Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అనైతిక బంధం ఆవిరైంది!
#1
అనైతిక బంధం ఆవిరైంది!
ప్రియురాలిని చంపి.. ప్రియుడి ఆత్మహత్య
అనాథలైన ఇరు కుటుంబాల పిల్లలు
చిత్తూరు నగరంలో దారుణం
ఇంటి ముందు రక్తపు మరకలు

వారిది వివాహేతర సంబంధమైనా.. అందులోనూ అనుమానం మొగ్గతొడిగింది. పెనుభూతమైంది. ప్రియురాలిని చంపేంతగా.. ప్రియుడు కసి పెంచుకున్నాడు. చివరకు అనుకున్నంత పని చేసి.. తానూ కడతేరాడు. చిత్తూరు నగరంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ దారుణం.. సంచలనం రేపింది. - న్యూస్‌టుడే, చిత్తూరు (నేరవార్తలు)
సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం మేరకు.. నగరానికి చెందిన దొరస్వామి కుమార్తె గీతారాణి (38)కి ఆర్మీ ఉద్యోగితో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త విధుల నిమిత్తం ఇతర రాష్ట్రంలో ఉండగా గీతారాణికి అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ (36) అనే యువకుడితో ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గీత భర్త.. ఆమెకు దూరం కాగా.. హమీద్‌ భార్య కూడా తన కుమారున్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గీత, హమీద్‌ కలసి ఉంటున్నారు. ఇటీవల గీత ప్రవర్తనపై హమీద్‌కు అనుమానం వచ్చింది. గురువారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హమీద్‌ చాకుతో ఛాతి, తల, నడుము భాగాల్లో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న గీతారాణి అరుపులు కేకలు పెడుతూ వీధిలోకి పరుగెత్తుతూ వచ్చింది. స్థానికులు ఆటోలో ఎక్కించుకుని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కొంత సేపటి తర్వాత దుర్గానగర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హమీద్‌ను స్థానికులు గుర్తించి.. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతను కూడా ఆస్పత్రికి చేరుకునేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ ఈశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి ఘటనపై ఆరాతీశారు. చిత్తూరు రెండో పట్టణ సీఐ యుగంధర్‌ అక్కడికి వచ్ఛి. హత్య, ఆత్మహత్య వివరాలను సేకరించారు. ఇద్దరి పరిచయాలు, వారి మరణాలకు గల కారణాలపై మృతుల సన్నిహితులు, బంధుమిత్రులతో మాట్లాడి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనాథలైన పిల్లలు..
గీతారాణి హత్య, హమీద్‌ ఆత్మహత్య కారణంగా ఇరు కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరి కుటుంబాలు విడిపోయినా.. పిల్లలు మాత్రం వారి తల్లి, వారి తండ్రి నీడలో ఉన్నారు. వారి మరణానంతరం ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లలు వీధినపడ్డారు. గీత భర్తకు దూరంగా ఉంటూ.. ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ఇదే విధంగా భార్య దూరమైనా హమీద్‌ ఆటో నడుపుకొంటూ కుమారున్ని పోషిస్తున్నాడు. వీరి సహజీవనంలో అనుమానం మొదలవ్వడం.. హమీద్‌ ఆవేశానికి గురై గీతారాణిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వాసుపత్రి వద్ద బంధుమిత్రుల రోదనలు
నగరంలో కొద్దిసేపట్లోనే హత్య, ఆత్మహత్య వార్తలు పొక్కడంతో.. ఆ ప్రాంతంలో సంచలనం కలిగింది. మృతుల బంధుమిత్రులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. మృతదేహాలను సెక్యూరిటీ ఆఫీసర్లు శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు.
[Image: anithikam.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
SO SAD...
Like Reply
#3
So sad, బట్ ఆంటీ కసక్ la ఉంది, ఇలాంటి సంబంధాలు చివరికి ఇలాంటి పరిస్థితి కి దారితీయటం మాములే అయినా, వారి పిల్లలు మాత్రం ఆనాధలు అయ్యారు.
Like Reply
#4
పూకు తెచ్చిన తిప్పలు ఇవి 
[Image: Dx0-QJ8-VVYAA-p-OV.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
సెక్స్ మీద అవగాహన కోసం 
https://xossipy.com/thread-49634-post-55...pid5520012
Like Reply
#5
Vadiki chance ichinattu...inkokadiki ichi untadi...tana puvvu....aa anumanam to vesesadu....
Like Reply
#6
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళకు పురుగు మందు మింగించి.. తానూ తాగి...



