Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ చెప్పిన కథ
#1
అమ్మ చెప్పిన కథ
-    
"తాతయ్యా... తాతయ్యా... ఒక కథ చెప్పండి" అప్పుడే రాత్రి భోజనం కానిచ్చేసి బయట రెస్టింగ్ చైర్లో కూర్చున్నా తాతయ్యతో అంది ఎనిమిదేళ్ల ఆస్తిక.
 
"కథ చెప్పాలా ఆశీ...!"
 
"అవును తాతయ్యా..... మీరు మమ్మీ చిన్నప్పుడు చాలా కథలు చెప్పారంటగా ఇప్పుడు నాకు చెప్పండి" అతని పక్కనే కూర్చుంటూ అంది.
 
"హ్మ్..... సరే కథలే కదా కావాలి, మీ అమ్మను చెప్పమను చాలా బాగా చెప్తుంది" భుక్తాయాసం తీర్చుకుంటు చెప్పాడు.
 
"మమ్మీ......మమ్మీ...." అంటూ కిచెన్ లో గిన్నెలు కడుగుతున్న మానసని పిలిచింది.
 
"ఏమిటి....?"
 
"మమ్మీ... తాతయ్యా మీరు చిన్నగా వున్నప్పుడు చాలా కథలు చెప్పేవారంట కదా, ఇప్పుడు నువ్ వాటిలో నుండి ఒక కథ చెప్పాలి"
 
"కథలు చెప్పాలా!!!...సరే చెప్తాను, ఫస్ట్ నువ్వెళ్లి ఇన్కంప్లీట్ గా వున్న నీ హోమ్ వర్క్ చెయ్, అప్పటి వరకు కిచెన్ క్లీన్ చేసి వస్తాను,సరేనా" కడుగుతూనే చెప్పింది మానస.
 
"హ్మ్... ఒకే మమ్మీ,హోమ్ వర్క్ కంప్లీట్ చేస్తాను ,కానీ నువ్ కథ నిజంగా చెప్పాలి" మోహం సీరియస్ గా పెట్టి వేలు చూపిస్తూ చెప్పింది ఆశీ.
 
"ఒకే గుడ్ గర్ల్ ..." అని ఆశీ కి సబ్బు నురగ ముక్కు పై అంటించింది.
 
"మమ్మీ......" అంటూ ముక్కు తుడుచుకొని వెళ్లిపోయింది ఆశీ.
 
"ఎంటోయ్... మాకు చెప్పవ కథలు " అంటూ కిచెన్ లోకి వచ్చాడు కనిష్క్.
 
"చెప్తా... ఎందుకు చెప్పను, మీరు కూడా ఆశీల మీ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయండి అప్పుడు చెప్తాను" అంది.
 
"నేను ఆఫీస్ వర్క్ ఆఫిస్ లోనే చేస్తాను.....ఇంటి వర్క్ ఇంట్లోనే చేస్తాను,ఏది పెండింగ్ పెట్టుకొను" అంటూ మానస కడిగిన గిన్నెలని వాటి ప్లేస్ లో సర్దుతూ అన్నాడు.
 
"వెరీ గుడ్.... మీరు కూడా ఆశీ తో బయట కూర్చోండి మీకు కూడా చెప్తాను" చేతులు శుభ్రం చేసుకుంటూ చెప్పింది.
 
"ఉహు... నాకు అలా బయట కూర్చొని చెప్పుకొని కథలు వద్దు, మనం నువ్వు నేను మాత్రమే లోపల చెప్పుకొనే కబుర్లు" అంటూ ఆమెని వెనక నుండి హత్తుకొని ఆమెతో పాటు అతని చేతులు నీళ్లలో తడిపాడు.
 
"మీకు.. కొంచెం కూడా సిగ్గు,బుద్ధి లేదు ఇంట్లో కూతురు బయట మామయ్య గారు వున్నారు, కొంచెం అదుపులో వుండండి" అంటూ అతనిని విడిపించుకొని పాలని గిన్నెలో పోసి స్టవ్ పై పెట్టింది.
 
"ఇందులో సిగ్గు ఎందుకు... హ బుద్ధి మాత్రం ఉండాలి" అంటూ పసుపు ,శొంఠి ,మిరియాల పొడులను గ్లాస్ లో వేసాడు.
 
"ఇంకాస్త వేయండి ఆశీ కి ఇంకా జలుబు, దగ్గు తగ్గలేదు" అన్న మానసతో "ఆశీ....ఇంకా చిన్నపిల్లే తగ్గలేదని మనం ఎక్కవ వేయకూడదు. నిదానంగా తగ్గినా పర్వాలేదు,ఇది సరిపోతుంది" అన్నాడు.
 
"అలా అయితే ఎలా,ఆశీ కి వచ్చే వారంలో ఎక్సమ్స్ ఉన్నాయి. తగ్గక పోతే ఎక్సమ్స్ ఎలా రాస్తుంది.!!"
 
"హలో టీచరమ్మ..... మన పాపా చదివేది థర్డ్ క్లాస్ దానికి నువ్వు అదేదో ఎమ్ బి బి ఏస్, ఐ ఏ ఎస్ , డిఫెన్స్ కి రాసే కాంపిటెటివ్ ఎక్సమ్స్ లా పెద్ద అది చేస్తున్నావ్. ఇప్పటి నుండే వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకూడదు" అని ఆమె తల మీద చిన్నగా కొట్టాడు.
 
"అబ్బా...." అంటూ తల రుద్దుకొని చిరు కోపంగా చూసింది.
 
"నన్నూ మన రూమ్ లో తీరిగ్గా చూద్దువు గాని ముందు బాబాయ్కి ఈ గ్లాస్ ఇచ్చేసి రా" అని పాలగ్లాస్ లో త్రిఫల చూర్ణం కలిపి ఇచ్చాడు.
 
"ఇవ్వండి...." అని తీసుకు వెళ్తుంటే "తొందరగా వచ్చేయ్.... నీతో పని ఉంది" అని మెల్లిగా అన్నాడు.
 
మానస వెనక్కి తిరిగి కోపంగా చూడడంతో "సరే.. సరే...ఎప్పుడైన రావచ్చు ..మీ ఇష్టం మేడం" అనగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
 
"డాడీ.....డాడీ... నా హోమ్ వర్క్ అయిపోయిందోచ్" అని కిచెన్ లో ఉన్న కనిష్క్ దగ్గరికి వెళ్ళింది ఆస్తిక.
 
"ఓహ్ థాట్స్ మై గర్ల్....సరే మరి ఇప్పుడేంటి!!" అని మోకాళ్ళ మీద వంగి ఆలోచిస్తున్నట్టుగా మోహం పెట్టాడు.
 
"ఇట్స్ స్టోరీ టైం...." అని కనిష్క్ చెవిలో గట్టిగా అరిచింది.
 
"ఆహ్..... మెల్లిగా తల్లి" అని చెవి రుద్దుకుంటు అన్నాడు.
 
"సొరి డాడీ " అన కనిష్క్ చెంప మీద ముద్దు పెట్టింది.
 
"నా డైమండ్ ఇది...." అంటూ ఆశీ తలపై ముద్దు పెట్టాడు.
 
"డాడీ... మమ్మీ ఎక్కడ, నాకు స్టోరీ చెప్పాలి" అనగానే "మమ్మీ తాతయ్యా దగ్గర ఉంది ....పద వెళ్దాం " అన్నాడు.
 
"ఆశీ ఇంకా పడుకోలేదా మను .."అని పాల గ్లాస్ అందుకున్నాడు కనిష్క్ వాళ్ళ బాబాయి.
 
"లేదు మామయ్య.... హోమ్ వర్క్ చేస్తుంది" అని చెప్తుండగానే కనిష్క్ ఆస్తిక ని ఎత్తుకొని వచ్చాడు.
 
"తాతయ్యా నా హోమ్ వర్క్ అయిపోయింది.... మమ్మీ కి చెప్పండి నాకు కథ చెప్పమని" అని కనిష్క్ పై నుండి దిగి తాతయ్యా దగ్గరికి వెళ్ళింది.
 
"తాతయ్య దగ్గర ఈ వీక్ పోయెమ్ చెప్పించుకున్నవా?" అని మానస ఆశీ ని అడగటం తో లేదన్నట్టు తల ఊపింది.
 
"ఫస్ట్ పోయెమ్ తరువాతే స్టోరీ" అంది మానస.
 
"ఒకే మమ్మీ " అనేసి "తాతయ్య పోయెమ్ చెప్పు, పోయమ్ వినేదాక నో స్టోరీ అంట" బుంగ మూతి పెట్టి అంది ఆశీ.
 
"పద్యమె కదా ,నేను చెప్తాను రా" అని పక్కన కూర్చో బెట్టుకొని సులువుగా ఉన్న పద్యం చెప్తాను విను అని చెప్పాడు.
 
"అన్ని దానములందు అన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనులు లేరు
ఎన్నగురుని కన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ! వినుర వేమ!!"
 
పద్యం చెప్పి ఆపగానే మీనింగ్ ఏంటి తాతయ్య అంది. దానికి బదులుగా "మనం చేసే దానాలలో అంటే డొనేషన్ లో అన్న దానం గొప్పది. ఆకలిగా వున్నవాడికి పెట్టె అన్నం చాలా విలువైనదని, మనల్ని తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన తల్లి కి ఎవరు సాటి రారు, ఈ ప్రపంచంలో ఆమె కన్నా గొప్ప వాళ్ళు లేరని, మనకి విద్య నేర్పిన గురువు కన్నా ఎక్కువ ఎవరు కారని ఈ పద్యభావం" అన్నాడు.
 
"అంటే నా బర్త్ డే మమ్మి చేస్తుంది కాబట్టి గ్రేట్, నాకు రీడింగ్, రైటింగ్, డిసిప్లిన్...చెప్తున్నందుకు మా స్కూల్ టీచర్స్ గ్రేట్,ఆకలి గా ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం గ్రేట్ ఇవే కదా మీరు చెప్పింది తాతయ్య " అంటూ ఆలోచిస్తున్నాట్టుగా మోహం పెట్టింది.
 
"అంతే తల్లి!" అనగానే "మమ్మీ ఇప్పుడు స్టోరీ" అంది.
 
"సరే చెప్తాను, కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు" వార్నింగ్ ఇస్తున్నట్టుగా అంది.
 
కనిష్క్ వైపు చూసెసరికి కనిష్క్ "సరే " అన్నట్టు తల ఉపడంతో "సరే మమ్మీ ....డౌట్స్ అడగను,పెద్ద .....కథ చెప్పండి" అంటూ రెండు చేతులూ మొత్తం చాచి చూపించింది.
 
"నా డైమండ్...." అంటూ ఆశీని ఒళ్ళో కూర్చో బెట్టుకున్నాడు.
 
"హ్మ్... మీ డైమెండేలె" అంది ఆశీ,కనిష్క్ లని చూస్తూ.
 
"మమ్మీ.... స్టోరీ...." అని మళ్ళీ గట్టిగా అరిచింది.
 
"ఏమి కథ చెప్పాలి!!"అని మానస ఆలోచిస్తుంటే "సోల్జర్,సెక్యూరిటీ అధికారి,డాక్టర్, ఫైటర్ స్టోరీస్ కాకుండా ఓల్డ్ వి...ఓల్డ్ స్టోరీస్ చెప్పు,తాతయ్యా మీకు చెప్పినవి" అంది ఆశీ.
 
"చిట్టి రాక్షసి...." అని "తాతయ్యా నాకు కథలు చెప్పలేదు నా ఫ్రెండ్ కి చెప్పాడు....సరే కథ చెప్తున్నా అందరూ వినండి" అని మానస కథ చెప్పటం మొదలు పెట్టింది.
 
"అది ఒక చిన్న రాజ్యం..... ఆ రాజ్యం లో ఒక చిన్న కుటుంబం...ఆ కుటుంబం లో ఒక చిన్న పాప,ఆ పాప తండ్రి ఉండేవాళ్ళు."
 
"అన్ని చిన్నవేన..." అని ఆశీ మోహం చిన్నగా పెట్టి అడగ్గానే కనిష్క్ ,కనిష్క్ బాబాయ్ ఇద్దరు ఒకటే సారి నవ్వారు.
 
వాళ్ళని కోపంగా చూసి "ఆశీ.....నో డౌట్స్, నో డిస్టర్బెన్స్" అంది.
 
"సరే.. సరే" అంటూ ఆశీ నోటి మీద వేలు పెట్టుకునేసరికి
"గుడ్..." అనిమానస తిరిగి చెప్పటం మొదలుపెట్టింది.
 
"ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక పాపా పుట్టింది, పాపా పుట్టగానే వాళ్ల అమ్మ చనిపోయింది. భార్య చనిపోవడంతో అతను వాళ్ళ పాపతో ఒంటరిగా వుండేవాడు.ఆ పాప శివలీల చిన్నప్పటి నుండే చిన్న చిన్న పాత్రలలో వంట చేయటం,మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఇంట్లో పనులన్నీ చేయటం నేర్చుకుంది అలా ఆ పాప చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్నకి,ఆమెకి వంట చేసేది. అయితే ఒక రోజు శివలీల తండ్రి బోజనమ్ చేస్తుంటే అన్నంలో రాళ్లు వస్తాయి. అప్పుడూ అతను చిన్నపిల్ల చూడకుండా వంట చేసి వుంటుందని ఆ రోజుకి భోజనము కానిచ్చేసి అతని పని మీద బయటకు వెళ్ళిపోతాడు. ఇలా రెండో రోజు ,మూడో రోజు కూడా అవ్వడంతో "శివలీల ....!!" అని గట్టిగా పిలిచి "ఇదేంటని ఆమెకి చూపిస్తే "తెలీదు నాన్నగారు ,నేను రోజు బియ్యంలో రాళ్లు తీసే వంట చేస్తున్నాను" అని చెప్తుంది. అది వినకుండా వాళ్ళ నాన్న విసురుగా బయటికి వెళ్ళిపోతాడు.
 
మరుసటి రోజు ఉదయమే "శివలీల ....నాకు పని ఉంది భోజనం సమాయనికి వచ్చేస్తాను,నువ్ జాగ్రత్త "అని చెప్పి వెళ్ళిపోతాడు. శివలీల తండ్రి అలా వెళ్ళగానే పొరుగింట్లో వుండే భానుమతి శివలీల దగ్గరికి వచ్చి "అమ్మ శివలీల కాస్త బెల్లం వుంటే ఇవ్వు" అని అడిగేసారికి "వుండండి,ఇప్పుడే తెస్తాను" అని శివలీల లోపలికి వెళ్తుంది. అలా శివలీల అటు లోపలకి వెళ్ళగానే తన కొంగులో దాచిన రాళ్లని చేతిలోకి తీసుకొని పొయ్యి మీద ఉన్న బియ్యంలో వేయడానికి వెళ్తుంటే, అప్పుడే శివలీల తండ్రి ఇంటి పైకప్పు నుండి దూకి ఆమె చేయిని పట్టుకొని "ఏమిటిది?ఎందుకిలా చేస్తున్నావ్" అని భానుమతి ని కోపంగా అడుగుతాడు. అప్పుడు బయటికి వెళ్లిపోయారు కదా అని భానుమతి అడగటంతో "ఎప్పుడు నా కూతురు వంట చేసిన రాని రాళ్లు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి,కారణం ఏంటో తెలుసుకోవలనే బయటికి వెళ్లినట్టు చేసి పై కప్పు మీద నుండి అంత చూస్తున్నాను" అని చెప్పి "ఇకనైనా చెప్పు ,ఎందుకిలా చేస్తున్నావ్ ?" అని గద్ధిస్తాడు.
 
"శివలీల కోసం...." అని ఆమె చెప్పగానే "శివలీల కోసమా ,ఎలా?"అని ఆశ్చర్యం గా అడుగుతాడు.
 
"అవును, శివలీల కోసమే, తాను ఇంకా చిన్న పిల్ల ఇప్పటి నుండే ఆమెకి ఇన్ని పనులు ఎందుకు ,హాయిగా తన తోటి పిల్లలతో ఆడుకునే వయస్సు తనది తల్లి లేక ఎంత ఇబ్బందులు,కష్టలు పడుతుందో నా కన్నా మీకే బాగా తెలుసు" అని కొంగుతో ముక్కు తుడుచుకుంది.
 
శివలీల తండ్రి "అవును నీవు చెప్పింది అక్షరాల సత్యం కానీ నేను ఏమి చేయగలను నాకు బయట పనులు ఉంటాయి" అని చెప్పేసరికి "మీరు అన్నది కూడా వాస్తవమే,అందుకే ఆమె ఆలనా పాలన చూసుకోడానికి తల్లిలాంటి ఒక ఆడది కావాలి" అని చెప్తుంది.
 
"తనని అలా ఎలా ఎవరూ చూసుకుంటారు?" అని దిగాలుగా అనేసరికి "మీకు అభ్యంతరం లేకపోతే నేను చూసుకుంటాను" అని తలా దించుకొని చెప్తుంది.
 
కాసేపు ఆలోచించి "శివలీలని నువ్వు చూసుకుంటాను అంటే అంతకంటే భాగ్యం లేదు"అని "మరి మీ పెద్దవాళ్లని" అని ఆగిపోతాడు.
 
"మా పెద్దలని నేను ఒప్పిస్తాను మీరు శివలీల కి అర్ధం అయ్యేలా చెప్పండి" అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది.
 
ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే శివలీల తండ్రికి,భానుమతికి వివాహం జరిగింది. అంతవరకు బాగానే ఉన్న భానుమతి నిజ స్వరూపం వివాహమైనా కొద్దీ రోజుల్లోనే బయట పడింది. శివలీల తండ్రి ఉన్నంతవరకి శివలీలని బాగా చూసుకుంటున్నట్టు నటించి అతను వెళ్ళగానే అసలు గుణం బయట పెట్టేది.
 
ఇంటి పని మొత్తం శివలీలతో చేయించి శివలీల తండ్రి రాగానే తానే అంత చేసినట్టు ,నొప్పులని బాధ పడుతూన్నట్టు నటించేది,భానుమతి ని చూసిన శివలీల తండ్రి "శివలీల అమ్మకి కాస్త సహాయంగా వుండు అన్ని పనులు ఒక్కతే చేసుకోలేకపోతుంది" అని తిరిగి శివలీలకె చెప్పేవాడు.
సవతి తల్లి సవతి తల్లేనని శివలీల కి తొందరగానే తెలిసొచ్చింది. అయినా శివలీల తన తండ్రి ముందు నోరు విప్పి చెప్పేది కాదు.
 
ఒక మగవాడి జీవితం అతను పెళ్లి చేసుకునే ముందువరకు తల్లి పై పెళ్లితరవుత తన భార్య పై మొత్తానికి ఒక స్త్రీ పైనే ఆధారపడి ఉంటుంది.
 
భానుమతి వారి జీవితంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే శివలీల తండ్రి మారిపోయాడు ఎంతలా అంటే భార్య ఏమి చెప్తే అది చేసేలా,వినేల. ఇక శివలీలని పట్టించుకోవడమే మానేశాడు.
 
రోజులు గడుస్తున్నా కొద్దీ శివలీల పరిస్థితి మరి దారుణం అయింది. ఇద్దరి మనుషుల చాకిరి కాస్త ముగ్గురిది అయింది. భానుమతి కి శివలీల తండ్రికి ఒక పాపా పుట్టింది. భానుమతి కూతురు అంటే భానుమతి నొట్లొ నుండి పుట్టింది అని చెప్పుకోవాలి. శివలీల కి తన తల్లి పోలికలు వచ్చి కుందనపు బొమ్మల వుంటే, మందరకి తన తల్లీ భానుమతి పోలికలైన నలుపు రంగే కాకుండా వంకర కాలు కూడా వచ్చింది,ఆమె నడిచినపుడల్లా కాలు కుంటుతూ నడుస్తుండేది.
 
శివలీల ని చూసినప్పుడల్లా తన కూతురు మందర శివలీల లా అందగా లేదని శివలీల నే తిట్టేది. తన తల్లి భానుమతి ఆస్తులు,గుణాలు అయిన కోపము,ద్వేషం,అసూయ ,ఈర్ష్య ఇవన్నీ మందరతో పాటు పెరుగుతూ వచ్చాయి.
 
చూస్తుండగానే ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. మందర తన కన్నా పెద్దది అయిన శివలీలని ఒక సోదరిగా కంటే ఎక్కువగా పని మనిషిగానే చూసేది.
 
వీళ్ళ వుండే రాజ్యపు రాజుకి ఒక్కగానొక్క కొడుకు. రాజుగారి వయసు పైబడటంతో రాజ్యభారం రాకుమారుడి పైన వేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు రాజు. ఇదే విషయం రాకుమారుడు అయిన విజయ రుద్ర కి చెప్పగా అతను "తండ్రి మాకు అనుభవం లేనందున దేశాటన కొరకు కొంత సమయం కావలెను," అని చెప్పి ఇంకేదో చెప్పడానికి సంకోచిస్తుండగా "చెప్పు రాకుమార మీ మదిలో ఉన్నది" అని రాజు గారు అడిగేసారికి "తండ్రి...కొన్ని రోజుల నుండి నాకు ఒక స్వప్నం వస్తుంది అందులో ఒక అందమైన అమ్మాయి నన్నే పిలుస్తూ ఏడుస్తుంది" అని చెప్పేసరికి " ఆమె ఎవరో నీకు తెలుసా రాకుమార ?"అని రాజు గారు అడిగేసారికి "ఆమె ఎవరో తెలియదు తండ్రి కానీ చాలా విచారంగా ఉంది,నాకు వచ్చింది స్వప్నమే అయిన ఆమె దుఃఖిస్తు వుంటే చూడలేకున్నాను తండ్రి" అని బాధపడతాడు. సరే ఆమె మొహమైన గుర్తు ఉన్నదా?అని ఆడిగితే నేను కళ్లు మూసుకుంటే కనిపిస్తుంది కళ్ళు తెరిస్తే మాయం అవుతుంది అంటాడు. అది విన్న రాజుగారికి రాకుమారుడికి వివాహ సమయం ఆసన్నమైంది అందుకే సుందరిమణుల కలలు కంటున్నాడు" అనుకోని నవ్వుతూ "మీ దేశాటనకు ఆరు నెలల సమయం ఇస్తున్నాను,ఆ లోపు నీ స్వప్న సుందరి కనిపిస్తే ఆలోచిద్దాము లేదంటే ఆమె గురించి మరచిపోయి మేము నిర్ణయించిన మగువనే నీవు వివాహమడాలి" అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
విజయరుద్ర అతని స్నేహితుడు ఇద్దరు కలిసి దేశాటన కై అన్ని రాజ్యాలు తిరిగి చివరన వారి రాజ్యానికి వచ్చి రాజకోటకి వెళ్లకుండా రాజ్యం లో ఉన్న పూటకుళ్ల పెద్దమ్మ ఇంట్లో బస చేస్తారు. ప్రయాణం చేసి అలసిపోయి వుండడంతో ఆ రేయి తొందరగా పడు కుండిపోతారు. విజయరుద్ర స్నేహితుడు ఆదమరిచి నిద్రపోగావిజయరుద్ర కి కల చెదిరి నట్టుగా నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు.
 
కళ్ళు తెరిచిన కలలో వచ్చిన అమ్మాయి మొహమే కనిపిస్తుంది అతనికి. కొద్దీ సేపు ఆరు బయట వుందాం అని పూటకుళ్ల పెద్దమ్మ దగ్గరకి వెళ్తాడు.

ఇంకా ఉంది...

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice update
[+] 1 user Likes Varama's post
Like Reply
#3
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#4
nice one
[+] 1 user Likes prash426's post
Like Reply
#5
Superb ji keka, we waiting for next update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#6
వీలైతే ఈ రోజు లేదా రేపుదయం, అప్డేట్ ఇవ్వగలను.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#7
బయట కొచ్చి చూసేసరికి కలలో కనిపించిన అమ్మాయి వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తాడు ఆ అమ్మాయేన అని,ఆమె నిజంగానే కనిపించేసరికి పూటకుళ్ల పెద్దమ్మ వద్దకి వెళ్లి "పెద్దమ్మ ..ఇక్కడ అందరూ ఇంత ఉదయమే లేస్తారా?" అని ఆ అమ్మాయిని చూపిస్తూ అడిగాడు.
 
"లేదు బాబు.....అదిగో అక్కడ కనిపిస్తుందే అమ్మాయి,ఆమె మాత్రమే ఇంత ఉదయమే లేచి పనులు చేస్తుంది,లేదంటే ఆమె సవతి తల్లి ఊరుకోదు. చాలా గుణవంతురాలు, సౌమ్యశీలి అందరితో సౌమ్యంగా మెసులుకుంటుంది,కానీ దురదృష్టవంతురాలు" అని చెప్పేసరికి ఎందుకు అని అడిగిన అతనికి ఆమె గురించి,ఆమె సవతి తల్లి గురించి మొత్తం చెప్తుంది.
 
అంత విన్నాక అతను కొద్దిసేపు ఆలోచించి ఎదో నిర్ణయానికి వచ్చినట్టయి రెండు రోజులు అక్కడే ఉండి పూటకుళ్ల పెద్దమ్మ చెప్పింది నిజమా కాదా అని రుజువు చేసుకొని అతని స్నేహితుడితో అక్కడ నుండి తమ రాజకోటకి వెళ్ళిపోయి తన తండ్రితో తను చేసిన దేశాటన విషయాలు,విచిత్రాలు చెప్పి తన స్వప్న సుందరి గురించి చెప్తాడు.
 
రాజు,రాణి గారు రాకుమారుడి ఇష్టాన్నే తమ ఇష్టంగ భావించి శివలీల ఇంటికి వివాహ విషయమయి మాట్లాడడానికి వస్తారు.
 
