Posts: 2,273
Threads: 4
Likes Received: 3,428 in 1,566 posts
Likes Given: 4,882
Joined: Nov 2018
Reputation:
75
(06-01-2025, 11:07 AM)Ajayk Wrote: Mari bolokam lo gora Kali nasanam gurinchi
అప్డేట్స్ చాలా బావున్నాయి బ్రో, అన్ని చిక్కుముడులు ఒక్కొక్కటే ఇప్పుడు విడవడ్డాయి.
ఎలాగైతే విక్రమ సిం హుడు పునర్జన్మ అభిజిత్ లా పుట్టాడో జ్వాలా జిహ్వుడు ఘోరకలిలా పుట్టాడు...అంతే కదా correct [b][i]న బ్రో[/i][/b]
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 12,813
Threads: 0
Likes Received: 7,188 in 5,430 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
శంభల రాజ్యం – 14
జజీరా ప్రలోభము.....విక్రమసింహుడిని తుదముట్టించుటకు జ్వాలా జిహ్వుడి విశ్వప్రయత్నం
వరుణ ప్రాకారం తర్వాత వరుసగా అనల, మేఖల ప్రాకారాలున్నాయి. అప్పటికే వరుణ ప్రాకారం బయట ఖగరథం ఒకటి నిలుపబడి వున్నది.
ఖగరథం వైపుకు అడుగులేస్తున్న రుద్రసముద్భవను చూస్తూ, "అదేంటి స్వామి? ఎటువైపుకు మన పయనం ?" అని అడిగాడు సంజయ్.
"అనల, మేఖల ప్రాకారాలలో మనకు ప్రవేశం నిషిద్ధం. ఒకప్పుడు జ్వాలా జిహ్వుడు, భైరవిల నివాస స్థానాలవి. అక్కడికి వెళ్లాల్సిన సమయం ఇంకా ఆసన్నమవ్వలేదు ", అంటూ చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
"మనం తెలుసుకోవాల్సిందేదో ఇంకా మిగిలే ఉంది", అన్నది అంకిత.
అభిజిత్, అంకిత, సంజయ్ లతో రుద్రసముద్భవ నేతృత్వంలో ఖగరథం కదిలింది.
గాలిలో వెళుతుండగా అభిజిత్ తన పక్కనే ఉన్న గవాక్షి ద్వారా ఆకాశం వైపుకు చూసాడు.
సూర్యుడు కనిపించాడు. పక్షులు కనిపించాయి. ఒకసారి క్రిందకు చూసాడు. అనల ప్రాకారం కనిపించింది. అనలలో నడయాడినట్టు అక్కడి నేలపై జ్వాలా జిహ్వుడి పాద ముద్రలు, ప్రాకారం నలుమూలలా శరీర రూపురేఖలు స్పష్టంగా ముద్రింపబడ్డాయి. మహనీయుల అడుగులు నేల తల్లికి ఎంత పావనమో లోక కంటకులు ఆవిడకి అంత పెనుభారం. ఆ ప్రాకారం ఇప్పటికీ నిప్పులు వెదజల్లుతున్నట్టుగా అనిపించింది అభిజిత్ దృష్టికి. తదుపరి మేఖల కనిపించింది. ఏదో తెలియని అశాంతి నిండుకున్న ప్రదేశంలా ఉందది. భయం గొలిపే ఎరుపు రంగు అనల అయితే, కమ్ముకొనే పెను చీకటి మేఖల.
"మనమిప్పుడు వెళ్లబోయే ప్రాకారం ఏది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"ఇక్కడి నుండి రాబోయే నాలుగు ప్రాకారాలూ విక్రమసింహుడి జీవితాన్ని పూర్తిగా మార్చివేసినవే ", అంటూ రుద్రసముద్భవ అభిజిత్ వైపు చూసాడు.
"ఇప్పుడు మనం అడుగుపెట్టబోయేది ప్రలోభ లో", అంటూ ఊపిరి బిగబట్టి ఏదో తెలియని ఆలోచన తనను వేధిస్తున్నట్టుగా రుద్రసముద్భవ ఒక్కసారిగా సంజయ్, అంకితల వైపు చూసాడు.
