02-12-2018, 10:01 PM
మాతృత్వం పరిమళించిన అపురూప సంఘటన!!
ఈ చిత్రం చూడటానికి జుగుప్సగా, అశ్లీలమైనదిగా మొదట భావన కలగవచ్చును. కానీ, ఈ చిత్రం వెనుక కళ్లు చెమర్చే వాస్తవ గాధ దాగివున్నది. ఆ కథ గురించి వింటే హృదయం ద్రవించక మానదు.
రోమన్ చారిటీ పేరుతో ప్రాచుర్యంలో వున్న అ కథలో సైమన్ (Simon) అనే వ్యక్తికి యూరప్ లో తిండి లేకుండా మరణించే శిక్షను (incarcerated and sentenced to death by starvation) విధించారు. కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు. కానీ ఆ వ్యక్తి కూతురైన పెరొ (Pero) ప్రతిరోజు తన తండ్రిని కొంతసేపు కలిసే విధంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నది.
ప్రతిరోజు అతన్ని చూడ్డానికి వచ్చేముందు అక్కడి కాపలాదారులు ఆమె ఎటువంటి తినే, త్రాగే పదార్థాలను ఆమె వెంట తీసుకెళ్ళకుండా క్షుణ్ణముగా తనిఖీ చేసి లోపలకు వదిలేవారు. తిండీ, నీరు లేక శరీరం శుష్కించి మరణానికి చేరువవుతున్న తన తండ్రిని చూడలేక తల్లడిల్లిపోయిన పెరొ తానే అతనికి తల్లిగా మారి తన స్తన్యాన్ని అతని నోటికందించింది. ఇలా రోజులు గడువసాగాయి. రెండ్రోజుల్లో చనిపోతాడనుకున్న సైమన్ ఇంకా బ్రతికే వుండటం ఆ జైలు అధికారులను విశ్మయానికి గురిచేసింది. అందుకు గల కారణాన్ని తెలుసుకొని ఆ తండ్రీ కూతుర్లిద్దరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. జరిగినదంతా తెలుసుకున్న న్యాయస్థానం మానవీయ కోణంలో తీర్పుని వెల్లడించి ఆ ఇద్దరినీ విడుదల చెయ్యాలని ఆదేశించింది.
ఇదీ... ఆ చిత్రం వెనుక దాగివున్న అసలు కథ.
ఈ కథకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు.
ఎనభైవ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర నటించిన 'సావాసగాళ్ళు' చిత్రంలో ఈ కథని రిఫర్ చేయటం జరిగింది.
ఈ చిత్రం చూడటానికి జుగుప్సగా, అశ్లీలమైనదిగా మొదట భావన కలగవచ్చును. కానీ, ఈ చిత్రం వెనుక కళ్లు చెమర్చే వాస్తవ గాధ దాగివున్నది. ఆ కథ గురించి వింటే హృదయం ద్రవించక మానదు.
రోమన్ చారిటీ పేరుతో ప్రాచుర్యంలో వున్న అ కథలో సైమన్ (Simon) అనే వ్యక్తికి యూరప్ లో తిండి లేకుండా మరణించే శిక్షను (incarcerated and sentenced to death by starvation) విధించారు. కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు. కానీ ఆ వ్యక్తి కూతురైన పెరొ (Pero) ప్రతిరోజు తన తండ్రిని కొంతసేపు కలిసే విధంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నది.
ప్రతిరోజు అతన్ని చూడ్డానికి వచ్చేముందు అక్కడి కాపలాదారులు ఆమె ఎటువంటి తినే, త్రాగే పదార్థాలను ఆమె వెంట తీసుకెళ్ళకుండా క్షుణ్ణముగా తనిఖీ చేసి లోపలకు వదిలేవారు. తిండీ, నీరు లేక శరీరం శుష్కించి మరణానికి చేరువవుతున్న తన తండ్రిని చూడలేక తల్లడిల్లిపోయిన పెరొ తానే అతనికి తల్లిగా మారి తన స్తన్యాన్ని అతని నోటికందించింది. ఇలా రోజులు గడువసాగాయి. రెండ్రోజుల్లో చనిపోతాడనుకున్న సైమన్ ఇంకా బ్రతికే వుండటం ఆ జైలు అధికారులను విశ్మయానికి గురిచేసింది. అందుకు గల కారణాన్ని తెలుసుకొని ఆ తండ్రీ కూతుర్లిద్దరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. జరిగినదంతా తెలుసుకున్న న్యాయస్థానం మానవీయ కోణంలో తీర్పుని వెల్లడించి ఆ ఇద్దరినీ విడుదల చెయ్యాలని ఆదేశించింది.
ఇదీ... ఆ చిత్రం వెనుక దాగివున్న అసలు కథ.
ఈ కథకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు.
ఎనభైవ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర నటించిన 'సావాసగాళ్ళు' చిత్రంలో ఈ కథని రిఫర్ చేయటం జరిగింది.
గర్ల్స్ హైస్కూల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK