Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తృప్తి
#1
తృప్తి - పార్ట్ 1
 
రచన: శ్రీపతి లలిత






"అమ్మా!" గుమ్మం లో నిలబడ్డ ఆదిత్యని చూసి, కళ్లనుంచి నీళ్లు కారాయి సుభద్రకు.



ఎలా ఉండే పిల్లాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ "ఆదీ! రా నాన్నా!" అంటూ చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకుని వచ్చింది.



"నాన్న ఏమన్నా అంటారేమో?" అంటూ చూస్తున్న ఆదిత్యకి లోపల దిగులుగా చూస్తున్న రాజారాం కనిపించాడు.



"అయామ్ సారీ నాన్నా, మిమ్మల్ని నిరాశపరిచాను" కళ్ళనీళ్ళతో అంటున్న కొడుకుతో "ఆదీ! నీకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు నాన్నా!" అంటూ హత్తుకున్నాడు రాజారాం ఆదిత్యని.



అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి వచ్చినందుకు తల్లి, తండ్రి ఏమి అంటారో అంటూ భయపడుతూ వచ్చిన ఆదిత్యకి ధైర్యం వచ్చింది.



"అమ్మా! ఆకలి దంచేస్తోంది. సరిగ్గా భోంచేసి వారమైంది, ఏం చేసావు వంట?" అంటూ భోజనాల బల్ల మీద చూసాడు.



"అన్నీ నీకిష్టమైనవే" అని తల్లి అంటుంటే ఒకో గిన్నె మూత తీసి "వావ్! వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి. నేను స్నానం తర్వాత చేస్తాను. అన్నం పెట్టేయి" అని చెయ్యి కడుక్కుని కూర్చున్నాడు.



ఆదిత్య తినే పద్దతి చూసి సుభద్ర, రాజారామ్ కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తిని వారం కాదు.. సంవత్సరం అయినట్టు, తిండికి ముఖం వాచినట్టు, మాటా, పలుకూ లేకుండా తింటుంటే బాధగా అనిపించింది.



ముగ్గురికీ వండిన వంట అంతా తనే తినేసి" అమ్మా! అంతా నేనే తిన్నట్టున్నాను. మళ్ళీ వండుకో " అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, తండ్రిని హత్తుకుని "నేను పడుకుంటాను, లేపకండి. సరి అయిన నిద్ర పోయి ఎన్ని రోజులయిందో" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.



ఆదిత్య లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాక సుభద్ర దుఃఖం ఆపుకోలేకపోయింది.



"ఊరుకో భద్రా! వచ్చేసాడుగా, ఇంక వాడి సంగతి మనం చూసుకుందాము" అంటూ ఓదార్చాడు కానీ, అతనికీ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది.



ఆదిత్య వీళ్ళకి ఒక్కగాని ఒక్క కొడుకు. పదోక్లాస్, ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, ఐఐటీ లో మొదటి రాంక్, క్యాంపస్ లోనే అమెరికాలో పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు దాదాపు రూపాయల్లో సంవత్సరానికి రెండు కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. అన్ని పేపర్ల లోనూ ఆదిత్య ఫొటోలే.



చిన్నప్పటి నుంచి తన అంతట తనే చదువు మీద శ్రద్ధతో బాగా చదివేవాడు. అమ్మా, నాన్నా, చదువు తప్ప వేరే లోకం లేదు, పెద్ద స్నేహితులు లేరు.



సుభద్ర కానీ, రాజారామ్ కానీ, పెద్దగా స్నేహితులతో ఆడుకోమనీ, తిరగమనీ ప్రొత్సాహించిందీ లేదు. చదువుకోమని వెనక పడాల్సి రాకపోయినా, సినిమాలకి కానీ బంధువుల ఇళ్లలో పెళ్లి, పేరంటాలకు కానీ తీసుకెళ్లకుండా, చదువు తప్ప వేరే లోకం లేకుండానే పెంచారు.



ఎవరైనా పిల్లలు దగ్గరికి వద్దామని ప్రయ్నతించినా, వాళ్లు అల్లరి పిల్లలు, పెద్ద చదవరు అంటూ దూరం పెట్టేవారు. తాము ఇంట్లో టీవీ చూసినా, సినిమాకి వెళ్లినా ఆది కి ఇబ్బంది అని వీళ్ళు ఎక్కడికీ వెళ్లేవారు కాదు.



