Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller సింహబలుడు(శాతకర్ణి 1)
#1
గౌతమీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం శాలివాహన సామ్రాజ్యం . శ్రీముఖ శాతవాహనుడు తన పదమూడవ ఏట ఉజ్జయినిరాజు విక్రమార్కుడిని ఓడించాడు.
భట్టి మహారాజు తో సహ ఉజ్జయిని మహారాజుని కొన్ని వందల సంవత్సరాల చరిత్రని రూపుమాపి కొంగ్రొత్త శాతవాహన శకాన్ని ప్రారంభించారు.
శ్రీముఖ శాలివాహనుడు అది విక్రమశకానికి చరమగీతం పలికాడు కానీ అంత పెద్ద సామ్రాట్టుని ఒక చిన్న దేశ యువకుడు ఎలా ఓడించాడన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం .
ప్రస్తుతం గోదావరి నది పుట్టినిల్లయిన నాసిక త్రయంబకేశ్వరాన్ని అనుకొని శాతివాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది శివస్వతి. తన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీ ముఖుడు సముపార్జించిన విశేష సామ్రాజ్యం ఇప్పుడు దండయాత్రలతో హొరెత్తుతున్నది. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న విక్రమార్కుని వారసులు, నహపునితో కలగలసి తమ పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నారు.
యవనులు, మ్లేత్యులు, పల్లవులు మొదలైన వారు రాజ్యాన్ని దక్కించుకోవడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.
శివస్వతికి వారసుడు లేడు, వారసులు లేని రాజ్యం మీదే శత్రువులు చూపు. రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు.
ఒకరోజు శివస్వతి గోదావరి తీరాన ఉన్న దట్టమైన అడవిలో వేటకు బయలుదేరాడు.
పులిని చూసి దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు.
ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.
రాజుగారు నేలమీద పడిపోయారు. కళ్ళు బైర్లు కమ్మాయి.వెంటనే ఒక వింత జరిగింది.
చెట్టు పైనుండి ఒక కుర్రాడు సింహం మీద దూకాడు. సింహాన్ని నిలువరించి దాన్ని మచ్చిక చేసుకుని, సింహం మీద ఎక్కాడు.
రాజుగారు తేరుకుని "బాలకా! నీవెవరవు." అడిగారు.
"నేను ఈ అడవి పుత్రుడుని, నన్ను ఇక్కడ ఉన్న తెగ కు చెందిన వాడిని . మేము జంతువులతో కలిసిమెలిసి ఉంటాము.
" అని చెప్పాడు.
అప్పుడు రాజుగారు ఆ తెగ వారిని కలుసుకుని బాలుడు గురించి అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ బాలుడు తమకు అడవిలో దొరికాడని చెప్పారు.
బాలుని చూసి రాజుగారు బాలకా! “నేను నిన్ను యువరాజుని చేస్తాను. నీవు నాతో మన రాజ్యానికి రావలసి ఉంటుంది” అని చెప్పారు.
ఆ తెగవాళ్ళు బాలుడిని ఒప్పించి, రాజుతో పాటు పంపించారు.
ఆ తరువాత ఆ కుర్రాడు రాజు గారితో సింహం ఎక్కి రాజ్యానికి బయలు దేరాడు. అలా ఆ కుర్రాడు సింహ౦ మీద రాజ్యలోనికి రావడంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి భయపడ్డారు.





మహారాణి పేరు గౌతమి . అందంగా ఉన్న బాలుని చూసి ముచ్చటేసింది రాణిగారికి బాలుని గురించి ఆరా తీసి,ఇతన్ని మనం పెంచుకుందాం అంది మహారాణి.అప్పుడు శివస్వతి బాలుని రాణికి చూపించి యువరాజుకి ఏమి పేరు పెట్టాలని ఆలోచించారు
"గౌతమీపుత్ర అని పెడదాము, బాలుని జన్మ వృత్తాంతం ఎవరికీ (తర్వాత తరాలకు) తెలియకుండా ఉండాలి. ఎలాగో గోదావరి నదీతీరాన దొరికాడు కాబట్టి గౌతమీపుత్ర అని పెడదాము" అని రాణి అన్నారు.
సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాజు .
దత్తత కార్యక్రమము, నామకరణం అయిన తర్వాత అతడిని గౌతమ మహాముని ఆశ్రమానికి(గురుకులం) పంపించారు. గురుకులంలో అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టిన శాతకర్ణి, ఏకసంధాగ్రహి. అన్నీ విద్యలను చక్కగా నేర్చుకున్నాడు.
జ్యోతిష్యులు యువరాజు జాతకం చూసి జంబూద్వీపాన్ని పాలించే చక్రవర్తి అవుతాడని చెప్పారు.
ఈ మాట దావానంలా వ్యాపించింది. అప్పుడు మహానందనం అనే ప్రాంతం నుండి సాధువులు రాజ్యానికి వచ్చారు. వారు శివస్వతికి నమస్కరించి ఇలా అన్నారు "రాజా, మీ ముత్తాత గారు శ్రీముఖ శాలివాహనుడు మాకు అత్యంత ఆప్తులు . మీకు ఒక రహస్యం చెప్పాలి ."
రెండవ భాగము ;
సాధువులు ఇలా అన్నారు.
మేము పరశురాముని ప్రియ భక్తులం. మేము పరశురాముడు సృష్టించిన కొడంగళూరు భగవతీ ఆలయంలోని గురుకులంలోని వాళ్ళము.
మీ ముత్తాత గారు మా దగ్గర ఒక రహస్య మర్మకళ నేర్చుకున్నారు.
ఆయన ఒక్క వేటుతో 15 మందిని చంపిన ఘనుడు.
మీకు ఒక తాళపత్ర గ్రంధం ఇస్తాము.
అది మీ కుమారునికి ఇచ్చి అందులో ఉన్న సూచనలు అనుసరించి మహానందనంలో ఉన్న గురుకులంలోనికి వెళ్ళమని చెప్పండి. అక్కడి నుండి అతనిని మహా చక్రవర్తిగా తయారు చేసేందుకు ఇంకొక మహాచక్రవర్తి దగ్గరకు ఆ గ్రంధమే తీసుకెళుతుంది.
తాను ఒంటరిగా ఈ కార్యక్రమము నిర్వర్తించవలిసి ఉంటుంది అని అన్నారు.
ఇదంతా విన్న మహారాజు పులకించి పోయారు ఈ మహాకార్యాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని శాతకర్ణికి ఆ పవిత్ర గ్రంధాన్ని ఇచ్చారు.
శాతకర్ణి ఆ గ్రంధం తెరచి చూశారు. “అందులో పరశురాముని గురించి ఉంది. ఆయన ఆశ్రమం జంబూద్వీపానికి దక్షిణ కొనలో ఉన్నది.
దట్టమయిన కీకారణ్యంలో ఉన్నది.
దానికి దారి తెలియాలి అంటే ఇది తెలియాలి అని ఉంది
"సృష్టిమూలం అగ్గిరవ్వయితే పవిత్ర జలాన్ని కూడా ప్రమిదగా వెలిగిస్తుంది.ఆ దీపాన్ని మూడు కాంతుల నడుమ ఉంచితే మీ మార్గం ఉన్నత స్థానంలో ఉన్నవాడు చూపిస్తాడు."
సృష్టిమూలం అంటే ఏమిటని ఆలోచించి శాతకర్ణి అనేక పుస్తకాలు చదివాడు.
ఒక రోజు ఏది ఏమైనా తండ్రికి తనపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని శాతకర్ణి అన్వేషణ మొదలు పెట్టారు.
అనేక సాధువులను కలిసి చర్చించారు. ఎంతకీ అవగతం అవ్వడం లేదు.”
అప్పుడు ఒక అందమైన లోయ వద్దకు వచ్చాడు శాతకర్ణి. అక్కడ ఒక అందమైన కన్యను చూసి వింతగా అనిపించింది. ఇంత అందమైన సౌందర్య రాశిని ఎప్పుడూ చూడలేదు. అతను వెంటనే ఆమెను వెంబడించాడు. ఆమెను రహస్యముగా ఆమె పరివారం వద్దకు వెళ్ళి చూశాడు.





ఆ కన్య పరివారం ఒక అందమైన తటాకం (చెరువు) వద్ద ఉంది.బహు నున్నగా చెక్కిన రాళ్లతో తటాకమునకు చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. చెరువు లోకి మెట్లు మరియు తూరలు కట్టిన పనితనం చూసి శాతకర్ణి విస్తుపోయాడు .శతధృవంశ యోధుల్లా ఉన్న పెద్ద వృక్షాలు ,దట్టమైన నీడ తో పాటు పిల్ల గాలులు కూడా వీస్తుండండం తో మైమరచి ,పిల్ల కోసం వెతకసాగాడు .కానీ నీటి లో పిల్ల తిమ్మెరలు చూసి ఏమి ఈ సౌందర్యం అనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద ఉడత ఒక చెట్టు మీదనుంచి ఇంకొక చెట్టు మీదకు ఉరుకులు పరుగులు చూసాడు. చెట్టు మీద రెండు కోతులు కూర్చొని ఉన్నాయి ,వాటి తోకలతో పిల్లకోతి ఉయ్యాలలూగుతోంది.





నేల మీద పచ్చిక మృదువుగా కాళ్లకు తగులుతోంది. తుమ్మెదలు, తేనెటీగల ఝుంకారాల మధ్య పెద్ద పళ్లెం లాగా ఉన్న ఆకులతో ఉన్న ఎర్ర కలువలు మరింత వికసిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలు విని చెరువు లో ఉన్న ఒక దిబ్బ మీద ఒక దృశ్య కావ్యం చూసాడు శాతకర్ణి. చెరువులో దిబ్బ మీద ఎర్ర చిలువ బాతులు ,నారాయణ పక్షులు, నీటి కోడిల గుంపు చూసి విహంగ జంటల ప్రేమకేళి చూసి మళ్ళి సుందరాంగి గుర్తుకు వచ్చింది.





అలా వెళ్లగా ఒక శివాలయం కనపడింది .అక్కడ ఆ దివ్యంగన చెలికత్తెలతో కూడి దేవునికి హారతి అర్పించి ,చెరువు లోకి దిగింది. చెలికత్తెలు ఇక్కడ మొసళ్ళు ఉండవు కదా అని పరిహాసమాడారు. ఇంతలో స్నానం ముగించి దివ్యంగన మహాదేవునికి పూజాదికాలు చేసింది. కానీ శాతకర్ణికి ఆమె మోము (ముఖం) అగుపించుట లేదు. వేరే వైపుకు వెళ్లి చూద్దామని బయలుదేరాడు, పూజ ముగించుకొని ఆమె కూడా శాతకర్ణి వైపు వచ్చింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దెబ్బతో ఇంతకూ ముందు చూసిన ప్రకృతి సౌందర్యం అంతా మనస్సులోంచి మటుమాయం అయిపోయింది .ఆమెను చూస్తూ స్థాణువు ల ఉండి పోయాడు .