ప్రలోభ లో ఏదైనా జరగవచ్చు. మీరు ఇప్పటివరకు మాయారూపధారుల గురించి, కామరూపధారుల గురించి విని ఉంటారు. శంభల మునుపెన్నడూ కనని, వినని, ఎరుగని సంకల్పధారులని ప్రలోభ లో మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అందుకు విక్రమసింహుడే కారణం. ఆ సంకల్పధారులెవరో, వారెప్పుడు, ఎందుకు, ఎలా కనిపిస్తారో ఒక్క విక్రమసింహుడికే…తెలుసు", అంటూ అభిజిత్ వైపు చూసారు ముగ్గురూ.
"అంతుబట్టని మాయకు ఒక రూపం ఉంటుంది. అంతులేని కామానికి ఒక రూపం ఉంటుంది. మన బుద్ధి బలానికి మనోబలం తోడైనప్పుడు సంకల్పం మనలోనే స్థిరమయ్యి ఉంటుంది. అలాంటి సంకల్పం వేరొక బాహ్య రూపం ఎలా తీసుకుంటుంది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"చాలా లోతైన ప్రశ్న అడిగావు సంజయ్. సంకల్పానికి వికల్పం ఎదురైనప్పుడు, ఆ వికల్పము అంతటి మహాసంకల్పానికే మరణసదృశం అవుతున్నప్పుడు ఆ మహాసంకల్పానికున్న బలం వల్ల సంకల్పమొక రూపం తీసుకుంటుంది. బాహ్యరూపం సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని నేను కళ్లారా చూసాను కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
విక్రమసింహుడికి ఈ ప్రాకారంలో అలా తటస్థపడ్డవారే ఆ సంకల్పధారులు. వారిని శంభల యోగులు అంటారిక్కడ. సంకల్పధారి అన్న దృష్టి ఎంతో లోతుకు వెళితే గానీ అందని భావన. శంభల రాజ్య యోధులు శంభల యోగులుగా వీరిని కొలుస్తారు. యుద్ధానికి సంసిద్ధం అయ్యే సమయంలో వారు ఈ శంభల యోగుల ముందే సంకల్పం చెబుతారు. యుద్ధంలో విజయం ఆ సంకల్పం నెరవేరటం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వుకుండా ఉండేందుకు శంభల యోగుల దీవెనలు వారికి ఎంతైనా అవసరం."
అంతట్లో ఖగరథం ప్రలోభ వాకిట ఆగింది.
ఖగరథం దిగగానే అభిజిత్ అడుగులు తనకు తెలియకుండానే ప్రలోభ లోనికి పడ్డాయి.
తానక్కడికి బహు తక్కువ పర్యాయాలే వచ్చి ఉన్నా సరే, అక్కడేదో చారిత్రక ఘట్టం జరిగిన అనుభూతి కలుగుతోంది.
రుద్రసముద్భవ అభిజిత్ నే చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నదే జరుగుతోంది. అభిజిత్ కి అక్కడేదో గుర్తుకొస్తోంది.
మిథిలా విక్రమసింహుడి కోసం పూర్ణిమ రాత్రి నాడు రావటం గుర్తుకొస్తోంది.
మిథిలా ప్రేమలో పడి జజీరా రూపంలో విక్రమసింహుడికి పొంచివున్న ప్రమాదం కనబడకపోవడం గుర్తుకొస్తోంది.
అభిజిత్ ఒక చోట ఆగిపోయాడు. అంతకంటే ఇంకేం గుర్తుకు రావటం లేదు.
రుద్రసముద్భవ, సంజయ్ మరియు అంకితలు అక్కడికి చేరుకున్నారు.
