన్నయ్య రాజన్న కున్న జిల్లా మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు!
అల్లీపురము గడిల దొరల ముందు, వూడూరు జమీందారుల పెళ్లిళ్లలో ఒక చోటేమిటీ మానేరువాగు అటు పక్క పది ఊళ్లు, ఇటు పక్క పది ఊళ్లు రాజన్న గంగి రెద్దుల ఆటంటే పడి చచ్చేవారు. ఏ పెళ్లయినా, పేరంటమయినా రాజన్న గంగి రెద్దుల ఆట ఉండాల్సిందే! జాతర్లలో అయితే సరేసరి! కనీసం రొన్నూర్లయినా తగ్గేవాడు. ఆ కాలంలో రొన్నూరు రూపాయలంటే మాటలా! ఏడాది గాసం, చిన్నగా ఓ పెళ్లిచేసేంత పైకం. ఇప్పుడు తన ఆవుపాలకు హొటలు వోళ్ళు నెలకీ యాభై ఇచ్చినా వారం కూడా తిరగడం లేదు!
పైసలు, బంగారం, ధాన్యం, ఎద్దులు ఒకటేమిటి! అన్నీ పుష్కలంగా ఉండేవి, వాటికి తోడు రాజన్న రూపు రేఖలు కూడా ఓ మాదిరి రాజులాగే ఉండేవి. బుర్ర మీసాలు, చెవులకు తులమేసి బంగారు పోగులు, అయిదేళ్లకు అయిదు ఉంగరాలు. అందరికీ రాజయ్యంటే ప్రాణమే! రాజయ్య కూడా నూరూళ్ళ ప్రజలతో కుటుంబ సభ్యుడిలా మెలిగేవారు. రాజన్నకి పిల్ల నివ్వడానికి పోటీలు పడి ముందు కొచ్చిన వాళ్ళు వందల్లో ఉన్నారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
రాజన్నకి గంగి రెద్దు లాట అంటే ప్రాణం కన్నా ఎక్కువే. గంగిరెద్దులనూ రాజన్ననీ విడదీసి చూడడం వీలయ్యేది కాదు.
"నా తాత తల్లితండ్రుల కాలం నుండి ఈ గంగిరెద్దులు ఆ ఎములాడ రాజన్న రూపాలే! మా పాలిట కుల దేవతలే! ప్రాణం ఉన్నా పోయినా వీటి నీడలోనే" అనేవాడు గర్వంగా మీసాలు దువ్వుకొంటూ.
ఆ మాటలు నాంపల్లికి ఎంతో కమ్మగా తోచేవి!
అయ్య పొందే మన్ననా, మర్యాద, ఆటలో నేర్పరితనం అన్నీ తనూ పొందాలని కలగనేవాడు. రాజయ్యకి కూడా నలుగురు కొడుకులున్నా నాంపల్లి అంటేనే ప్రాణం!
"నా తర్వాత నా ఆటా, పాటా కలకాలం నిలబెట్టేది నా నాంపల్లి గాడొక్కడే" అనేవాడు తోటి వారితో.
"ఓరే రాజన్నా! దీప మున్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాల్రా! ఓ లంకంత ఇల్లు గట్టి పదెకరాల పొలం గొని పారెయ్యరాదురా!
ముసలితనాన పనికొస్తది. ఏ కాలం ఎట్లుంటదో." తోటి వాళ్లు బుద్దులు చెప్పావారు.
"నా కెందుకే ఇల్లు శిన్నాయనా! ఈ గడ్డంతా నాదేనాయే! ఎవలింట్లో బిచ్చమెత్తుకున్నా రోజు గడిచిపాయే! అడిగినోళ్ల ఇంట్ల అడగకుండ తిరిగినా పదేళ్లు బతుకత గేరంటిగా" అనేవాడు విజయగర్వంతో.
నిజమే! ఆ రోజుల్లో బిచ్చమెత్తడం నామోషిగానూ, బిచ్చం వెయ్యడం గొప్పతనంగానూ ఎవరూ అనుకునేవారు కాదు!
ఎవరి కుల వృత్తి వారిది!
ఇప్పుడు కష్టం మీద పడుకున్నా ఎవరూ రూపాయి ఇవ్వడం లేదు.
"ఆ దినాలు యాడ బోయినయో!" నాంపల్లి ఆవేదనగా అనుకున్నాడు.
"ఎటుబోతున్నవురా నాంపల్లీ!" ఊరి సర్పంచ్ ఎదురయి అడిగాడు.
"అయ్యా బాంచను! మీ ఇంటికే బోతున్న" ఆలోచనల్లోంచి చప్పున తేరుకుని బదులిచ్చాడు నాంపల్లి.
"ఎందుకురా?" ఆప్యాయంగానే అడిగాడు.
నాంపల్లి కొద్దిసేపు తటపటాయించాడు.
"అయ్యా! ఎడ్లకు గడ్డిలేక సచ్చిపోతున్నాయ్! వాటి కింత గడ్డి, మా కింత గాసం ఇస్తారేమోనని అడుగుదామని వొత్తున్న" పొట్లం కట్టినట్లు ఒదిగిపోయి వినయంగా చెప్పాడు.
సర్పంచ్ నిట్టూర్చాడు.
"గడ్డేడ పాడయిందిరా ఈ కరువు కాలంల! పోయి అమ్మనైతే అడుగు. మల్లెసాలల బుడ్డెడన్ని ముక్కలుండె! నే బెట్టమన్ననని తెచ్చుకో."
"నీ దయ దొరా." గబగబా అడుగుల వేగం పెంచాడు.
బస్ కోసం కాబోలు సర్పంచ్ కూడా వేగంగా నడుస్తూ వెళ్లిపోయాడు.
***
"అమ్మా గింత గడ్డి ఇయ్యిండ్రి! గట్లే బుడ్డెడన్ని ముక్కలు పెట్టుమన్నాడు దొర." సర్పంచ్ భార్య విమలమ్మని ఉద్దేశించి అడిగాడు.
ఆమె ఒక్కసారిగా తిరస్కారంగా చూసింది!
"గడ్డి లేదు గిడ్డూలేదూ! ఆయన కోటి తెల్విలదు! ఆడ దొరోలే ఆర్డర్ చేత్తడు! ఇక్కడ ఇయ్యనోల్లని నిష్ఠూరం చేత్తడు." కోపంగా అంది. నాంపల్లి లో మొలకెత్తిన చిన్ని ఆశ మొదలంటా కత్తిరించబడింది!
"అట్లయితే పోయొస్తనమ్మా." కళ్లలో తిరిగేనీళ్లని అదిమిపట్టి అన్నాడు.
ఆమె నిర్ధాక్షిణ్యంగా తలూపింది!
"ఒరేయ్ నాంపల్లీ! ఆ దిక్కుమాలిన గంగిరెద్దులు వదిలి, నీవు, నీ భార్య మా ఇంట్లో కూలికి జేరిపొండ్రా! తిండీ, బట్టా పెట్టి యాడాదికి రెండు వేలిస్తాం" గేటు దాటుతున్న నాంపల్లితో అంది విమలమ్మ.
అతడు వెనుదిరిగాడు.
"మరి నా ఎడ్లగతి ఎందమ్మా?" అడగకూడదనుకుంటూనే అడిగాడు.
"వాటిని మా కమ్మెయ్! అన్నిటికి కలిపి అయిదే వేలిస్తమ్."
నాంపల్లి గుండె తరుక్కుపోయింది!
కన్నబిడ్డలా పెంచుకుంటున్న ఎద్దులను అమ్మేయడమా? అది పొలం పనికి.
అదిగాక వాటిల్లో ఓ దానికి అయ్య పేరే పెట్టుకున్నడాయె!
"తొందరేం లేదురా! బాగా ఆలోచించే చెప్పు." ఉపదేశం ఇస్తున్నట్టు తాపీగా అంది.
"మంచిదమ్మా!" తలొంచుకుని చెప్పాడు, కళ్లలోంచి దూకే నీళ్లు ఆమె చూడకూడదని.
తర్వాత మరో నాలుగిళ్లు తిరిగాడు. కొంచెం అటు ఇటూ అందరూ అదే బాపతు మాటలాడారు. నాంపల్లి మనసులాగే సూరీడు అస్తమిస్తుంటే తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు. అదే చింత చెట్టు కిందకి.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"నీ సంసారంల మన్నువడ! రేపటికి ఇత్తులేదు! ఈ దిక్మెల్ల బతుకు బతికే కన్నా ఏడనయినా పడి సచ్చింది నయం థూ!" ధుమ ధుమ లాడుతూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, ఆఖరుగా మిగిలిన జొన్న సంకటి పొయ్యి మీదేసింది. రంగశాయి.
నాంపల్లి నిర్వికారంగా వింటున్నాడు.
"ఆ దిక్మెల్ల ఎడ్లను పట్టుకొనే ఏడుస్తడు! ఆ దొరసాని చెప్పినట్టు వాటిని అమ్మి నాశనం జేసి, వాళ్ల దగ్గర జీతముంటే ఎంత సక్కగుంటది! పెయ్యినిండ బట్ట, కడుపునిండా తిండన్నా దొరుకుతది. లగ్గమయి నాలుగేండ్లయినా, ఒక్కనాడు బుద్ధి తీర తిన్నదిలేదు. సోకయిన బట్ట కట్టింది లేదు. ఎవలయ్యా గంగెద్దు లాడిచ్చి బిల్డింగులు కట్టింది? అయినా నీ అన్న జేత్తుండా, ఈ రీతిలేని కొలువు నీ తమ్ముడు జేత్తుండా? ఎవలికి లేని పీకులాట నీ కెందుకయ్యా రంగశాయి అలుపూ సొలుపూ లేకుండా అరుస్తూనే ఉంది.