ఇంతలో భటులు వచ్చి శాతకర్ణి ని చుట్టుముట్టారు.ఆమె శాతకర్ణి అందము చూసి ముగ్ధురాలై సరస్సు లోనుండి ఒక కలువను తెంపి పంటితో కొరికి తన యద మీద కలువను పెట్టి శాతకర్ణి మీదకు విసిరి చెలికత్తెలతో పారిపోయింది. వారు చాల దూరం వెళ్లిన తరువాత శాతకర్ణి ని భటులు యువరాణిని చూసినందుకు ఒక చెట్టుకు కట్టేసి అడవి లో ఒంటరిగా వదిలేసారు.ఆ దివ్యంగన మత్తు లో ఉన్న శాతకర్ణి ఆమె రూపాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ఇంతలో ఇందాక ఉయ్యాల ఊగుతున్న కోతిపిల్ల శాతకర్ణి కట్లు విప్పేసి కేరింతలు కొడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు శాతకర్ణి అనుకున్నాడు "ఆమె గంధర్వురాలై ఉంటుందా,లేక మత్స్యకన్యా ? లేక నాగకన్యా ?. ఏమి సౌందర్యo ! ....పూర్ణచంద్రుడు లాగా పరిపూర్ణంగా ,జాలువారుతున్న కురులు తేనెటీగల సమూహంలా,నెలవంకను పోలిన వికసించిన పెదవుల సమాహారం, సివంగిని గుర్తుకు తెచ్చే ఆ నడుము, ఆ వయ్యారాల హంస నడక, శ్వేతాంబరాల వంటి మేనిఛాయ ,కస్తూరి సువాసనలతో ,మల్లెపువ్వు లాగా ,కోకిల కంఠం తో ,మన్మధుడే దిమ్మతిరిగేలా వెల్లువిరిసిన వసంతం లాగా ఉంది ఆ దివ్యంగన."
ఆమె మైకంలో పడి శాతకర్ణి ఆమె గురించే తలచుకుని మురిసిపోయి, కొన్ని రోజులకి ఎలాగైనా ఆమెను పొందాలని చాలా ప్రాంతాలు వెదికాడు.
ఆమె దొరకలేదు వైరాగ్యంతో కృంగిపోయాడు.
అప్పుడు యువరాజు ఒక కొండ వద్దకు వచ్చి అక్కడ శివాలయంలో తలదాచుకున్నాడు.
అక్కడ శివమహాపురాణం చెబుతున్నారు పండితులవారు.
"ఈ అనంతవిశ్వం ఒక నల్లరాయిలా ఏర్పడింది. విశ్వశక్తి అంతా శివుని రూపంలో వచ్చింది. శివుని నుంచి ఆదిశక్తి, బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ సప్త ఋషులను సృష్టించారు. బ్రహ్మ సృష్టికర్త అయ్యి సంధ్యను సృష్టించారు. బ్రహ్మ మానసపుత్రుడు మన్మధుడు. మన్మధుని కారణాన కామం పెరిగిపోయింది. ఆ కామం పరమశివుని మీద అస్త్రం ఎక్కుపెట్టినప్పుడు మన్మధుడు బూడిద అయిపోయాడు.
అప్పుడు మన్మధుడి ప్రభావం వల్ల బ్రహ్మ కామం తో తనను ఆమెను చూడటం వల్ల తట్టుకోలేక సంధ్య కూడా అగ్నిప్రవేశం చేసి ప్రాతః సంధ్య శ్యామ సంధ్యగా మారిపోయింది.
అలా తన తేజస్సుని మార్గశిర మాసంలో అగ్నిగా మార్చి ఈ అరుణాచలం పై వెలిశారు మహాశివుడు "అని చెప్పాడు.
అప్పుడు ఆలోచన వచ్చింది, శాతకర్ణికి.
గ్రంథం లో మొదటి వాక్యం, సృష్టిమూలం అగ్గిరవ్వ అయితే అంటే ఈ అరుణాచలంలో ఆ అగ్ని నాకు దొరుకుతుంది.,అని ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడు.
అరుణాచలం కొండ క్రిందకు వచ్చి శాతకర్ణి అంతా వెదికాడు ఏమైనా దారి దొరుకుతుందేమోనని.
అంతా దట్టమైన అడవి, యువరాణిని ఇంకా మరిచిపోలేకుండా ఉన్నాడు శాతకర్ణి.
అప్పుడు ఒక శివాలయం కనిపించింది. అందులోని పూజారి పేరు దక్షిణామూర్తి, దక్షిణామూర్తికి జరిగిన సంగతి అంతా చెప్పి తనకు దారి చూపించమన్నాడు శాతకర్ణి అప్పుడు పూజారి "నాయనా ఇది శివుడు తన ఆత్మశక్తి జ్వాలగా మార్చి వెలసిన ప్రదేశం. బ్రహ్మ కుమారులు (సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు )నలుగురూ అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టినా ఏదో తెలియని తనం వెంటాడుతూ ఉండేది.
అప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి పరమేశ్వరుని వద్దకు వచ్చి జ్ఞానం ఉపదేశించమని చెప్పారు.
ప్రకాశవంతం




శివుల వారు దక్షిణామూర్తిగా మారి ఒక భోధి వృక్షం దగ్గర ఉపదేశం చేశారు.
ఆ ఉపదేశం సారాంశం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలని.నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే తురియ స్థితికి చేరాలి, అది సమాధి స్థితికి ముందు స్థితి.ఆ భోధి వృక్షం ఇక్కడే ఉంది.ఆ స్థితి పొందడానికి నీకు నేను సాయం చేస్తాను "అన్నారు.
ఇది కార్తీక మాసం, కార్తీక మాసం 21వ రోజున శివుని శక్తి సంపూర్ణంగా వెలుగు రూపంలో కనపడుతుంది. ఆ శక్తికి మూలం ఎక్కడో ఎవరికీ తెలియదు. నువ్వు తెలుసుకుంటే నీటిలో దీపం వెలిగించే అగ్గి రవ్వ దొరుకుతుంది అని అన్నారు.
తురియ స్థితి పొందడానికి శాతకర్ణి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
21వ రోజు రానే వచ్చింది.
శివునికి వెలుగుకి సంబంధమైనది ఏది అని ఆలోచించి చంద్రవంక శివుని తలపై ఉండడాన్ని చూసి, ఆలోచించాడు. చంద్రుని కిరణాలు ప్రకాశవంతంగా కొండపైన ఒక చోట పడుతున్నాయి. వాటిని చూసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కొండపైన ఒక ద్వారం తెరుచుకుంది.
కొండలోనికి ఒక దారి ఉన్నది. నాలుగు ద్వారాలు కొండ సొరంగంలోనికి ఉన్నాయి.
వాటిని చూశాడు శాతకర్ణి.
మొదటి ద్వారం దగ్గరకు వెళ్ళాలి అంటే నీళ్ళు లోతుగా ఉన్నాయి. ప్రక్కనే బోలెడు అస్థి పంజారాలు ఉన్నాయి ,ఒక పడవ ఉంది ,కర్రతో పడవ నడుపుకుంటూ మొదటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ద్వారం బయట ,పెద్ద తాళం వేళాడదీసి వుంది.కానీ ద్వారానికి తాళం కప్ప కనబడలేదు ద్వారం రాయితో చేయబడింది. కాగడా వెలుతురులో చూస్తే ద్వారం ప్రక్కగా రాయితో చేసిన కప్ప ఉంది.రెండు రాళ్ళ తలుపుల మధ్య తాళం కప్ప ఉంది మధ్యలో చేయి వెళ్ళటం లేదు. ఆ రెండు గోడల సందులో చెయ్యి ఎంత వంచినా వెళ్లట్లేదు.పడవలో శాతకర్ణి తురియ సాధన చేశారు. ఒక ఆలోచన వచ్చింది.చేతిని మోచేయి వద్ద విరిచాడు, అలా చేయడం వల్ల ఎంతో బాధకు లోనయ్యాడు. ఇంకో చేతితో విరిగిన చేతిని పట్టుకుని, ఆ సందులో చేతిని దూర్చి తాళం తిప్పగలిగాడు.విపరీతమైన బాధతో ఉన్నాడు శాతకర్ణి. వెంటనే తలుపు తెరుచుకుంది ,వెంటనే మెడలో గుడ్డ వదులుగా కట్టి అందులో విరిగిన చేతిని పెట్టాడు. ఒక చేతితోనే తెడ్డు పట్టుకొని పడవ నడిపాడు. రెండో ద్వారం సమీపించేటప్పటికి నీటిలో అలలు బయలు దేరాయి ,ఎదురుగా సుడిగుండం ఉంది.దాని తప్పించుకోబోయి పడవ తిరగబడిపోయింది.ప్రక్కనే ఉన్న తీగను పట్టుకోబోయాడు .అది నీటి సర్పం ,నాలుక మీద కాటు వేసింది. నాలుక పెద్దగా వాచిపోయి ఊపిరి ఆడటంలేదు .వెంటనే శాతకర్ణి ,సాధన చేసి కత్తితో గొంతు మీద గాటు పెట్టాడు .గాలి ఆడింది .వెంటనే తూడు పువ్వు రెమ్మను కత్తిరించాడు .అది గొట్టంలా ఉంది. దానిని గొంతులో పెట్టాడు .గాలి ఆడుతూ ఉంది వెంటనే పెద్ద పళ్లెం లాంటి ఆకులు నీటిపై తేలియాడుతున్నాయి . ఓపిక తెచ్చుకుని శాతకర్ణి వాటి పై పడుకున్నాడు .
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దక్షిణామూర్తి పూజారి ఉన్నారు. కాంతి మీద పడి వంటిపై ,చేయిపై గాయాలు మానిపోయాయి. అప్పుడు దక్షణామూర్తి,చెబుతూ, “ నాయనా నీకు రెండు పరీక్షలు పెట్టాను.
మొదటిది నొప్పి మీద భయం పోగొట్టేది .రెండవది ప్రాణం మీద మమకారం పోగొట్టేది చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు చావు గురుంచి భయపడడు.
సాలిగ్రామ నిర్మితమైన అరుణాచల స్వామి ఆలయానికి స్వాగతం.” .ఇంకొక ద్వారం మిగిలింది, ఆ ద్వారం తర్వాత నీకు అరుణాచల స్వామి కటాక్షం కలుగుతుంది "అన్నారు.