ప్రలోభలో ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా అభిజిత్ రుద్రసముద్భవ దిక్కు చూసాడు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
"ఇప్పుడు నేను చెప్పబోయేది నీకెలా అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ ఈ ఘట్టం ద్వారా ఎప్పటికీ మరువలేని శంభల యోగులు మాత్రం శాశ్వతంగా శంభలకు దొరికారు. వారెవరో తెలిస్తే నీకు విక్రమసింహుడు అర్థం అవుతాడు. సింహ దత్తుడు అర్థం అవుతాడు. నీకు నువ్వు ఇంకా బాగా అర్థం అవుతావు అభిజిత్", అంటూ రుద్రసముద్భవ చెప్పటం మొదలు పెట్టాడిలా.
"విక్రమసింహుడు మిథిలాను ఇష్టపడుతున్న రోజులవి. మిథిలా కోసం ఏదైనా చేసే ధైర్యం, సాహసం విక్రమసింహుడి దగ్గర ఉండనే ఉన్నాయి. వాటిని మించే ప్రేమను మిథిలా మాత్రమే విక్రమసింహుడికివ్వగలిగింది. మిథిలా రాజకుమారి కాదు. కానీ, రూపలావణ్యంలో ఏ రాజకుమారికీ, దేవకన్యకు తీసిపోని అందం తనది. విక్రమసింహుడు రాజు. విక్రమసింహుడంతటి అందగాణ్ణి అంతక్రితం శంభల ఖచ్చితంగా చూడలేదు. అలాంటి వీరిరువురూ కలిసిన ప్రతి సారి వీరిద్దర్నీ చూస్తూ ప్రకృతి మైమరచిపోయి ఆనందతాండవం చేస్తోందేమో అన్నట్టుండేది. వీరి మాటల్లో చూపులు కలిసేవి. చూపుల్లో మాటలు కలిసేవి. శంభలలో అంతులేని ప్రేమ భాష తెలిసిన ప్రేమికులు వీరిద్దరేనా అన్నట్టుండేది. మిథిలా కోసం ఏదైనా చేసెయ్యగలిగే విక్రమసింహుడి బలాన్ని బలహీనతగా చూసే జజీరా కళ్ళకు వీరి ప్రేమ అంతగా రుచించేది కాదు. మిథిలాను మోజుపడ్డాడు జజీరా. జజీరాది శారీరక వాంఛ. పైగా జజీరా తనను తాను విక్రమసింహుడితో పోల్చుకుంటూ తానెందులోనూ అతనికి తీసిపోనని భావిస్తూ ఈర్ష్యాద్వేషాలను పోగుచేసుకున్న బలవంతుడు. విక్రమసింహుడు జజీరా గురించి ఏనాడు ఆలోచించలేదు. విక్రమసింహుడికి తన ప్రేమలో మిథిలా తప్ప వేరెవ్వరూ కనిపించేవారు కాదు.
మిథిలాకు విక్రమసింహుడి అమ్మగారైన విజయకుమారితో మంచి అనుబంధం ఏర్పడింది. విజయకుమారికి మిథిలా అంటే ఎంతో ఇష్టం. విక్రమసింహుడికి అన్ని విధాలా ఆమె సరైన ఈడు జోడు అని తన నిశ్చితాభిప్రాయం. జజీరాకి వేగుల ద్వారా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. శంభలలో ఎవ్వరికీ ప్రవేశం లేని అనల, మేఖలలో జజీరా ఒకనాటి రాత్రి ప్రవేశించాడు. సింహ దత్తుడు జ్వాలా జిహ్వుడిని, భైరవిని సంహరించిన తర్వాత అనల, మేఖల ప్రాకారాలను పూర్తిగా నిర్బంధించి వేశారు. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. జజీరా మొట్టమొదటి సారి అక్కడికెళ్ళాడు. అనలలో మొట్టమొదటి సారిగా విషాన్ని కాకుండా నిప్పును విరజిమ్మే పాములను చూసాడు జజీరా. ఆ గాలిలోనే విషం ఉంది. జజీరా అణువణువులోనూ అది రివ్వున ఎక్కేసింది. జజీరా అక్కడ ఏదో అద్భుత శక్తి ఉందనుకుని ఆ శక్తిని జపం చేస్తూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన వల్ల జ్వాలా జిహ్వుడు సింహ దత్తుడికిచ్చిన శాపం తాలూకు ఘట్టం మొత్తం జజీరా కళ్ళకు కట్టినట్టు కనబడింది. జ్వాలా జిహ్వుడు అంతం అయిపోయినా అక్కడ ఉత్తరక్రియలు జరగకపోవటం చేత అతని ప్రేతం అలానే మిగిలిపోయింది. ఆ ప్రేతాన్ని ఆవాహన చేసుకునే మంత్రం జజీరా దగ్గరుంది. విక్రమ సింహుడి మీదున్న ఈర్ష్య జజీరా చేత ఆ ప్రేతాన్ని తనలోకి ఆవాహన చేసుకునేలా పురికొలిపింది. ముందు వెనుక ఆలోచించకుండా కేవలం విక్రమసింహుడి పైనున్న అసూయతో జ్వాలా జిహ్వుడి ప్రేతాన్ని తనలోకి ఆహ్వానం పలికాడు జజీరా. జ్వాలా జిహ్వుడి ప్రేతం జజీరాలోకి ప్రవేశించగానే పిచ్చి పట్టినవాడిలా చుట్టూ వెతికాడు. దేనికోసం వెతుకుతున్నాడో అర్థం కావట్లేదు.
'పదకొండు...పదకొండు.... పదకొండు' అంటున్నాడు. అదే సమయంలో అక్కడొక బిలం కనబడింది. ఏదో గుర్తుకొచ్చినవాడిలా అందులోకి వెళ్ళాడు. అక్కడ పదకొండు సర్పాలు కనిపించాయి. అవి మాట్లాడే విష సర్పాలు. కానీ వాటి విషాన్ని అవి ఇతరులపై ప్రయోగించవు. ఈ విషయం జ్వాలా జిహ్వుడికి బాగా తెలుసు. అందుకే పూర్ణిమ రాత్రి కోసం ఇన్నేళ్లు ఎదురు చూసాడు. ఇప్పుడు సమయం ఆసన్నం అయ్యింది. పూర్ణిమ రోజున ఆ పదకొండు సర్పాలకూ విముక్తి దొరుకుతుందని ఎప్పుడో ఒక ఋషివర్యుడు చెప్పాడు. అదే వాక్యాన్ని ఆలంబనగా చేసుకుని అక్కడే ధ్యానంలో ఉన్నాయవి. కానీ ఈ సర్పాల విషం అత్యంత ప్రమాదకరం. ఒకసారి ఈ సర్పాల విషపు చుక్క అక్కడి రాతిపై పడటం, ఆ రాయి మలమల మాడిపోవటం తన కళ్లారా చూసాడు జ్వాలా జిహ్వుడు.
అది చూసిన రోజు నుండి మదిలో నిలిచిపోయిందా దృశ్యం. ఇప్పుడదే విషపు చుక్కతో జ్వాలా జిహ్వుడి ప్రేతం సింహ దత్తుడి కొడుకైన విక్రమ సింహుడిని అంతం చేద్దాం అనుకుంటోంది. విక్రమసింహుడిని చూసి ఈర్ష్య పడే జజీరా ద్వారా తన శాపాన్ని ఎలాగైనా నెరవేర్చాలన్న కసి జ్వాలా జిహ్వుడి ప్రేతానిది. ఈ విషపు నాగులకు పూర్ణిమ రోజున సగరుడు తాకిన మట్టి తెచ్చి పూజ చేస్తే విముక్తి కలుగుతుందని తెలియటంతో జజీరా వెంటనే తాను ఆ పని చేస్తానని మాటిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా తాము ఏమి చెయ్యాలో జజీరాను అడిగాయి ఆ పదకొండు విషసర్పాలు. ప్రలోభలో మిథిలా, విక్రమసింహుడు కలవనున్న పూర్ణిమ రోజున వారిరువురి మధ్యనా దూరం పెరిగేలా చెయ్యమని కోరాడు జజీరా. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయ్యటం కాకుండా మరేదైనా కోరుకొమ్మని అడిగాయి ఆ పదకొండు విష సర్పాలు. జజీరా ఊహించని పరిణామం ఇది.