అమెరికా వెళ్లిన కొత్తల్లో వారానికి రెండు,మూడు సార్లు ఫోన్ చేసి తల్లి తండ్రులతో బాగా కబుర్లు చెప్పేవాడు. జీతంలో తన ఖర్చులకు ఉంచుకుని, అంతా తండ్రికే పంపేవాడు.



రాజారామ్ కూడా ఆ డబ్బులతో మంచి విల్లా, రెండు, మూడు స్థలాలు కొన్నాడు. వికారాబాద్ వేపు ఫార్మ్ హౌస్ కోసం రెండు ఎకరాల స్థలం కొని అందులో ఒక రెండు బెడ్ రూంల ఇల్లు, పనివాళ్ళకోసం ఒక చిన్న ఇల్లు కట్టించి, ఆ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లు కొన్ని వేయించాడు.



ఉద్యోగంలో చేరిన మూడేళ్ళలో రెండు సార్లు వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్ళాడు ఆదిత్య.



అది కూడా ఆఫీస్ పని మీదే. రాను రాను ఫోన్లు తగ్గాయి. చేసినా కూడా "ఎలా ఉన్నారు?" అని అడిగి పెట్టేసేవాడు.



ఒకసారి విడియో కాల్ లో చూసి సుభద్ర అడిగింది "అలా ఉన్నావేమిటి ఆదీ? సరిగ్గా తింటున్నావా? నీ ముఖం చూస్తే చాలా అలసటగా ఉంది" అంది.



"నాకేమిటో జీవితంలో ఆనందం, తృప్తి ఉండటం లేదమ్మా?" అన్నాడు ఆది.



ఇంకోసారి "ఎందుకమ్మా? నన్ను చూస్తే అందరూ దూర దూరంగా వెళతారు? నాతో ఎవరూ కలవరు? " అడిగాడు తల్లిని.



"నువ్వు మంచి చదువు, ఉద్యోగం కదా! వాళ్ళందరూ ఏదో సామాన్యమైన వాళ్లు. నువ్వు పెద్ద బాధ పడక్కర్లేదు, నీ లెవెల్ వాళ్లతో కలు" సలహా చెప్పింది సుభద్ర.



"నా లెవెల్ వాళ్ళు అంతా పెద్దవాళ్ళు. వాళ్ళు నన్ను చూస్తూనే చికాకు పడతారు." కోపంగా అంటూ ఫోన్ పెట్టేసేడు.



రాజారామ్ తో కూడా మధ్యలో ఒకసారి "నేను ఉద్యోగం మానేస్తాను నాన్నా! నాకు ఇక్కడ చాలా ఒత్తిడి గా ఉంది" అంటే ఆయన కోప్పడ్డాడు.



తరవాత వారం అయినా ఆదిత్య ఫోన్ చెయ్యలేదు. వీళ్ళు చేసినా ఎత్తలేదు.



ఇద్దరూ భయపడ్డారు. ఇంకో రోజు సుభద్ర ఆపకుండా ఫోన్ చేస్తే "నాకు చచ్చిపోవాలని ఉంది అమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసాడు.



సుభద్రకి గుండె ఆగినంత పని అయింది. రాజారాం కూడా ఆదిత్య మాట్లాడినది విని హతాశుడయ్యాడు. "భద్రా! వాడిని వచ్చేయమని చెప్పు" అన్నాడు. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice start story
[+] 1 user Likes BR0304's post
Like Reply
#3
Good starting  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
భయ్యా కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#5
ఈ కథను ఇప్పటి వరకు మెచ్చిన, చదివిన మితృలకు కృతజ్ఞతలు

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#6
"అవునండీ! నాకూ అలానేఉంది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, పిల్లాడు దక్కితే చాలు" అంది భద్ర.



"ఆదిత్యా! నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేమూ ఏమీ అనము, నువ్వు ఇంటికి వచ్చెయ్యి" అంటూ విడియో మెసేజ్ పెట్టింది.



అంతే, వెంటనే "జాబ్ రిజైన్ చేశాను" అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకి వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు పదిగంటలు నిద్ర పోయాడు. నిద్ర లేచాక, టీ తాగుతూ చెప్పడం మొదలు పెట్టాడు.



"అమ్మా! నాన్నా! మీ ఇద్దరికీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలీదు కదా. చిన్నప్పటినుంచి నేను చదువు మీదే దృష్టి పెట్టాను, ఆటలు లేవు, స్నేహితులు లేరు.



మీరూ, చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగం లో చేరాక, నేను, నా వయసు వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్లేవారు. ఒకరు, ఇద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవీ తెలీవు.



నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు, ఎప్పుడూ దాంట్లోనే మునిగి ఉండేవాణ్ణి.



ఈ మధ్య కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి, దానితో, నేను ఏ తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో, అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధ పడతారు, ఇదే నా ఆలోచన.



దానితో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ ని కలిసాను.



ఆయన సలహా మీద, నేను ఉద్యోగం మానేసి, నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను.



ముందు కొన్నిరోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదామనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికీ వెళ్లకుండా నాతోనే ఉన్నారు, అమ్మా! ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాము. దగ్గరలో మన బంధువులు ఉంటే వాళ్ళనీ కలుద్దాము" అన్నాడు ఆది.



"అలాగే వెళదాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకి పూజ చేయిస్తాను అని మొక్కుకున్నా. నాన్న అక్క, జయ అత్తయ్యా వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో, మా అన్నయ్యా వాళ్ళు ఉంటారు.



అందరూ, వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి, అడిగి విసిగి పోయారు. అందర్నీ చూసి వద్దాము" సంతోషంగా అంది సుభద్ర.



రెండు రోజుల తరవాత, కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురూ. అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం రాజారామ్ వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు.



"ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్నా? అత్తయ్య వాళ్ళ పిల్లలు, వేరే ఊళ్ళో ఉంటారు కదా?" అన్నాడు ఆది.



"అవును, ఈ ఇల్లు మా బావగారి నాన్న కట్టించిన ఇల్లు.



ఇది వదిలి పెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం, ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు కానీ, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేటులో ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి.



ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా" అన్నాడు రాజారామ్.



"అమ్మా! ఇక్కడ మంచి బట్టల షాపులు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు, కొన్ని పళ్ళు, స్వీట్స్ తీసుకు వెళదాం" అన్నాడు ఆది.



ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దార్లో షాపుల దగ్గర ఆపి, అన్నీ తీసుకున్నారు.



కార్ గుమ్మం ముందు ఆగాక, ఆశబ్దానికి రాజారామ్ బావగారు నారాయణ బయటికి వచ్చాడు.



వీళ్ళ రాక ఏమాత్రం ఊహించని ఆయనకి ఒక నిమిషం అర్థం కాలేదు.



"జయా! ప్రళయం వస్తుంది జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో" అంటూ, "రండి, రండి. ఏదో దారి తప్పి వచ్చారు అమెరికా దొరవారు మనఇంటికి." 



నారాయణ మాటలకి నవ్వుతూ రాజారామ్ " అనండి బావా ! మీకు కాక ఇంకెవరికి ఆ అధికారం ఉంది" అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది.



" రాజా! ఇన్నాళ్ళకి వచ్చారు. ఏదో పెళ్లి, పేరంటాలకు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం?" అంటూ పలకరించింది.



ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా, నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు.



ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడు అని తెలిసాక "అదేమిటి ఆదీ! మేము అందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాము. ఎందుకు అలా మానేసావు?"
అని ఖంగారుపడ్డాడు.



"ఏం కాదు మామయ్య గారు. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తాను." అన్నాడు ఆది.



ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారు ఇద్దరూ. వాళ్ళ తమ్ముడిని, మరదలిని పిలిచి చూపించారు నారాయణగారు.



వాళ్ళకీ, తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్నీ ఇచ్చింది సుభద్ర.



మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజీనిరింగ్ అయిపోయిందనీ, అమెరికాలో చాలా మంచి కాలేజి అయిన MIT లో MS సీట్ వచ్చిందనీ, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా, పై ఖర్చులు పెట్టుకోవడం కష్టమని సీట్ వదిలేస్తామని చెప్పారు.



ఆదిత్య వెంటనే "మామయ్యగారూ, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా?" అని అడిగాడు నారాయణ గారి తమ్ముడిని.