అక్కడకు వెళుతుంటే అక్కడ కొలను లో యువరాణి కొలనులో స్నానం చేస్తున్నది. పున్నమి వెలుతురు లో ఆమె మేని ధవళకాంతులీనుతుంది .ఇంకా చెలికత్తెలు కూడా స్నానం చేయుచు యువతులను చూసిన శాతకర్ణి వారి వద్దకు వెళ్ళాడు.అందరూ వివస్త్రలు గా ఉన్నారు. వారి కాళ్ళు నున్నగా పాదరసం వలె నీటి లో కదలాడుచున్నవి . వారిని చూసి బయటకు రండి మీ వెనుక మొసలి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆ అందమైన యువరాణి తన నగ్న శరీరం తో శాతకర్ణి వద్దకు వచ్చినది.
నీటి తో తడిసిన ఆమె శరీరం బంగారు వర్ణం లో మెరిసి పోతూ ఆమె అందాలు రెట్టింపయ్యాయి . అతనిని చూసి నవ్వుతూ స్పందన లేకపోవుట గమనించి ,నవ్వి అతని ఇంద్రియ నిగ్రహము నకు కారణం ఇతను తురీయా స్థితి సాధించటం అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు వెనుక నుండి దక్షిణామూర్తి "భళా శాతకర్ణి ,నీవు ఇంద్రియాలను జయించావు తురియ స్థితిని నీవు సాధించావు ,శుక మహర్షి మాత్రమే ఈ స్థితిని పొందగలిగారు .వ్యాసునికి కూడా దక్కని స్థితి నీకు కలిగింది." అంతలో ద్వారం తెరుచుకుంది.
నాలుగు చిరుత పులులు వచ్చి శాతకర్ణి పై పడ్డాయి .ఎదురుగా కత్తి ఉన్నది.కత్తి పట్టుకుని కోపంతో ఉన్న చిరుత పులులు పైకి ఎగిరాడు. శాతకర్ణి ,జంతువులు తన బాల్య మిత్రులు గనుక వాటి మదం అణిచి ఒక చిరుత మీద స్వారీ చేశాడు .
అప్పుడు దక్షిణామూర్తి చూసి భళా “ చేతిలో కత్తి ఉన్న వాటిని చంపకుండా జీవకారుణ్యం చూపించావు” అని అన్నారు.
అప్పుడు దక్షిణామూర్తి ఆఖరి తలుపు తీసి స్పటిక లింగాన్ని చూపించి .అప్పుడు అడిగాడు, దక్షణామూర్తి, శివలింగం అంటే ఏమిటి అని .
వెలుగులు జిమ్ముతున్న ఆ శివలింగం అంతా ప్రకాశంగా ఉంది.అప్పుడు శివలింగాన్ని చూసి ధ్యానం చేసి శాతకర్ణి ఆ శివలింగం మానవుని శుఘమ్న నాడి కి చిహ్నం అని చెప్పాడు.
అప్పుడు శాతకర్ణి తీక్షణంగా శివలింగాన్ని గమనించాడు. రెండు కెంపులతో శివలింగానికి రెండు కళ్ళు ఉన్నాయి.శివునికి మూడో కన్ను కూడా ఉంటుంది అని ఆలోచించుకొని చూసాడు .రెండు రెండు కన్నుల మధ్య గంధం రాసి ఉంది,అది తొలగించాడు శాతకర్ణి. శాతకర్ణి అప్పుడు మూడో కన్ను బంగారు రేకుతో చేయబడిన ఆ కన్నును ప్రక్కకు జరిపాడు రేకు తీయగానే ఎంతో ప్రకాశంతో వెలుగుతున్న సోమ వజ్రాన్ని చూసాడు.
ఆ వజ్రాన్ని తీసుకుని ఇదే అరుణాచలంలో వెలుగు అనుకోని ముందుకు వెళ్ళాడు . దక్షిణామూర్తి దగ్గరకు అంతలో ఒక సంఘటన జరిగింది. ఒక త్రిశూలం వచ్చి దక్షిణామూర్తికి తగిలింది .రక్తం ధారగా కారిపోతుంది .అప్పుడు శాతకర్ణి ఆలోచించి నాకు గొంతుకు ,చేతికి ఉన్న గాయాన్ని ఈ కాంతి నయం చేసింది.ఇప్పుడు మీ గాయాన్ని ఈ కాంతి రూపుమాపుతుంది అన్నాడు.
కానీ దక్షిణామూర్తి చెప్పాడు ,నీవు కారణజన్ముడివి ,కాబోయే చక్రవర్తివి,ఈ వజ్రాన్ని తీసుకు వెళ్ళు ఇంకొన్ని క్షణాల్లో కార్తీకమాసం 22వరోజు వస్తుంది .అప్పుడు ఈ కాంతి వెళ్లిపోతుంది .
అప్పుడు శాతకర్ణి ఒక మనిషి ప్రాణం కన్నా ఇదేమి ముఖ్యం కాదని తలచి ఆ కాంతిని దక్షిణామూర్తి గాయంపై ప్రసరింపచేశాడు .సోమ వజ్రం వెలుగు పోయింది వెంటనే దక్షిణామూర్తి గాయం నయం అయ్యింది . దక్షిణామూర్తి మామూలు మనిషి అయ్యాడు .
అప్పుడు దక్షిణామూర్తి చెప్పాడు .శివుని యొక్క ఆత్మశక్తి ఈ అరుణాచలాన్ని తేజోమయం చేస్తుంది ,కానీ ఈ స్థలం నిన్ను నువ్వు తెలుసుకొనేలా చేస్తుంది .ఆత్మ సాక్షాత్కారం కలుగ చేసే పుణ్యభూమి .నీవు ఈ స్థితిని సాదించావు. నీకు కావలిసిన వెలుగు నీలోనే ఉంది .నీవే చూడు నీకే కనిపిస్తుంది.అన్నాడు.
వెంటనే శాతకర్ణి శరీరంలోనుంచి వెలుగు(ఆత్మశక్తి ) వజ్రం లోకి వచ్చింది అప్పుడు దక్షిణామూర్తి ని, ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ది బలం ,యోగ బలం నిరూపితమైనది.
అప్పుడు దక్షిణామూర్తి "నీ ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ధిబలం, యోగబలం నిరూపితమైనది.
నీవు తక్షణం ఋష్యముఖి పర్వతం వద్దకు వెళ్ళు అక్కడ మీ ముత్తాత శాలివాహనుడు గురించి నీకు తెలుస్తుంది."
దీపాన్ని నీళ్ళతో వెలిగించడం అనేది ఆ పర్వతపు నీటితోనే సాధ్యం అవుతుంది "అని చెప్పాడు.
శాతకర్ణి తన గుర్రం మీద ఎక్కి సోమవజ్రాన్ని సంచిలో పెట్టుకుని కిష్కింద రాజ్యానికి బయలుదేరాడు.
ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది.
కిష్కింద రాజ్యాన్ని అనిరుద్ధుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. వాలి సంతతికి చెందినవాడు.
రాజ్యం పర్వతాల నడుమ ఉన్నది. చుట్టూ పర్వతాలు గోడల్లా ఉన్నాయి.






రెండు కొండల మధ్య మార్గం ఉన్నది. అది ముఖద్వారం. ఒక్కో కొండపై ఒక వానర వీరుని శిల్పం ఉన్నది. వాళ్ళిద్దరూ మల్లయుద్ధం చేస్తున్నట్టు ఉన్నది. చేతుల రెండూ బాహాబాహీ చేస్తున్నట్టు ఉన్నది, అది ఆ ముఖద్వారానికి తోరణంలా ఉన్నది.

ముఖద్వారం వద్ద వానర వీరులు శాతకర్ణిని ఆగి ఆది విచారించారు. తాను శాలివాహన యువరాజు అని శాతకర్ణి చెప్పాడు.
అరుణాచలంలోని తీవ్ర ఒత్తిడి వల్ల బక్కపలుచగా తయారయ్యాడు శాతకర్ణి.
వానరవీరుడు నువ్వు యువరాజా? అని గేలి చేసి కయ్యానికి కాలుదువ్వారు.
వెంటనే శాతకర్ణి గర్వం అణచాలని చెప్పి వారితో యుద్ధం చేశాడు.
కానీ వానర వీరుల బలం ముందు శాతకర్ణి నిలువలేకపోయాడు. వాళ్ళు ముగ్గురూ కలిసి శాతకర్ణిని మట్టికరిపించారు.
శాతకర్ణిని బంధించాలని చూశారు, అప్పుడు శాతకర్ణి శివుడిని తలచుకుని సోమవజ్రాన్ని బయటకు తీశాడు.
ఆ శక్తికి తాళలేక వానర వీరులు పారిపోయి తమ రాజ్యంలోని సాధువుని తీసుకువచ్చారు.
ఇదేదో మంత్రజాలమని తలచి ఆ సాధువు వచ్చి శాతకర్ణిని చూసి, "నాయనా ఇది సోమవజ్రం, శివుని తేజస్సు గలది. ఇది సామాన్యులకు దొరికేది కాదు. నీవు కారణజన్ముడివి నిన్ను మా గురువుగారి వద్దకు తీసుకువెళతాను" అని తీసుకెళ్ళాడు.
సొరంగ మార్గంలో నుంచి భూగర్భగుడిలోకి ప్రవేశించారు ఇద్దరూ.
ఒళ్ళంతా తెల్లని జుట్టుతో సింహాసనం మీద ఉన్న ఒక యోగిని చూశారు శాతకర్ణి.
ఆ గదిలో వానరులు మల్లయుద్ధం, గదాయుద్ధ శిక్షణ పొందుతున్నారు.
అప్పుడు శాతకర్ణి నమస్కరించి, "యోగిపుంగవా, ఎవరు మీరు? "అని అడిగాడు.
ధ్యానంలో ఉన్న ఆ యోగి, శాతకర్ణి చేతిని చూసి, నాయనా నీవు అచ్చం మీ ముత్తాతలా ఉన్నావు, మీ ముత్తాత కుండలిని కూడా అదే అని అన్నారు.
ఆశ్చర్యంగా చూశాడు శాతకర్ణి
"నా పేరు జాంబవంతుడు. నేను ఈ కిష్కింధ రాజ్యానికి రక్షకుడిని "అని అన్నారు ఆ యోగి.
అప్పుడు జాంబవంతునికి నమస్కరించి శాతకర్ణి, మిమ్ములను కలుసుకోవడంతో నా జన్మ ధన్యమయినది.
"నా ముత్తాత మీకు తెలుసా "అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు, “పరశురాముడు సృష్టించిన ఈ దక్షిణ జంబూ ద్వీపంలో తరాల కొద్దీ రాజులను, రాజ్యాలను పరిరక్షించడానికి నియమింపబడిన వారిలో నేను ఒకడిని మా అందరికీ అధినాయకుడు ఒకరు ఉన్నారు. త్వరలో నీకు తెలుస్తుంది. మీ ముత్తాత శ్రీముఖ శాలివాహనుడు. బాలకుడిగా వచ్చిన ఆయనకు బాహుబల సంపన్నునిగా మార్చింది మేమే.
ఆయన గొప్ప వీరుడు ఒక్క కత్తి వేటుతో 15 మందిని చంపిన ఘనుడు. "
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం జాంబవంతుల వారు అని అడిగాడు.
మీ ముత్తాత ఆయుధం పేరు ఉరిమి. మూడు కత్తులు ఒక్క పిడితో చేయబడి ఉంటాయి, కత్తులకు వంగే గుణం ఉంది. కత్తిని తాడులా గుండ్రంగా చుట్టి ఒక్క ఉదుటన వదిలేవాడు ,చుట్టూ చక్రంలా తిప్పేవాడు. ఆదృశ్యం ఇప్పటికీ నా ముందు కదలాడుతుంది అని చెప్పాడు.
"నా ముత్తాత గురించి ఇంకా వివరాలు చెప్పండి" అన్నాడు శాతకర్ణి.అప్పుడు జాంబవంతుల వారు, కాలమే నీకు కధగా చెబుతుంది నాయనా అన్నారు.
“ నీవు వచ్చిన కార్యమేమి “ అని అడిగాడు.
“నేను ఈ తాళపత్ర గ్రంధంలోని రెండో వాక్యం కోసం వచ్చాను, నన్ను దక్షిణామూర్తి గారు ఇక్కడికి అరుణాచలం నుండి పంపారు " అని అన్నాడు.
ఆ తాళపత్రం చూశాడు జాంబవంతుడు, అగ్నితో నీటి దీపం వెలిగించవచ్చు అని చదివారు. "నాయనా ఆ జలాలు ఋష్యముఖి పర్వతం మీద ఉన్నాయి, అక్కడ మాతంగ ముని ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమ౦లోని కొలనులో ఆ నీరు దొరుకుతాయి.మామూలు వ్యక్తులకు అక్కడ ప్రవేశం నిషిద్దం. ఆ కొలనుకు యక్షులు కాపలాగా ఉంటారు. నీవు శక్తిహీనుడిలాగా ఉన్నావు. కావున నీవు సరైన శిక్షణ నా వద్ద తీసుకోవలసి ఉంటుంది. సాధువు చెప్పారు. “నిన్ను మల్లయుద్ధంలో వానరులు ఓడించారని”. .
నీ కుండలిని బట్టి నీవు ఈ జంబూద్వీపానికి చక్రవర్తిని అవుతావు. అతులిత బలసంపన్నుడివి అవ్వాలి. నేను నీకు శిక్షణ ఇస్తాను.
మొదట నీవు అంజనాద్రి పై ఉన్న మూలికలు తీసుకురావాలి, ఈ సాధువు నీతో పాటు వస్తారు. ఆ మూలికలు స్వయం ప్రకాశాలు, అని చెప్పి పంపించారు."
అంజనాద్రి అక్కడున్న చాలా పెద్ద పర్వతం, నిండా దట్టమైన వృక్షాలు ఉన్నాయి వానరులు చెట్ల మీదనుంచి దూకుతూ వెళుతున్నారు. శాతకర్ణిని నేలమీద నుంచి రమ్మన్నారు.
శాతకర్ణి నవ్వుతూ నా బాల్యమంతా వృక్షాల ఒడిలోనే జరిగింది అని ఒక్క ఉదుటన చెట్టు ఎక్కి ఊడల సాయంతో చెట్లపై దూకుతూ వెళ్ళాడు.
ఆశ్చర్యపోవడం వానరుల వంతయ్యింది. వారం రోజుల తర్వాత అక్కడి మూలికలు, పండ్లు తినడం వల్ల దేహదారుఢ్యం పెరిగింది శతకర్ణికి, ఆఖరికి అంజనాద్రి మీదకు చేరుకున్నారు.
ఇంతలో గాలివానలో వచ్చి శాతకర్ణి తప్పిపోయాడు. అక్కడ ఒక చిన్న గుహలో చేరుకున్నాడు శాతకర్ణి.
ఆ గుహలో వృద్ధదంపతులు ఉన్నారు. "వారి వద్దకు వెళ్ళి నేను మూలికల కోసం వచ్చి తప్పిపోయాను అని చెప్పాడు ",శాతకర్ణి.
తుఫాను తగ్గకపోవడంతో ఆ వృద్ధ దంపతులకు, ఆహారం నీరు సమకూర్చే వాడు.
ఒక రోజు గుహలోకి మొత్తం నీరు వచ్చేసింది ముదుసలి దంపతులు మునిగిపోతున్నారు. అప్పుడు వాయు స్తంభన విద్యతో, తాను మునిగి వారిద్దరినీ పైకి లేపి ఉంచాడు.
తుఫాను తగ్గిన తర్వాత తాత " నాయనా మాకు చాలా సేవ చేశారు. నీ రుణం తీర్చుకోవడానికి ఈ హారం తీసుకో, దారిలో ఉపయోగపడుతుంది అన్నారు.
కానీ ఈహారo ఎవరికీ చూపించకూడదు అన్నారు.
ఈ హారం వాలికి ఆయన తండ్రి ఇంద్రుడు ఇచ్చింది. ఇది ఎవరు పడితే వారు ధరించలేదు. దీని శక్తిని తట్టుకుని నిలబడలేదు. కాబట్టి నీవు కారణజన్ముడిలా ఉన్నావు. నీవు బలశాలిలా ఉన్నావు,తీసుకో "అన్నారు.
శాతకర్ణి హారం వేసుకున్నాడు. కానీ దాని శక్తిని తాళలేక తాతకి ఇచ్చేశాడు. తాత శాతకర్ణితో "అంజనాద్రి చిట్టచివర కొన్ని మూలికలు ఉంటాయి అవి నీకు చూపిస్తాను కానీ నేను అంత ఎత్తు ఎక్కలేను అన్నాడు. "
తాతని భుజం పై వేసుకుని శాతకర్ణి చిట్టచివర పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడి చెట్టుకి యక్షులు కాపలా కాస్తున్నారు. అప్పుడు యక్షులతో శాతకర్ణి యుద్ధం చేశాడు. యుద్ధంలో యక్షులు భయంకరంగా పోరాడుతున్నాడు. ఆఖరికి మొలలో ఉన్న సంచిలో ఉన్న సోమవజ్రాన్ని బయటకు తీశాడు. కానీ ఆ కాంతిని తట్టుకుని యక్షులు మళ్ళీ పోరాడసాగారు. వారి యుద్ధ నైపుణ్యం ముందు శాతకర్ణి నిలువలేక పోయాడు. అప్పుడు శాతకర్ణి తాత వద్ద దాచిన హారాన్ని వేసుకున్నాడు. వెంటనే శాతకర్ణి శక్తి పెరిగింది. యక్షులను ఓడించి బంధించాడు.
అప్పుడు ఆ మూలికలను తీసుకుని గుహలోకి వచ్చాడు శాతకర్ణి తాతతో అన్నాడు శాతకర్ణి, ముందు నేను హారాన్ని వేసుకున్నప్పుడు తాళలేక పోయాను, ఇప్పుడు ఎలా భరించగలిగాను అన్నాడు.
అప్పుడు తాత "ముందు నువ్వు సందేహంతో వేసుకున్నావు, నాలో ఆ శక్తి ఉందా అని, “ముందు వానరుల చేతిలో ఓటమి గుర్తుకు వచ్చి”
ఇప్పుడు నువ్వు నేను యక్షులను ఓడిoచాలి అని సన్నద్ధమై ఈ హారాన్ని ధరించావు.
మొదట నీలో అంధకారం పాళ్ళు ఎక్కువ, ఇప్పుడు నీలోని వెలుగు అంధకారాన్ని జయించింది.
ఈ హారం యొక్క శక్తి అదే విజయీభవ అని మూలికతో మీ ప్రాంతానికి వెళ్ళు అన్నారు" తాత.
ఉత్సాహంతో శాతకర్ణి జాంబవంతుని వద్దకు వచ్చాడు.
నాయనా నీకు కావలసిన దేహదారుఢ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని కూడగట్టుకున్నావు.
ఈ ములికా రసంతో నా సైన్యాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్దుతాను అని అన్నారు.
అప్పుడు మహారాజు అనిరుద్ధుడు వద్దకు జాంబవంతుడు తీసుకెళ్ళాడు.
శాతకర్ణికి నమస్కరించి అనిరుద్ధుడు, మీ తాతగారు మా రాజ్యం కష్టకాలంలో ఉన్నప్పుడూ మాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు మీకు ఏమైనా సాయం కావలిస్తే మమ్ములను అడగండి అన్నాడు. అప్పుడు శాతకర్ణి సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను. ఇక్కడ నుండి ఋష్యముఖి పర్వతానికి వెళ్ళాలి అనుమతించండి అని అడిగాడు.
మా సంతతి వారు ఆ పర్వతం పైకి వెళ్ళడం నిషిద్ధం. మహా వాలికి మాతoగ ముని శాపం అది ,కావున మీరు ఒంటరిగా వెళ్ళండి అని చెప్పాడు.
అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.
అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వారసులు ఉన్నారు.
అక్కడ ఒక హనుమంతుని గుడి ఉన్నది.
అప్పుడు శాతకర్ణి మునులతో చెప్పారు. “నేను శాలివాహన రాకుమారుడిని దీపంతో నూనె కాకుండా జలంతో వెలగాలి.
దీపాన్ని వెలిగించే జలాన్ని అన్వేషించ వచ్చాను, కాబట్టి మీరు మార్గం చూపించాలి” అని అన్నారు. ఇక్కడి కొలనులోని జలాన్ని శివుని ఆత్మలింగంపై అభిషేకించాలి అప్పుడు ఆనీటికి దీపాన్ని వెలిగించే శక్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక కొలను చూపించి ఈ జలం తీసుకోండి అన్నారు. కొలనులో నీళ్ళు లేవు. ప్రతీ సంవత్సరం మార్గశిర ఏకాదశి నాడు ఆకాశగంగ ఇక్కడకు వస్తుంది, ఆ ఆకాశగంగని తీసుకోవడానికి పాత్ర మాత్రం తెల్ల ఆవునుండి తయారుచేసినదై ఉండాలి, కానీ ఆ జంతువు రక్తం మాత్రం చిందకూడదు. ఆ రక్తం ఈ ఆశ్రమ భూమిపై చిందితే ఈ ఆశ్రమం శాపం నీకు తగులుతుంది అన్నాడు.