రాజభటులు తమ ఇంటికి రావటం చూసి ఏమై ఉంటుంది అని ఆలోచించిన భానుమతి తన భర్త వర్తకుడు అని గుర్తుకువచ్చి అతన్ని పిలుస్తుంది. శివలీల తండ్రి భానుమతి ఇద్దరు కలిసి వాళ్ళకి స్వాగతమ్ చెప్పి మర్యాదపూర్వాకంగా ఆహ్వానించారు.
 
రాకుమారుడు అక్కడ అందరికి దూరంగా నిల్చున్న శివలీలని చూపించి ఆమెనే నేను ఇష్టపడింది అని రాణి, రాజు వాళ్ళకి చెప్పేసరికి రాణిగారు శివలీలనే చూస్తూ వుంటారు. భానుమతి శివలీల తో రాజు,రాణి రాకుమారుడికి తినుబండరాలు ,పానీయాలు తెమ్మని చెప్పి పంపిస్తుంది.
 
రాజు గారు శివలీల తండ్రితో మేము మీ అమ్మాయిని మా యువరాజు వారికిచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాం అని చెప్పగానే భానుమతి సంతోషంతో ఉబ్బితబ్బాయ్ "మహా అదృష్టం, మీ మాటని జవదాటే హక్కు మాకు లేదు,ఇదంతా మా మందర భాగ్యం, మీరు ఎలా అంటే అలానే" అని మందరని చూసి మురిసిపోతుంది.
 
రాణి గారు చెప్పింది విని "సంతోషం అమ్మాయిని రమ్మనండి మా తరుపున చిన్న కానుక ఇవ్వాలి"అని రాజా కుటుంబానికి చెందిన గొలుసు బయటికి తీస్తుంది.
 
వెళ్లు వెళ్లు అని మందరని ముందుకు తొస్తుంటే పానీయాలు తినుబండరాలు పట్టుకొని శివలీల అప్పుడే అక్కడికి వస్తుంది. తమ ముందు ఉన్న మందరని పట్టించుకోకుండా "కుమారి ఇలారా" అని ఆ గొలుసుని శివలీల మెడలో వేస్తుంది. రాణి గారు అలా చేసేసరికి భానుమతి చేష్టలుడిగి శివలీలని కోపంగా చూస్తూ "రాణివారు పొరపడుతున్నారు మా అమ్మాయి ఇక్కడ ఉంది,ఆమె మా పనిమనిషి" అని చెప్తుంది. అది విన్న శివలీల తండ్రి భానుమతి ని కోపంగా చూడటం తప్ప ఏమి చేయలేకపోయడు.
 
అప్పుడు రాణిగారు మాకు మీ పనిమానిషే నచ్చింది,మీ అమ్మాయి కాదు అనేసరికి మనసులో రాణిగారిని చంపేయాలానంత కోపం వచ్చిన తమాయించుకొని పైకి మంచిగా నటిస్తూ "మా శివలీల అదృష్టం మా ఇంటి పిల్లేగా అన్ని మేము చూసుకుంటాము " అని రాణిగారికి చెప్తుంది.
 
రాణిగారు మాత్రం ఆమె చెప్పేది వినకుండా శివలీల నీకు మా యువరాజుని పెళ్లిచేసుకోడం ఇష్టమేనా అని అడుగుతుంది. శివలీల తననే చూస్తూ మందహసం చేస్తున్నా రాకుమారుడిని చూసి తన తండ్రి వైపు చూసి అతను నిలువుగా తల ఊపేసారికి ఆమెకి కుడా ఇష్టమే అన్నట్టు తల ఊపుతుంది. తండ్రి మాట జవదాటని కూతురు కదా,అప్పట్లో అందరూ అలాగే వుండేవారు.
 
రాజుగారు రాకుమారుడిని చూసి నవ్వి "మేము మా రాజగురువులని సంప్రదించి వివాహ ముహూర్తం గురించి మీకు వర్తమానం అందిస్తాము" అని రాజాకుటుంబన్ని తీసుకుని రాజా కోటకి వెళ్ళిపోయాడు.
 
వాళ్ళు వెళ్ళగానే భానుమతి తన ద్వేషాన్ని అంత శివలీల పై చూపిస్తూ కొట్టడానికి వెళ్తుంటే శివలీల తండ్రి "తను ఇప్పుడు కాబోయే యువరాణి తన మీద నీ కోపము చూపిస్తే నీకె నష్టము" అని చెప్పి వెళ్ళిపోతాడు.
 
రాజకోట నుండి ముహూర్త వర్తమానం రావడం శివలీల ని తీసుకువెళ్ళటం, నిశ్చయించిన సుమూహుర్తానికి విజయ రుద్ర యువరాజుకి శివలీలకి పెళ్లి జరగటం అయిపోతుంది. అప్పటివరకి కష్టాల కొలిమిలో ఉన్న శివలీలకి అమ్మ నాన్న ప్రేమ రాజు రాణి వారి నుండి లభించగా, తనని వివాహమాడి తనకి కొత్త అస్థిత్వన్నీ ప్రసాదించిన తన పతియైన యువరాజూనే సర్వస్వంగా భావించి అమితంగా ప్రేమిస్తుంది.
 
యువరాజు అయిన విజయరుద్ర వారి పెళ్లినాటి మొదటిరాత్రి ఆమెకి ఒక ఉంగరం బహుకరించి "స్వప్న ములో నిన్ను చూసినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తాన అని మనసు ఉవ్విళ్లూరుతుండేది. చివరకి నిన్ను నా దాన్నిచేసుకున్నను. నీకు నేనంటే ఇష్టమున్నదా?"అని ఆమె కళ్లలోకి చూస్తూ అడుగుతాడు. "స్వామి...ఇంతవరకు మా తండ్రిని తప్ప నేను ఏ పురుషుడిని కూడాకన్నెత్తి చూడలేదు. మీరు మా ఇంటికి రాకముందే నేను మిమ్మల్ని మొదటి సారి పూటకూళ్ల వాళ్ళ ఇంట్లో చూసి మనసు పడ్డాను,కానీ ఆడపిల్లను, అందులో మా తండ్రి గీసిన గీతను దాటను. మీరు వెళ్ళిపోయాక మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. కానీ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నాకెంత సంతోషం వేసిందో అంతలోనే ఒక రాజ కుమారుడిన నేను మనసు పడింది అనుకోని బాధ తో విలవిల్లాడను.
 
చిన్నప్పటి నుండి ఆ దేవుడి ని ఏమి కోరుకొని నేను నా ప్రేమ నిజం అయితే మీరే నా భర్త కావాలని కోరుకున్నాను. ఆ దేవుడు, మీ తల్లిదండ్రులు కరుణించి నన్నూ ధన్యురాలిని చేసారు. ఇక ఈ జీవితం మీకు అకింతం" అని విజయ రుద్ర కాళ్ళ మీద పడుతుంది.
 
"లీల....నువ్వు నా హృదయరాణివి నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ "అంటూ ఆమెని గుండెలకు హత్తుకుని
"నువు లేకుండా నేను ఉండలేను,వున్న నా జీవితానికి అర్ధం లేదు. నా ప్రాణమైన నీకూ చిరు కానుక" అంటూ ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగి ఇది ఎప్పటికి తీయకూడదు" అని ఆమె చేతిని ముద్దుపెట్టుకుంటాడు.
 
వాళ్ళ ప్రేమలో రోజులే కాదు నెలలు కూడా గడిచిపోయాయి. ఒక రోజు రాజకోట మొత్తం ఒక శుభవార్తతో సంబురాలు జరుపుకుంది. ఆ నోట ఈ నోటా యువరాణి వారు గర్భవతి అని త్వరలో మనకు చిన్ని రాకుమారుడు రాబోతున్నాడని శివలీల తండ్రి చెవి పడుతుంది. శివలీల తండ్రి సంతోషంగా ఇంటికి వెళ్లి ఆ శుభవార్తని భానుమతి కి చెప్తాడు.
 
అది విన్న భానుమతి "నా కూతురికి దక్కవల్సిన భాగ్యాన్ని ,భోగాలని అనుభవిస్తున్న నిన్నూ పాతాళానికి పంపిస్తాను" అని శపథం చేసుకొని శివలీల తండ్రికితన మనోభావాలు కనిపించకుండా "మన అమ్మాయి తొలిసారి గర్భవతి అయింది,ఏ ఆడపిల్లకైన తొలికానుపు అమ్మగారింట్లో చేయాలి,అది పుట్టబోయే బిడ్డకి తల్లికి మంచిది"అని చెప్పటంతో తన భార్య మారింది అనుకొని "సంతోషం ...నేను వెళ్లి శివలీలని తీసుకువస్తాను "అని వెళ్ళిపోతాడు.
 
"ఏంటమ్మా నువ్వు చేసింది, అది మళ్ళీ ఈ ఇంటిలోకి ఎలా వస్తుంది? నేను చేసుకోవాల్సిన యువరాజుని గద్దలా తన్నుకుపోయింది!!" మందర తన కోపాన్ని తండ్రి వెళ్లిపోగానే బయటపెట్టింది.
 
"పిచ్చిదాన పిలిచి శ్రీమంతం చేస్తాను అనుకుంటున్నావ, దానికి పాడేకట్టడానికి మీ నాన్నతో అలా చెప్పాను. ఇప్పటినుండి నేను ఎలా చెబితే నువ్వు అలా చేయాలి, అప్పుడే నువ్వు యువరాణివి అవుతావు" అనగానే మందర తన తల్లి చెప్పినదానికి సరే అంది.
 
ఇవేవీ తెలియని శివలీల తండ్రి రాజకోటకి వెళ్లి రాజా వారి కి "శివలీలని తమ ఇంట్లో కొన్ని రోజులు వుండడానికి అలాగే అక్కడే శ్రీమంతం, మొదటి కానుపుకని పుట్టినింటికి తీసుకువెళ్ళడానికి అనుమతి కోరుతూ" లేఖ పంపిస్తాడు.
 
అది అందిన రాజు గారు శివలీలని పంపించటం ఇష్టం లేక రాణి గారి సలహా తీసుకుంటాడు. ఆమెకి కూడా శివలీలని పంపించటం ఇష్టం లేక వద్దు అంటుంది. విజయరుద్ర అయితే వాళ్ళ గూర్చి తెలుసు కాబట్టి అతను శివలీల వెళ్ళడానికి ఒప్పుకోలేదు,అందునా గర్భవతియైన తన ప్రియామైన భార్యని ఆ సమయంలో విడిచిపెట్టి ఉండుటకు మనసు రాక వెళ్లొద్దు అంటాడు.
 
యువరాజు నిర్ణయం విన్న శివలీల బాధపడుతూ "ప్రసవానికి కాకున్నా కొన్ని రోజులు అక్కడే ఉండి తొందరగా వచ్చేస్తాను" అని నచ్చచెప్తుంది. అదే సమయంలో రాజ కోటకి వేగుల నుండి ముఖ్యమైన వర్తమానం వస్తుంది. "వచ్చే కొన్ని రోజులలో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి" అని ఆస్థాన మంత్రివర్యులు వర్తమాన సారాంశాన్ని చదివి రాజుగారికి వినిపించారు.
రాజు గారు యువరాజు పిలిచి "మన పొరుగు రాజ్యానికి మనవంతు సహాయం చేయవలసిన సమయం వచ్చింది. మనం కొన్ని రోజులలో సైనికులను తీసుకొని దక్షిణదిశగా వెళ్లి రాజుకి యుద్ధంలో సహకరించాలి" అనిచెప్తాడు. దానితో విజయరుద్ర తండ్రితో సరే అని చెప్పి శివలీల దగ్గరికి వచ్చి "నీ సంతోషం కోసం నువ్వు మీ తండ్రిగారితో వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాను. నేను కూడా యుద్ధభూమి కి వెళ్లాల్సివచ్చింది,యుద్ధం ఎన్ని రోజులలో ముగుస్తుందో చెప్పలేను. నువ్వు మన బిడ్డ జాగ్రత్త" అని చెప్పి ఆమెను తండ్రితో పంపిస్తాడు.
 
అలా శివలీల తండ్రి ఆమెని పుట్టింట్లో దిగబెట్టి "నేను కూడా వర్తక విషయమయి కొన్ని రోజులు పొరుగు రాజ్యానికి వేళ్ళాలి, మీరూ జాగ్రత్త "అని భానుమతి,మందర లకి శివలీల ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.
 
శివలీల ఇంటికి రాగానే భానుమతి తన కపట బుద్ధిని దాచి మంచిదానివలే నటిస్తుంది,ఆమె తో పాటు మందర కూడా మరిపోయినట్టు "అక్క అక్క .." అంటూ శివలీల చుట్టే తిరుగుతూ రాజాకోట సంగతులు చెప్పమంటుంది.
 
