Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
SURYA..జగతికి వెలుగు..!!? తెలిపే.. పుణ్యక్షేత్రం వివరాలు..!!?శ్రీ?
#1
SURYA..జగతికి వెలుగు..!!? తెలిపే..
పుణ్యక్షేత్రం వివరాలు..!!?శ్రీ?

అక్బర్ , షాజహాన్ , ఔరంగజేబ్ ఎంత  ప్రయత్నించినా ఆరని జ్వాల..?

జ్వాలాముఖి ఆలయంను జ్వాలాజీ అని కూడా పిలుస్తారు. 
ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది. 
ఒక మండుతున్న నోరు గల దేవత అని పిలుస్తారు. 

ఈ ప్రదేశంలో సహజ వాయువు వెలువడే ఒక కాపర్ పైప్ ను గుర్తించారు. 
దేవాలయము గదిలో తొమ్మిది పోలి జ్వాలలు ఉన్నాయి.

వాటికీ మహాకాళి,
అన్నపూర్ణ,
చండి,
హింగ్ల,
బిన్ధ్య బాస్ని,
మహా లక్ష్మి,
సరస్వతి,
అంబిక మరియు 
అంజి దేవి 
అని వివిధ దేవతల పేర్ల మీదుగా ఉన్నాయి. 

జానపద ప్రకారం ఈ ఆలయం పెళ్లైన కంటెంట్మెంట్ మరియు దీర్ఘాయువు యొక్క దేవత అయిన 
సతి యొక్క నాలుక పడిపోయిన స్థలం మీద కట్టబడింది.

ఇక్కడ దేవి చిన్న జ్వాలల రూపంలో ఉందని నమ్మకం. 
బ్లూ జ్వాలలు ఆలయం ఉన్న పురాతన రాక్ పగుళ్ళు నుండి బయటపడతాయి. 
ఒక పురాణం ప్రకారం మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా దాని స్వచ్ఛత తనిఖీ చేయటానికి ఆలయంను సందర్శించెను. 
ఆ మంటలను చూసి అతను దేవత భక్తుడుగా మారాడని చెప్పబడింది. 

అతను కూడా ఆలయ జ్వాలల బయటకు ఆర్పివేయుటకు ఆలయ ప్రాంగణంలో ఒక నీటి పారుదల నిర్మించేను. 
అంతే కాకుండా ఆలయంనకు బంగారు గొడుగు సమర్పించారని చెప్పబడింది.

అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో, 
మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. 
ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! 
భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారిని 
అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. 
అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం!

దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందేనీ, 
అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా! 
వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. 
మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. 
వాటిలో ఒకటే హిమాచల్ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో 
ఉన్న జ్వాలాముఖి క్షేత్రం.

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. 
దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు. 

మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, 
మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా... 
నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. 
కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు.

ఈ కాలంలో సైన్టిస్ట్ లు కూడా చేతులెత్తేశారట 
జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఓ స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. 
ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి... 
తను ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. 
అమ్మవారు చెప్పిన ప్రాంతాన్ని ఎంత కూలంకషంగా వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదు సరికదా... భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. 

అదే అమ్మవారి రూపంగా భావించిన రాజుగారు, 
ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ‘జ్వాల’ తప్ప మరే విగ్రహమూ కనిపించదు.

దౌలాధర్ పర్వతాల దిగువున... 
ధర్మశాల- సిమ్లా రోడ్డు మార్గం పక్కన ఉండే 
ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. 
నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ, నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. 

జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, 
ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. 
ఉత్తర్ప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం, 
ముక్తినాధ్లోని జ్వాలామాయి ఆలయం 
వీటిలో ప్రముఖమైనవి. 

ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తుంటారు.

అక్బర్ కూడా జ్వాలాముఖి గుడిని నాశనం చేసే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. 
అఖండ జ్యోతిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. 
రెండడుగుల మందంగల ఇనుప దిమ్మలను పెట్టించాడు ఆ జ్యోతిపైన 
ఈ సృష్ఠి మొదలైనప్పటినుండి ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే వుంది. 
తన తరం కాలేదు. 
అలాంటి నాలుగైదు దిమ్మలు పెట్టిచాడు. 
ఆ ఇనుప దిమ్మల మధ్యనుండి జ్యోతి పైకి వచ్చింది. ఈరోజునకూడా ఆ ఆనవాళ్లు కనబడతాయి. 

అక్బర్ తన తప్పును తెలుస్కుని అమ్మవారి 
క్షమను అర్ధించి బంగారు ఛత్రం చేయించి సమర్పించుకున్నాడు .
నేటికి ఆ ఛత్రాన్ని ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాతనే హిందూ మతాన్ని కూడా గౌరవించడం మొదలుపెట్టాడు. 
రాజ్యంలో బీర్ బల్ అనే పండితుడికి స్థానం కల్పించాడు. 
హిందూ రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. 

షాజహాన్ ఈ జ్వాలలను తానూ ఆర్పుతానని 
కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు తెప్పించి ధారాపాతంగా పోయించాడు .
ఎన్ని రోజులు ఇలా నెలలు పోస్తున్నా జ్వాలలు ఆరలేదు సరికదా నీటి సమస్య వచ్చింది,
రాజ్యంలో ఎక్కడ ఒక్క నీటి చుక్క లేకుండా చెరువులు బావులు ఇంకిపోయాయి .
అప్పుడు అమ్మవారి శక్తిని అంగీకరించి 
క్షమాపణ కోరి వెనుదిరిగాడు.

ఔరంగజేబు ,అక్బర్ షాజహాన్  చేయలేని పనిని 
తను పూర్తి చేస్తానని బయల్దేరాడు సైన్యంతో సహా. కాని పఠాన్ కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా మాత గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి తేనెటీగలు వాడి సైన్యాన్ని చుట్టుముట్టి చంపేశాయి. 
బతుకు జీవుడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈ రోజుకీ కాగడా మాత, జ్వాలాజీ మాత గుళ్లలో
ఆ ఆనవాళ్లు కనబడతాయి. 
తొమ్మిది రంగులలో గోడమీద జ్వాల వెలుగుతూంటుంది ఈ రోజుకికూడా. 
మినుకు మనుకు మంటూ ఆరడానికి సిధ్ధంగా వున్న జ్యోతి ఎప్పటినుండి అలా వెలుగుతోందో ఆర్కియాలజిస్టుల దగ్గర వున్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

హిందూ మతాన్ని విమర్సించే జన అఙ్ఞాన వేదిక వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు.  
ఎందుకంటే NASA scientists కూడా చాలా ప్రయోగాలు చేశారు. 
కింద భూమిలో పెట్రోలుందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టుపీక్కుంటూ వెళ్లిపోయారు. 

ఆ గుడిలోనే గోరఖ్ నాథుడి ఉపాలయం వుంది. ఎలాంటి వెంటిలేషన్ లేనిచోట ఒక గొయ్యి ప్రక్కనే ఒకటిన్నర అడుగు ఎత్తు వరకూ అఖండ జ్యోతి వెలుగుతూంటుంది. 
మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి. కానీ ఆ నీరు చల్లగా ఫ్రిజ్ వాటర్ మాదిరి 
చల్లగా వుంటాయి. 
ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి కాని అలా జరగదు. 
ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాతే ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణవ్యవస్థకు చేరుకుంది. ఈ మధ్య దానినికూడా బాగు చేశారు.
ఓం శ్రీ మాత్రే నమః
స్వస్తి..!!?

ఓం నమః శివాయ..!!?
సర్వే జనా సుఖినోభవంతు..!!?

                           ?శ్రీ మాత్రే నమః?

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)