పదకొండు సర్పాలనూ విడి విడిగా వాటి విషపు చుక్కలను ఇవ్వమని కోరాడు. ఒక నిమిషం పాటు దీర్ఘాలోచన చేశాయి.
"నువ్వు మా విషాన్ని ఎందుకు అడుగుతున్నావో మాకు అనవసరం. కానీ ఈ విషం చాలా ప్రమాదకారి. పుట్టగతులుండవు. ఒకే ఒక్క విషపు చుక్క అయినా సరే అతి భయంకరమైన నరకాన్ని బ్రతికుండగానే చవిచూపిస్తుంది. ఇది హెచ్చరిక మాత్రమే. ఆ పై నీ మనోగతాన్ని అనుసరించే నువ్వు ప్రవర్తిస్తావు", అని జజీరా కోరినట్టుగానే విషపు చుక్కల్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాయి.
"ఇది నువ్వు ఎవరి మీద ప్రయోగించాలి అన్నా ముందు ఇక్కడి నుండి నువ్వు ఈ విషాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళటానికి వీలుగా ఉండే ప్రహీణ అదుగో అక్కడున్నది. అందులో మాత్రమే నువ్వు ఈ విషాన్ని నింపగలవు" అన్నాయా విష సర్పాలు.
జజీరా విషం నిండిన ఆ ప్రహీణ తో బిలం నుండి నిష్క్రమించాడు.
సగరుడు తాకిన మట్టి కోసం వెతకసాగాడు జజీరా. ప్రలోభలో సగరుడు తాకిన మట్టి ఉంటుందని తన వేగుల ద్వారా వాకబు చేయిస్తే తెలిసింది. సగరుడు అంటే సముద్రుడు. సముద్రం తాకిన మట్టి ఇక్కడెలా ఉందబ్బా అని ఆశ్చర్యపోయాడు జజీరా. ప్రలోభలో విస్తారముగా పరుచుకుని వున్న పర్వతం నుండి తెచ్చిన ఆ మట్టిని అతనికి అందించారు వేగులు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
ఆ మట్టిని తీసుకెళ్లి జజీరా పూర్ణిమ నాడు ఆ పదకొండు విష సర్పాలకూ అందించాడు.
ఆ మట్టి వాసన పసిగట్టాయి ఆ విష సర్పాలు. ఒక్కసారిగా పదకొండు సర్పాలూ జజీరా వైపు చూశాయి. జజీరాకు ముచ్చెమటలు పట్టాయి.
"సగరుడు తాకిన ఈ మట్టి నీకెక్కడిది?" అని ముక్తకంఠంతో ప్రశ్నించాయి ఆ సర్పాలు.
"ప్రలోభలో దొరికింది", అని తడబడుతూ జవాబిచ్చాడు జజీరా.
కాసేపటి మౌనం తర్వాత,
"ఏదైతేనేం, మాకు ముక్తిని కలిగించినవాడివయ్యావు", అంటూ ఆశీర్వదించాయవి.
జజీరాకేమీ అంతుబట్టడం లేదు. ఆ బిలం నుండి నిష్క్రమించాడు.
ఆ పూర్ణిమ రాత్రి విక్రమసింహుడు ప్రలోభలో మిథిలాను కలవబోతున్నాడు . మిథిలా విక్రమసింహుడు ఆరాధించే పరమశివునికి అభిషేకం చేసిన పాలు ఒక బంగారు పాత్రలో తీసుకుని వస్తోంది. మిథిలా చేతుల మీదుగా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకోవాలని విక్రమసింహుడు ఆనందంగా ఎదురుచూస్తున్నాడు ఆకాశంలోని పున్నమి చంద్రుణ్ణి చూస్తూ. మిథిలా మాత్రం తను అంతవరకు చేసిన పూజలో ఆ పరమశివునికి విన్నవించుకున్న తన ప్రేమ గురించే ఆలోచిస్తూ విక్రమసింహుణ్ణి ధ్యానిస్తూ వస్తోంది.
జజీరా మిథిలాను వెంబడిస్తున్నాడు. అదే సమయంలో మిథిలా ఒక చోట ఆగి విక్రమసింహుడికి ఎంతో ఇష్టమైన మందార మకరందాన్ని దాచి ఉంచిన వనంలోకి వెళ్ళింది. వెళుతూ ఆ అభిషేక పాత్రను అక్కడే వదిలి వెళ్ళింది. జజీరా ఆ పాత్రలోనే తను తెచ్చిన ప్రహీణ లోని ఆ విషపు చుక్కను కలిపాడు అందులో. వేడిగా పొగలు కమ్ముతూ ఉంది ఆ పాత్ర. ఆ అభిషేక మహిమో మరేంటో తెలియట్లేదు గానీ పాల రంగు మాత్రం అలాగే ఉంది. జజీరా అది చూస్తూ వికృతంగా నవ్వాడు. మిథిలా మందార మకరందాన్ని ప్రోగు చేసుకుని తన దగ్గర దాచుకుని వనం నుండి బయటికొచ్చింది. ఆ పాత్రను తీసుకుని ముందుకు సాగింది. జజీరా ఇంకా మిథిలా వెనకే వస్తూ ఉన్నాడు.
ప్రలోభలో వున్న పర్వత ప్రాంతం చేరుకున్నారు. ఆ పర్వతం విశాలంగా దారి పొడుగునా పరుచుకుని ఉన్నది. మిథిలా విక్రమసింహుని కోసం వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నది. వెనకే జజీరా వస్తున్నాడు. అల్లంత దూరాన విక్రమసింహుడు కూర్చుని ఉన్నాడు.
ఇంతలో ఆ పర్వతాన్ని చీల్చుకుంటూ పదకొండు మంది ఒక్కరొక్కరుగా జజీరా వెనుకే వస్తున్నారు. ఇదంతా జజీరా దృష్టికి అందట్లేదు. ఎందుకంటే జజీరా వెనక్కి తిరిగి చూస్తే కదా. తన చూపంతా ఆ పాత్ర పై, ముందున్న విక్రమ సింహుడిపై ఉన్నది. మిథిలా దృష్టి అంతా విక్రమసింహుడి పై.
మిథిలా విక్రమసింహుణ్ణి చేరుకొని తన దగ్గరున్న ఆ పాత్రలోని అభిషేక క్షీరాన్ని అందివ్వబోతుండగా,
జజీరా వెనకున్న ఆ పదకొండు మంది
"హరహర మహాదేవ శంభో శంకర " అనుకుంటూ
పరమశివునికి అభిషేకం చేసిన ఆ పాత్రలోని క్షీరాన్ని విషంతో కలిసినా సరే అలాగే స్వీకరించారు. జజీరా వారిని చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారు పదకొండు మంది ఉన్నారు. సరిగ్గా పదకొండు విష సర్పాలను మెడలపై ధరించి ఉన్నారు. జజీరా అనలలో చూసిన విష సర్పాలే అవి .
ఆ పాత్రలోని క్షీరాన్ని పుచ్చుకోగానే ఆ పదకొండు మంది ఉగ్రులైపోయారు. వారి కళ్ళల్లో దావాగ్ని ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉన్నారు. వారిని చూసి జజీరాలోని జ్వాలా జిహ్వుడి ప్రేతం అదిరిపడి జజీరా శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ పదకొండు మంది కలిసి ఆ ప్రేతాన్ని అంతమొందించారు. జజీరా కళ్లెదుటే జరుగుతున్న ఈ విలయ తాండవాన్ని చూస్తూ నోరు మెదపకుండా ఉండిపోయాడు.
జ్వాలా జిహ్వుడి ప్రేతానికి విముక్తి కల్పించిన తర్వాత ఆ పదకొండు మంది విక్రమసింహుడిని, మిథిలా ను కలిశారు.