దుగ్గిరాల, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటే..మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం ప్రకారం దుగ్గిరాల చెన్నకేశవనగర్‌కు చెందిన వెంకటపద్మావతి(32)కి, పెనుమూలికి చెందిన సుబ్బారెడ్డికి కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దీంతో పాటు వీరి మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. పద్మావతి వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు సుబ్బారెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి వారి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ఒకసారి ఆమెను సుబ్బారెడ్డి కర్రతో దాడి చేశాడు. దీనిపై స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. ఇది ఇలా ఉండగా శనివారం ఉదయం సుబ్బారెడ్డి పసుపు, ధాన్యం బస్తాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు బస్తాల మధ్య వేసే సల్ఫాస్‌ మాత్రలు తీసుకుని పద్మావతి ఇంటికి శనివారం ఉదయం 7 గంటల సమయంలో వచ్చాడు. అప్పుడే ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తుండగా గట్టిగా పట్టుకుని సల్ఫాస్‌ మాత్రను ఆమె నోట్లో వేసి మింగించాడు. అరవకుండా గట్టిగా నోరు, ముక్కు మూయడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మరణించారు. ఆమె చనిపోయిందని నిర్ధరించుకుని సుబ్బారెడ్డి తన వెంట తెచ్చుకున్న మాత్రలను మింగేశాడు గొడవ జరుగుతున్న విషయం విని ఆమె కుమారుడు హేమంత్‌ తలుపు వేసి కేకలు వేస్తూ బయటవారిని పిలిచాడు. వారంతా వచ్చేసరికి లోపల ఉన్న సుబ్బారెడ్డి తలుపు పగులగొట్టుకుని బయటకు వచ్చాడు. ఈ సమయంలో మృతురాలి కుమారుడు, మరొకరు కలిసి సుబ్బారెడ్డిని తీవ్రంగా గాయపర్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సుబ్బారెడ్డి బంధువులు తాడేపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి ఐదారుసార్లు రక్తవాంతులు జరిగాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీలక్ష్మి, గ్రామీణ సీఐ అశోక్‌ పరిశీలించారు. పద్మావతి కుమారుడు ఫిర్యాదు మేరకు ఒక కేసును, సుబ్బారెడ్డి కుమారుడు ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదైంది..
Like Reply
#7
చంపడమా.. చావడమా..
వివాహేతర సంబంధాలతో చేటు
ఆందోళన కలిగిస్తున్న బలవంతపు చావులు
సామాజిక మాధ్యమాల ప్రభావమూ కారణమే
విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ
ఈనాడు డిజిటల్‌, గుంటూరు



దుగ్గిరాల చెన్నకేశవనగర్‌కు చెందిన ఓ మహిళకు, పెనుమూలికి చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సదరు మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించిన ఆ వ్యక్తి పైరుకు పురుగు పట్టకుండా వినియోగించే విషపు మాత్రలను ఆమె నోట్లో వేసి మింగించాడు. అతను కూడా ఆ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతురాలి కుమారుడు ఈ విషయాన్ని తెలుసుకుని సదరు వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు.

బొల్లాపల్లిలోని అటవీ ప్రాంతంలో వస్త్రంలో మూటకట్టి ఉన్న ఓ వ్యక్తి మొండెం కనిపించింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియురాలి భర్తను దారుణంగా హతమార్చాడు. తల నరికేసి అడవిలో పాతి పెట్టి, మొండేన్ని మూట కట్టి పడేశాడు.

శనివారం అత్యంత పాశవికంగా జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.. శారీరక సంబంధాల నేపథ్యంలో దారుణంగా హత మార్చడం, చావడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

ఆదివారం విజయవాడలో ఓ వ్యక్తి తన భార్య తలను నరికి చేత్తో పట్టుకుని రోడ్డు మీద సంచరించడంతో స్థానికులు భయంతో పరుగులుదీయాల్సి వచ్చింది. ఈ ఘటనకు వారిద్దరి మధ్య గొడవలే కారణం.