శివలీల కూడా తన సవతి తల్లి, చెల్లి మారిపోయి సఖ్యతగా ప్రేమగా వుంటున్నారని అన్ని విషయాలు చెప్తుంది. భానుమతి, మందర కి సైగ చేయడంతో మందర "అక్క,మీరు బావ గారితో ఎలా వుంటారు? అదే మనం మాములు వర్తక కుటుంబనికి చెందిన వాళ్ళము, వారేమో రాజులు కదా నువ్వు బావగారితో ఎలా నడుచుకునేదానివి?" అని తెలివిగా శివలీల ని అడుగుతుంది.
 
శివలీలకు చెల్లిబుద్ధి తెలియక తనని సొంత సోదరిలా ఆదరించే సరికి ముందు వెనక ఆలోచించక తాను రాజకోటలో ఎలా వుండెదో, యువరాజుతో ఎలా మెలిగెదో అన్ని పూసగుచ్చినట్టు మందరకి చెబుతుంది. అలా అన్ని విషయాలను తెలుసుకున్న మందర శివలీలతో " అక్క మనం కొలను కి వెళ్లక చాలా రోజులు అవుతుంది నువ్ ఒప్పుకుంటే ఈ రోజు సాయంత్రానికి వెళ్దాం"అని చెప్పెసరికి శివలీలకి కూడా వెళ్లాలనిపించి "సరే సాయంత్రము తొందరగానే వెళదాము" అంటుంది.
 
సాయంత్రం అవ్వకముందే భానుమతి వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పి "చీకటి పడక ముందే వచ్చేయండి" అని పంపిస్తుంది. వాళ్ళు వెళ్లిపోయక తన పన్నాగాన్ని నెరవేర్చడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది.
 
అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుంటు మాట్లాడుకుంటు కొలను లోకి దిగిన మందర "అక్క నువ్ కూడా వచ్చేయ్" అంటుంది."వద్దు చెల్లి నువ్ కానియ్ నేను రాను " అన్న పదేపదే రమ్మనటంతో దిగడానికని పైబట్టలు తీసి పక్కన పెడుతుంటే "అక్క నీ నగలు తీసేసిరా,నీటిలో పడిపోతే వేతకలేము" అని చెప్పేసరికి వంటి మీద వున్న గాజులు, నగలు అన్ని తీసేస్తుంటే "అక్క... మంగళ సూత్రం కూడా తీసేయ్, ఈ కొలను లో గనుక పడిపోయిందంటే రాజ కుటుంబానికి, బావ గారికి కీడు జరుగుతుంది" అని అనుమానం పుట్టించి అది కూడా తీసేలా చేస్తుంది.
 
మందర కూడా పైకి వచ్చి తన నగలు కూడా తీసి మూటగట్టింది. శివలీల "నీ భర్త కి కీడు అనగానే తన నగలతో పాటు మంగళసూత్రం కూడా తిసి ఉంగరాన్ని కూడా తీయడానికి ప్రయత్నిస్తుంటే అది రాకపోయే సరికి తీసిన నగలను మూటగట్టి పక్కన పెట్టి తాను కూడా కొలనులోకి దిగుతుంది.
 
కొద్దీసేపు కాగానే "అక్క చీకటి పడుతుంది" అని మందర గబ గబ పైకి వచ్చి బట్టలు కట్టుకుంటున్నట్టు చేసి రెండు నగల మూటని దూరంగా ఉన్న గుబురు చెట్లలో వేసేసి "అక్క.....అక్క..మన నగల మూటలు కనిపించటం" లేదు అని గట్టి గట్టిగా అరుస్తుంది.
 
మందర అరుపులు విన్న శివలీల నీటిలోనుండి బయటికి వచ్చి చూసేసరికి నగల మూటలు కనిపించక కంగారుగా అటు ఇటు వెతుకుతుంది."అయ్యో ....దొంగలు మా నగలు ఎత్తుకుపోయారే " అని ఏడిచినట్టు నటించి "అక్క అటు వైపు ఎవరో వెళ్లినట్టు అనిపించింది" అని నగల మూట ఉన్న వైపు వెళ్తున్న శివలీల ని పిలిచి వేరే వైపు చూపిస్తుంది.
 
"వెళ్లి చూద్దాం చెల్లి ..." అని అన్న శివలీలతో "వద్దు అక్క అసలే నువ్వు ఒట్టిమనిషివి కాదు,ఎవరినైన పిలుచుకువద్దాం" అని అక్కడి నుండి తీసుకువస్తుంది.
 
మందర తన పాచిక నెరవేరినందుకు సంతోషంగా ఉండగా, శివలీల పోయిన నగల గురించి కాక తన భర్త గురించి ఆలోచిస్తుంది. తమకు ఎదురువస్తున్నా భానుమతి ని చూడగానే " అమ్మ ....మా నగలు దొంగలు ఎత్తుకుపోయారు" అంటూ మీద పడి ఏడుస్తుంది మందర.
 
"అయ్యో తల్లి ...నగలు పోయాయా? నువ్వేం బాధపడకు మీ నాన్నకు చెప్పి ఇద్దరికి కొత్తవి చేపిస్తాను"అని ఓదార్చి ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ముభావంగా వున్న శివలీలతో "ఏమైంది శివలీల ...నగలు పోయాయని చింతిస్తున్నావా?" అని అడుగుగా "లేదు పిన్నమ్మ..ఆయన గురించి ఆలోచిస్తున్నాను,ఎందుకో ఈ రోజు ఆయన పదే పదే గుర్తొస్తున్నారు" అని చెప్తుంది.
 
"నీకు ఇదే చివరి రోజు అందుకే అతను గుర్తుకొస్తున్నాడు" అనుకోని "శివలీల నీ కోసం పాలు పండ్లు తీసుకొచ్చాను" అని చెప్పగానే "నాకు ఆకలిగా లేదు పిన్నమ్మ" అని వాటిని పక్కన పెడుతుంటే "ఒక స్వామీజీ గుడికి వస్తే ఆయన దగ్గరుండి నీ కోసం ఈ పండ్లు తెప్పించాను, కనీసం ఒక్క పండు అయిన తిను,
నీ కోసం కాకపోయినా నీకు పుట్టేవారి కోసం అయిన తినాలి" అని పళ్లెంలో పైన ఉన్న పండుని కోసి ఇస్తుంది.
 
"నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అయిన తిను" అనగానే "ఆమె చెప్పింది నిజం..నా కోసం కాకపోయినా ఆయన వారసుడి కోసం అయిన తినాలి" అని కోసిన పండుని తింటుండగానే "పిన్నమ్మ ఈ పండేంటి ఇలా ఉంది" అని అడిగితే "స్వామీజీ ప్రసాదం అలాగే ఉంటుందేమో" అని సమాధానం ఇస్తుంది భానుమతి.
 
తిన్న కొన్ని నిమిషాలలోనే మత్తువచ్చినట్టు పడుకుండి పోతుంది శివలీల. ఆమెకి మత్తు ఎక్కింది అని నిర్దారించుకొని మందర ని పిలుస్తుంది భానుమతి.
అలా ఇద్దరు కలసి శివలీల ని ఒక మూటలో పడుకోబెట్టి ఆమె చుట్టూ పాత బట్టలన్నీ వేసి పెద్ద బట్టల మూటల చేస్తారు. దారిన పోయే ఒకతన్ని పిలిచి "మా ఇంట్లో పాత బట్టల మూట ఒకటి ఉంది, దాన్ని కాస్త పాడవేయడానికి మాకు సాయం చెయ్యండి" అని బ్రతిమిలాడి శివలీల ని వుంచిన బట్టల మూటని వీళ్ళు వుండే ఊరి చివరన వున్న బావిలో వేయమంటారు.
 
అతను మూట బరువుగా వుండడంతో "ఇది నిజంగా బట్టల మూటనేన ఇంత బరువుంది " అనగానే "పాతబట్టలు కదా మళ్ళీ అవి మాములు బట్టలు కావు నేతపోసి రాళ్లు ఒదిగిన ఖరీదైన బట్టలు. పాతవిగా అయి పోవడంతో ఇలా పాడవేస్తున్నము" అని ఎదో సర్ధిచెప్పి అతనితో ఆ మూటని నీళ్లు లేని పాతబావిలో పడవేస్తుంది. పని అయిపోయిందని అతను వెళ్లిపొగానే భానుమతి మందర కూడా వికారంగా నవ్వుకుంటూ కొలను దగ్గరికి వెళ్ళి మందర దూరంగా విసిరేసిన రెండు నగల మూటలను తీసుకొని ఇంటికి వెళ్లిపోతారు.
 
శివలీలని వుంచిన పాతబట్టల మూట వేగంగా వెళ్లి ఒక పెద్ద రాయి లాంటి ఆకారం మీద పడుతు పెద్దగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి చాలా వయసు గల పెద్ద ఆడపాము అక్కడికి వచ్చి చూస్తుంది. ఆ నాగు అక్కడ ఉన్నది చూసి సంతోషంగా ఎదురుగా ఉన్న మగ నాగపాముని అల్లుకుని ఎవరినో పిలుస్తుంది. వాళ్ళు అలా వుండగానే ఏడుగు నాగుపాములు వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి.
 
ఇన్నాళ్లకు తమ తండ్రికి ఉపశమనం లభించిందని అవి కూడా తండ్రి నాగుపాముని అల్లుకున్నాయి. ఇది ఎలా జరిగిందని ఆడనాగు అడగగా "ఇదిగో ఈ మూట నాపై పడగానే తల మీద ఉన్న రాచపుండు పగిలిపోయింది" అని సంతోషంగా చెప్తాడు. ఇందులో ఏముందని మూటని తెరచి చూడగా "కుందనపు బొమ్మల, హాయిగా నిద్రాపోతున్నా శివలీల వాళ్ళ కంటికి చిన్ని పాపయిల" కనిపిస్తోంది.
 
"ఎవరండి ఈ మానవస్త్రీ ?" అని ఆడ నాగు అడగగా "తెలియదు రాణి మేము ఎప్పటిలా ఆసీనుడినై బాధతో విలవిలాడుతుంటే మాత పార్వతి దేవి అనుగ్రహించిన్నట్టు ఏదో వస్తువు బలంగా నా తలపై పడి నూరు సంవత్సరముల నుండి రాచ పుండుతో తల్లడిల్లుతున్న నన్నూ ఈ బాధ నుండి విముక్తిడిని చేసింది,ఏమిచ్చి ఈమె రుణం తీర్చుకోగలను" అని నిద్రపోతున్నా శివలీలని చూపిస్తాడు.
 
"స్వామి ఈ మానవ స్త్రీ ఈ మూటలో కెలా వచ్చింది?"అని సందేహం వెలిబుచ్చాగా శివలీలనే పరీక్షగా చూస్తూ "ఎవరో పాపాత్ములు ఈమె చనిపోయుంటుందని భావించి ఇలా మూటలో కట్టి ఎవరు రాని ఈ బావి లో పడవేసుంటారు" అని ఆమెని తీసుకొని ఒక గదిలో పడుకోబెడతాడు.
 
"ఏమిటి స్వామి ఆ కన్యని అలా చూస్తున్నారు?" అని అడిగితే "మనకు ఉన్న ఏడుగురు సంతానం మగపిల్లలే ఒక్క నాగబాలిక కూడా లేదు,వుంటే తను కూడా ఇలాగే వుండేది" అని ఆమెకి గాలి విసురుతు ఉంటాడు.
 
"మనకు పుత్రిక సంతానం లేకపోతేనేమి!! ఆ పరమశివుడు ఇచ్చిన ఈ మానవ కన్య ఉందిగా ఈమెనే మన పుత్రికలాగా చూసుకుందాం" అని అతనికి చెప్తుంది.
 
"ఒక సమస్య ఉన్నది తండ్రి" అని నాగరాజు అయిన శేషాద్రి మొదటిసంతానం అయిన పెద్దనాగు అంటాడు.
 
" ఏమిటా సమస్య ?" అని నాగరాజు అడుగగా "మనము ఆ మహాదేవుడిని పూజించే నాగులము, వీళ్ళు మనల్ని మన మహాదేవుడిని కొలిచే మానవులు. ఈమెకి సృహ వచ్చిన తరవాత మనల్ని చూసి భయపడుతుందే తప్ప మనతో కలిసిపోదు"అని చెప్తాడు.
 
బాగా ఆలోచించిన నాగరాజు అక్కడున్న అందరితో "ఈమె కనుతేరిచే సమయానికి మనం అందరం మానవరూపాన్ని సంతరించుకొని ఆమెతో అలాగే మెలగాలి" అని అమెకోసమని వారు వుంటున్న బావి లోపలి భాగాన్ని పెద్ద ఇల్లులా మార్చేస్తాడు. వాళ్ళు అందరూ కూడా తమకున్న మానవరూపాల్లోకి వచ్చేస్తారు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#8
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#9
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#10
Ji any continuous or anthena
Like Reply
#11
I will post an update, later today

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#12
చాలా సమయం తరువాత మెల్లిగా, బరువుగా శివలీల కళ్ళు తెరుస్తుంటే ఆతృతగా తననే చూస్తున్న ఇద్దరు దంపతులు,ఇంచుమించు ఒకే పొలికల్తో వున్న వేరువేరు శరీర ఛాయలలో వున్న ఏడుగురు పురుషులు కనిపిస్తారు.
 