అప్పుడు, శాతకర్ణి బాగా ఆలోచించి ఆవు కొమ్ముతో నీళ్ళు పడదాము అని చెప్పి, కానీ రక్తం రాకుండా వాటిని తీయడమెలా అని ఆలోచించి సోమవజ్రానికి అనంతశక్తి ఉంది. ఆ శక్తిని చిన్న కిరణంలా మారిస్తే అని తలచి ఒక సీసపు పెట్టెలో వజ్రాన్ని పెట్టి మూసాడు. తన ఆత్మ శక్తితో వెలిగించాడు. అందులోనుంచి ఒక కిరణం వచ్చింది. ఆ కిరణం శక్తికి చెట్టు పడిపోయింది మెల్లగా కొమ్మును ఆ కిరణం సాయంతో కత్తిరించాడు.
రక్తం రాకుండా తెగిపోయింది కొమ్ము.
మార్గశిర ఏకాదశి రానేవచ్చింది, ఆ కొమ్ముతో నీరు పట్టి, ప్రమిద వెలిగించాడు శాతకర్ణి.
ఇప్పుడు ఆ దీపాన్ని ఆకాశంలో మూడు వెలుతురులు మధ్య పెట్టాలి అది ఎక్కడ అని ఆలోచించసాగాడు.
అప్పుడు శాతకర్ణి ఆలోచించాడు, పరశురాముడు కేరళ ప్రాంతాన్ని నిర్మించాడు కదా, అక్కడకు వెళ్ళి వెతుకుదాము అని బయలుదేరాడు.
దారిలో ఒక పండితుడు శాతకర్ణికి కనిపించాడు. ఆయన దుర్భిణిలో చుక్కలను చూస్తున్నాడు. అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి స్వామీ మీరు ఏమి చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన “నా పేరు భట్టు, నేను ఖగోళశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. అని అతనికి ధృవ నక్షత్రం దుర్భిణిలో చూపించాడు. శాతకర్ణి సంతోషించి, నాకు ఒక సందేహం ఉంది ఆకాశంలో మూడు వెలుగులు ఎక్కడ ఉంటాయి. చుక్కలైతే లెక్కపెట్టలేనన్ని ఉంటాయి కదా అని అన్నాడు.
అప్పుడు భట్టు నాయనా, ఇప్పుడు వచ్చే మాసంలో మకర సంక్రాంతి నాడు ఆకాశంలో శబరిమల పైన మూడు కాంతులు దర్శనమిస్తాయి అని చెప్పారు.
అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. శబరిమల పైకి ప్రయాణం సాగించాడు.
దారి మధ్యలో హనుమంతుని గుడి ఒకటి ఉన్నది. ఆయన ఆ గుడి వద్ద ఆగారు. అక్కడ ఒక యోగిని చూశాడు. అప్పుడు ఆ యోగి శాతకర్ణిని నాయనా ఎవరు నీవు అని అడిగాడు.
అప్పుడు శాతకర్ణి తన దగ్గర ఉన్న సోమవజ్రాన్ని, నీటిని చూపించాడు. అప్పుడు ఆయన నీవు ఇచ్చటకు వచ్చిన పని ఏమిటి అని అడిగారు.
అప్పుడు శాతకర్ణి ఆకాశంలో మూడు వెలుగుల మధ్య ఈ వెలుగు పెట్టాలి, అని చెప్పాడు.
అప్పుడు ఆ యోగి “నాయనా, మకర కలువు అంటే మూడు వెలుగులు, ఆ
వెలుగులు మకరసంక్రాంతి రోజున కనిపిస్తాయి కానీ ఆ వెలుతురులో ఒక మర్మం ఉన్నది. బ్రహ్మచారి, ఐహిక సుఖాలను వదలి, సాత్వికాహారం భుజించి దీక్షగా దేవుని స్మరించువారికి ఆ మూడు వెలుగులు స్పష్టంగా కనిపిస్తాయి. వెలుగులు క్షణకాలం పాటు ఒక్కొక్కటిగా వస్తాయి.”
“ఆ వెలుగుల నుండి ఒక శక్తి వచ్చి అది చూసిన వారిలో ఒక నూతనోత్తేజం నింపుతుంది.”అని అన్నాడు.
ఆ రోజు మకరసంక్రాంతి
అప్పుడు శబరిమల శిఖరం పైకి ఎక్కి మూడు వెలుగులను చూశాడు. ప్రమిదలో నీరు పోసి, సోమవజ్రాన్ని వెలిగించాడు తన ఆత్మశక్తితో దీపం వెలిగింది. ఒక్కసారిగా పెద్ద వెలుతురు వచ్చి మూడు వెలుగుల నుండి దీపానికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు కొండ క్రింది ఒక చోట పడింది. అక్కడ ఒక గుర్రం కనబడింది. సోమవజ్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద ఎక్కి వెళ్ళాడు.
క్రిందకు వచ్చి చూస్తే అక్కడ పెద్ద కొలను ఉన్నది.
కొలను చుట్టుప్రక్కల చూశాడు ఏమీ కనబడలేదు.
కొలను లోపలికి దూకాడు శాతకర్ణి లోపల ఒక గుహలాగా ఉంది. దానికి ద్వారం ఉంది వెలుగు ఆ ద్వారం మీద ఉంది. లోపలి తలుపు తీయగా బయట తలుపు మూసుకుపోయింది, లోపల నీళ్ళన్ని బయటకు వెళ్లిపోయాయి. లోపల ఇంకో ద్వారం ఉన్నది. ద్వారం తీయగానే, ఆ వెలుగు లోపల ఉన్న ఒక వ్యక్తిపై పడింది.
ఆ వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
అద్బుతమైన ఆ ముఖవర్చస్సు చూసి ఆశ్చర్యపోయిన శాతకర్ణి నమస్కారం చేసి మహానుభావ మీరెవరూ అని అడిగాడు.
అప్పుడు శ్వేతాంబరధారి అయిన ఆయన మేని బంగారు ఛాయతో వన్నెలీనుతోంది. ఆయన వెండిరంగు గెడ్డం,వస్త్రాల అందాన్ని రెట్టింపు చేస్తున్నది.
అప్పుడు ఆయన నవ్వుతూ,"నాయనా నీ సాహసాలు,అంకుఠిత దీక్ష నాకు నచ్చాయి. నిన్ను ఈ (దేశానికి) జంబూ ద్వీపానికి చక్రవర్తిగా చేయడానికి ఘడియలు దగ్గరకు వచ్చాయి అన్నాడు.అప్పుడు ఆయన నీవు అశ్వమేధయాగం,రెండు రాజసూయ యాగాలు చేస్తావు.నీ కంటే ముందు రఘువంశ నందనుడు ఆ మహాత్కార్యం చేసాడు. ఆయన కంటే ముందు నీను ఆ పని చేసాను.నా పేరు మహాబలి చక్రవర్తి అని చెప్పాడు.నేను మహావిష్ణువు ఆజ్ఞానుసారం పాతాళలోకంలో ఉండి సంవత్సరానికి ఒక సారి ఈ భూమి మీదకు వస్తాను.
నేను, నా స్నేహితుడు ఈ జంబూద్వీపానికి పరిరక్షకులము.పూర్వo దక్షిణ జంబూద్వీపం నిత్యం సముద్రుడు ఆధీనంలో ఉంది, ఎప్పుడూ జీవజాతులు సముద్రుని కోపానికి బలి అవుతూ ఉండేవి. దైవ సంపన్నుడు, దివ్యాంశ శంభూతుడు అయిన పరశురాముడు, దుష్ట క్షత్రియ వధ చేసి, రాజ్యాన్ని స్దాపిoచాలనుకున్నారు. కానీ సముద్రుడు వల్ల ఉన్న ముప్పును ముందే పసిగట్టిన భార్గవరాముడు అతనితో యుద్దం చేసి కట్టడి చేసాడు.
సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యతోను తన నెత్తిన వేసుకున్న పరశురాములవారు అగస్త్యమునితో కలసి కొడంగల్లూరులోని భగవతి అమ్మవారిని ప్రతిష్టించారు.ఆదిశక్తి మహిమ వల్ల అక్కడ గురుకులం స్థాపించి అన్ని శాస్త్రాలను అభివృద్ది చేసారు."అని అన్నారు.
అప్పుడు మహాబలి శాతకర్ణిని తీసుకుని ఆలయం క్రింద ఉన్న సొరంగ మార్గంలో ఇంకొక భూగర్గ ఆలయంలోకి తీసుకెళ్లారు. అందులో అందరూ ఒక మర్మకళను అభ్యసిస్తున్నారు. అందులో శిక్షణ చాలా కఠినంగా ఉంది.
అది చూసిన శాతకర్ణి, "రాజోత్తమా,మిమ్ముల్లి కలవడం నా జన్మ అదృష్టం, నేనెంతో పుణ్యం చేసుకున్నాను. మీరు మహా గ్రేసరులు, అంతకు మించి మానవోత్తములు.ఈ యుద్దవిధ్య ఏమిటో సెలవివ్వగలరు" అన్నారు.
దీన్ని పరశురాములు వారు అభివృద్ది చేసారు. అగస్త్యముని, ఎంత ప్రయాసలకొర్చి దీన్ని శిష్యులకు నేర్పించారు.
మేమందరం దీనిని కలరి అని పిలుస్తాము. ఇది మానసిక, శారీరక పరిపూర్ణత పొందిన వారే చేయగలరు. మేము చిన్నవయసు నుండి ఈ యుధ్ధకళను నేర్పిస్తాయి. దాంతో వారు పరిపూర్ణ సైనికులవుతారు. వారిని ఈ మహాభారత సామ్రాజ్యానికి పరిరక్షకులుగా నియమిస్తాము.
ఇందులో కొందరు సంఖ్యాశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, శల్యశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతులు మన సామ్రాజ్యానికి పునాది రాళ్ళుగా ఉన్న ఈ విజ్ఞులను ఈ భగవతి ఆలయమే తయారు చేసింది.కాలాలు మారినా ఈ దేశాన్ని రక్షించడానికి కొందరు చిరంజీవులను ఈ ఆలయం ఆదేశించింది.అందులో నేను, నా స్నేహితుడు ముఖ్య భూమిక పోషిస్తాము "అన్నారు.
అప్పుడు శాతకర్ణిని చూసి మహాబలి నాయనా నీ తేజస్సు నిన్ను చూస్తుంటే నీ తాత గారు శ్రీముఖుశాలివాహనుని చూస్తున్నట్లుంది. ఆయన మహా తేజోమంతుడు.
అప్పుడు శాతకర్ణి మహాబలితో," విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి "అన్నారు.