నాంపల్లి నిశ్శబ్దంగా వాగు కేసి నడిచాడు. రాత్రి ఎనిమిదవుతుందేమో తెల్లని వెన్నల కనుచూపు మేర పరచుకొంది. అతడు ఇసుకలో వెల్లకిలా పడుకున్నాడు. చల్లని ఇసుక స్పర్శ అమ్మ ఒడిని గుర్తుకు తెచ్చింది. అనుకోకుండానే నాంపల్లికి కళ్లలో నీళ్లు జలజలా రాలాయి.
ఎవరికి నచ్చని ఈ గంగెద్దులాట పట్టుకొని తాను నాశనమయిపోతున్నాడా!
ఒకవేళ ఈ ఎడ్లన్నీ అమ్మి దొర దగ్గర జీతముంటే నిజంగా ఏ చీకూ చింత ఉండదా?
కాని వాటిని అమ్మే దెట్లా?
తన తండ్రి తాతల ద్వారా సంక్రమించిన ఈ అపురూపమైన విద్యని ఎలా నేలమట్టం చేయగలడు?
ఇప్పటికే ఈ ఆట చాలా మంది వదిలేసుకున్నారు. తనకి తెలిసినంతవరకు నాలుగు జిల్లాల్లో తానొక్కడే ఈ ఆట ఆడుతున్నాడు. అంటే తానూ వదిలేస్తే గంగిరెద్దు లాట మాయమయిపోతుందా?
కాక ఏం చేస్తుంది? చేజేతులా తద్దినం బెడితే!
అంటే తరతరాల నుండి ఉన్న ఓ కళని తన చేతులతోనే పూడ్చి పెట్టడమా!
"ఛీ! బతుకు పాడుగాను!" నాంపల్లి దుఃఖం మానేరు వాగులా పొంగింది. అలా ఎంత సేపు ఏడ్చేవాడో గానీ, భోజనానికి పెళ్లాం పిలవడంతో వాగులోంచి లేచి చెట్టు కిందకి నడిచాడు.
భోజనాలయ్యాక రంగశాయి నాంపల్లి పక్కలో చేరింది.
"నా మాటినయ్యా! నీ కాళ్లు మొక్కుత! ఈ కాలంలో ఈ దిక్మెల్ల విద్య పట్టుకొని ఎవడేడుస్తుండు? రేపు మనకు పోరగాండ్లు పుడుతరు. సంసారం బెరుగుతది. మనకే గతి లేదు ఇగ పొరగాండ్లను ఎట్ల పెంచుతం! మన చుట్టాలూ, పక్కాలూ తెలిసిన వాళ్ళందరూ వదిలేసిన ఈ ఆట మన కెందుకయ్యా! ఈ గొడ్లన్ని అమ్మగా వచ్చిన పైసలతో మంచిగా బట్టలు కొనుక్కొందాము. తిండికి సర్పంచి ఇంట్లో కొదువలేదు. ఏడాదికి ఇద్దరికి. ఇచ్చిన రెండు వేలు దాసుకుందాం. అలా బతికి నన్నాళ్ళు వాళ్ల దగ్గర చాకిరి చేసుకున్నా నయమే" శాంతంగా సర్ది చెప్పింది రంగశాయి.
"సరేలేవే నీ ఇష్టమే కానీ!" నాంపల్లి ఆమెని దగ్గరగా తీసుకొని అన్నాడు.
రంగశాయి ఒళ్లు పూల విమానంలా గాలిలోకి ఎగిరింది. కాసేపటికి రంగశాయి నిశ్చితంగా నిద్రపోయింది. అయితే నాంపల్లి మాత్రం నిర్మలంగా ఉన్న ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు.
"రంగశాయి చెప్పిందాంట్లో అబద్ద మేమీలేదు. ఈ కాలంలో తన ఆటని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఇష్టపడుతున్నారు? ఎక్కడికి వెళ్లినా తనని, తన వేష భాషలను చూసి గేలి చేసేవారే! పైగా కష్టపడి పని చేసుకోక ఎందుకొచ్చిన సోమరి పని అంటూ చీత్కారాలు చేసేవారే! అంతేగానీ తనదీ ఓ విద్యేనని, దాంట్లో ఓ మెరుపు ఉందని తలాడించి మెచ్చుకున్నవారే లేరు. ఎవరూ పట్టింపుతో చూడకపోవడం వల్ల తనకూ చాలా వరకు ఆసక్తి తగ్గింది. ఈ ఆట మీద పదేళ్లుగా ఒక్కనాడైనా పది నోటు సంపాదించిన ఘడియ లేదాయే!
"మొన్న చబ్బీస్ జనవరి వేడుకల్లో ఆట ఆడటానికి నాలుగు జిల్లాలు వెదకగా తాను దొరికితే సర్పంచ్ ఎంతో బింకంగా కరీంనగర్ తీస్కపోతే, అక్కడ నిలబడి నిలబడి కాళ్లు పచ్చి పండ్లయిపోయె. ఎడ్లు తాగడానికి నీళ్ళు లేక నిలువు గుడ్లేసినయ్! మంత్రి వచ్చేసరికి పట్టపగలాయే! ఆఖరుకి అటో ఇటో ఆట అయిందనిపిస్తే గాడిదని తింపినట్టు తింపి తింపి నూట యాభయి రూపాయల చెక్కు చేతిల పెట్టిరి. అది బ్యాంకుల కెళ్లి విడిపించుకునే కంటే, దానికన్నా ఓ రోజు ఊరంత తిరిగి బిచ్చమెత్తుకున్నదే నయమనిపించింది.
ఇంకోసారి ఇల్లు జగాలు ఇప్పిస్తమని సర్పంచ్ తింపి తింపి ఆ కాగితాలు తెమ్మని ఈ కాగితాలు తెమ్మని ఒర్రిచ్చి ఒర్రిచ్చి ఆఖరుకి వచ్చే ఏడు సూద్దామనిరి. అట్ల ఏ ఏటికాయేడు అయిదేళ్లు గాలికి కొట్టుకపోయె. ఆఖరుకి ఆ సంగతే మర్చిపోవుడాయె. మల్లొకసారి జిల్లా పండుగలని వెళితే, అక్కడ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే శాలువాలు కప్పుడు, ఒకల్ల నొకళ్ళు పొగుడుకొనుడు, ఆఖరుకి జనానికి విసుగొచ్చి వెళ్లిపోయే వారు వెళ్లిపోగా మిగిలిన పది మంది ముందు ఆటాడితే పది రూపాయలు కూడా ఇవ్వలేదు. గద్దెలెక్కి కుక్కరాగాలు తీసిన కవులకు మాత్రం వేలకు వేల చెక్కు లిచ్చిండ్రు.
"ఛీ! ఈ ఆట వదిలేయక తప్పదు!"
ఆ నిర్ణయం తీసుకొన్నాక అతడి మనసెంతో తేలిక పడాల్సిందిపోయి మరింత దిగులు ఆవహించింది.
ఇక గొడ్లన్నీ అమ్మెయ్యాల్సిందే!
వెన్నెల్లో దూరంగా నెమరేస్తోన్న ఎద్దులను చూశాడు! చిక్కిపోయి ఉన్నాయి! వర్షాకాలంలో ఎలా ఉండేవి నిగనిగలాడుతూ వేసవికాలం వచ్చింది. ఎక్కడా గడ్డి దొరకడం లేదు!
"రేపే అమ్మెయ్యాలి! కష్టపడ్డా వాటికి కడుపు నిండా తిండైనా దొరుకుతుంది!"
"ఒరేయ్ నాంపల్లీ!" రాజన్న గొంతుకి ఉలిక్కిపడ్డాడు నాంపల్లి.
"అయ్యా నువ్వా!" ఆశ్చర్యంగా అన్నాడు.
"నేనేరా! ఈ ఆట ఇడిసి ఏడ్డను అమ్మేద్దామనుకుంటున్నావట్రా." ఆపైన మాటరాక వెక్కి వెక్కి ఏడవసాగాడు రాజన్న.
"లేదు నాయినా లేదు! నా పాణ ముండగా అమ్మను."
చప్పున మెలుకువ వచ్చింది నాంపల్లికి!
"కలా! ఔను కలే. లేకపోతే ఎన్నడో చచ్చిపోయిన నాయిన అర్ధరాత్రి హఠాత్తుగా తిరిగిరావడ మేమిటి?"
ఆ రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో అతడికే తెలీదు.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
తెల్లవారుతూనే నాంపల్లి తమ్ముడు యాదగిరి వచ్చాడు.
నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తమ్ముడిని చూసి పోల్చుకోలేకపోయాడు. ఇస్త్రీ పాంటు చొక్కాలో, చక్కగా కత్తిరించిన జుట్టుతో, వేష భాషలు, మాట పొందికా, ఒకటేమిటి - గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. హైదరాబాద్ లో ఏదో ప్రైవేట్ కంపెనీలో చప్రాసీగా ఉంటున్నాడట. ఉచిత భోజన వసతితో బాటు నెలకు వేయి రూపాయల జీతం. రంగశాయి అయితే మురిసిపోయింది మరిదిని చూసి.
వదినకి నాలుగొందల రూపాయలిచ్చి దావత్ చేయమన్నాడు.
నాలుగొందలు! పట్టి పట్టి మరీ చూసింది! జీవిత కాలంలో, నాంపల్లే చూడలేదు. అనుభవించడం ఇక కలలో మాటే! నాంపల్లి సైతం నమ్మలేకపోతున్నాడు తమ్ముడి ఎదుగుదలని!
"భలే బాగుందన్నయ్యా వన భోజనంలా!" భోజనాలయ్యాక తృప్తిగా త్రేనుస్తూ అన్నాడు యాదగిరి.
నాంపల్లి బాధగా నవ్వాడు.
"నాకు రోజూ వన భోజనమేరా! ఎంత మామూలుగా అన్నా, అన్నయ్య కంఠంలోని వణుకు గుర్తు పట్టేశాడు. యాదగిరి.
అన్నయ్యా! ఎందుకు ఈ దరిద్రాన్ని పట్టుకుని వేళ్ళాడుతావ్! చక్కగా నాతో పట్నంరా! నీకూ నాలాంటి ఉద్యోగం ఇప్పిస్తాను. దొరలా బతకొచ్చు. అక్కడ మనకులం, శాఖా ఎవరూ పట్టించుకోరు అన్నట్టు నా పేరు అక్కడ యాదగిరి కాదు. శ్రీనివాస్. అందరూ వాసూ అంటారు. కనీసం ఏరా అని కూడా పిలవరు." ధీమాగా అతిశయంగా అన్నాడు.
రంగశాయి మురిపెంగా, గర్వంగా మరిదికేసి చూసింది.
నాంపల్లి భూమి లోపలికి క్రమంగా కుంచించుకుపోతున్నాడు మానసికంగా.
"అన్నయ్యా! త్వరగా తయారవు. కరీంనగర్ వెళ్లి సినిమా చూసొద్దాం. వదినా నీవు కూడా!" హుకుం జారీ చేశాడు.
"ఎలారా మనకో ఇల్లా, పాడా! ఇంత సామానూ, గొడ్లూ గాలికి వదిలి ఎలా వెళ్లగలమూ?" నాంపల్లి మెల్లిగా అన్నాడు.
రంగశాయి గయ్ మని లేచింది.
"దిక్కుమాలిన ఎడ్లు, చిప్పలు, నులకమంచం కావలి కాస్తూ ఆ చింత చెట్టుకు ఉరేసుకోవయ్యా పీడా వదిలిపోతుంది" ముక్కు పుటాలు ఎగరేస్తూ అరుస్తోంది కోపంగా.
ఓ అరగంట కష్టపడి ఇరువురినీ శాంతింపజేశాడు యాదగిరి.
"ఓరే నీవూ, వదినా పోయిరాండ్రిరా నాకు సినిమా మీద పెద్ద ఇష్టం లేదు" నిరాసక్తంగా అన్నాడు.
కాసేపు బతిమాలాక, యాదగిరి వదినని తీసుకొని కరీంనగర్ వెళ్లిపోయాడు.
నాంపల్లి నులక మంచం మీద పడుకొని తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయాడు.
రాత్రి అయ్యా ఆత్మ కలలోకి ఎంతగా ఏడ్చింది ఛీ! చచ్చినా ఈ విద్యను వదిలిపెట్టోద్దు అట్లా చేస్తే తండ్రి ఆత్మ ఎంత రంధి పడుతుందో? రంధి పడడమేమిటీ! జన్మజన్మల పాపమై తనని ఉసురుపెట్టదూ?
***
ఏ రాత్రో ఎవరో నిద్ర లేపుతుంటే మెలుకువ వచ్చింది నాంపల్లికి.
"ఓరేయ్ నాంపల్లీ! నేను సర్పంచ్ నిరా ఆఖరు బస్ కొస్తున్నాను. కరీంనగర్ లో నీ పెళ్లాం, తమ్ముడూ కలిశారు" "ఆ" నిద్ర మబ్బుతో ఆవులించి వింటున్నాడు నాంపల్లి.
"నిన్ను రేప్పొద్దున్నే ఆ పెంటంతా వొదిలించుకొని రమ్మన్నారు. అటు నుండి ఆటే హైదారాబాద్ వెళ్లిపోవచ్చునట! అలా రావడం నచ్చకపోతే ఇక్కడే చావమన్నారు. నీ భార్య నీ తమ్మున్నే ఉంచుకొని సంసారం చేస్తుందట తప్ప నీతో ఇక మీదట కాపురం చేయదట బాగా ఆలోచించుకొని పొద్దున్నే రమ్మని చెప్పింది. మధ్యాహ్నం "రెండు దాకా చూసి వెళ్ళిపోతారట హైదరాబాద్ కి." సర్పంచ్ బాధగా చెప్పాడు.
నాంపల్లి నిద్ర మత్తు తటాలున ఎగిరిపోయింది.
'అంటే రంగశాయి మరిదితో లేచిపోయిందా?
కొంచెం అటూ ఇటూగా అంతే!
సర్పంచ్ వెళ్లిపోయాడు. నాంపల్లి మాత్రం రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపాడు.
తెల్లవారి లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకొని గంగిరెద్దుని అలంకరించుకొని ఊళ్లోకి బయలుదేరాడు.
ఇపుడు వాడి మనసు ఎంత స్వేచ్చగా ఉంది.
ఇన్నాళ్ళూ తన ఇష్టానికి అనవసరంగా భార్యను కూడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆమె ఇష్టానికి ఆమె వెళ్లిపోయింది.
ఇక ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనవసరంలేదు.
తాను బతికి ఉన్నంతకాలం గంగిరెద్దులాడించుకునే బతుకుతాడు.
తండ్రి రక్తం, వారసత్వం తనలో ఎలా జీర్ణించుకుపోయాయో ఈ ఆట కూడా అంతే!
బతికి నన్నాళ్ళూ ఈ అరుదైన విద్యని రెండు చేతులూ అడ్డుపెట్టి ఆరిపోతున్న దీపాన్ని కాపాడినట్టు కాపాడుతాడు.
సర్కారు. పట్టించుకోవడానికి ఇదేమన్నా కూచిపూడి నాట్యమా? గురజాడ ఇల్లా? కోణార్క్ శిల్ప సంపదా?
ఆ క్షణాన అతడి గురించి అతడికి తెలియదుగానీ, అతడూ ఓ బాపతూ త్యాగమూర్తే! మహానుభావుడే!
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
07-05-2025, 02:27 PM
(This post was last modified: 07-05-2025, 02:29 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
వెయిటింగ్ ఫర్ యాద్గిరి - భగవంతం
కోఠీ సెంటర్లో ఆగి ఉన్న ఆటో ఎక్కి "పోనీ" అన్నాను.
"ఎక్కడిదాన్క..?" మీటర్ వేస్తూ అడిగాడు ఆటోవాలా.
"చచ్చేదాకా" అన్నాను.
ఉలిక్కిపడ్డాడు వాడు. అయోమయంగా చూసాడు నావైపు.
"సచ్చేదాన్కనా? ఎవరు సచ్చేదాన్క...? నేనా...నువ్వా?" అడిగాడు.
"నువ్వు కాదు నేనే భాయ్. నా ముక్కులో ఊపిరున్నంతవరకూ ఆటో పోనియ్, సరేనా?" అన్నాను ఆటోలో రిలాక్స్ గా కూర్చుంటూ. వాడికి నా ఫిలాసఫీ అర్ధం అయినట్టులేదు. పైగా కోపం కూడా వచ్చినట్లుంది.
"నీ కండ్లకు నేనేమైనా పొగల్లాన్లెక్కగిన కొడుతున్నానా? లేక్పోతే లైఫ్ లాంగ్ నువ్వు సచ్చేదాకా నిన్ను మోస్కోని తిర్గనీకి నువ్ తాళికట్టిన నీ పెండ్లం లెక్కగిన కన్పడుతున్నానా? ఛల్ దిగు ఆటో... సచ్చేదాన్క తిప్పాలంట. అసలు సచ్చేదాన్క ఆటోలో తిప్పనీకి ఎన్ని పైసలయితయో ఎర్కేనా నీకు?"
"ఖచ్చితంగా తెలియదు, కానీ చాలా డబ్బే ఇవ్వాల్సి వస్తుందని మాత్రం తెల్సు. అందుకే నా ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఆ డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేసి వస్తున్నా. ఇదుగో నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్. నా చివరి శ్వాస ఆగిపోయిన మరుక్షణం ఆటో ఆపేసి మీటర్ లో ఎంతయిందో చూసి ఆ ఫిగర్ ని చెక్ మీద రాసుకొని వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకో" అన్నాను చెక్ చేస్తూ.
"నీ శ్వాస గెప్పుడాగిపోవచ్చు...?" వాడట్లా అడుగుతాడని ఊహించలేకపోయాను.
"తెలీదు. ఇంకో నిమిషం తర్వాతైనా పోవచ్చు. నలభై సంవత్సరాలకు పోవచ్చు. నీకు విసుగుపుట్టి నువ్వే నా గొంతు పిసికి చంపకపోతే" నవ్వాను.
వాడు నా సెన్సాఫ్ హ్యూమర్ ని పట్టించుకోలేదు. నేనిచ్చిన బ్లాంక్ చెక్ ని అటూ ఇటూ తిప్పి చూస్తూ -
"ఇంతకీ బ్యాంకుల ఎంత డిపాజిట్ జేసిండ్రు?" అనడిగాడు.
"ఒక మనిషి తన పూర్తి జీవితకాలం ఏ బాదరబందీ లేకుండా హాయిగా గడపడానికి అవసరమైనంత" చెప్పాను.