"ఏకాదశ రుద్ర విభూతులము మేము. ఇక్కడే కొన్నేళ్లుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. పర్వత గర్భంలో కలిసిపోయాం. మీ నాన్న గారైన సింహ దత్తుడు ఆ పరమ శివుని దగ్గర మా గురించి ప్రస్తావించారు. ఆయన వల్లే ఈ రోజున మాకు విముక్తి లభించింది. మా ద్వారా ఈ పదకొండు విష సర్పాలకూ లభించింది. ఈ పూర్ణిమ రాత్రి ఏకాదశ రుద్రులలో శాశ్వతంగా కలిసిపోతున్నాం. మాకు ఇకపై జన్మ లేదు. నీకేమైనా కావాలంటే కోరుకో" అని వరం అడిగారా పదకొండు మంది.
"ఇవ్వాల్టి రోజున మీ పరాక్రమాన్ని నా కళ్ళతో చూసాక శంభల యోగులుగా మీరిక్కడి యోధులకు కార్యసిద్ధిని కలిగిస్తారనే దృఢ నమ్మకం కలిగింది. జ్వాలా జిహ్వుడితో మా నాన్న గారు పోరాడి ప్రాణ త్యాగం చేశారు. అయినా ఆ ప్రేతం ఇంకా బతికే ఉండటం నన్నెంతగానో కలవరానికి గురిచేసింది. మీరు లేకుంటే నేను బ్రతికుండే వాణ్ని కాను. నేనే మీకెంతో రుణపడి ఉన్నాను. అలాంటిది మీరే తిరిగి వరం ఇచ్చారు నాకు", అంటూ వినయంగా వారికి నమస్కరించాడు.
"ఇదంతా కార్యకారణ సంబంధం, విక్రమసింహ. నువ్వు అడిగినట్టుగానే శంభల యోగులుగా మా శక్తి ఈ శంభల రాజ్య యోధులకు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా వాళ్ళ చుట్టూ ఉంటుంది. వరం నీకోసం కాకుండా రాజ్యం కోసం కోరుకున్నావు చూడు అక్కడే నీలో సింహ దత్తుడు కనిపించాడు మాకు. జయము", అంటూ జజీరా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుండి నిష్క్రమించారా ఏకాదశ రుద్ర విభూతులైన శంభల యోగులు ", అని చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
స్వస్తి
శుభం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
ఇప్పటి వరకు చదివిన, వ్యాఖ్యానించిన; దాదాపు 20000 పాఠక మితృలకు కృతజ్ణతాభినందనలు
ముఖ్యంగా శ్రీ7869గారు, ఉదయ్ గారు, కేప్టెన్--- గార్లకు
ఈ మన సైటు నిర్వాహకులకు
ఎల్లుండి నుండి మరో ధారావాహికం మొదలు
మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ
పెద్దబాబు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,273
Threads: 4
Likes Received: 3,428 in 1,566 posts
Likes Given: 4,882
Joined: Nov 2018
Reputation:
75
మరి ఘోరకలిని అలాగే వదిలేసారేంటి k3vv3 బ్రో. అభిజిత్ [b][i]ఘోరకలి మద్య ఏం జరగదా....[/i][/b]
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
మిగిలిన విషయాలు పాఠకుల ఊహకే వదిలేయబడింది.
ఎలా అనుకునా సరే మిత్రమా ఉదయ్!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,149
Threads: 172
Likes Received: 13,032 in 2,581 posts
Likes Given: 8,573
Joined: Nov 2018
Reputation:
895
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,813
Threads: 0
Likes Received: 7,188 in 5,430 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Super excellent fantastic story clp); clp); clp);
Posts: 1,037
Threads: 0
Likes Received: 1,553 in 895 posts
Likes Given: 3,985
Joined: Jun 2020
Reputation:
68
(12-01-2025, 10:38 AM)k3vv3 Wrote: అంటూ జజీరా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుండి నిష్క్రమించారా ఏకాదశ రుద్ర విభూతులైన శంభల యోగులు ", అని చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
స్వస్తి
శుభం
K3vv3 garu! Very good story!!! I am thinking that you might have ended this story without concluding, because of fewer viewers/readers. If possible, please conclude the story.
yr): yr): clp); clp);
|