"తప్పకుండా" అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ ని పిలిచారు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#7
అప్డేట్ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply
#8
నిజమే బ్రో...సేం టు సేం, సరిగ్గా ఇలాంటి పరిస్థితే నా సహోద్యోగి కొడుకుది.  చిన్నప్పటినుంచి అన్నింటిలోనూ ఫస్ట్, ఉద్యోగం కూడా ఇంజినీరింగ్ అవుతూనే వచ్చేసింది. కాని స్నేహితులే లేరు. స్కూలు, కాలేజ్, ఇల్లు ఇదే లోకం అనుకున్నాడు...అసలైన ప్రపంచం కళ్ళముందు కనిపించింది. ఒకేసారి చేరిన వాళ్ళు కన్ ఫాం అవుతున్నారు, బాదను చెప్పుకోవడాని ఎవరూ లేరు. ఉద్యోగం వదిలేసి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు ఏపనీ చేయకుండా.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#9
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#10
తృప్తి - పార్ట్ 2/2'  పెద్ద కథ



"దేవుడు పంపినట్టు వచ్చావురా ఆదీ! దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.బంగారం లాంటి కొడుకుని కన్నావురా రాజా నువ్వు. మీ పెంపకానికి మెచ్చుకోవాలి."



అటు జయ, నారాయణ అంటుంటే నిజమైన పుత్రోత్సాహం కలిగింది రాజారామ్, సుభద్రలకి.



మళ్ళీ రావాలని మాట తీసుకుని వదిలారు జయ, నారాయణ. రాహుల్, ఆదిత్య తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండి తన ప్రయాణం గురించిన వివరాలు తెలియచేస్తాను అని చెప్పాడు.



చాలా రోజుల తరవాత ఆదిత్య కి మనసు హాయిగా అనిపించింది.



తను వెళ్లిన సైకియాట్రిస్ట్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవసరంలో ఉన్న మనిషికి సాయం చేస్తే, వాళ్ళు చూపే కృతజ్ఞత కి విలువ కట్టలేము.



ఆ ఆనందమే వేరు. అదిఅనుభవిస్తే నీకు తృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఏ డబ్బు సంపాదన ఇవ్వలేనిది ఆ తృప్తి. ఆ తృప్తి తెలిసాక, నీ సంపాదన కూడా సద్వినియోగం అవుతుంది.



ఈ రోజు, అలాంటి తృప్తి అనుభవించాను అనుకున్నాడు ఆదిత్య.



మర్నాడు గుంటూరు బయలుదేరారు. ఈసారి కొడుకు చెప్పే ముందే, అన్నకి, వదినకి బట్టలు తీసుకుంది సుభద్ర.
సుభద్ర తల్లీ, తండ్రీ ఇద్దరూ లేరు. ఉన్నది ఒక్కడే అన్న.



సుభద్ర అన్న రామ్మోహన్, గుంటూరు జనరల్ హాస్పిటల్ లో డాక్టర్. వదిన సుగుణ గృహిణి.



వాళ్ళ అబ్బాయి వివేక్. అతను తండ్రి ఎంత చెప్పినా వినకుండా, వ్యవసాయం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు.



సుగుణ తల్లీ, తండ్రీ పల్లెటూళ్ళో ఉంటారు. స్కూల్ టీచర్ గా రిటైర్ అయినా, ఆయన తన సొంత ఊరులోనే, పొలాలని చూసుకుంటూ ఉంటారు. టైం దొరికినప్పుడల్లా రామ్మోహన్, సుగుణ వెళ్లి వాళ్ళని చూసి వస్తారు.



రామ్మోహన్ కి, ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగం కావడంతో ఒక్క క్షణం సమయం ఉండదు. అతను గుండె ఆపరేషన్ చేసే సర్జన్.



ఎప్పుడో తప్ప, ఫోన్లో మాట్లాడడం కూడా కుదరదు రామ్మోహన్ కి సుభద్ర తో. కానీ సుగుణ మాత్రం, ఆడపడుచు తో ఫోన్ లో మాట్లాడుతునే ఉంటుంది.



గుంటూరు లో అన్న వాళ్ళ ఇల్లు పెద్దదే కనుక డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్నా, వదినకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వెళ్లారు.



సరిగ్గా వీళ్ళు వెళ్లేసరికి రామ్మోహన్ ఆసుపత్రికి బయలు దేరుతున్నాడు.
చెల్లెలి కుటుంబాన్ని చాలా రోజుల తరవాత చూసేసరికి సంతోషంతో పలకరించాడు.



" భద్రా ! ఏమైంది ఇవాళ సూర్యుడు ఎటు పొడుస్తున్నాడు? నువ్వు, బావగారు, ఆదిత్య ఒకేసారి! వావ్" అంటూ రాజారామ్ వంక తిరిగి " బావగారూ! నేను సర్జరీ అవగానే వస్తాను."
చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు.