వాడు ఆలోచనల్లో పడ్డాడు. ఇదేదో మంచి బేరంలానే ఉందనిపించింది వాడికి. ఒక ట్రిప్ లో గిరాకీ దొరికితే ఇంకో ట్రిప్ లో ఆటో ఎక్కేవాడే దొరక్క ఎదురుచూసీ చూసీ రోజూ విసిగిపోయేకన్నా కనీసం నలభై సంవత్సరాలు - అంటే ఇప్పట్నుంచి లెక్కబెడితే ఒక జీవితకాలం ఢోకాలేని గిరాకీ దొరికిందనిపించింది వాడికి. అదృష్టవశాత్తూ ఈ పాగల్గాడు మధ్యలోనే చనిపోతే అన్నేళ్ళూ వీడ్ని మోయనక్కర్లేదు కూడా - అని కూడా అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు వాడు. ఆటోని స్టార్ట్ చేసి హుషారుగా ముందుకి పోనిస్తూ అడిగాడు.
"ఓకే సార్! ఈ కాంట్రాక్టుకి నేనొప్పుకుంటున్నా. అంత మంచిగనే ఉన్నది. కానీ డీజిల్ సంగతి, మన తిండి సంగతీ ఏంది..?"
"ఈ ట్విన్ సిటీస్ లోని అన్ని పెట్రోల్ బంకులకూ, అన్ని రెస్టా రెంట్లకూ కొంత ఎమౌంట్ ముందే కట్టొచ్చాను. నేను చచ్చేదాకా చచ్చినా వాళ్లెవ్వరూ మనల్ని డబ్బులు అడగరు సరేనా?"
వాడు స్థిమితపడ్డట్లున్నాడు.
"మంచిది. ఇగ జెప్పండి - ఆటోని ఏ రూట్లో పోనిద్దాం?" అడిగాడు.
"నీ ఇష్టం. నాకైతే ఓ గమ్యమంటూ ఏంలేదు. నీకు ఎటు పోవాలని పిస్తే అటుపోనీ. నిరంతరం ఆటోలో ప్రయాణిస్తుండటం మాత్రం ముఖ్యం. ముందు నీ స్టీరియోలో ఏదైనా మంచి పాతపాట పెట్టు. కిషోర్ కుమార్ పాట - "ముసాఫిర్ హుయారో" ఉందా?"
"గస్మంటివన్నీ లెవ్వుగానీ జబ్బస్తి పాటొకటి పెడ్త - ఇనండి?? అంటూ నా అంగీకారం లేకుండానే స్టీరియోలో ఏదో క్యాసెట్ పెట్టి నొక్కాడు.
"చిన్నదమ్మే చీకులు కావాలా...
నా సామిరంగా -
చీకులమ్మే చిన్నది కావాలా...?
"ఏం పాటయ్యా ఇది. తీసి ఇంకేదైనా పెట్టు" అనబోయాను కానీ ప్రయాణంలో హుషారు బీటుగానే అన్పించి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.
ఆటోలోంచి హైదరాబాద్ దృశ్యాల్ని వాసన చూస్తున్నాయి కళ్ళు. "చేయడానికి ఇక జీవితంలో ఏంలేదు. ఏ కఠోర వాస్తవం కూడా ఇకపై నా భ్రమల్ని పటాపంచలు చేయలేదు - చివరికి మృత్యువు కూడా... బాగుంది - చివరివరకూ ఇలా ప్రయాణించడం... బాగుంది - హాయిగా ఇలా ఆటోలో కూర్చొని ఎండనూ, నీడనూ, వర్షాన్నీ, కట్టడాలనీ, కదలికల్నీ, దృశ్యాల్నీ - ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని సెలబ్రేట్ అవ్వడం..." అనుకుంటున్నప్పుడు నా చీమూ, రక్తమూ, మాంసమూ, చెమటా, వెంట్రూకలూ, చర్మం, గోళ్లూ, కణాలూ, అస్తిత్వమూ - అన్నీ ఏకకాలంలో తియ్యగా మూలిగిన చిన్న జలదరింపు.
ఆటో రవీంద్రభారతిని దాటబోతున్నపుడు చూసాను. ఎవరో ముసలాయన. ఒంటరిగా రవీంద్రభారతి మెట్లెక్కుతున్నాడు. అతన్ని "సాగర సంగమం" సినిమాలో వయసుపైబడ్డ కమలహాసన్ పాత్రలా ఊహించుకున్నాను.
టూ మిస్టేక్స్ రా... టూ మిస్టేక్స్...
స్టెప్పులయ్యా... స్టెప్పులూ...
పలికే పెదవి వణికింది ఎందుకో...?
నమస్కారమయ్యా... నమస్కారమమ్మా... -
నాద వినోదము... నాట్య విలాసము... పరమసుఖము... కె. విశ్వనాథ్. ఈ టైం లో ఏం చేస్తూ ఉండొచ్చో...?
సాగరసంగమాన్ని సినిమాగా కాకుండా నాటకంగా మార్చి - నెలలో ఒక ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో అవే పాత్రలో ప్రదర్శిస్తుంటే ఎలా ఉంటుందో కదా అన్పించింది.
కమలహాసన్ చెన్నై నుండి ప్రతినెలా హైదరాబాద్ కి ప్లయిట్లో వచ్చి నాటకంలో నటించి వెళ్తూ ఉంటాడు. శరత్ బాబు పంచె కట్టుకొని కార్లో వచ్చి నటించిపోతుంటాడు.
జయప్రద రాజకీయ బాధ్యతల్ని నెలలో ఒకరోజు పక్కనపెట్టి రవీంద్రభారతికి వచ్చి వెళ్తూంటుంది.
కొంచెంలావయినా యస్.పి. శైలజ 'ఓం నమఃశివాయః పాటకు తనే వచ్చి డాన్స్ చేసి కమలహాసన్ చేత తిట్లు తిట్టించుకొని వెళ్తుంది.
ఒక చిన్న మార్పుంటుంది. "బాలకనకమయక్ ల సృజనపరిపాల" పాటకు మంజుబార్గవి నృత్యప్రదర్శన కాకుండా ఒక్కోసారి ఒక్కో క్లాసికల్ డాన్సర్ అరంగ్రేటం ఉంటుంది.
నాటకంలో మొదటి దృశ్యం - కమలహాసన్ (బాలూ పాత్రధారి) రిక్షాలో రవీంద్రభారతికి రావడం...
ఈ నాటక ప్రదర్శన అత్యంత సహజంగా. కొంత వైవిధ్యంగా కూడా ఉంటుంది. అంటే -
కమలహాసన్ బేగంపేట ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ దిగి రిక్షా ఎక్కి సరిగా నాటక ప్రదర్శన మొదలయ్యే సమయానికి రవీంద్రభారతికి చేరుకుంటాడు లాల్చీ పైజామా గడ్డం విస్కీవాసనతో.
ప్రేక్షకులు హాల్లో కాకుండా రవీంద్రభారతి మెట్ల పక్కన నిలబడి కమలహాసన్ రాకకోసం ఎదురుచూస్తుంటారు. రిక్షా రవీంద్రభారతి ఆవరణలోకి రాగానే నాటక ప్రదర్శన మొదలైనట్లు అర్ధం.
కమలహాసన్ రిక్షా దిగి రవీంద్రభారతిలోకి వెళ్లి చివరి వరుసలోని సీట్లో కూర్చుంటాడు.
ఆ తర్వాత ప్రేక్షకులంతా వచ్చి హాల్లో కూర్చుంటారు.
యస్.పి శైలజ నృత్యప్రదర్శన ఓంనమఃశివాయ పాట పూర్తయ్యాక ప్రేక్షకులంతా వెనక్కి తిరిగి చూస్తే చివరి వరుసలో కమలహాసన్ కన్పించడు. స్టేజీ వెనక్కి ఎప్పుడెల్లాడో తెలియదుకానీ పావుగంట తర్వాత నాటకంలోకి ప్రవేశిస్తాడు కమలహాసన్ పత్రికాఫీసు సీన్లో...
చెవి పక్కన్నుంచి కారొకటి వేగంగా దూసుకెళ్లిన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
ఆటోడ్రైవర్ స్టీరియోలోంచి వస్తోన్న మరేదో లేటెస్ట్ పాటకు అనుగుణంగా తల ఊపుతూ డ్రైవ్ చేస్తున్నాడు.
"కొంచెం సౌండ్ తగ్గించు" అన్నాను. తగ్గించాడు.
"నీ పేరేంటి?" అడిగాను.
"యాద్గిరి... పేరు బాగోలేదు. ఈ రోజునుండీ నీ పేరు సత్యానందం" అన్నాను.
"సచ్చేనందమా? గదేం పేరు సాబ్. సావడం - బతకడం" అన్నాడు యాద్గిరి ఉరఫ్ సత్యానందం నవ్వుతూ.
"ఈ సృష్టిలో నాకు తెల్సినంతవరకూ ఒకే ఒక గొప్ప సత్యముంది. ఆనందమయమై ఉన్న సత్యం - సత్యమై ఉన్న ఆనందం. కలిపితే సత్యానందం. చూసావా? ఎంత గొప్ప పేరు పెట్టానో నీకు..." అన్నాను. "అసలు వీడికిదంతా అర్ధమవుతుందా?" అని వెంటనే అనుకుంటూ.