మహాబలి అప్పుడు ఇలా అన్నారు ... "ఈ దేశాన్ని విక్రమాధిత్యుడు వేల సంవత్సరాలు పాలించారు. తన తమ్ముడు భట్టితో కలసి
కొంతకాలానికి సైన్యాధ్యక్షులు అధికారదాహం వల్ల సామంత రాజులు రాజ్యాలను కొల్లగొట్ట సాగారు. అలాగే శ్రీముఖుని తండ్రి రాజ్యాన్ని తగుల బెట్టారు.కోపంతో రగిలిపోయిన 10 ఏళ్ళ శ్రీముఖుడు, విక్రమాధిత్యుని ఓడించడానికి లక్షమంది సైన్యాన్ని తయారు చేసాడు."
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యం అన్నారు.
అప్పుడు మహాబలి ఇలా సెలవిచ్చారు "నిజం సైన్యం కాదు, మట్టితో చేసిన బొమ్మలు, అతనిని ఒక నాగా సాధువు తీసుకొచ్చి మా వద్ద వదిలాడు, అతని కుండలినిలో మహారాజయోగం ఉంది అని
అప్పుడు అతనిని అరుణాచలంలో బుద్ది బలాన్ని, రిష్య ముఖ పర్వతాలలో భుజ బలాన్ని పెంపొందించుకునేలా సమగ్ర శిక్షణ ఇప్పించాము.విక్రమార్కుని పై యుద్దానికి శ్రీముఖుని సన్నద్దం చేసాము.
మా మిత్రులు ద్వారా లక్షమంది సైన్యాన్ని సమీకరించాము. కానీ విక్రమార్కుని సైన్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది.
అందరికీ నాగాసాధువు లక్షమంది సైన్యం, శ్రీముఖుడు తయారు శ్రీముఖుడు చేసిన మట్టిబొమ్మల నుంచి సృస్టించారని వదంతి వ్యాపింప చేసాం.
యుద్ధ భేరి మ్రోగింది .శ్రీముఖుడు ఉరిమి అనే ఆయుధం తో బరిలోకి దిగాడు .




ఒకే పిడిలో ఉన్న మూడు వంగే కత్తులలో చుట్టూరా గోళాకారంలో తిప్పుడూ రధం పైకి ఎక్కి ముందుకు ఉరికాడు శాలివాహనుడు.
శాలివాహనుడు, యుద్దంలో ఉరిమిలో విజృంభిస్తున్నాడు. సైన్యం ప్రక్కనే ఉన్న అడవిలో తలదాచుకున్నారు
పెద్ద ఎత్తున ఉన్న విక్రమార్కుని సైన్యాని నిలువరించలేక పోతుంది కాబట్టి.
ఒకే ఒక్కడు శాలివాహనుడు బయలుదేరారు. అప్పుడు శాలివాహనుడు, చక్రవ్యూహంలోకి అడుగుపెట్టారు.
వ్యూహం మధ్యలో వెళ్ళగానే కత్తులలో 15 మంది చుట్టుముట్టారు.
ఉరిమిని పైకి లేపి, గుండ్రంగా ఒక వేటు వేసాడు శాలివాహనుడు ఉరిమిలోకి కత్తులు, మెరుపుల్లా పదిహేను మందినీ చంపేసాయి.
తేరుకున్న సైనికులు రెండో వలయంలో 30 మంది బాణాలు సంధించారు.
ఉరిమితో వలయాకారంలో ఉరిమి తిప్పుతూ అతి వేగంగా తన చుట్టూ గోళాకారం లో రక్షణవలయాన్ని స్టాపించాడు.
తన మొలలోనించి ఒక కత్తిని తీసాడు.




నెలవంక ఆకారంలో ఉన్న రెండు కత్తులను రెండు వైపులా విసిరాడు శతవాహనుడు. సుదర్శన చక్రం లా రెండు కత్తులూ తిరుగుతూ 30 మందినీ చంపేశాయి, వెంటనే తన చేతుల్లోకి వచ్చేసాయి.
వెంటనే సైన్యం అంతా చక్రవ్యూహం వైపు వచ్చి చుట్టుముట్టారు.
రధంలోనుంచి దూకి మహాబలి ప్రసాదించిన పరశురాముని గొడ్డలి బయటకు తీసారు శ్రీముఖుడు .
వెంటనే గొడ్డలి వేగంగా తిప్పుతూ గాలిలోకి విసిరారు.
ఆకాశంలో ఆ గొడ్డలి వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఎర్రగా సూర్యునిలా వెలుగుతూ నిప్పులు రువ్వసాగింది.
ఆ వెలుగుకు అందరూ కుప్పకూలిపోయారు విక్రమార్కునితో సహా.
వెంటనే అడవిలో ఉన్న సైన్యం, అందరినీ బంధించింది.
విక్రమార్కుడు తప్పించుకున్నాడు.
చండప్రచండంగా ఉన్న ఆ గొడ్డలి మళ్ళీ శాలివాహనుడు చేతిలోకి వచ్చింది.
అలా మీ ముత్తాత శాలివాహనుడు అలా విక్రమార్కుని ఓడించి శాలివాహన శకాన్ని స్థాపించారు .
ఆ గండ్రా గొడ్డలిని హిమాలయలకు తీసుకెళ్ళి అమరనాధునితో నిక్షిప్తం చేసాము.
అప్పుడు మహాబలి నాయన అది మీ ముత్తాత కధ అని చెప్పారు.
మహాబలి "నాయినా నీకు కూడా చక్రవర్తి యోగం ఉంది. ఈ దేశాన్ని బయట శత్తులు ఆక్రమిచడానికి పన్నగాలు పన్నుతున్నాయి. వాటిని నీవు నిలువరించాలి.అలా నిలువరించాలి అంటే నీవు చతురంగ బలాలు, నావికా బలాలలో సుసంపన్నం అవ్వాలి.
నావికా బలం పెంపొందాలంటే మన ప్రక్కన ఉన్న సింహళ రాజ్యాన్ని మనం మిత్రులం చేసుకోవాలి."
జలపాతం పైన సింహళ రాజు కోట ఉంది .అది పర్వత రాజ్యం. హోరుగా ఉన్న జలపాతం ఎక్కి అడవి ని చేరుకున్నాడు .అక్కడ ఒక యువకుడిని పులి దాడి చేసింది .చుట్టూ ఉన్న సైనికులు ఆయన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ,కానీ ఆ బెబ్బులి ధాటికి తట్టుకోలేక పారిపోయారు.
అప్పుడు శాతకర్ణి పులి పై దూకి దానిని నిలువరించారు .
అప్పుడు ఆ యువకుడు కృతజ్ఞతలు చెప్పి తాను సింహళ దేశ యువరాజు అని చెప్పి రాజ్యానికి తీసుకెళ్లాడు.
సింహళ రాజును కలిశాడు శాతకర్ణి .శాతకర్ణి కి ఘనసత్కారం చేసాడు రాజు.
అప్పుడు శాతకర్ణి తాను శాలివాహన యువరాజు అని చెప్పి తనువచ్చిన కార్యం గురించి చెప్పాడు.
సింహళ రాజు "ఆ మ్లేచ్చుల తో మాకు చిరకాల వైరం ఉంది, మీకు యుద్ధం లో నా నావికా దళం కావాలంటే ,మీరు నాకు ఒక సహాయం చేసిపెట్టాలి."అన్నారు.
"ఈ రాజ్యం దగ్గర లో పిపిరి పర్వత శ్రేణి లో ఒక తెగ వారు నివసిస్తున్నారు .వారు నాగరికులకు దూరం గా ఉంటారు .వారి వద్ద మహాశక్తి ఉందని సమాచారం. ఆ శక్తి వల్ల వారు అతులిత బలధాములలాగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. సింహళ దేశ బెబ్బులి ని మీరు ఒంటి చేత్తో మట్టికరిపించారు .మీరు మహా యోగి లాగా ప్రకాశవంతం గా ఉన్నారు. . గత కొన్నేళ్లుగా మా దేశం లో ఒక భయంకర మహమ్మారి పీడిస్తుంది, ఆ మహమ్మారికి విరుగుడు వారి వద్ద ఉందని మా రాజ్యగురువు చెప్పారు. ఈ పని చేస్తే మీకు జీవితాంతం రుణ పడి ఉంటాము .ఈ సాయం చేస్తే మీకు నా కుమార్తె ను ఇచ్చి వివాహం చేస్తాను" అని రాజు చెప్పారు .
..........
శాతకర్ణి రాజు వద్ద సెలవు తీసుకుని పిపిరి పర్వతశ్రేణి లోకి పయనమయ్యాడు.
నాగరిక వేషధారణ వదిలేసి శాతకర్ణి ఆ తెగ వద్దకు చేరుకున్నాడు .
సైనికులు ఆ తెగకు కాపలాగా ఉన్నారు.శాతకర్ణి వంటి మీద వస్త్రాలు లేకుండా ఆ తెగ ఉండే చోటు వద్దకు చేరుకున్నాడు. అతనికి అక్కడ దట్టమైన అడవి తప్ప ఏం కనిపించలేదు.తురీయ స్థితి లోనుండి ధ్యానం చేయగా మసక గా ఒక గ్రామం
కనపడింది.ఆ ప్రదేశం ఇంకా స్ప్రష్టంగా కనపడటానికి తురీయాతీత స్థితి కి చేరుకున్నాడు. శాతకర్ణి దివ్య తేజస్సు తో వెలిగిపోతున్నాడు. వేరే కాలప్రమాణం లోఉన్న పిపిరి తెగ వారు శాతకర్ణి తేజస్సు చూసి బాహ్య కాలప్రమాణం లోకి వచ్చి తమ లోకం లోకి తీసుకెళ్లారు.
అప్పుడు అర్ధమైంది శాతకర్ణి కి ఈ రహస్య జీవులు ఎలా మిగిలిన ప్రపంచానికి తెలియకుండా ఉంటున్నారో .....
శాతకర్ణి వారి తెగ నాయకుడైన మాతంగ ధీశుని కలిశారు.
శాతకర్ణి మాతంగా ధీశునితో ఎన్నో సైద్దాంతికపరమైన చర్చలు జరిపారు.
కానీ వారి ఆలయంలోకి మాత్రం రానిచ్చేవారు కాదు.వారి దేవాలయం చాలా విశాలమైనది.ఒక పెద్ద సరస్సులో ఉంది. చాలా పురాతనమైనది. నాలుగు ప్రాకరాలు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవులు, అడవి నుండి దేవాలయానికి కర్రల వంతెన ఉంది.
ఆ ఆలయంలోకి బయట వారికి ప్రవేశం లేదని మాతంగధీశుడు తెలిపాడు.
కొన్ని రోజులకు శాతకర్ణికి తెలిసింది, ప్రతీ నలభై ఒక్క సంవత్సరాలకు ఒక యోగి ఆ దేవాలయానికి వచ్చి అందరికీ ఉపదేశం చేస్తారని ఆయన సంరక్షణలోనే ఈ తెగ ఉన్నదని, ఈ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడేది, ఆ యోగ శక్తి అని చెప్పారు.
ఆ రోజు రానే వచ్చింది.ఆలయం బయట శాతకర్ణి తురీయ స్ధితిలో ఉన్నారు.
యోగి పుంగవుని రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అంతలో ఒక దివ్యకాంతి పుంజం గుడి బయట ఆవిర్భవించింది.
యోగి పుంగవుడు ఆ కాంతిలోంచి వచ్చారు.ఆయన తురీయాతీత స్ధితిలో ఉన్న శాతకర్ణిని చూసి,అతన్ని యోగ విద్య నుండి లేపి,నాయనా నాతో పాటులోనికి రా అని లోపలికి తీసుకువెళ్ళారు.
యోగితో శాతకర్ణి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి,యోగికి నమస్కరించారు.అందరూ తమ తమ సందేహాలను యోగిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు.
దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న యోగిని చూసి శాతకర్ణికి నోట మాట రావటంలేదు.
యోగి పుంగవులు అందరికీ ఒక మంత్రం ఉపదేశం చేసాడు.
యోగి చెబుతూ ఈ మంత్రం మనస్సులో అనుకుంటే నేను వారికి ప్రత్యక్షం అవ్వుతాను.కానీ మంత్రం చదివిన వ్యక్తి నాతో ఆత్మశక్తి పంచుకోగలిగిన వాడై ఉండాలి, లేకపోతే తన్ను తాను తెలుసుకున్నవాడై ఉండాలి అని అన్నారు.
వెంటనే మాతాంగుల వారు, యోగిని అడిగారు,స్వామి, ఇతని పేరు శాతకర్ణి,అన్యులకు సాధ్యం కానీ ఈ ఆలయ ప్రవేశం ఇతని కెలా సాధ్యమయ్యింది అని అన్నారు.
అప్పుడు యోగి,ఇతను మహానుభావుడు,చక్రవర్తి అంశతో పుట్టినవాడు. భగవతీ ఆలయంలో సుశిక్షితుడు.అంతకుమించి తురియ,తురీయాతీత స్ధితిని సాధించినవాడు.అతులిత బల సంపన్నుడు. అత్యంత పవిత్రమైన సోమవజ్రాన్ని కలవాడు.
ఇతను రాజసూయ యాగ యోగo ఉన్నవాడు. మీ ఉపదేశం పూర్తి అయినది. శాతకర్ణి తప్ప మిగిలిన వారు, బయటకు వెళ్ళండి అని యోగి చెప్పారు.
అప్పుడు యోగి ఇలా చెప్పారు,నాయనా నేను హనుమంతుడిని,పరశురాముడు స్ధాపించిన భగవతీ ఆలయ పరిరక్షకుడిని. మన జంబూద్వీపంలో సనాతన ధర్మ పరిరక్షకుడిని అరుణాచలంలో నీకు గాయాలు అయ్యినప్పుడు,నీటిలో మునిగిపోయినప్పుడు నిన్ను కాపాడింది నేనే,దక్షణామూర్తి అనే పండితుడిని నేనే,కిష్కిందలో నువ్వు కాపాడిన వృద్ధుడిని కూడా నేనే,నిన్ను అడుగడుగునా కంటికి రెప్పలా చూసుకున్నాను.
అప్పుడు శాతకర్ణి హనుమంతునికి నమస్కరించి,మీ చేతిలో మలచబడ్డ శిల్పాన్ని నేను అని కన్నీరు పెట్టుకొని ఆ యోగ కాంతికి సాష్టాంగ నమస్కారం చేసారు.
ఈ రహస్యాన్ని చాలా గోప్యంగా ఉంచాలి, మన జంబూద్వీప మనుగడకి పరశురాముని భగవతీ విశ్వవిధ్యాలయం పునాధి. నేను మహాబలి చక్రవర్తి ,జాంబవంతులవారు సరైన నాయకత్వం, పాలన, రాజ్యాభివృద్ధి కలిగేలా చూస్తున్నాము.
ఇది ఎవ్వరికీ తెలియకుండా తరతరాలుగా చేస్తున్నాము.నీవు ఎవ్వరికీ ఈ విధానం చెప్పకూడదు అని చెప్పి.
ఈ భూభాగాన్ని జంబుద్వీపాన్ని పరిరక్షించడానికి ఒక ఆయుధం నీకు ఇస్తాను అని చెప్పి అడవిలోకి తీసుకువెళ్ళారు.
అక్కడ ఒక జలపాతం క్రింద ఒక గుడి ఉంది.అది రావణాసురుని గుడి, శివాలయం కూడా ఉంది. రావణసురుని గొప్పతనానికి మెచ్చి రాముడు ఆయనకు గుడి కట్టించారు.
ఆ గుడి చాలా దట్టమైన అరణ్యంలో ఉంది అక్కడకు వెళ్ళి శాతకర్ణి, హనుమంతులవారు గుడిలో రహస్య మార్గంలోనికి వెళ్ళారు.
ఆ రహస్య మార్గంలో ఇంకొక గుడి ఉంది.ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే వజ్ర వైఢూర్యాలతో కూడిన రధం ఉన్నది.ఆ రధం ఎక్కి హనుమంతుల వారు ఆకాశంలోకి ఎగిరారు.పాదరసంలో పనిచేసే ఆ రాధాన్ని హనుమంతుల వారు శాతకర్ణికి ఇచ్చి అది ఎలా ఉపయోగించాలో చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ రధం ఎక్కి శాతకర్ణి సింహళ రాజు వద్దకు వెళ్ళి తెగను ఒక యోగి కాపాడుతున్నారని చెప్పి ఆ రధాన్ని చూపించారు.
ఇంతటి యోగ్యుడికి తన కుమార్తెను పెళ్ళి చేస్తానని చెప్పి, శాతకర్ణికి తన కుమార్తెను చూపించబోయాడు... రాజ్యం స్దిరపరిచిన తర్వాత వస్తానని చెప్పి ఆయన నావికాదళాన్ని తనతో పంపాలని కోరాడు. అల్లుడి కోరికను వెంటనే తీర్చాడు సింహళ రాజు.
..............................
Like Reply
#3
ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,"మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని"
అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు
శత్రువుల బలం మనకంటే పెద్దది ,వారివి మూడంతస్తుల యుద్ధ నౌకలు ,మన నౌకా దళం చిన్నది అని తీవ్రంగా ఆలోచించసాగాడు
సింహళ దేశం నుండి నౌకలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతలో వేళ్ళని ఎలా నిలువరించాలి అని సభ ఏర్పాటు చేసాడు
వేగుల ద్వారా వారి సైన్యం పదివేలు నౌకలు అని తెలిసింది ,శాతవాహన బలం వెయ్యి మాత్రమే
తన రహస్య మందిరం లో ఒక వ్యూహం రచించాడు
యుద్ధ నౌకలు తీరాన్ని సమీపిస్తున్నాయి
వెంటనే శాతకర్ణి పాములా పొడవుగా వున్న వంద చిన్న పడవలను రప్పించాడు,అవి మెరుపు వేగం తో కదులుతాయి.
వాటిని బోర్లా పడుకోబెట్టి ఈదుకుంటూ మ్లేత్యుల నౌకలు చుట్టూ అర్ధచంద్రాకారం లాగా ఏర్పరిచారు
శత్రువులకు పాముపడవలు తిరగబడి ఉండటం వలన ఒక తాడులాగా కనిపించాయి
ఇంతలో సింహనాదం వినిపించింది
పడవకు వేలాడదీసిన పీపాకు కట్టిన తాడు కత్తిరించారు ,కత్తులతో వాటి మూతలను తీసేసి వెనక్కి ఈదుకుంటూ వెళ్లిపోయారు గజఈతగాళ్ళు .
వెళ్లే ము కింది అంతస్తులో శత్రునౌకల తెడ్డువేసే వారిని బాణాలతో చంపేశారు
నౌకలు ఎక్కడికక్కడే ఆగి పోయాయి
శత్రువుల కంటికి పీపాలు తేలుతూ కనిపిస్తున్నాయి
ఈటెల వర్షం కురిసింది శత్రు నౌకల నుండి ....
వేలాది డాలులు నీటిపై తేలుతున్నాయి
వాటిని వీపుకు కట్టుకుని ఈదుతూ తప్పించుకున్నారు శాతవాహనులు
సముద్రమంతా నల్లగా తారుతో నిండిపోయింది
ఆకాశం లో కారుమబ్బులు ఆవరించాయి ఇంతలో సముద్రం లో పిడుగు పడింది
మెరుపులు మొదలయ్యాయి
మెర్పుల వెలుతురులో శాతకర్ణి ఆకాశ వీధి లో రధం పై కనిపించాడు
అది పిడుగు కాదు శాతకర్ణి సంధించిన నిప్పుల బాణం
నౌకలు అగ్గి రాజుకున్నాయి ,వెనుక వున్న నౌకలు వెనక్కి తగ్గాయి
ఇంతలో వెనుక నుంచి సింహళ నౌకలు రానే వచ్చాయి .అవి ఐదు అంతస్తుల నౌకలు .అవి మ్లేత్యుల నౌకను చుట్టు ముట్టాయి .
చేసేది లేక యినుప గుండ్లు ప్రయోగించ సాగారు .ఇంతలో ఒక ధ్వజస్తంభం లాంటి దానిని నౌకకు ముందు వుంచి,పదునైన ఇనుప ధ్వజాన్ని
తాడు సాయం తో ఒక్కో నౌక మీద వదిలారు .వెంటనే ఆ దెబ్బకు నౌకలు మునిగి పోయాయి .సుమిత్ర బాలి దీవుల నుండి సువర్ణ వర్మ కూడా సింహళ నావికా బలానికి సాయం వచ్చారు .
మ్లేచ్చులు తమ సైన్య రక్తం సముద్ర నీటి తో ,తారుతో పాటు కలిసిపోవడం చూసి ,యవనులతో సహా ఓటమి అంగీకరించారు.
విజయధ్వానాలు మిన్నుమింటాయి .
ఇంతలో వర్తమానం అందింది నహపాణుడు దండెత్తి రాజ్య వైపు వస్తున్నాడని....
నహపాణుడు ఉత్తర దేశ సైన్యాలన్నీ కలిపి రెండు లక్షల సైన్యం తో యుద్దానికి బయలుదేరారు.
శాతకర్ణి సైన్యం 40 వేలు మాత్రమే .....
శాతకర్ణి మహాబలి ఇచ్చిన పుస్తకం లోనించి బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించాడు .
రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కోటకు రక్షణ కవచం లా అశ్వాలనూ ,ఏనుగులను నిలబెట్టాడు .