సుగుణ వీళ్ళని కూర్చోపెట్టి కబుర్లు మొదలుపెట్టింది.
" అత్తయ్యా! వివేక్ లేడా?" అడిగాడు ఆదిత్య.
సుగుణ ముఖం కొంచెం వాడినట్టయ్యి "ఉన్నాడు ఆదీ !"
అంటూ
"విక్కీ" అని పిలిచింది, సమాధానం రాకపోయేసరికి "ఆదిత్యా, అత్తయ్యా, మామయ్యా వచ్చారు"



గట్టిగా అంది. గబుక్కున పక్కన రూంలోనించి వచ్చాడు వివేక్.
"హాయ్ ఆదీ! ఎలా ఉన్నారు అత్తయ్యా, మామయ్యా!"
అంటూ పలకరించి ఆదిత్య పక్కనే కూర్చున్నాడు.



పెద్దవాళ్ళు వాళ్ళ కబుర్లలో మునిగిపోతే ఆదిత్య, విక్కీ అతని రూంలోకి వెళ్లారు.



సాయంత్రం రామ్మోహన్ వచ్చాక అందరూ కూర్చుని మళ్ళీ కబుర్లు మొదలు పెట్టారు.
విక్కీ ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళాడు.



అదే అదనుగా ఆదిత్య " మామయ్యా ! మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను. విక్కీ చేస్తాను అన్నదానికి మీరెందుకు ఒప్పుకోరు?"
రామ్మోహన్ ఉలిక్కిపడ్డాడు " నీతో
చెప్పాడా విక్కీ?" ఆశ్చర్యంగా అన్నాడు.



"విక్కీ చెప్పలేదు, నేనే కష్టం మీద వాడి దగ్గర్నుంచి లాగాను. తను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. నేను అదే స్థితి నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు
అందుకే తన పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది." అన్న ఆదిత్యని చూసి



"డిప్రెషనా! నీకా! " అన్నారు రామ్మోహన్, సుగుణ ఒకేసారి.



"అదేంటి మామా ! మీరు డాక్టర్ అయిఉండి కూడా అలా మాట్లాడతారు? డిప్రెషన్ ఎవరికైనా రావచ్చుకదా?" అన్నాడు ఆదిత్య.



"అంతే అనుకో కానీ, అన్నీ అమరిన నీకు అంటే ఆశ్చర్యంగా ఉంది " అన్నాడు రామ్మోహన్.



"మా ఇద్దరికీ విక్కీని డాక్టర్ని చెయ్యాలని కోరిక ఉండేది, వాడేమో మంచి రాంక్ తెచ్చుకోకుండా అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరి, ఎమ్మెస్సీ కూడా చేసాడు.



చదువు అయ్యాక పోనీ ఏ బ్యాంకు లోనో, ప్రభుత్వం లోనో ఆఫీసర్ గా చేరమని, లేదా అమెరికా వెళ్లి పీజీ చెయ్యమంటే, వ్యవసాయం చేస్తా అంటాడు" అంటున్న రామ్మోహన్ కి అడ్డు పడి



"మా నాన్నా వాళ్ళకి, ప్రస్తుతం ఆ పొలం మీద ఆదాయమే ఆధారం, అక్కడ ఏవో సాగు చేస్తాను అంటే, వద్దు అన్నామని ఇలా నిరాశ తో ఉన్నాడు. వేరే పొలం కొనివ్వమంటాడు, ఇప్పుడు పొలాలు మనం కొనేటట్టు ఉన్నాయా?"అంది సుగుణ.



"నాన్నా! మనము హైదరాబాద్ శివార్లలో ఫార్మ్ హౌస్ కోసం కొన్న పొలం ఎంత ఏరియా" తండ్రిని అడిగాడు ఆదిత్య.



"రెండు ఎకరాలు, అందులో వెయ్యి గజాలు ఇంటికి వదిలాము. రెండు బెడ్ రూంల ఇల్లు కట్టాము, పని వాళ్ళకి ఒక రూమ్, వంటిల్లు, బాత్రూం ఉంది." చెప్పాడు రాజారామ్.



"నేను ఆ పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని మనుషుల కోసం వెతుకుతున్నాను.
విక్కీ కి చెప్పి, తనకి ఇష్టమైతే డబ్బు నాది, కష్టం తనది, వచ్చిన లాభంలో చెరిసగం" ఆదిత్య అంటుండగానే విక్కీ లోపలి అడుగు పెట్టాడు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#11
"ఆదిత్యా ! నిజమా! నిజంగా నువ్వు నాకు సాగు చెయ్యడానికి పొలం ఇస్తావా! చూడు వండర్స్ చేస్తాను." కళ్ళలో మెరుపుతో అంటున్న కొడుకుని ఆశ్చర్యంగా చూసారు సుగుణ, రామ్మోహన్, నిజంగా అంత పట్టుదలగా ఉన్నాడా పంటలు వేసే విషయంలో, అనుకున్నారు ఇద్దరూ.