తను ఎక్కడ ఉందొ తెలియక గదికి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ "నేను ఎక్కడ వున్నాను?మీరంతా ఎవరూ?" అని తల పట్టుకొని అడుగుతుంది శివలీల.
 
"ఈమె నా అర్ధాంగి నాగరాణి, వీళ్లు నా కొడుకులు పెద్దవాడు తెల్ల నాగు అబోయి పాల సముద్రుడు అని చెప్పి మిగత ఐదుగురిని పరిచయం చేసి ...చివరన ఉన్నది నల్లన్నా అయిన కాలశేషుడు" అని అందరిని పరిచయం చేసి నేను శేషాద్రి" అని పరిచయం చేసుకొని "ఒక సంఘటన వల్ల నువ్వు మా గృహంలో వున్నావు" అని "నువ్వెలా ఆ మూటలోకి వచ్చావు పుత్రి?"అని అడిగేసరికి "ఏడుస్తూ జరిగింది చెప్తుంది శివలీల" అంత విన్నాక శేషాద్రి కోపంతో ముక్కుపుటలు ఎగరేస్తుంటే నాగరాణి అతన్ని శాంతిప జేసీ "ఎడవకమ్మ నీకు మేము వున్నాం"అని "మమ్మల్నే నీ తల్లిదండ్రులు అనుకో ఇదిగో వీళ్లే నీ అన్నదమ్ములు ఇప్పటినుండి" అని అందరిని చూపించి "ఇతనితో జాగ్రత్త , అస్సలు కోపం తెప్పించకూ డదు తనకి. అందరి కన్నా చిన్నవాడు, నీకు చిన్నన్న, కోపం ఎక్కువ తనకి" అని మరి మరి చెప్పి "నీకు ఇల్లు చూపిస్తా రా"అని వాళ్ళు ఉన్న ఇంటిని మొత్తం తిప్పి తిప్పి చూపించింది.
 
శివలీల ఇంటిని చూస్తూ అన్ని గమనిస్తుంటే "ఇల్లు మొత్తం నాగుల ఆకారాలతో వాటి విగ్రహలతో ,ఒక దగ్గర పెద్ద లింగం,కింద జత నాగుల విగ్రహలు కూడా ఉన్నాయి,ఎక్కడ చూసిన ప్రతి దానిలో సర్పాకారం కనిపిస్తుంది శివలీలకి.
 
రాజకోటలో రాజుగారు, రాణిగారు చూపించిన ప్రేమ కంటే వీళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తుండడంతో శివలీలకి సొంత వాళ్లే ప్రాణాలు తీయాలని చూస్తుంటే బాధ, పరాయివాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తున్నారని సంతోషం, వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్న భర్త గుర్తుకువస్తుండడంతో ఎప్పుడూ ముభావంగా ఉండేది,నాగరాణి ఎన్నిసార్లు కారణం అడిగిన చెప్పకపోయేది.
 
ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత యుద్ధం సజావుగా ముగిసి వారు ఇచ్చిన అతిధ్యాన్ని స్వీకరించి అక్కడ నుండి వచ్చేసరికి విజయరుద్రకి మాసం రోజులు పట్టింది. అక్కడి నుండి తిరిగి వచ్చిన విజయరుద్ర శివలీల కోసం నేరుగా శివలీల పుట్టింటికీ వెళ్తాడు. యువరాజు వస్తున్నట్టు సమాచారం అందగానే శివలీల బట్టలు, నగలు, మంగళసూత్రం అన్ని మందరకి వేసి మందరని శివలీలలా అలంకరించి దేవుడి గదిలో కూర్చోబెడుతుంది.
 
యువరాజు రాగానే అతనికి సత్కారాలు చేసి కుశలప్రశ్నలుఅడుగుతుంటే "శివలీల ఎక్కడ వచ్చినప్పటి తను బయటికి రాలేదు" అని యువరాజు అడిగితే "శివలీల ఇప్పుడు పూజలో ఉంది" అని భానుమతి చెప్పగానే "పూజనా?" అని అంటాడు"."అవును యువరాజ, తను ఇరవై ఒక్క దినముల వ్రతం నోచుకుంది, అది పూర్తి అవ్వనిదే మీరు తనని చూడడానికి వీలులేదు తను చేసే వ్రతం కనుక భగ్నం అయితే మీరు తనని ఎప్పటికి నేరుగా చూడకూడదు" అని చెప్తుంది. భానుమతి చెప్పినదానిలో నిజం లేదని "శివలీల ని చూడకుండా ఉండటమ?"అని అడుగుతాడు. దానికి భానుమతి "మేలిముసుగుతో చూడవచ్చు" అని తన ఉపాయాన్ని చెప్తుంది. విజయరుద్రకి అనుమానం వచ్చిన వేచిచూడాలి అనుకోని "కొన్ని రోజులు ఇక్కడే వుంటాను" అని అక్కడే వుంటాడు. మరుసటి రోజు ఉదయము మాటలు వినిపించి లేచి చూసేసరికి భానుమతి, మందర చాటుగా మాట్లాడుకోవడం వినిపించి శివలీల కోసం ఇల్లంతా చూస్తాడు,కానీ ఎక్కడ కూడా మూడో ఆడ మనిషి ఉనికి తెలియకపోడాంతో శివలీల అక్కడ లేదని అర్ధం అవుతుంది.
 
ఉదయ అల్పాహారం కూడ భానుమతి నే చూసుకోడంతో "శివలీలతో పాటు మందర కూడా వ్రతం నోచుకుందా? ఎక్కడ కనిపించటం లేదు" అని అడుగుతాడు. మందర ప్రస్తావన ఊహించని భానుమతి కొంచెము భయపడుతూ" ఆమె ..ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది"అని అబద్ధం చెప్తుంది. భానుమతి తడబడుతు చెప్పేసరికి తన అనుమానం నిజమేనని అయితే శివలీలని పిలవండి అంటాడు. ఆమె ఏదో చెప్పేలోపు గట్టిగా శివలీల బయటికిరా అంటాడు. శివలీల ముసుగులో ఉన్న మందర మేలిముసుగు ధరించి ఏమి మాట్లాడకుండా మెల్లిగా వచ్చి వాళ్ళ ముందు నిలబడుతుంది.
 
"ఎందుకు కుంటుతూ నడుస్తున్నావ్?" అని యువరాజు అడిగితే "కాలు బెణికింది అందుకే అమ్మాయి అలా నడుస్తుంది" అని మందర తరపున భానుమతి సమాధానము చెప్తుంది. శివలీల ఆభరణాలని,బట్టలని ధరించి మేలిముసుగులో వున్న ఆమెని చూడగానే అర్ధం అయింది ఆమె శివలీల కాదని. విజయరుద్ర ఆమెని పరీక్షగా చూసి దగ్గరికి వెళ్లి "శివలీల ని ఏం చేసావ్?" అని గొంతు పట్టుకొని అడుగుతాడు. మందరకి ఊపిరి ఆడక "అమ్మ..అమ్మ" అని పిలుస్తుంటే భానుమతి భయంగా "నా కూతురిని వదిలేయండి యువరాజ! మీకు అంతా చెప్తాను" అని ఏదో చెప్పబోతుంటే "నాకు నిజం మాత్రమే కావాలి!!" అని గద్ధిస్తాడు.
 
యువరాజు చేతిలో మందర ప్రాణాల్ని చూసి తల్లికూతుర్లు కలిసి చేసిన పని మొత్తం వివరిస్తుంది. అంత విన్న యువరాజు వీళ్లని అసహ్యించుకొని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయి శివలీల గురించి వెతకటం మొదలుపెడతాడు. వేగులని , గూఢచారులని పంపించి వెతికించినా కుడా ఆమె జాడ దొరకకపోడంతో రాజదంపతులు ఆమె మరణించి ఉండవచ్చనే సందేహాన్ని వెలిబుచ్చుతారు. అది విన్న యువరాజు తీవ్రమనస్తాపం చెంది రాజకోట నుండి వెళ్ళిపోతాడు, ఎన్ని చోట్లని వెతికిన ఆమె ఆచూకీ లభించక అలసిపోయి ఒక చెట్టుకింద పడుకుంటాడు.
 
అతనికి పూర్వం స్వప్నం వచ్చిన్నట్టు మళ్ళీ నిద్రలో శివలీల మోహం కనిపిస్తుంది, ఒక వైపు సంతోషంగా కనిపిస్తు మరోవైపు బాధపడుతున్నాట్టుగా ఉంది. నిద్రలో నుండి లేచి ఏదో స్ఫురించినట్టు గురాన్ని తీసుకొని మారువేషంలో రాజ్యం మొత్తం తిరుగుతాడు. ఒక రోజు బట్టలు అమ్మేవాడిగా వెళ్తే , మరొక రోజు పట్టుకుచ్చులు అమ్మేవాడిలాగా వెళ్ళేవాడు ఇలా ఎదో ఒకటి అమ్ముతున్నట్టు రాజ్యం లో ఉన్న అన్ని ప్రదేశాలు తిరుగుతుంటే అతనికి ఒక చోటు విచిత్రంగా కనిపిస్తుంది.
 
అతను అంతకు ముందు రోజు అక్కడికి వెళ్లినప్పుడు బావి కనిపిస్తే ఇప్పుడు అది ఒక ఇల్లులా కనిపిస్తుంది. అదే అతనికి విచిత్రాన్ని కలిగించింది. తరువాతి రోజు వెళ్లి చూడగా ఇల్లు లాగానే కనిపిస్తుంది, ఈ ఇంటికి వెళ్ళలేదు అని ఆ ఇంటి ముందుకి వెళ్లి "గాజులమ్మ,గాజులు...రంగు రంగుల మట్టి గాజులు"అని గట్టి గట్టిగా గాజులు అమ్మేవారిలా అరుస్తాడు.
 
బయటి నుండి వినిపిస్తున్నా గాజుల వాడి అరుపులు విని ఇంట్లో ఉన్న శివలీల "నాన్న...నాకు మట్టి గాజులు కావాలి" అని శేషాద్రిని అడుగుతుంది." ఎందుకు అమ్మ !!" అని అడిగితే "నాకు మట్టి గాజులాంటే చాలా ఇష్టం" అని చెప్పి తన భర్తతో గడిపిన సమయములో తనకి మట్టి గాజులంటే ఇష్టమని తెలుసుకొని ఆమె కోసం ప్రత్యేకంగా తెచ్చి అతనే ఆమె చేతులకు తొడిగింది గుర్తుకొచ్చి కన్నీళ్లు కారుస్తుంది. అది చూసిన శేషాద్రి "ఏడవకమ్మ గాజులే కదా " అని "రాణి....మనమ్మాయికి గాజులు తీసుకోవాలి, వెళ్లి ఆ గాజులత్తాన్ని పిలిచి అమ్మాయికి గాజులు వేయించు" అనగానే "అమ్మయి కోసం జున్ను చేస్తున్నాను, క్షణంలో వచ్చేస్తాను" అని లోపలి నుండే చెప్తుంది.
 
"పర్వాలేదు నాన్న ....నేను పిలుస్తానులే" అని గుమ్మం లోపలి నుండే "ఓ గాజులయన ఇటురా" అని చప్పట్లు కొట్టి పిలుస్తుంది. గాజులు అమ్మేవాడి వేషంలో ఉన్న యువరాజుకి ఆమె పిలుపు విని "ఈ స్వరం నాకు బాగా చిరపరిచీతం అయిన స్వరం" అని ముందుకు వెళ్తాడు. అతను వచ్చి "ఇక్కడ గాజులకోసం పిలిచారు ఎవరూ లేరే !!"అని అంటే "నేను తెరచాటు వెనకనే వున్నాను, మీరు అక్కడ నుండే గాజులు వేయండి" అని గుమ్మంకి అనుకోని కూర్చుంటుంది.
 
"సరే...మీ ఇష్టప్రకారమే వేస్తాను" అని చేయి ఇవ్వమంటాడు విజయరుద్ర. ఆమె తన చేతిని బయట పెట్టగానే ఆమె చేయిని చూసి గబుక్కున తన చేతిలోకి తీసుకొని ఒక క్షణం ఆగి ఆమెని అతను ముందుకు లాగుతాడు.ఆ హఠాత్పరినామనికి కంగారుగా ఆమె
"అమ్మ...."అని అరుస్తుంది. ఆమె పిలుపు వినిపించగనే నాగరాణి, శేషాద్రి ఆరుగురు అన్నదమ్ములు ఆమె ముందు వాలుతారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆమె అతన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది.ఆ దృశ్యం చూడగనే కోపోద్రుక్తుడైనా శేషాద్రి సర్పముల మారి అతని పైకి వెళ్తుంటే "నాన్నగారు ఆగండి...ఇతను నా భర్త"అని శేషాద్రిని శాంతిపజేస్తుంది.
 