"భలే పేరు పెట్టిండ్రు సాబ్" పగలబడి నవ్వాడు. పిట్టగూడులా అస్తవ్యస్తంగా పెరిగిన తలవెంట్రుకల కింద సన్నని మెదతో కలిసి ముందు సీట్లో స్టీరింగ్ పట్టుకుని కూర్చున్నవాడిని వెనకనుండి చూస్తోంటే నాకు ఎందుకో జాలివేసింది. వీన్నేకాదు - కొంతమందిని నిద్రపోతున్నపుడు. వెనకనుండి చూసినపుడు, అన్నం తింటున్నపుడు చూస్తే - ఎందుకో తెలీదు - జాలి కలుగుతుంది. సైకియాట్రిస్టుకి చూపించుకోవాలి.
ఆటో స్లో అయింది.
"గీడ ఓ పదినిమిషాలు వెయిట్ జేయిండ్రి సాబ్. గీన్నే మా యిల్లు. గిప్పుడనకపోతే మల్ల నేను ఇంటికొచ్చేటప్పట్కి ఎన్నేళ్ళయితదో? పండుగలకీ పబ్బాలకీ కూడా ఇంటికి రాకుండా ఎంగేజ్ చేసుకుంట్రి. ఒక్కసారి బోయి మా వోళ్లకి కన్పించి వచ్చేస్త..." అని రాజ్ భవన్ ముందు రైల్వే క్రాసింగ్ దగ్గర ఆటో ఆపి నా అంగీకారం తీసుకోకుండానే దిగాడు సత్యానందం.
వాడు ఇంటికేసి కదలబోతుండగా అన్నాను.
"సత్యానందం. త్వరగా వచ్చెయ్. కదలని ఆటోలో కూర్చోవడం చాలా బోర్ నాకు..."
సత్యానందం వెళ్లిపోయాడు రోడ్డు పక్కనున్న రైలుపట్టాల్ని దాటుకొని.
పట్టాల అవతల రోడ్డు పక్కన ఇరానీ హొటల్ 'సీరాక్' కనిపిస్తోంది. రోజంతా కురిసిన కొన్ని వర్షాదివారాల్లో దినపత్రికల అనుబంధాల్ని ముందేసుకొని కూర్చున్న చోటునుండి ఎడతెగని వర్షాన్ని ఎడతెగని ఛాయ్ ల్తో సెలబ్రేటయిన క్షణాలు గుర్తుకొచ్చి ఆ ఫ్లేవర్ లోనే చాలాసేపు ఉండిపోయాను.
ఫ్లేవర్ మొత్తం కరిగిపోయాక మనసుని నెమ్మదిగా బోర్ ఆక్రమించసాగింది.
సత్యానందం వెళ్లినవైపు చూసాను వాడేమైనా వస్తున్నాడేమోనని. పట్టాల అవతలి దృశ్యాన్ని చెరిపేస్తూ జమ్మూనుండి కన్యాకుమారిదాకా బోగీలు తగిలించుకున్న హిమాసాగర్ ఎక్స్ ప్రెస్ రైలు అడ్డంగా పరిగెడుతోంది.
"చచ్చాను. ఈ ట్రైను ఇప్పుడే రావాలా పర్యాటకుల కోసం దీన్ని హైదరాబాద్ మీదుగా నడపాలని టూరిజం డిపార్ట్ మెంటువాళ్ళు ఏ క్షణాన నిర్ణయించుకున్నారో కానీ... దేవుడా...! దీని ఇంజను కాశ్మీర్లో ఉంటే - చివరిబోగీ కన్యాకుమారిలో ఉంటుంది. ఇదెప్పుడు వెళ్లిపోవాలీ? ఆ గేట్లెప్పుడు లేవాలీ? సత్యానందం గాడు ఎప్పుడు రావాలీ? ఈ ఆటో ఎప్పుడు కదలాలీ? వీన్ని అనవసరంగా పంపినట్టయింది. ఇంకా వీడొచ్చేదాకా ఆ ఆటోలోనే చావాలి. ఆవుసు! ఆటోలో కళ్ళుమూయడమేకదా నా జీవిత పరమావధి. కావచ్చు... కానీ కదలని ఆటోలో కూర్చొని దిక్కులేని చావు చావడం మాత్రం కాదు. షీట్! సత్యానందం గాడు వచ్చి చచ్చేదాకా వెయిట్ చేయకతప్పదు... ఉష్..." మని నిట్టూర్చాను. అసహనంగా అన్పించింది. వీడొచ్చేదాకా ఎట్లా టైం పాస్ చేయాలబ్బా అనుకుంటుండగా గుర్తొచ్చింది.
వెంటనే ఆటోలో సీటు వెనుక పెట్టిన ప్లాస్టిక్ కవర్లో చెయ్యి పెట్టి దాంట్లోంచి 'త్రిపుర కథలు' పుస్తకం బయటకు తీసి "భగవంతం కోసం" కథ చదవడం మొదలుపెట్టాను.
------
టపాకాయలు పేలుతోన్న శబ్దం విని 'త్రిపుర కథలు' పుస్తకంలోంచి బయటకొచ్చి తలెత్తి ఆటోలోంచి బయటకు చూసాను.
హిమసాగర్ ఎక్స్ ప్రెస్ వెళ్లిపోయిన సందర్భంగా రైల్వే క్రాసింగ్ దగ్గర ఏదో ఉత్సవంలా జరుగుతోంది.
కొంతమంది స్వీట్లు పంచుతున్నారు.
కొంతమంది రంగులు పూసుకుంటున్నారు.
కొంతమంది నృత్యం చేస్తున్నారు.
ఒకచోట పష్టిపూర్తి కార్యక్రమం జరుగుతోంది. రిటైరైన సందర్భంలో ఎవరికో సన్మానం జరుగుతోంది ఆ పక్కనే...
అంతా సందడి చిందడిగా ఉంది.
ఒకరినొకరు ఆలింగనం చేసుకొని అభినందనలు చెప్పుకుంటున్నారు. ఒక రైలు గేటు దాటిపోయాక ఇంతగా ఆనందిస్తారా జనం అని ఆశ్చర్యపోతూ హాలులో సీరాక్ వైపు చూసాను.
అక్కడ సీరాక్ లేదు. అది ఉండేచోట వెయ్యి అంతస్థుల బహుళజాతి సంస్థ భవనమొకటి కన్పిస్తోంది. అంతస్థులు తక్కువైనా దాని చుట్టుపక్కలా అలాంటి భవంతులే కోకొల్లలుగా నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాయి. నేనున్నది హైదరాబాద్ లోనా న్యూయార్క్ నగరవీధిలోనా అన్న అనుమానం కలిగింది.
ఆ వెయ్యి అంతస్థుల భవనం కట్టడానికి కనీసం యాభై సంవత్సరాల కాలమైనా పట్టి ఉంటుంది. అంత అత్యద్భుతంగా ఉందా నిర్మాణం.
యాభై సంవత్సరాలు...!
అంటే ఇప్పుడు నా వయస్సు ఎంతయి ఉంటుంది? చేతిలోని పుస్తకం జారి కిందపడింది. ముచ్చెమటలు పోసాయి ఒక్కసారిగా. నా శరీరం వైపు చూసుకున్నాను.
దేహమంతా గాలి తీసిన బెలూన్లా అయిపోయింది.
ముడుతలు పడ్డ చర్మమూ, చర్మాన్ని చీల్చుకువస్తున్న నరాలూ... ముసలివాసన. బహుశా నాకిప్పుడు ఎనభై అయిదు సంవత్సరాలు ఉండొచ్చు. ఒక పొడవాటి ప్రయాణాన్ని కూడా అనుభవించకుండానే వృద్ధాప్యం ఆటోలోకి ప్రవేశించి నన్ను కౌగలించుకుంది. అయిపోయింది. జీవితం... ఇక మిగిలిందాల్ల చివరి రోజులు...
అవును వాడేడి..? ఏడీవాడు..? నందం... ఆనందం... సత్యానందం... వాడు ఇంకారాలేదేం...? హిమసాగర్ వెళ్లిపోయిందిగా?
రావాలన్న కోరిక చచ్చిపోయుంటుందా? అవున్లే ఎలా వొస్తాడూ...? వాడికి కనీసం తొంభై అయిదేళ్లయినా వచ్చుండాలి ఇప్పటిదాకా బతికుంటే... బతికే ఉండొచ్చా? ఉన్నా రాకపోవచ్చా...?
వయసులో వాడికన్నా నేనే చిన్నవాడిని కాబట్టి నేనే వాడి దగ్గరికి వెళ్లడం సబబనిపించింది.
ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆటోలోంచి దిగ బోతుండగా నా ఒళ్లో ఉన్న 'త్రిపురకథలు' పుస్తకం కింద పడింది.
భగవంతుడు ఎప్పటికీ రాడు. గోడోలాగ. సచ్చానందం కూడా అంతేనా?
ఆటోలోంచి దిగగానే ఇన్ని సంవత్సరాలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉండడంవల్ల జాయింట్లన్నీ పట్టేసినట్లనిపించింది. ఒళ్లు విరుచుకున్నాను. లేదా విరుచుకున్నట్లు భ్రమించాను. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రైలుపట్టాల్ని దాటి ఎదురుగా వస్తున్న ఒకాయన్ని ఆపి అడిగాను. "గోడో ఇల్లు ఎక్కడో చెబుతారా..??"
"గోడోనా..? ఏం చేస్తుంటాడాయన..?"
"యాభై సంవత్సరాల క్రితం ఆటోడ్రైవర్. ఇప్పుడేంటో తెలీదు."
"తెలీదు." అని వెళ్లిపోయాడాయన.
నేను చేసిన పొరపాటేమిటో తెల్సింది. వృద్ధాప్యం వల్ల మతిమరుపుకూడా వచ్చేసింది అనుకొని - ఈసారి ఆటో ఆయన్ని ఆపి అడిగాను.