ఏనుగులకు ముళ్ల కవచం ఏర్పాటు చేసాడు
తొండానికి ఇనుప గొలుసుతో ముళ్ల ఇనుప గుండ్లు కట్టారు.ఏనుగు కు చుట్టూ పది అశ్వాలను, ఇరవై మంది సాయుధులను ఉంచారు .ఇలాంటివి వందయేనుగుల వరకు ఉంచారు.
చుట్టూ దీర్ఘచతురస్రాకారం లో సైన్యాన్ని మోహరించారు. ముందు వరుస మధ్యలో ఖాళీ వదిలారు
దీన్ని మండల వ్యూహం అంటారు
ఈ వ్యూహాన్ని పసిగట్టి గరుడ వ్యూహం పన్నాడు నహపాణుడు .
పక్షి ముక్కు ముందు వ్యూహాన్ని చీల్చేలా ,రెక్కలు రెండువైపులా చాచి మండల వ్యూహాన్ని రెండు వైపులా చుట్టుముట్టేలా పధకం వేశారు.
తమకు నాలుగు రెట్లు వున్న శత్రువులను ధైర్యం తో ఎదురు నిలిచారు శాతకర్ణి సైన్యం
ముందుకు దూసుకువచ్చింది పక్షి ముందు భాగం అశ్వదళం తో, వెనుక నుండి బాణాల వర్షం కురిసింది శాతకర్ణి సేన మీదకు .అప్పుడు శాతకర్ణి సైనికులు తయారుచేసిన యుద్ధగజాలను ముందుకు వదిలారు.
తొండాలకు కట్టిన ముళ్ల గుండ్ల తో శత్రు అశ్వాలపై విరుచుకు పడ్డాయి.
ఊహించని పరిణామాలకి హుతాశులయ్యారు నాహాపణ సైన్యం .
గరుడవ్యుహం ముక్కు పగిలిపోయింది
శాతకర్ణి మధ్యలోంచి సింహం పైకి ఎక్కి ఉరిమి కత్తి తో ముందుకు ఉరికాడు
కానీ నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
భయంకరమైన పేలుడు సంభవించి శత్రుసైన్యం చెల్లాచెదురు అయ్యారు.
ఇప్పుడు భగవతి ఆలయం నుండి వచ్చిన వీరులు రంగం లోకి దిగారు .రెండు చేతులతో ఉరిమి ని పట్టి ఒక్క వేటుతో పది మందిని బలితీసుకున్నారు . క్యాలరీ విద్య లో ౧౦౮(108 )రకాలు ఉన్నాయి ,వాటిని మార్చి మార్చి ఉపయోగించారు.దెబ్బకు శత్రు సైన్యం సగమైంది .
అప్పుడు శాతకర్ణి తన సింహం ఎక్కి సైన్యం పై విరుచుకు పడ్డాడు. మహావాలి కి చెందిన హారాన్ని ధరించి రెండు చేతులలో ఉరిమి కత్తులను పట్టి చేతులను చాచి మణికట్టు వద్ద వేగంగా గుండ్రంగా తిప్పాడు , సింహం వేగానికి ఎత్తులు సుడిగాలి గా అగుపించాయి .మధ్య మండలం లో ఉన్న శత్రుసైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఇంతలో గాయపడిన తన సైన్యం వద్దకు వచ్చి సోమవజ్రం తో వారి గాయాలు మానేలా చేసాడు.
గాయపడిన ఏనుగులు శక్తి పుంజుకున్నాయి .ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది .
తర్వాతి రోజు యుద్ధం మొదలైంది .
శాతకర్ణి శూల వ్యూహం రచించాడు. తక్కువ సైన్యం తో సూది ని పోలిన వ్యూహాన్ని రచించాడు.
దానికి ధీటుగా రెండు వరుసలలో గోళాకార వ్యూహాన్ని అమలు పరిచాడు నహపాణుడు,విజయం మీద ధీమా తో.
కానీ తన సైన్యాన్నంతా ఒకే చోట పెట్టి తప్పు చేసాడు.
ఇంతలో శత్రు సైన్యానికి కుడి వైపు గండ్ర గొడ్డలి ఉన్న జెండాలు కనిపించాయి ....త్రికోణాకారం లో కిష్కింద నుండి అనిరుద్ధుడు సైన్యం ఆఘమేఘాల మీద గోళాకారం ను చుట్టుముట్టాయి. ఎడమ వైపున మహా బలి ,మహా బలి అని అరుపులు వినిపించాయి ,భగవతి ఆలయం లోని అశ్వదళం మరో త్రికోణం ఆకారం లో ఎడమవైపు గోళాన్ని చుట్టుముట్టాయి .
పైనుంచి రధం లో చూస్తున్న శాతకర్ణి కి మధ్య లో శూలానికి గుచ్చిన గోళం ,గోళం ఇరువైపులా రెండు త్రికోణాల తో గండ్రగొడ్డలి ల వుంది ....దీన్నే గండ్రగొడ్డలి వ్యూహం అంటారు అని మహాబలి ఇచ్చిన పుస్తకం లో వుంది.
నహపాణుడు ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
ఇలా శాతకర్ణి ఒక పెద్ద సామ్రాజాన్ని నెలకొల్పాడు జమ్బుద్విపం లో .
యువరాజు ను చక్రవర్తి గ పట్టాభిషక్తుడిని చేసాడు శివస్వతి .
ఇంకా వివాహం చేద్దామన్నంతలో సింహళ రాజు నుండి వర్తమానం అందింది. అందులో ఏమున్నది అంటే శాతకర్ణి పెంపుడు కొడుకు ..కదా ,రాచరిక రక్తం కాదు , దాన్ని నివృత్తి చేసుకోడానికి సింహళ దేశ రాజు వస్తున్నాడని సారాంశం.
శివస్వతి కంగారుపడి ఆంతరంగిక మందిరం లో భార్య ,పిల్లలతో సమావేశమయ్యాడు.
ఇంతలో సింహళ దేశ రాజు వచ్చి తన సందేహం తీర్చమన్నాడు.
రాజభటులు వచ్చి ఒక నాగసాధువు రాజుగారితో అతి రహస్యమైన విషయం చెప్పాలని వచ్చారని చెప్పారు.
తెరలోంచి చూసాడు శివస్వతి ,ఆ సాధువు మొదట శివస్వతి కి శాతకర్ణి కుండలిని గురించి చెప్పినవాడు .వెంటనే శివస్వతి సాధువు వద్దకు వచ్చాడు.
అప్పుడు వెనుక నుండి వచ్చిన గౌతమి దేవి ని చూసి సాధువు ,మహారాణి ,మీ సంతానం గురించి చెప్పండి,అం అడిగాడు .
అప్పుడు మహారాణి భాదపడుతూ చెప్పసాగింది
నాకు పురుటినెప్పులు మొదలైనప్పుడు శత్రుసైన్యం రహస్య సొరంగాలు ద్వారా అంతఃపురం లోకి ప్రవేశించారు. రక్షణ బలగం అంతా కోట రక్షణకు వెళ్లిపోయారు .మహారాజు (శివస్వతి) నన్ను (మహారాణి) ని కొంతమంది సైన్యం తో భూగర్భ మార్గం ద్వారా పక్కన ఉన్న అరణ్యం లోకి పంపారు.
శివస్వతి శత్రువులతో యుద్దానికి బయలు దేరాడు . నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు .అరణ్యం లో నేను మగబిడ్డ ను ప్రసవించాను. యుద్ధం ముగిసిన తర్వాత శివస్వతి అరణ్యానికి వచ్చారు . ఇంతలో ఒక సింహం గుంపు సైనికులను చంపేసింది. మహారాజు నన్ను సింహాల నుండి కాపాడారు .ఇంతలో ఓ ఆడ సింహం పసిబిడ్డను కరచుకొని పారిపోయింది. ఎంత వెతికినా పసిబిడ్డ కనపడలేదు.
అప్పుడు సాధువు చెప్పాడు " శాతకర్ణి మీ కన్నబిడ్డ ,నేను అరణ్యం లో తాంత్రిక విద్యలు సాధన చేస్తున్నప్పుడు ,సింహం నోట్లో పసిబిడ్డ ని చూసి నా విద్య తో బాలాకుడిని కాపాడాను .పక్కనే మయి అనే తెగ వారికి అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళాను .వారు సింహాలను వేటాడే వారు .నాకున్న శక్తులతో ఇతని భూత ,భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇతను మీకు మళ్ళీ అడవిలో దొరుకుతాడని ఇతని జాతకం చెప్పింది.మీకు ఇతని జన్మరహస్యం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇతని వివాహానికి ,వంశ పరంపరకు ఇది అడ్డు కాకూడదని ,త్వరలో శాతకర్ణి చేత రాజసూయ యాగం చేయించమని చెప్పి ,వెళ్ళిపోయాడు .
ఇదిమొత్తం విన్న శివస్వతి ,గౌతమి దేవి పరమానంద భరితులయ్యారు .ఆనందం తో శాతకర్ణి ని హత్తుకొని ఏడ్చారు .
సింహళ రాజు కూడా వివాహం జరిపించాడు.
మహారాణి తోలి రేయి రోజు ధవళ వస్త్రాలతో శయన మందిరం లోకి వచ్చింది .
శాతకర్ణి ఆమెను తొలి కలయిక నాడు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాడు .ఇంతలో ఒక సందేహం వచ్చింది
మహారాణి మీ నామధేయం అని అడిగాడు .
అప్పుడు ఆమె నొచ్చుకొని రాజా మీరు తురీయా స్థితి ని అర్ధం చేసుకున్నంతగా ఆడవారి హృదయాలను అర్ధం చేసుకోగలరా అని
మందిరం లోని కొలను లో కలువ పువ్వును తెచ్చి,పంటి తో కొరికి తన వక్ష స్థలం మీద పెట్టి శాతకర్ణి కి అందించింది తొలి కలయిక లో చేసినట్టుగా . .
శాతకర్ణి కి విషయం అవగతమై "పద్మావతీ దేవి ,మీరు మీ పేరుని ,మీరుండే ప్రదేశం దంతేశ్వర పురం అని ,తొలి చూపు లోనే నన్ను హృదయ ప్రతిష్ట గావించివున్నారని మీ సoఞ్జల ద్వారా చెప్పకనే చెప్పారు ,నేను అవగతం చేసుకోలేక పోయాను . కానీ అది నాకు మంచికే జరిగింది .మిమ్మల్ని అన్వేషించే క్రమం లో నన్ను నేను తెలుసుకున్నాను. నీ వల్ల నా జీవనానికి ఒక అర్ధం వచ్చింది అర్ధాంగి అన్నాడు.

[+] 1 user Likes Kittyboy's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)