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తమ సంబంధానికి అడ్డువస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు వెనకాడట్లేదు. కొంతమంది కన్న బిడ్డలను సైతం వదిలించుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు పెద్దలు ఏది మంచో, ఏది చెడో చెప్పేవారు. నేడు చిన్న కుటుంబాల వలన చెప్పేవారు కరవయ్యారు.. ఇంట్లో భార్యాభర్తలు పెడదోవ పట్టినా హెచ్చరించేవారు లేకుండా పోయారు. దీంతో చిన్న సమస్యలు ఎదురైనా పెద్దవై చంపుకొనే వరకు వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు వంటివి పెట్టుకొని హతమార్చేందుకు కూడా వెనకాడటం లేదు. కొన్ని నెలల క్రితం జిల్లాలో ఓ ప్రభుత్వాధికారి భార్యతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఓ రోజు పట్టుబడటంతో ఆ ప్రభుత్వాధికారిపైనే దాడి చేసి పారిపోయేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించాడు. అధికారి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే మాదిరి బొల్లాపల్లిలో ప్రియురాలి భర్తనే హతమార్చడం ఆందోళన కలిగించింది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతో ప్రభావం చూపుతున్నట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నారు. మాధ్యమాల్లో పెంచుకొన్న పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. సంబంధం ఇంట్లో వాళ్లకి తెలిసినప్పుడు ఆత్మహత్యకు పాల్పడటమో, లేదా అడ్డు తొలగించుకొనేందుకు హత్య చేయడమో చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తనను దారుణంగా వంచించాడని సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో ఓ మహిళ సెక్యూరిటీ ఆఫీసర్లు ఫిర్యాదు చేసింది.

తీరని నష్టం ; భార్యభర్తలు తమ సుఖం కోసమే కాకుండా వివాహ బంధాన్ని గౌరవించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా అనారోగ్య సమస్యలే గాకుండా సామాజిక సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు. కుటుంబ గౌరవం నాశనమవుతుంది. ఈ సంబంధం ఒక్కసారి బయటపడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం కూడా ఉండదు. అందరూ అవహేళనగా మాట్లాడటం చేస్తుంటారు. భార్య, భర్త ఒక్కసారి వివాహేతర సంబంధం ఏర్పరచుకోవాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా పిల్లలు, కుటుంబాన్ని గుర్తుచేసుకుంటే వారికి ఆ విధమైన ఆలోచనలు దరిచేరవని పేర్కొంటున్నారు. వివాహేతర సంబంధనాలు కలిగే పరిణామాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు సాగించారు. ప్రధానంగా ఆలోచన శక్తిని కోల్పొయి ఈ సంబంధాల్లో ఇరుక్కుంటున్నారని, వివేకంతో ఆలోచించి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
* చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో వారికి 35 ఏళ్లు వచ్చే సరికి జీవితంలో ఏదో నిర్లిప్తత ఆవహిస్తుంది. జీవితాన్ని సంతోషంగా గడప లేదు. పిల్లలు, కుటుంబమే సర్వస్వం అయిపోయిందనే భావన వారి మనసులో వచ్చి ఎవరైతే ఆ వయస్సులో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారో వారి పట్ల ఆకర్షితులవుతారు. అటునుంచి వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ప్రేమించిన వారిని కాకుండా తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల బలవంతంగా పెళ్లి చేసుకున్నవారు తల్లిదండ్రులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు తహతహలాడిన వారూ ఉన్నట్లు వెల్లడైంది.
* ఇంట్లో పెద్ద దిక్కు చనిపోవడం, వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడం, ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో తెలియక వాటిని భర్తీ చేసుకునేందుకు వాటన్నింటినీ తీర్చగలిగే వారున్నారని నమ్మినప్పుడు కొంతమంది ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారని తేలింది.
* భార్య లేదా భర్త, ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా సంతృప్తి చెందనపుడు మరొకరు దాన్ని అందిస్తారనే ఆశతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకునేవారు ఎక్కువగా ఉన్నారని అధ్యయనం గుర్తించారు.
* భార్యభర్తల మధ్య ఆత్మీయ అనుబంధం లేనపుడు, ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం, ఒకరినొకరు అర్థం చేసుకోని పక్షంలో మానసికంగా కుంగిపోతుంటారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదని లోలోన మథనపడ్తుంటారు. ఆ సమయంలో చనువుగా మాట్లాడేవారుంటే వారితో దగ్గరై తప్పుడు దోవలోకి వెళ్తున్నారు.
* మహిళలు మోనోపాజ్‌ దశలో ఉన్నప్పుడు వారు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా సహకరించట్లేదని భావిస్తూ కొంతమంది మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొనేందుకు ఆసక్తిచూపుతున్నారని తేలింది.
* సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరవాత నీలి చిత్రాలను సెల్‌ఫోన్‌లోనే చూస్తున్నారు. అదే మాదిరి చేయాలని భార్యని ఇబ్బంది పెడుతున్న వారూ ఉన్నారు. వారు సహకరించని పక్షంలో మరొకరితో అలా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారన్న విషయం అధ్యయనంలో బయటపడింది.
* సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఏర్పరచుకుని, వ్యక్తిగతంగా కలవడం.. ఆ సమయంలో ఫొటోలు తీసుకుని వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అక్రమ సంబంధాలని కొనసాగిస్తున్నవారు ఇటీవల కాలంలో పెరిగారని సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నారు.