భగవంతం ఇల్లెక్కడో కాస్త చెబుతారా?"
'తెలీద'ని వెళ్లిపోయాడాయన. మళ్లీ నేను చేసిన తప్పేమిటో తెల్సింది.
ఈసారి ఇంకో పెద్దమనిషిని ఆపి అడిగాను.
"సార్ ఇక్కడ సత్యానందం ఇల్లెక్కడ?" తెలీదన్నాడు. ఆయన కూడా.
మళ్లీ నేను చేసిన తప్పు తెల్సింది. నన్ను నేను తిట్టుకున్నాను.
ఈ సారి ఓ పాన్ షాప్ ని సమీపించి అందులో కూర్చున్న యువకుడిని ఒళ్లు దగ్గర పెట్టుకొని అడిగాను. "బాబూ... గోడో... ఉరఫ్ భగవంతం ఊరఫ్ సత్యానందం అనబడిన యాద్గిరి ఇల్లెక్కడ?
ఏ యాద్గిరి... బోల్డంతమంది యాద్గిరులున్నారీ ఏరియాలో..." అన్నాడా యువకుడు. చెప్పడం కన్నా చూపించడం బెటరనుకొని రైలుపట్టాల అవతల రాజ్ భవన్ కెదురుగా పెంటకుప్పల్లో తుప్పుపట్టిపోయున్న నేను దిగొచ్చిన ఆటో చూపించి "ఆ ఆటోడ్రైవర్ యాద్గిరి..." అన్నాను.
పరిశీలనగా ఆ ఆటోని షాప్ లోంచే చూసి అన్నాడా యువకుడు.
"ఓ ఆ యాద్గిరా? వాడు నిన్ననే సచ్చిపోయాడుగా" నెత్తి మీద బాంబు పడ్డట్లనిపించింది. "యాద్గిరి చనిపోయాడా? నిన్ననే..." పాడుబడ్డ బావిలోంచి వచ్చినట్లుగా ఉన్నాయి నా మాటలు.
"అవును. హిమసాగర్ ఎక్స్ ప్రెస్ ఆఫ్ వెల్లకముందు వాడు ఆ ఆటోని ఆపి ఇంటికొచ్చాడు. వాడికి అదృష్టం ఎలా పట్టిందో తెలియదు కానీ ఎక్కడ్నుంచి వచ్చాయో లక్షలు... లక్షలు... పెంకుటిల్లు అమ్మేసి అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు. రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఓ కారు కొన్నాడు. అయితే ఈ హిమసాగర్ రైలు వల్ల పట్టాలు దాటి ఎప్పుడూ అవతలకి పోలేదు. ఇక్కడిక్కడే కార్లో తిరుగుతూ కొత్త పెళ్లాంతో భలే ఎంజాయ్ చేసేటోడు. ఈ బస్తీలో ఎవ్వరూ వాడు బతికినంత హాయిగా బతకలేదు సాబ్... మమ్మల్నందరినీ వెక్కిరిస్తూ యాద్గిరి ఎప్పుడూ ఒకమాట అంటూ ఉండేవాడు.
"పైసలు సంపాదించడం గొప్పకాదురా?? ఆ పైసల్ని ఆనందంలోకి మార్చుకోవడం గొప్ప" అని. పాపం..! నిన్నటిదాకా బాగానే ఉన్నాడు. ఏమైందో తెలీదు. నిన్న సాయంత్రం ఈ పక్క బార్ లోంచి బయటకొచ్చినపుడు నా షాఫ్ లో పాన్ కూడా కట్టించుకుని వెళ్లాడు. తెల్లారి తెల్సింది. రాత్రి ప్రాణం పోయిందని. చాలా చిన్న వయసులోనే పోయాడు పాపం."
"చిన్న వయసా..? చనిపోయేనాటికి యాద్గిరి వయస్సెంతుంటుంది?" ఆశ్చర్యంగా అడిగాను.
"నలభై ఏళ్లు ఉండొచ్చు..." చెప్పాడు పాన్ షాఫ్ యువకుడు. ఈసారి నెత్తిమీద పిడిగుపడింది.
"యాద్గిరి వయసు నలభైఏంటీ..? నా వయసు ఎనభై అయిదేళ్ళెంటీ? అంటే నా మీదా; నాలాంటి వాళ్లమీద తప్పా యాద్గిరిలాంటి వాళ్లమీద కాలప్రభావాన్ని పడనివ్వలేదా హిమసాగర్ ఎక్స్ ప్రెస్...? ఎంతపని చేసావ్ దొంగముండా.."
"యాద్గిరి ఇంటికెళ్తారా? ఈ పక్కసందు చివర్లోనే వాళ్ళిల్లు బాడీని ఇంకా తీసేసినట్లు లేదు." అన్నాడు పాన్ షాప్ యువకుడు.
"దొంగ... కొడుకు. వాన్నేంటయ్యా చూసేది? నా ఆస్తి పాస్తులన్నీ అమ్ముకున్న సొమ్ముని ఎన్ క్యాష్ చేసుకొని చచ్చేదాకా నా పైసల్తో కులికిన నా కొడుకు. వాడింటికేంటయ్యా వెళ్లేది?" కోపంతో నేలను తన్నాను కాలితో.
నీరసం ఆవహించింది మనసుకూ... శరీరానికీ... నిస్సత్తువగా పాన్ షాఫ్ దగ్గర్నుండి కదిలాను. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాలేదు. ఎక్కడికి వెళ్తే బాగుంటుందో తెలియదు. ఎక్కడికి వెళ్లకపోతే బాగుంటుందో తెలియదు. మిట్ట మధ్యాహ్నకావడంతో ఎండ తీవ్రమవుతోంది. తల తిరిగినట్లనిపించింది. ఎక్కడైనా కాసేపు కూర్చుంటే బాగుండుననిపించింది. కానీ ఎక్కడా నీడ కన్పించలేదు. నా నీడ కన్పించింది పక్కనే. అయితే సేదతీరడానికి ఆ నీడ సరిపోదు. కొంచెం దూరంలో రైలు పట్టాలకవతల చెత్తకుప్పల మధ్య యాద్గిరి తుప్పు అటో కన్పించింది. తొందరగా వెళ్లి అందులో కూర్చొని కాసేపు సేద తీరాలి అనుకుంటూ కాళ్లను ఈడ్చసాగాను. రైలు పట్టాల్ని సమీపిస్తున్నాయి కాళ్ళు. హఠాత్తుగా నా ముఖం మీద శబ్దం గాలి లేదా గాలి శబ్దమొకటి రివ్వున వీచినట్లనిపించింది. హిమసాగర్ ఎక్స్ ప్రెస్ డౌన్ వెంట్రుకవాసి తేడాలో నాముందు నుండి దూసుకెళ్లసాగింది.
"షీట్... ఒక్క నాలుగడుగులు వేగంగా వేస్తే ఈ పట్టాల్ని దాటి అవతలికి పోయి ఆటోలో పడేవాన్ని. ఇప్పుడీ హిమసాగర్ వచ్చి మళ్లీ అడ్డం పడింది దీని చివరి డబ్బా వెళ్లిపోవడానికి మళ్లీ యాభై సంవత్సరాలు వెయిట్ చేయాలి" అనుకొని అసహనంగా ఉన్నచోటే కూలబడిపోయాను.
పిట్టగూడులా చిందరవందరగా చెదిరిపోయిన నా తలవెంట్రుకల కింద ముడుతలు పడ్డ సన్నని మెడతో కూడిన నన్ను వెనుకనుండి చూస్తూ ఎవరో జాలి పడ్తున్నట్లనిపించింది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
వెలుగు-నీడలు - ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
తెల్లవారింది. బద్దకంగా లేచాను.
రాత్రి చాలాసేపు నిద్రమేలుకుని వ్రాసిన విక్రమోర్వశీయ పద్యకావ్యపు దృశ్యాలు తియ్యని స్మృతుల్ని కదిలిస్తున్నాయి.
ఊర్వశీ దివ్య సౌందర్యం పద్యాల్లోకి కాంతిధారగా ప్రవహించి ఒచ్చినట్టనిపించింది.
పురూరవ చక్రవర్తి మధుర స్నేహసల్లాపాలతో నా కావ్యం పులకరిల్లినట్టు తోచింది.
సుధర్మలో, భరతముని ప్రయోగించే నూతన నాటికలోని నాయికాపాత్ర ధరించి, ఆ అప్సరః సుందరి, స్త్రీరమణీయతాసర్వస్వంగా రంగభూమికి అవతరించినప్పుడు వ్రాసిన ఈ పద్యం - రేషనుషాపు తీసే వేళయింది. చప్పున కాఫీ పుచ్చుకు వెడతారా? పాపం రాత్రి చాలాసేపు మేలుకున్నారు. ఏం చెయ్యను? తెచ్చుకునే రోజు తప్పదు"
ఇంద్రసభకు బదులుగా మా చాలీచాలని అద్దె వాటా, నాట్య ఉజ్జ్వలరూపిణీ ఊర్వశికి బదులుగా నిత్య సంసారయాత్రలో నలిగే పాతగళ్ళచీర బ్రాహ్మణీ కనబడేసరికి నా వురూరవ చక్రవర్తి హిందూ దేశంలో ఒక నాగరిక పట్టణంలోని ఆరోనెంబరు రేషను షాపు దగ్గరకు నడవలేక చట్టున తప్పుకున్నాడు.