మనిషిల ఉన్న అతను ఒక్కసారిగా పెద్ద సర్పమయి తనపైకి బుసలుకొడుతూ రావటం, అంత పెద్ద సర్పాన్ని చూస్తూ నాన్న అని పిలవటం ఆశ్చర్యంగా ఉన్న, సర్పాన్ని చూసేసరికి భయం వేసింది విజయరుద్ర కి, అతని పరిస్థితిని అంచనా వేసిన శివలీల తన సవతితల్లి, చెల్లి తనకి చేసిన ద్రోహంతో పాటు దేవుడి దయవల్ల పొందిన అమ్మ,నాన్న అని నాగరాణి,శేషాద్రిని చూపించి అన్నలని అక్కడున్న ఆరుగురు నాగులని పరిచయం చేస్తుంది.
 
అది సరే వీళ్ళు సర్పాలని నికెప్పుడు తెలిసింది అని యువరాజు ఆమె వెనకాలే ఆమె గదిలోకి వెళుతు అడిగాడు. శివలీల నవ్వి "ఒకరోజు ఏమి తోచక గదిలోనే అటు ఇటూ పచార్లు వేస్తుంటే నాన్నగారు తన నిజరూపంలో బయటికి వెళ్లడం చూసాను, నాన్న వెనకాలే మా అన్నలు కూడా సర్పల్లాగా మారి నాన్న తో పాటె వెళ్ళిపోయారు,అప్పుడు తెలిసింది నన్నూ కాపాడి , సొంత కూతురిలా చూసుకుంటున్నది సామాన్యమైన మానవ కుటుంభం కాదు ఒక పవిత్రమైన శేషకుటుంభం అని" అతనికి వివరిస్తుంది.
 
"మరి నీకు భయం వేయలేద" అని అడిగితే మనిషిరూపంలో ఉండి విషాన్ని చిమ్మే , విషసమానం అయిన కుటుంభం నుండి వచ్చిన నాకు ,ప్రేమ బంధాలు మాత్రమే చూపించే వీళ్ళని చూస్తే భయం వేయలేదు" అని సమాధానము ఇస్తుంది.
 
శివలీలతో పాటు శివలీల భర్త అయిన విజయరుద్రని కూడా ప్రేమతో అల్లుడు అనే గౌరవంతో చూసుకుంటారు. ఇలా చివరికి శుభం జరిగి అందరూ సంతోషంగా ఉండగా ఒక రోజు విజయరుద్ర శేషాద్రి, నాగరాణి తో "శివలీల,నేను సురక్షితంగా వున్నాము అని, త్వరలో వస్తాము అని రాజ కోటలో ఉన్న మా తల్లిదండ్రులు కు వర్తమానం పంపించాను" అని వారితో చెప్పగానే సంతోషం వాళ్ళ మొహాలలో కనపడిన ఆ వెంటనే బాధ కూడా కనిపించింది యువరాజుకి.
 
"ఇంత తొందరగా వెళ్ళవలసిన అవసరం ఏముంది అల్లుడుగారు" అని శేషాద్రి భారంగా అంటాడు."మా తండ్రిగారి వయస్సు మళ్ళుతున్నది, నేను రాజుగా బాధ్యతలు తీసుకోవలసి ఉంది, ఇది అసలు ముందుగానే నిర్ణయించబడిన నా దేశాటన, శివలీలతో వివాహము, పిదప యుద్ధ సహాయము, ఆ తరువాత శివలీల అదృశ్యం ....ఇక జరిగింది అంత మీకు కూడా అనుభవమే" అని ముగించాడు యువరాజు.
 
శేషాద్రి కూడా యువరాజు చెప్పింది సబబుగా అనిపించినా కూతురిని పంపించాలంటే మనసు భారంగా మారింది. నాగ రాణినే శేషాద్రి కి నచ్చచెప్పి వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇస్తుంది.
 
చూస్తుండగానే వాళ్ళు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. వారి ఇంటి ముందు ఏడు బండ్లు నిలిపి ఉన్నాయి,వాటిలో వజ్ర వైడూర్యలు,ముత్యాలు,కెంపులు,బంగారము,ఏడూవారాల నగలు,.....ఇలా చాలా సంపదని ఆ ఏడూ బండ్లలో నింపి ఒక్కో బండిని ఒక్కో సోదరుడి బహుమతిగా తమ చెల్లెలికి పుట్టింటి వారి సారె అని రాజకోటకి పంపడానికి సిద్ధంగా ఉంచారు.
శివలీల వారిని విడిచి వేళ్ళలేక ఏడుస్తూ తన ఏడుగురి అన్నల గడపలకి పసుపు రాస్తూ చివరి గడప అయిన చిన్న అన్న అయిన నల్లన్నా గది గుమ్మానికి పసుపు పెడుతు " అమ్మ ...చిన్నన్న కి చెప్పండి నేను అత్తవారింటికి వెళ్లినట్టు, అలాగే చెప్పకుండా వెళ్తున్నందుకు క్షమించమని అడిగానని చెప్పండి" అని నాగరాణి ని పట్టుకొని ఏడుస్తుంది.
 
నాగరాణి శేషాద్రిని చూడగా "రాణి మనము, చిన్నవాడికి అర్ధముఅయ్యేలా నచ్చచెపుతాము, జామాత మాటని తిరస్కరించిన మన పుత్రికకే బాధ. ఆమె ఇప్పటికే గర్భవతి , భర్తకి దూరమయి చాలా బాధలు పడింది. ఇప్పుడు మనము జమాతతో పాటూ మన కూతురిని కూడా కోటకి పంపిచాలి" అని శేషాద్రి తమ చివరి పుత్రుడు అయిన నల్లనాగు గురించి భయపడుతూన్నా నాగరాణికి చెప్పి యువరాజుని శివలీల ని సాగనంపుతాడు.
 
అక్కడి నుండి వెళ్లినా కొద్దీ కాలానికే శివలీలకి పండంటి మగ పిల్లాడు పుడతాడు,శివలీల కష్టాలు తిరిపోయి ఇప్పుడూ తన భర్త, కుమారుడితో సంతోషంగా ఉంది"
 
"అమ్మో.....చాలా పెద్ద కథ మమ్మీ" కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది ఆశీ.
 
"అప్పుడే అయిపోలేదు అమ్మడు"అని ఆశీని తన ఒళ్ళోకి తీసుకుంటుంది మానస.
 
"ఇంకా ఉందా..!! కంప్లీట్ చెయ్ మమ్మీ" అని మానస మెడ మీద చేతులు వేస్తూ అంది.
 
"చెప్తాలే గాని,నీకు నిద్రరావటం లేదా?" అని ఆశీని అడిగితే "రావటం లేదు మమ్మీ..నువ్ స్టోరీ కంటిన్యూ చెయ్ మమ్మీ"అని మళ్ళీ అడుగుతుంది.
 
"సరే...." అని " హ..ఎక్కడి వరకి వచ్చాము "అని అడగ్గానే "అంటీ అంకల్, బేబీతో హ్యాపీగా వున్నారు" అని ఆశీ చెప్తే "హ..మై బేబీ ఇస్ టూ షార్ప్" అని మానస అంటే "అందుకే ఎనిమిదేళ్ళకె థర్డ్ క్లాస్ లో ఉంది" అని కనిష్క్ అనేసారికి "నో డాడీ ఐ ఆమ్ ఎయిట్ అండ్ హాఫ్ " అని ఎనిమిది వెళ్లు చూపిస్తూ ఒక వేలుని సగం మడిచింది. "ఇది బంగారం...." అని ఆశీ ని ముద్దుపెట్టుకొని మళ్ళీ కొనసాగిస్తుంది మానస.
 
"బాబు పుట్టిన ఇరవైఒక్కరోజున నామకరణం చేయాలని రాజా దంపతులు అందరికి ఆహ్వానం పంపిస్తారు,యువరాజు నాగ దంపతుల గురించి ముందే చెప్పి ఉండటం వలన వాళ్ళకి కూడా ఆహ్వానంపంపిస్తారు. చెల్లి కోసము తపస్సుకని వెళ్లిన ఆఖరి నాగైన నల్లనాగు ఇంటికి వచ్చి చూసేసరికి శివలీల ఎక్కడ కనిపించకపొగ తల్లిదండ్రులని అడుగుతాడు. శేషాద్రి నల్లనాగుని కూర్చోబెట్టుకొని శివలీల భర్త అయిన యువరాజు విజయరుద్రరావటం వాళ్ళతో కలిసి కొన్ని రోజులు ఉండటం, తమ అనుమతితో శివలీలని రాజాకోటకి తీసుకువెళ్ళటం చెప్పి, ఆమె తన భర్తతో ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు నల్లనాగు కోసం పడ్డ మనోవేదనని కూడా చెప్తారు,అయిన ఇవేవి పట్టించుకోకుండా కేవలం తను రాకముందే తన కోసం ఆగకుండా ,చెప్పకుండా వెళ్లిపోయిందని క్రోధంతో బుసలు కొడుతూ సర్పంల మారి రాజకోటకి బయలుదేరుతాడు నల్ల నాగు".
 
ఇరవైఒక్క రోజున బాబుని బంగారు ఊయలలో వేసి నామకరణనికి వేచివుంటారు. ఎంతకీ శివలీల బాబు దగ్గరికి రాకుండా బయటి వైపే చూస్తుండాడంతో ఏమైందని శివలీలని విజయారుద్ర అడిగితే "నేను వచ్చేటప్పుడు చిన్నన్న కి చెప్పకుండానే వచ్చాను, ఇప్పుడు అన్నయ్య లేకుండా బాబు నామకరణానికి మనసు ఒప్పటం లేదు"అని బాధపడుతుంది. శివలీల బాధ చూడలేక "మీ అన్నయ్యతో నేనే బలవంతంగా తీసుకువచ్చాను అని మాట్లాడతాను నువ్వు బాధపడకుండా రా" అని అంటే "లేదు మా అన్నయ్యకి కోపం ఎక్కువైనా నా కోసం మన బాబు కోసం తప్పకుండా వస్తాడు" అని అలాగే ఎదురుచూస్తుంది.
 
శివలీల, విజయరుద్రల మాటలను అక్కడే ఉన్న ఉయ్యాలా పై భాగంలో అల్లుకొని సమయం దొరికినప్పుడు బాబుని కాటు వేయడానికని ఉన్న నల్ల నాగు ముద్దు గా బోసి నవ్వులు నవ్వుతున్న బాబుని చూడగానే అంత మర్చిపోయి బాబుని చూస్తూ వాళ్ళ మాటలు వింటాడు. వారి మాటలు విన్నాక తను ఎంత మూర్ఖంగా ఆలోచించాడో అని పశ్చత్తాపం చెంది శివలీల విజయరుద్రల ముద్దుల బాబుని ఆశీర్వదించాడనికని మెల్లిగా కిందకి దిగి ఉయ్యాల నలువైపులా చుట్టుకొని బాబుని చూస్తూ ఉంటాడు.
 
అప్పుడే అటు వైపుగా వచ్చిన పరిచారికలు నల్లగా చుట్ట చుట్టూకొని బాబు పైనా ఉన్న నల్ల నాగుని చూసి భయంతో కేకలు పెడుతు పరుగులు తీస్తారు,కేకలని విన్న శివలీల , విజయారుద్ర, రాజ దంపతులు అక్కడికి వచ్చి చూడగా ఉయ్యాలలో ఉన్న బాబు నవ్వుతూ నల్ల నాగుని చూస్తూ ఉంటాడు, అది చూసిన రాజదంపతులు సర్పం, సర్పం అని అరిస్తే శివలీల "రాజమాత అతను మా చిన్న అన్నయ్య , భయం లేదు"అని బాబు దగ్గరికి వెళ్లి "నా మీద కోపం లేదా అన్నయ్య !!"అని అడిగితే
"చెల్లెలి మీద కోపం అరక్షణము, అయిన చెల్లెలి మీద కోపం తెచ్చుకునేవాళ్లు మూర్ఖులు,పాపాత్ములు" అంటూ మనిషిగా మారి ఆమెని దగ్గరికి తీసుకుంటాడు.
 
విజయరుద్ర ఉయ్యాలలో ఉన్న బాబుని ఎత్తుకొని "మీ మేనల్లుడు" అని నల్ల నాగుకి ఇస్తాడు. అతను బాబుని ముద్దుచేస్తూ "మీ అమ్మ కోసమని తపస్సుకు వెళ్లి వచ్చేసరికి నువ్వూ పుట్టావు" అని కళ్ళు మూసుకొని అతని చేతిని చాపగానే ఒక తంత్రం లాంటి తాయత్తు అతని చేతిలో ప్రత్యక్షమవుతుంది, అది తీసుకొని బాబుకి కట్టి "అజేయుడివై చిరకాలం కీర్తి ప్రతిష్టలతో రాజ్యన్ని పరిపాలించు" అని ఆశీర్వదించి ఇక అక్కడ ఉండటం సరికాదని శివలీల విజయరుద్రలకి చెప్పి వెళ్లిపోతాడు.
 