వివాహ బంధాన్ని గౌరవించాలి
భార్యాభర్తలు చేసే తప్పు కారణంగా పిల్లలు అనాథలవుతున్నారు. కుటుంబ వ్యవస్థ నాశనమై వ్యక్తిగత కుటుంబాలు వస్తున్నాయి. ఏదైనా తప్పు చేస్తే మందలించే వారు లేకపోవడంతో వారు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఆర్థికంగా, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు వినియోగించుకోవాల్సిన స్వేచ్ఛను అక్రమ మార్గాలకు వినియోగించుకుంటున్నారు. ఈ సంబంధాల వల్ల వారిలో ప్రతీకారేచ్ఛ పేట్రేగిపోతోంది. భార్య, భర్తలను వదిలించుకోవడానికి, కన్నబిడ్డలను చంపుకోవడానికి వెనకాడట్లేదు. భార్యభర్తలు తమ హక్కులు, వివాహ బంధాన్ని గౌరవిస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం తెలుసుకుని దాన్ని గౌరవించాలి

- సరిత, అడిషనల్‌ ఎసీˆ్ప సీˆఐడీ, విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు
వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్లల్లో మొదట్లో చిన్నగా దిగజారడం మొదలై తరువాత అదుపు చేయలేని స్థితికి వస్తారు. భావోద్వేగాలను అదుపు చేయలేక వారి సంబంధానికి అడ్డువస్తున్న వారిని చంపేందుకు సిద్ధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఏమవుతుందిలే అని మొదలుపెట్టే చిన్న తప్పు ఇరు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. సమాజంలో వారికున్న గౌరవాన్ని నాశనం చేస్తుంది. ఈ సంబంధాల వల్ల అనారోగ్య, ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తప్పవు. తల్లి, తండ్రి అలాంటి సంబంధంలో కొనసాగుతున్నారని పిల్లలకు తెలిస్తే వారి మనసులో మాయని మచ్చ ఏర్పడుతుంది. ఏమైనా మనస్పర్థలు వచ్చినట్టయితే కూర్చొని మాట్లాడి వాటి పరిష్కారాన్ని కనుక్కొని దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

- పెద్ది సాంబశివరావు, లైంగిక సంబంధాలతో దుష్ప్రరిణామాలపై అధ్యయనం చేసిన అధికారి

మనసు విప్పి మాట్లాడుకోవాలి
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా భార్యభర్తలు రోజూ మనసువిప్పి మాట్లాడుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. ఏదైనా తప్పు చేయాలనే భావన వచ్చినప్పుడు ఆ విషయం బయటపడితే కుటుంబ గౌరవం ఏమవుతుందో ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని గ్రహించాలి. తమ పిల్లలు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని తెలియగానే తల్లిదండ్రులు వారితో మాట్లాడి మరోసారి ఆ తప్పు చేయకుండా హెచ్చరించాలి. తల్లిదండ్రులు వివాహేతర సంబంధం పెట్టుకున్న పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతారు. దొంగతనాలు చేయడం, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడటం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కుటుంబంలో అనుమానానికి తావులేకుండా ఒకరి మీద ఒకరు నమ్మకంతో బంధాన్ని బలంగా ఉంచుకునేందుకు పాటుపడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని గుర్తించాలి.

- ప్రసాదబాబు, మనస్తత్వ నిపుణులు, ఇగ్నో, విజయవాడ
Like Reply




Users browsing this thread: 1 Guest(s)