ఎదురుగా కనబడే సిమెంటు కంపెనీ కాలెండరు మీద 45 సంవత్సరం 18 తారీఖు వాస్తవ జగత్తులో కనబడేసరికి నా ఒళ్ళు దహించుకుపోయింది.
బియ్యం లేవని తెలియగానే ఆకలి ఎక్కువగా ఉంది. అంత దివ్య సౌందర్యభూయిష్ట కళాసంపదను భావనాసంపత్తితో పుడమికి అవలీలగా అవతరింపచేయగల ఆంధ్ర కవీశ్వరునకు ఆకలి కలిగిందంటే ఎంత నీచం!
కాని వేస్తోంది! ఎవరితోనూ అనకండి, బాగుండదు.
మహేంద్రుడు గాని, అమరవేశ్యగాని ఈ కరువురోజుల్లో నా కెట్టి సహాయం చెయ్యలేరని రూఢిగా తెలిశాక మాసిపోయిన కేన్వాస్ సంచీ పుచ్చుకొని కళ్ళీడ్చుకుంటూ బజారుకు నడిచాను.
ఈనాటి కవి నిజస్వరూపం - ఎదుట నిలువుటద్దం లేకపోయినా - స్ఫుటంగా నా కళ్ళల్లో ఆనింది.
రోడ్డు ఎక్కేసరికి జమీందారుగారి కొత్త కారు రంయిమని నడిచేవారి కంట్లో దుమ్ము కొట్టి పరుగెత్తింది.
చట్టున టౌనుహాల్లో జరగబోయే గౌరవార్ధపు టీపార్టీలోని తేనేటి సువాసన నా మెదడుకు తగిలి వికారపెట్టింది.
పట్టణానికి ఒకవైపున చాలీచాలని కొలబత్తెపు బియ్యం కోసం తొక్కిడిపడే దౌర్భాగ్యుల కోలాహాలమైతే - ఇంకో వైపున బలిసిన లంచాలచేతులు కమ్మని వెచ్చని పదార్ధాలను సమృద్ధిగా సిల్కుసూట్ల బొజ్జల్లోకి నెమ్మదిగా జార్చడం గమ్మత్తుగా జ్ఞాపకం వచ్చి నవ్వాను.
రోడ్డుమీద జనప్రవాహం ఏవైపు నడుస్తున్నదో తెలియలేదు.
అప్పుడే రేషను షాపు తెరిచారు.
అధికారుల పిచ్చతవ్వలతో మట్టిరంగు బియ్యం రూపంలో న్యాయాన్ని పంచుతున్నారు.
పవిత్ర ఆర్యావర్తభూమిలో -
చప్పున షాపులోకి చొరబడడానికి వీలులేదు. నరశరీరాల గోడ అప్పటికే బలంగా ఏర్పడి ఉంది.
కొంతసేపు గడిచింది. ఉవ్వెత్తుగా మానవదేహభిత్తిక బీటవారి లోపల నుంచి ఒక కలకలం వినపడడం మొదలుపెట్టింది.
మేం ఆశ్చర్యపడి చూస్తున్నాం.
గుమస్తా కీచుగొంతుకతో అరుస్తున్నాడు. అయిదు నిమిషాల తర్వాత కీచుగొంతూ, ఇద్దరు నౌకర్లూ చేతుల్లో శక్తి అయిపోయేదాకా బాది ఒక పదార్ధాన్ని రోడ్డు మీదికి తెచ్చి విడిచిపెట్టారు.
అది నెమ్మదిగా కదలి అంటుకున్న రోడ్డు దుమ్ము దులుపుకుని, ఊడిపోయిన చిరుగుల తలగడ్డను సవరించుకొని వెనక వాలికలై ముందు మాసికలతో నిండిన చొక్కాతో పాలిపోయిన ముఖంమీద మొహమాటంగా పెరిగిన పేడిగెడ్డంతో మాటలు మోసే కూలీగాలేచి నించుంది .
వాడు ఏమీ జరగనట్టు, తగిలిన చోట చేతితోనైనా తడుముకోకుండా ముందుకు నడిచి పక్క తూముమీద కూచున్నాడు.
బియ్యం కొన్నాను. ఇటూ అటూ చూశాను. స్వయంగా పట్టుకుపోవచ్చు. కాని...
"బాబూ, కూలీ కావాలా?" - పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"ఎంత?"
"... బేడ"
"పావలా ఇస్తాను. పట్టుకో"
చాలా సహజంగా అన్నాను. కాని - తిన్న దెబ్బల కన్న ఆ మాట నలిపింది గాబోలు. సిగ్గుపడి తల ఒంచుకొని మాట పుచ్చుకున్నాను.
వెనకనించి అందుకున్నారు - "మంచివాడు దొరికాడు"
"సగం బియ్యం తోవలో తినేస్తాడు" "పచ్చి దొంగ వెధవ"
"ఊరికే తన్నారా గుమస్తాగారు?" ఇంకా కూలి ఎందుకు?"
"ఏం? బేడ అడిగితే పావలా ఇచ్చే మహానుభావులు దొరికాక..."
"సామ్యవాదులండీ!"
దూరమై ఇక వినపడలేదు.
"నీ పేరెవరమ్మా"
నడుస్తూ తోచక వేసిన ప్రశ్న.
"సన్నాసండి"
"పద,"
చేతిలో పడ్డ పావలాకాసు చూసి సన్నాసి మొహం మరింత పాలిపోయింది. స్వార్దావరణం చీల్చి నిజమైన మనస్సు తెరచి చూపితే మనుషులు ఎంత దగ్గరకు వస్తారు! కాని నమ్మం అదే ఈనాటి నాగరికతలో ఉన్న విశేషం!
కొంతసేపటికి సన్నాసి ముఖం సంతోషంతో నల్లబడి - పురూరవ సార్వభౌముడు కాళీచేసిన చోట వెళ్ళి కూర్చుంది.
***
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
సోమవారం సంత.
ఫెళ్ళున సాగుతోంది.
ఇంద్రనీలమణి రాసులవంటి నీటివంకాయ గుట్టలూ, పచ్చలవంటి బచ్చలికూర స్తూపాలు, కెంపుల వంటి ఉల్లిగడ్డల పర్వతాలూ, సాయంకాలపు నీరెండ తగిలి మిలమిలా మెరుస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యం ఉచ్చదశలో వెలిగేటప్పుడు వర్తకులు రాజవీధిలో రత్నాలు రాసులుపోసి పట్టు బాలీసుల కానుకుని అమ్మడం చూశానని అబ్దుల్ రజాక్ అన్న మాటలు నానాటికి ఆంధ్రదేశంలో సోమవారం సంతగా ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ, మనకు ఏ రకం రత్నాలు ఎన్ని వీశలు కావాలో నిర్ణయించలేక ఆలోచిస్తున్నాను. నిండా అన్నం లేని ప్రజలకు ఇన్ని కూరలెందుకో?
అరటికాయల దుకాణం దగ్గిర చెళ్ళుమని చప్పుడయింది.
తిరిగి చూశాను.
చుట్టూ చేరిన నలుగురు 'పెద్ద మనుషుల' మధ్య మా కథానాయకుడు సన్నాసి కనపడ్డాడు. అధికార ముద్ర తగిలినట్టు దవడ ఎర్రగా కందింది.
ఒక కాపు పెద్ద చేత్తో కూరల బరువు మూట పట్టుకొని రెండో చేతిలో సన్నాసిని ఒడిసిపట్టుకుని అన్నాడు.
"యెదవలు... కూలిపని సేసుకోరాదూ, దొంగగడ్డి తినకపోతే... మూట లాగుతున్నాడు. సవట..."
కాలెత్తి, మళ్లా దయదలిచి ఊరుకున్నాడు, గాంధీగిరి అహింసా సిద్ధాంతం మీద చాలా గౌరవం ఉన్నవాడు!
"తప్పు కాదండీ! - లేకపోతే... అడుక్కోవాలి..."
మూకలో ముందున్న పంగనామాల తగుమనిషి పళ్ళులేని బోసినోటితో దేశంలోని నిరుద్యోగ నిర్మూలన రహస్యం నిమిషంలో పరిష్కరించి ఊరుకున్నాడు.
సన్నాసికి ఊపిరి తిరిగింది.
"మాట తెమ్మన్నారా బాబూ? అణాడబ్బులిప్పించండి. ఇంటి కాడికి, అందుకోసమే మూట ముట్టుకుంటే..."
"ఛప్! నోరుముయ్యి దొంగగాడ్దె! నాకు నీ కూలెందుకురా? ఇలాటివి పదిమూటలు పట్టికెళ్లగలను బుద్ధిగా బతుకు. తన్నులు తినేవు..." అని వెళ్ళిపోయాడు.
"మంచిపని చేశాడు. చూస్తే కూలి, చూడకపోతే నాలి. నాలి ముచ్చు వెధవలు" ఒక శోత్రియ బ్రాహ్మణోత్తముడు అరటాకుల కొట్టు దగ్గర్నుంచి తన అభిప్రాయం వెల్లడించాడు.
మళ్లా మామూలుగా జనప్రవాహం సంతలోకి ప్రవహిస్తోంది.
అలజడి క్రమంగా తగ్గింది.
సన్నాసి నెమ్మదిగా ఏదో కాలికింద గుచ్చుకున్నట్టుగా ఒంగి ఇందాకటి ఘర్షణలో పెద్దకాపు రొంటినుంచి జారగా ఇంతవరకూ ఎడంకాలి బొటనవేలితో తొక్కిపెట్టిన వస్తువును పదిలంగా తీసి బజార్లో నల్లమందుకొట్టవైపు చరచరా నడిచాడు.