అదే రోజు యువరాజు అయిన విజయారుద్ర కి మహారాజుగా పట్టాభిషేకం జరిపించి మహారాజుని చేస్తారు. నామకరణం, పట్టాభిషేకం సందర్భంగా రాజ్యంలో ఉన్న అందరికి ఆ రోజు నాణేలని, బహుమానాలని, అన్నప్రసాదాలను వచ్చిన వారికి కాదనకుండా పంచి పెడతారు. అలా ఆ రోజు రాజ్యంలో అందరూ ఆనందంగా, సంతోషంగా వుంటే "ఆకలిగా ఉంది,కొంచెం అన్నం పెట్టండి" అని నడివయస్సు ఉన్న ఒక స్త్రీ చిరిగి దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో తన కూతురిని చూపిస్తూ అడుక్కుంటుంటే,వాళ్ళకి దూరంగా ఒక మధ్యవయస్సు ఉన్న పురుషుడు కూడా అన్నప్రసాదాల వైపు దీనంగా చూస్తూవున్నాడు.
 
వీళ్లని చూసిన రాజదాసులు వెళ్లిపోమంటూ నెట్టుతుంటే గోడవేంట కోటమీద నుండి చూసిన శివలీలకి తన తండ్రి , పినతల్లి, చెల్లి కనబడతారు. తనకి ద్రోహం, అన్యాయం చేసిన వాళ్లు తన వాళ్ళెనని భావించి వాళ్ళని లోపలికి పంపించామని దాసీకి చెప్పి పంపిస్తుంది. వాళ్ళు భయ భయంగా లోపలకి వస్తుంటే కిందకి వచ్చిన శివలీల "ఎలా వున్నారు నాన్నగారు?"అని అడిగితే ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకోవడానికి కిందకి వంగుతుంటే "వీళ్ళకి అన్నపానీయాలు, కొంత ధనం ఇచ్చి దూరంగా పంపివేయండి" అని కోపంగా అంటాడు మహారాజు అయినా శివలీల భర్త.
 
"స్వామి వారు నా కుటుంబ సభ్యులు,వాళ్ళని దూరంగా ఎలా పంపిస్తారు?" అని వాళ్ళని చూపిస్తూ శివలీల అడిగితే "దుష్టులు దూరంగా ఉండటమే అందరికి మంచిది"అని గంభీరంగా అంటాడు. భర్త ఎంత చెప్పినను వినక పోవడంతో ఏమి చేసేది లేక వాళ్ళకి ధనం, ఆహార పానీయాలు సమకూర్చి బాధతో వెనుదిరుగుతుంది.
 
శివలీల తండ్రి శివలీలని చూస్తూ "నన్నూ క్షమించు అమ్మ, నేను చేసిన తప్పే నన్ను ఇలా ఈ పరిస్థితికి తెచ్చింది"అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు అతనితో పాటు భానుమతి, మందర కూడా తల దించుకొని వెళ్ళిపోతారు.

సశేషం

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#13
Nice story
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#14
nice story... I can tell to my son....
[+] 1 user Likes prash426's post
Like Reply
#15
మహారాజు అయిన విజయరుద్ర శివలీలని దగ్గర తీసుకొని "ఎవరు చేసుకున్నది వాళ్లే అనుభవించాలి,ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకు"అని ఆమెని అక్కడి నుండి తీసుకువెళ్తాడు.
 
"ఇదిగో వాళ్ళ పట్టాభిషేకానికి వెళితే నాకు ఈ చెవి జుంకాలు ఇచ్చారు" అని మానస తన చెవికున్న ముత్యాల జుంకాలని ఆశీకి చూపిస్తుంది.
 
"వావ్...మమ్మీ, నిజంగా వాళ్ళు ఇచ్చారా!!! చాలా బావున్నాయి" అని మానస చెవులకున్న జుంకాలని పట్టుకొని ఎక్సైట్ అవుతూ అంది ఆస్తిక.
 
"హ్మ్...పద నువ్ పడుకోవాలి" అని ఎత్తుకుని తీసుకువెళుతుంటే "మమ్మీ...ఇప్పటినుండి నువ్ ఎక్కడి కైన వెళితే నన్నూ తీసుకువెళ్లు" అని అంటే "ఎందుకు బంగారం నువ్వు?" అని అన్నా మానసతో " నాకు కూడా నీలాంటి జుంకాలు కావాలి" అని తనని ఎత్తుకున్న చెవులకున్న జూంకాలనే చూస్తూ ఉంటుంది.
 
"హ..హ..హ..ఆడపిల్ల అనిపించుకుంది నా డైమెండ్" అని మానస చేతుల్లో నుండి ఆశీ ని తీసుకొని వాళ్ళ మామయ్య గదిలో పడుకోబెట్టడానికి వెళ్తుంటే అక్కడికి ఎందుకు అని అడిగిన మానసకి కన్ను కొట్టి " ష్..." అన్నట్టు వేలు చూపిస్తాడు.
 
"నేనే నా గదిలో పడుకోబెట్టమన్నాను" అని ఆశీని తీసుకొని అతని గదిలోకి వెళ్లి "నువ్ వెళ్ళారా అబ్బాయి, ఆశీని నేను చూసుకుంటాను" అని అతను కనిష్క్ ని పంపి డోర్ వేస్తాడు.
 
"ఈయనకి ఎలా చెప్తే అర్ధం అవుతుందో!!" అని తల కొట్టుకుంటూ ఇంట్లో ఉన్న లైట్స్,గ్యాస్,వాటర్ టాప్స్ అన్ని ఆఫ్ చేసి విండోస్ క్లోస్ చేసిందో లేదోనని చెక్ చేసుకొని మానస బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే కనిష్క్ వెనక నుండి గట్టిగా కౌగిలించుకుంటాడు.
 
"మీకు కొంచెం కూడా బుద్ది లేదు,మామయ్య ముందు తల ఎత్తుకోలేకపోతున్నాను మీ వల్ల"అని ఫైర్ అవుతుంది కనిష్క్ మీద.
 
"అందులో ఏముంది మను డార్లింగ్, భార్యభర్తలు అన్నాక చిన్న చిన్న సరదాలు ఉండనే ఉంటాయి, ఆయన మన వయసులో ఉన్నప్పుడు మనలాగే ఉండివుంటారూ, గడిచిన కాలం తిరిగి రాదు డార్లింగ్" అని మరింత గట్టిగా పట్టు బిగిస్తాడు.
 
మానస కోపంగా కనిష్క్ ని విసిరికొట్టి డ్రెస్ చేంజ్ చేసుకొడానికి వెళ్లి వచ్చి చూసేసరికి బెడ్ కి చివరన ముడుచుకొని పడుకున్న కనిష్క్ కనిపిస్తాడు.
"బాగా హర్ట్ అయ్యాడు" అని అతని పక్కనే పడుకొని అతనిపై చేయి వేసి "సొరి" అంటుంది.
అతను ఆమె చేయి తీసివేస్తూ ఇంకొంచెం చివరికి జరుగుతాడు. ఆమె కూడా అతనికి దగ్గరగా జరుగుతూ మళ్ళీ "సారి" అంటుంది.
 
ఈ సారి బెట్టు చేయక ఆమెకి అభిముఖంగా తిరిగి అతను కూడా "సారి" చెప్పి ఆమెని హగ్ చేసుకుంటాడు. చూస్తుండగనే ఇద్దరు మనుషులు కాస్త రెండు కోడె నాగులై తీగల ఒకరిని ఒకరై అల్లుకుపోతారు.
 
ఉదయాన్నే అలారం మోతకి లేచిన మానస పక్కనే కనిష్క్ మెడ మీద కాలేసి నిద్రపోతున్నా ఆశీని సరిగ్గా పడుకోబెడుతుంటే "డిస్టర్బ్ చేస్తే లేస్తుంది, అలాగే వుండనివ్వు" అని నిద్రలోనే అంటాడు కనిష్క్.
 
ఆధమరిచి నిద్రపోతున్న ఆస్తికనే చూస్తూ తను ఎలా వారి జీవితాల్లోకి వచ్చిందో గుర్తు చేసుకుంది.
 
"ఇక్కడికి రాక చాలా రోజులు అయింది మను" అని మానస చుట్టే తిరుగుతూ అంటాడు కనిష్క్."అవును ఫణి పెద్దవాడు అవుతున్నాడు వాడిని చుసుకోడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా ఇక్కడికి ఎలా వస్తాం " అని చెట్లని దాటుకుంటూ వెళ్తుంది మానస."నీకు..ఏమైనా సౌండ్ వినిపిస్తుందా మను "అని చెవులను తాకుతూన్న శబ్దతరంగాలని శ్రద్దగా వింటూ అడిగాడు కనిష్క్.
 
"హ....ఇక్కడికి థర్టీ ఫీట్స్ లో నుండి వస్తుంది" అని కనిష్క్ ని చూసి వేగంగా ముందుకు కదులుతుంది మానస. ఆమె వెనుకే కనిష్క్ కూడా సౌండ్ వేవ్స్ ని అబ్సర్వ్ చేస్తూవెళ్తాడు.
 
వీళ్ళు వెళ్లేసరికి అంతవరకు చేసిన చప్పుళ్ళని ఒంట్లో శక్తి లేక ఆపి మూతలు పడుతున్న కనురెప్పలని తెరుస్తూ మూస్తూ మొగలి పొద పక్కన కనిపిస్తుంది సంవత్సరం న్నర వయస్సు వున్న పాప.
 
మానస కనిష్క్ ని చూసి వెంటనే మనిషి రూపంలో కొచ్చి పాపని తన చేతుల్లోకి తీసుకుని, చల్లబడుతూ శరీర రంగుని కోల్పోతున్న పాప ని చూడగనే అర్ధం అయింది మానసకి పాప కి విషం ఇచ్చి ఇక్కడ వదిలేసి పోయారని. పాపలో వున్న విషాన్ని తీసి కనిష్క్ కి పాప ని ఇచ్చి హాస్పిటల్ కి తీసుకువెళ్ళమంటూంది.
 
"మరి నువ్వు ....?" అని అడిగిన కనిష్క్ కి "పాప కోసం ఎవరైనా వస్తారేమో చూస్తాను" అని అక్కడే వెయిట్ చేస్తుంది.
 
ఎంత సేపు ఎదురు చూసిన ఎవరు రాకపోయేసరికి ఇంటికి వెళ్తుంది మానస. ఇంట్లోకి అడుగుపెడుతుంటే నవ్వులు వినిపిస్తాయి మానసకి. లోపలికి వెళ్ళి చూడగా కనిష్క్ చేతిలో పాప, పాప ని ఆడిస్తూ నవ్విస్తూ, నవ్వుతున్నా కార్తికేయ కనిపిస్తారు. పాప కోసం ఎవరైనా వచ్చారా అని అడిగిన కనిష్క్ తో "చావడానికని వదిలేసిన వాళ్ళు తిరిగి ఎందుకు వస్తారు"అని కనిష్క్ చేతిలో నుండి పాప ని తీసుకుంటుంది.
 
"మమ్మ.....ఈ పాప నా చెల్లి నా " అని ముద్దు ముద్దుగా అడుగుతాడు చిన్ని కార్తికేయ. ఏమి చెప్పాలో తెలియక కార్తికేయ నే చూస్తున్నా మానస తో "అవును ఫణి....తొందరలోనే ఈ పాప మనతోనే ఉంటుంది" అని కింద విడిచి పెట్టి "మను...ఈ పాప ని ఆర్ఫనేజ్ లో అడ్మిట్ చేసి మనమే అడాప్ట్ చేసుకుందాం, నీకు ఇష్టమైతేనే" అని ఆమె చేయి పట్టుకుంటాడు. అతని చేతిలోకి ఆమె చేయిని పోనిస్తూ "ఫణి గురించే ఆలోచిస్తున్నాను...ఫ్యూచర్ లో వాడు కోపం లో పాప ని ఏమైన చేస్తే..." అని వీళ్లకి కాస్త దూరంలో పాప తో ఆడుకుంటున్న కార్తికేయ ని చూసి భయపడుతుంది.
 
"ఫణి...." అని పిలవగానే "డాడ్..." అంటూ ఎత్తుకోడానికి తన వయస్సు సరిపోకున్న బలవంతగా పాప ని ఎత్తుకొని వస్తాడు."నాన్న ఫణి...పాప పడిపోతుంది,జాగ్రత్త!!!" అని మానస అంటే "మమ్మ...నేను ఉండగా చెల్లి కి ఎమ్ కాదు, కానివ్వను..." అని జారిపోతున్న పాపని సరిగ్గా ఎత్తుకుంటాడు.
 
"హ్మ్.....సరే పాప మనతోనే ఉండాలంటే నువ్ ఎప్పుడు తనపై కోపం తెచ్చుకోకూడదు, తనని తిట్టకూడదు, తనని ఏడిపించొద్దు...నీకు చాలా కోపం వచ్చిన నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంతే కాని చిన్నది కదా అని పాప పై చూపించొద్దు. నువ్ పాప తో గుడ్ గా వుంటాను అంటే పాప మనతోనే ఉంటుంది" అంటాడు కనిష్క్.
 