"అవును విక్కీ! నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నిజానికి, రెండు ఆవులు కూడా పెంచి, ఆ పేడతో ఎరువు తయారు చేసి, పంటలు ప్రయోగాత్మకంగా పండిద్దామని ఉంది.



నువ్వు కూడా, అలా చేద్దామంటే నెమ్మది మీద, ఇంకా కొన్ని ఏర్పాట్లు చేద్దాం, నీకు సాయంగా ఇంకో ఇద్దరు, ముగ్గురు మనుషులని పెడదాము.



నువ్వు ఒకే అంటే మాతో వచ్చేయి. నీకు ఉండడానికి భోజనానికి ఏమి ఇబ్బంది లేదు"
అన్నాడు ఆదిత్య.



సుభద్ర, రాజారామ్ కూడా అవును అన్నట్టే తలఊపారు.



ఏమాత్రం ఇది ఊహించని సుగుణా, రామ్మోహన్ ఆశ్చర్యంలో ఉన్నారు.



"నాలుగేళ్లలో ఇంత సంపాదించావా?" ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్, ఆదిత్య పంపిన డబ్బుతో ఎక్కడ ఏమేమి కొన్నారో రాజారామ్ చెప్తే విని.



"జీతం వచ్చింది, కానీ..జీవితం పోయింది మామయ్యా! నా తాపత్రయం అదే ఇప్పుడు. నేను జీవితాన్ని అనుభవించాలి. ప్రస్తుతము నేను ఉద్యోగం చేయక పోయినా, త్వరలో ఏదో ఒకటి చేస్తాను. కానీ, అది నాకు జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి, నా వాళ్లతో కాలం ఎక్కువ గడపగలగాలి.



అందుకే, డబ్బు అవసరం ఉన్నవాళ్ళకి చదువు కోసం, వైద్యం కోసం సాయం చేస్తాను. అది కూడా నా స్వార్థమే. నా సాయం అందుకున్న వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి 'తృప్తి' పడాలని ఉంది.



ఆ తృప్తే నా మానసిక బాధని దూరం చేస్తుందని నా ఆశ. నాలాగా చదువు, డబ్బు సంపాదనే, ధ్యేయంగా బతికే వాళ్ళకి నా జీవితం గురించి చెప్పి, మానసికంగా దుర్బలత్వం రాకుండా చేస్తాను.



మంచి చదువు ఉద్యోగానికి మాత్రమే కాదు, ఆ జ్ఞానంతో, సంపాదనతో ఇతరులకు సహాయపడడమే ఆ చదువుకి సార్ధకత.



నేనే, ఒక స్వంత వ్యాపారం మొదలుపెట్టి, కొంతమందికి ఉపాధి కల్పిస్తాను, నాకంటూ, నా చుట్టూ, కొంతమంది స్నేహితులని, శ్రేయోభిలాషులని ఏర్పరుచుకుంటాను. సంపాదించుకుంటాను. మీరేమంటారు?" ఒక్క నిమిషం ఆగి తల్లి తండ్రుల వేపు చూసాడు ఆదిత్య.



"నువ్వు సంతోషంగా ఉంటేనే మాకూ తృప్తి, నలుగురికీ ఉపయోగపడతానంటే, వద్దని అనం నాన్నా! మాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది." అంది సుభద్ర కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. అవునన్నట్టు భుజం మీద తట్టాడు రాజారామ్.



"చాలా మంచి ఆలోచన ఆదిత్యా! తప్పకుండ వివేక్ ని నీతోపాటు తీసుకెళ్ళు.
మేమూ ఒకసారి వచ్చి మీ పొలాలు చూస్తాము, మాకూ కొంత ఆటవిడుపుగా ఉంటుంది. ప్రకృతిలో గడిపితే" అన్నాడు రామ్మోహన్.



"గుండెలు కోసే డాక్టర్ గారు, గుండెనిండా గాలి పీల్చుకోవచ్చు" అంది సుభద్ర.
అందరూ తృప్తిగా హాయిగా నవ్వుకున్నారు.

==================================================================
సమాప్తం
==================================================================

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#12
Good story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#13
Nice story
Like Reply




Users browsing this thread: 1 Guest(s)