***
సిరావర్షంలా చీకటి అలముకుంది.
రాత్రి పదిగంటలు దాటింది.
మబ్బుగా ఉంది.
చలిగాలి చెలరేగింది.
వెచ్చని అన్నం తిని ఇనప్పెట్టెలలాంటి గదుల్లో కాశ్మీర శాలువల్లోకి కమనీయ గాథల్లోకి వెళ్ళిపోయేవారికి ఆ రాత్రి ఎంత వరప్రసాదం! ఒక్క చలిరాత్రి చల్లారిపోయే ఎన్ని గుండెల్ని జ్వలింపజేస్తుంది!
సంతపాకలు తప్ప ఊరంతా, ఒత్తిగిలడానికి కూడా బద్ధకంగా నిద్రపోతోంది.
పగలంతా బైరాగివేషంతో తిరిగే ముసలి జంగం పాత పడవ ఒకరేవుకు చేరినట్టు సంతపాకల్లో ఒక మూల చేరి కొంత గడ్డి పోగుచేసి మంట వేసి గుడాకుపోగ తాగుతూ దగ్గుతున్నాడు.
చవకరకం కల్లుతాగి యెవరో పడమటి యాసతో కీచులాడి తిట్టుకుని నోరు నొప్పెట్టి సంతపాకల నాపరాళ్ళమీద ఒరిగారు.
అక్కడికి కొంతదూరంలో చింతచెట్టు కింద బసచేసిన ఎఱకల కుటుంబం లోంచి ఎఱకల పిల్ల నీలాలు చట్టున మెలకువ వచ్చి కూచుంది. అన్ని ముష్టి కుటుంబాలూ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాయి. ఎటు చూసినా కారుచీకటి రాత్రి. పక్కని తల విరబోసుకున్న దెయ్యంలా పెద్ద చింతచెట్టు.
భయమేసింది.
తల్లిని లేపుదామని ఊరుకుంది.
"భయం మాటకేంగాని ఈ చీకటి రాత్రులు పడుచు మనస్సులకి ఎంత సరదాగా ఉంటాయి!" అనుకుంది నీలాలు. గొంతుగా కూచుని నిద్రలో చెదిరిన జుట్టు ఎగదోసుకుంటూ.
సందేళ తాగిన గంజి ఉడుకు చల్లారిపోయింది. ఆకలి మండిపోతున్నది.
పడుచుపిల్లకు చారెడు గంజినీళ్ళ బలం ఎంతసేపు?
చలిగాలి రివ్వున కొట్టింది.
లేతాకులా గజగజలాడి ఒళ్ళంతా కప్పని గడ్డతో వక్షాన్ని కప్పబోయింది.
రెండు చేతుల్నీ కలంగా 'ఇంటూ' గుర్తులా చేసి గుండెలకు అదుముకుంది.
మెరుపు మెరిసింది.
ఆకలి భగ్గుమంది.
లేచి నుంచుంది.
ఎదురుగా మంచం మిఠాయి పెట్టెకొట్లు కనబడుతున్నాయి.
మూసి ఉన్న కొట్టులోంచి మిఠాయి ఎలా వస్తుంది!
ఏమో?
ఆకలిగా ఉంది మరి -
నవ్వింది.
నున్నని నల్లశానపురాయిలా నిగనిగలాడే ముఖంలో పళ్ళు మెరిశాయి.
అడవిలో ముళ్ళపొదలమీద అడవిమల్లెపూలు జ్ఞాపకం వస్తాయి.
ఎవరు చూశారు?
చుక్కలు లేని ఆకాశం సిగ్గుపడింది.
పెట్టెకొట్టు అడుగున ఏ బల్ల ఐనా ఒదులుగా ఉండగూడదూ?
"దొరికితే చంపేస్తారు"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,012
Threads: 156
Likes Received: 9,751 in 1,941 posts
Likes Given: 5,705
Joined: Nov 2018
Reputation:
681
"ఈ ఆకలి బతకనిస్తోందా?"
"అది మొగోళ్ళపని."
మొగాడనగానే నవ్వొచ్చింది.
"ఆకలికి మొగా... ఆడా ఉందా?"
ఒక మొగాడు ఎట్లాగో తంటాలుపడి కొట్టుబద్దలు కొట్టి 'ఇదిగో మిఠాయి' అంటే ఎంత బాగుండును! అనుకుంది.
కొట్టుపక్క ఏదో నీడ కదిలింది. గుండెలు పట్టుజారినట్టనిపించింది. మనస్సు కూడదీసుకుని కొట్టుపక్క నక్కి కూచుంది.
రెండు నిమిషాలు నిశ్శబ్దం.
కొట్టు వెనక బల్ల ఊడలాగుతున్నట్టు వినబడి ప్రాణం కుదుటపడి మెల్లగా అక్కడికి మోకాళ్ళమీద పాకి తలయెత్తింది.
నీడ పారిపోయింది.
నీలాలు నాలుక కరుచుకుంది.
నోటి దగ్గర కూడు జారిపోయిందని విచారించింది.
నిటార్గా నించుని చూడగా వెనకతట్టు ఒక బల్ల సగం ఊడి ఉందిగాని ఒక మేకు పట్టుమాత్రం ఎక్కువగా ఉంది.
బలంకొద్దీ బల్లను గుంజి లాగింది. కదల్లేదు. ఒక కాలితో అడుగుభాగం తన్నిపెట్టి చెక్క పెకలించింది. బల్ల చప్పున ఊడి నీలాలు తూలి వెనక్కు పడిపోయింది. నీడ రెండు చేతులూ చాపి పట్టుకొని నించోబెట్టింది. చెమటపట్టిన చల్లని వెన్నుమీద వెచ్చని చేతులు బిగువుగా అనుకునేసరికి ఆ స్పర్శతో ఒక విశ్వ రహస్యం అర్ధమైపోయినట్టు తోచింది ఇద్దరికీ.
నీరసంతో అంతవరకూ చురుకుగా కదలలేని రెండుచేతులూ కొత్తగా చిగిర్చినట్టు పనిచేస్తున్నాయి.
నీడ నెమ్మదిగా లోపలికి దూరి చీకట్లో వెదకి ఒక వేరుశెనగ నూనె మిఠాయి జంగిడి పట్టుకుంది.
నీలాలు సాయంచేసి ఇవతలికి లాగింది.
కొన్ని లోపలికి జారిపోయిన జంగిడితో కొన్ని వచ్చాయి.
నీలాలు జంగిడితో కలిపి తినేసేటంత ఆకలితో ఉంది.
నీడకు ఇద్దర్నీ కలిపి తిందామని ఉంది.
"కూకో, తినేసేపోదం. మళ్ళా మోతెందుకు?"
"సాల్లే. ఎవరన్నా సూత్తే పక్కలిరుగుతాయి"
ఈ రోజు వొరసే ఇల్లా ఉంది"
"మొగసన్నాసికి ఇంత పిరికైతే... ఇక ఆడోళ్ళ కంతా కూడే..."
"ఆసి... నీవంటే... నీలి! కనిపెట్టేశావ్"
"ఓరి నీవంట్రా! పోల్చేశావు!"
"నడూ... నాన్నక..."
ఇటూ అటూ చూసి నీలాలు కర్ర పళ్ళెం చేతిలోపెట్టింది.
"తూరుపెంపుపాకకాడ ఎవరూ నేరు. అక్కడికి పోదాం" నడుస్తున్నాడు.
పక్క దుకాణం బడ్డీమీద మనిషి కదిలినట్టయింది కుక్క బొంయిమంది.
సన్నాసి చెంగున మురుక్కాలువ దాటి పరిగెత్తబోయాడు.
కాలుజారి మిఠాయి జంగిడి కాలువలో పడిపోయింది. ఇద్దరూ పరుగెత్తి తూరుపువైపు సంతపాకల దగ్గరికి రోజుకుంటూ చేరారు.
మెల్లగా మొగవాడు అరుగెక్కి నిరాశగా ఒకమూల ఇరికి కూచున్నాడు.
నీలాలు వెళ్ళి దగ్గరగా కూచుంది.
ఏమి మాటాడాలో ఇద్దరికీ తెలియలేదు.
సన్నాసి నీరసంగా తలగడ్డ నేలమీద పరిచి ఒరుగుతూ అన్నాడు. "ఒట్టి అలుపు మిగిలింది..."
నీ కర్మ"
అద్వైతసారం ఒంటిబట్టిన వేదాంతిలా నీలాలు వెటకారంగా నవ్వి వాడి భుజం మీద కొట్టింది. నీలాలు కళ్ళు ఆ కటికి చీకట్లో తెల్లనిప్పుల్లా మెరిశాయి.
"ఈ యేల కింతే పెట్టిపుట్టాం"
'ఉపనిషన్మధు' వొలికినచోట పుట్టినవాడు పలికాడు.
కాని వేదాంతికి కడుపు మండుతోంది. కన్నులు ఎంత నులిమినా మూతపడడంలేదు.
"మిఠాయిపోయి ఎర్రి యేదాంతం మిగిలిందిరా మనికి..." అని మరింత దగ్గిరగా జరిగి, దాచిన ఒక్క మిఠాయి ఉండ రెండుముక్కలు చేసి ఒకటి వాడిచేతిలో పెట్టి తనొకటి తిని కూచుంది.
చిటపట చినుకులు ప్రారంభించి టీన్ రేకు దారుణంగా ధ్వనిచేస్తోంది.
చలిగాలి రివ్వున కొట్టింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|