"హ్మ్....సరే డాడ్"అని "మమ్మ....నువ్ ఎమ్ చెప్పవా?" అని మానస ని అడిగితే " చెల్లికి ఎప్పుడు నువ్ సపోర్ట్ గా ఉండాలి, తనని ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఏ ప్రాబ్లెమ్ రాకుండా, మేము ఉన్న లేకున్నా నువ్ తనని మా కంటే బాగా చూసుకోవాలి" అని "అర్ధం అయిందా మై ఫణి బాయ్...." అనగానే " యెస్....మమ్మ" అని ఆమె మీద కూర్చుంటాడు. ఆ తరువాత రోజే ఆర్ఫానేజ్ కి వెళ్లడం, అడ్మిట్ చేయటం తరువాత కొన్ని రోజులకె అడాప్షన్ ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి పాప ని తెచ్చేసుకుంటారు. అలా ఆస్తిక వాళ్ళ జీవితం లో ఒక ముఖ్య భాగం అయిపోయింది.
 
ప్రెసెంట్ లోకి వచ్చి అలారం ఆఫ్ చేసి వాళ్ళకి బేడీషీట్ కప్పుతుంటే తన్నేసి ఒళ్ళు బయట పెట్టి పడుకున్నా ఇద్దరిని చూసి సరిపోయింది అనుకోని చక చక అన్ని పనులు చేసేసి గోడ గడియారం లో టైం చూసి కార్తికేయని స్కూల్నుండి తీసుకురావాలని పనులన్నీ పూర్తి అవ్వగానే చేసిన టిఫిన్ ని టేబుల్ పై వుంచి పూజలో కూర్చుంటుంది మానస.
 
అప్పటికే లేచి రెడీ అయిపోయిన కనిష్క్ వాళ్ళ మామయ్యకి కాఫీ, కీర్తికి టిఫిన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్తాడు."మను పూజలో ఉందా?" అన్న అతనితో అవును అని చెప్పగానే "నేను జేజకి హాయ్ చెప్పేసి వస్తాను" అని పూజ గదిలోకి వెళ్లి ధ్యానముద్రలో కూర్చొని ఉన్న మానస ని శివలింగాన్ని చూసి అక్కడ ఉన్న నంది వర్ధన, మోదుగ పూలని శివలింగానికి అలకరించి "ఈ రోజు అన్నయ్యా ఇంటికొస్తాడు, సాయంత్రం అన్నయ్య కూడా నీకు హాయ్ చెప్తాడు" అని అక్కడున్న చిన్న గంటని కొట్టేసి బాల్కనీలోకి వెళ్తుంది.
 
చేతిలో ప్లేట్ పట్టుకొని వున్న కనిష్క్ మీద కూర్చొని "డాడీ ఈ రోజు అన్నయ్య రాగానే అందరం కలిసి ఔటింగ్ కి వెళదాము" అని కనిష్క్ తినిపిస్తుంటే తింటూ అంటుంది.
 
"ఇప్పటినుండే వాడిని సైనిక్ స్కూల్ లో చదివించటం ఎందుకుర?" అన్న బాబాయితో "మొక్కగా ఉన్నప్పుడే మనం దేన్నయినా సరియైన దారిలో పెట్టగలము బాబాయి" అనగానే "మొక్కై వంగనిది, మానై వంగునా తాతయ్యా?" అని ఎప్పుడో కనిష్క్ వాళ్ళ అమ్మ చెప్పింది విని గుర్తుకు తెచ్చుకొని తిరిగి తాతయ్యా కి చెప్పింది ఆశీ.
 
"ఆశీ లాస్ట్ వీక్ తాతయ్య చెప్పిన పోయెమ్ గుర్తు ఉందా?" అని కనిష్క్ అడిగితే "ఓ.." అని
 
"చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు ఎంత
విశ్వదాభిరామ! వినుర వేమ!! "
అని చేతులు కట్టుకుని చెప్తుంది.
 
"ఇది మాణిక్యం......!!" అంటూ ఆయన ఆశీ బుగ్గలు లాగి మళ్ళీ ఒకసారి ఆ పద్యాన్ని చెప్పి తప్పులు సవరిస్తాడు.
 
"తాతయ్యా అన్నయ్య పెద్దయ్యాక సోల్జర్... కాదు ...కాదు సీక్రెట్ ఏజెంట్ అయితే, నేను ఏమో...నేను..హ...అనిమల్ డాక్టర్ అవుతా" అని చెప్తుంది.
 
"వెరీగుడ్.....మై డైమండ్ అంటే అది" అంటాడు కనిష్క్.
 
"ఏంటి అనిమల్  డాక్టర్ హ? ఎందుకు చిన్నుతల్లి !!" అని కనిష్క్ వాళ్ళ బాబాయి అడిగితే "నా ఫ్రెండ్ రితిక ఉంది కదా , తన పెట్ కి ఏమో డిసీస్ వచ్చి చనిపోయింది,వాళ్లు డాక్టర్స్ కాదుగా అందుకే వాళ్ళకి ఎలా చనిపోయిందో తెలిదు,మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిన్న కౌ బేబీ ఉంటుంది కదా దానికి కూడా కాలుకి దెబ్బ తగిలింది. అది చూసిన ఎవరు కూడా దానికి హెల్ప్ చేయలేదు. మా మిస్ ని అడిగాను ఎందుకు మిస్ అవి అలా అయిపోతున్నయి అంటే అవి మనల మాట్లాడలేవు, వాటికి ఏమైన ప్రాబ్లెమ్ వస్తే చెప్పుకోలేవు అని చెప్పింది. మరి వాటికి హెల్ప్ ఎలా చేయాలి మిస్ అని అడిగితే మనం ఏమి చేయలేము అనిమల్ డాక్టర్ వుంటారు వాళ్లే హెల్ప్ చేస్తారు అని చెప్పింది.
 
అందుకే నేను కూడా అనిమల్ డాక్టర్ అయి వాటికి హెల్ప్ చేస్తాను" అని చెప్పిన ఆస్తికని దగ్గరికి తీసుకొని "హెల్ప్ చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, మనం కూడా డాక్టర్ అవ్వలని లేదు" అని మంచి నీళ్ల గ్లాస్ ఇస్తాడు ఆశీ చేతికి.
 
"అవునా డాడీ....!!" అని ఆలోచించి " అయిన సరే నేను అనిమల్ డాక్టర్ అవుతా" అని చేతులు కట్టుకొని చెప్తుంది.
 
"అది అలా మాట్లాడుతూనే ఉంటుంది,మీరు కూడా టిఫిన్ చేసేస్తే స్కూల్ నుండి కార్తికేయని తీసుకురావచ్చు. మీరు ఇక్కడ లేట్ చేస్తే వాడికి అక్కడ కోపం వస్తుంది, తెలుసుగా వాడి కోపాన్ని కంట్రోల్ చేయలేమని, తొందరగా తినేస్తే మనం వెళ్ళాలి" అని టిఫిన్ వడ్డిస్తుంది.
 
"అవును మమ్మీ స్టోరీలో లాగానే అన్నయ్యాకి కూడా చాలా కోపం, ఒకసారి నేను ఆడుకుంటున్న బ్యాట్ ని రాజీవ్ అంకుల్ వాళ్ళ బాబు రాజ్ తీసుకున్నడని ఆ బ్యాట్ ని తీసుకొనే రాజ్ ని ఫుల్ గా కొట్టేసాడు,అప్పుడూ అన్నయ్య ఐస్ అయితే రెడ్ గా అయిపోయాయి" అని మానసకి చట్నీ అందిస్తూ అంది.
 
ఆస్తిక చెప్పింది వినగానే మానస, కనిష్క్ ఒకరినొకరు చూసుకొని సైలెంట్ అయిపోతరు."మమ్మీ ..తొందరగా తినండి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి" అని తన గదిలోకి వెళ్తుంది ఆస్తిక.
 
వీళ్ళు కార్తికేయ ఉన్న స్కూల్ కి వెళ్లి "ఫణి కార్తికేయ" అని చేప్పి పర్మిషన్ తీసుకొని కార్తికేయని తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు "అన్నయ్యా నైట్ మమ్మీ నాకు ఒక స్టోరీ చెప్పింది తెలుసా!!" అని కార్తికేయ పక్కన కూర్చుని చెప్తుంది.
 
"స్టోరీ నా !!! వాట్ స్టోరీ ఆశీ?" అని అడగ్గానే "అవును..పెద్దా.......స్టోరీ"అని మళ్ళీ చేతులు చాచి చూపిస్తూ అంది.
 
"ఎమ్ స్టోరీ మామ్...?" అని మానసని అడగగానే "ఒక ఆంటీ స్టోరీ, అందులో హార్సెస్ ఇంకా స్నేక్స్ ..హ మనల మారిపోయే స్నేక్స్ ఉన్నాయి. చూడు మమ్మీ పెట్టుకున్నా జుంకాలు కూడా వాళ్లు గిఫ్ట్ గా ఇచ్చినవే" అని వివరిస్తున్నట్టు చెప్తుంది.
 
కార్తికేయ కనిష్క్ ని, మానస ని చూస్తూ "ఆశీ...మామ్ చెప్పింది ఓల్డ్ స్టోరీ కదా, మామ్ అక్కడికి ఎలా వెళ్తుంది చెప్పు!!ఓల్డ్ స్టోరీస్ చెప్పినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్తారు బట్ అది నిజం కాదు. నానమ్మ కూడా మనకు స్టోరీస్ చెప్పినప్పుడు తనకి చెవి దుద్దులు, కంకణాలు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తుంది." ఆశీ కి అర్ధం అయ్యేలా చెప్తాడు కార్తికేయ.
 
"అవన్నీ నాకు తెలిదు...మమ్మీ జుంకాలు నాకు కావాలి అంతే " అని ముందుకు వంగి ముందు సీట్లో కూర్చున్నా మానస జూంకాలతో ఆడుతుంటుంది.
 
"ఆశీ....మామ్ డాడ్ చెప్పే స్టోరీస్ నుండి ఏదో ఒకటి తెలుసుకుంటావ్ కదా!!! మరి మామ్ చెప్పిన ఓల్డ్ స్టోరీ నుండి ఎమ్ తెలిసింది నీకు?" జుంకాలతో ఆడుతున్న ఆశీ ని అడిగాడు ఫణి. వయస్సు కు మించిన పరిణితితో కనిపిస్తున్న కొడుకునే చూస్తున్న కనిష్క్ ని తట్టి "దిష్టి తగులుతుంది ,అలా చూడకండి"అనగానే తన చూపుని తిప్పుకుంటాడు కనిష్క్.
 
"మ్.... ఏమిటంటే!! హ.....అంటీ ల అందరితో గుడ్ గర్ల్ ల బిహేవ్ చేయాలి, స్టోరీ లో బ్యాడ్ అంటీ ఇంకా గ్రాని చీ ట్ చేసినట్టు బయట ఎవరిని చీట్ చేయకూడదు, మనకి హెల్ప్ చేసిన వారిని అస్సలు మర్చిపోకుడదు, గుడ్ అంకుల్ ల ఎప్పుడు షార్ప్ గా ఉండాలి.....ఇన్ని నేర్చుకున్నాను" అంటూ చేతి వేళ్ళు చూపించింది ఆశీ.
 
"అవునా....అన్నీ నేర్చుకున్నావ!!" అంటూ కార్తికేయ ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్టుగా మెహం పెట్టాడు.
 
"అయ్యో....ఒకటి మర్చిపోయాను అన్నయ్య!!" అంటూ తల పై చేయి పెట్టుకొని పెద్దవాళ్ళు అన్నట్టు అంది.
 
ఆశీ ముఖ కవళికలు,చేతలు నవ్వుతూ చూస్తున్న కార్తికేయ "ఏమ్ మర్చిపోయావ్ ఆశీ !!" అని అడిగేసరికి "స్టోరీలో ఒక అంగ్రీ అంకుల్ కూడా ఉన్నారు, అతనిల ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు" అంటూ కార్తికేయ పక్కన కూర్చుంది.
 
"ఆశీ నాకు కూడా ఆ స్టోరీ చెప్పు" అని ఆస్తిక వైపు తిరిగి స్టోరీ చెప్పమని అడుగుతాడు కార్తికేయ.
 
మెరుస్తున్న కళ్ళతో నిజమా అన్నట్టు చూస్తుంది, "అవును ఆశీ నేను కూడా నీకుల గుడ్ అవ్వాలి కదా!!" అని కార్తికేయ అనగానే "యే...స్టోరీ టైం" అని మానస చెప్పిన స్టోరీ నే తన భాషలో కార్తికేయకి చెప్పడానికి రెడీ అయిపోతుంది.
 ---------
అంతే…కథ కంచికి మనమింటికి

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#16
Superb
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#17
Fantastic story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)