Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Apocalypse : where it begins?
#1
Chapter (1) Apocalypse: where it begins?

మాండ్వాకా అనే గ్రహంలో ఎన్నో రాజ్యాలు ఉండేవి రాజ్యాల్లో ఒకటైన మఖండ్వా అనే రాజ్యం ఉండేది రాజ్యాన్ని పాలిస్తున్న హురువు అనబడే వంశస్థులు. వంశంలోని వారంతా మిగతా రాజ్యాల్ని ఆక్రమించాలని ఎన్నో యుద్ధాలు చేసేవారు యుద్ధాల వలన ఎంతో మంది చనిపోయారు. కానీ ఎవరు గ్రహాన్ని పూర్తిగా గెలవలేకపోయారు. అయినప్పటికీ  వంశమంటే ఇప్పటికి మిగతా రాజ్యాల వారికీ భయం ఉండేది. ఇది ఇలా ఉండగా    గ్రహంలో  ఉన్న  మంత్రవాదులు గ్రహానికి ఆపద రాబోతోంది అని గుర్తించి గ్రహంలో ఉన్న ఖంగ్వ  అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ప్రదోత్య ని కలిసి విషయం గురించి చెప్తారు. అప్పుడు ప్రదోత్య హురువు వంశం వల్లే ఆపద రావొచ్చు అనుకోని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని భావించి అన్ని రాజ్యాలని కలుపుకుని మఖండ్వా రాజ్యం పై యుద్ధానికి వస్తారు. అప్పటికే మఖండ్వా రాజ్యాన్ని పాలిస్తున్న హురువు వంశంలో అందరు చనిపోయుంటారు వారి వంశంలో చివరిగా మిగిలింది ఇద్దరు మాత్రమే.

 ఒకరు యుక్త వయసు కూడా రాణి మఖ్రద్వ ఇంకొకరు మాటలు కూడా సరిగా రాణి మరుఖండ్వా ఆ వంశం మొత్తం నాశనం అవ్వాలని మఖండ్వా పైకి యుద్ధానికి వస్తారు. రాజ్యాన్ని పాలిస్తున్న మహారాణి, యువరాజులు తల్లి (తాను ప్రదోత్య చెల్లెలు కూడా) ఐన ప్రత్యోస్తి యుద్ధానికి వెళ్తుందిహురువు రక్తం తన కడుపులో ఉందని తెలిసి  ప్రత్యోస్తి ని చంపేస్తారు. ఇదంతా చూస్తున్న ప్రదోత్య కూడా ఏమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు గ్రహాన్ని రక్షించడం ముఖ్యం కాబట్టి.
 మఖండ్వా రాజ్యపు సేనాధిపతి ఇద్దరు యువరాజులతో : యువరాజ, మీరు తమ్ముడు అడవి ద్వారా తప్పించుకోండి, నేను అంతలోపు సైన్యాన్ని అడ్డుకుంటాను, పరిగెత్తండి అంటూ తన మీద కి వస్తున్నా శత్రు సైన్యాన్ని  తన  సైన్యం  తో  అడ్డుకుంటాడు . యువరాజు  మరియు  ఇంకా  మాటలు  కూడా  రాణి  తన  తమ్ముడిని  ఎత్తుకొని  అడవి  లోకి  పరిగెత్తుతాడు . అడవిలో  చాల  దూరం  తన  తమ్ముడిని  ఎత్తుకొని  పరిగెత్తి  అలసిపోతారు  మఖ్రద్వ .   లోపు  చీకటి పడుతుంది.
మఖండ్వా రాజ్యాన్ని  పూర్తిగా  ఆక్రమించుకొని  సేనాధిపతిని  సైన్యాన్ని  బంధించి    రోజు  రాజులందరూ  మంత్రవాదులతో  సమావేశమవుతారు .   సమావేశంలో  మంత్రవాదులకు  నాయకుడు  మరియు  శక్తివంతుడైన  మాంత్రికుడు  ఇలా  అంటదు  :   గ్రహానికి  ఆపద  ఇంకా  పొంచి  ఉంది  చేదు  సంకేతాలు  ఇంకా  కనబడుతున్నాయి  శవాలతో  నిండిపోవడం  నాకు  ఇంకా  కనబడుతోంది  అని  అంటదు . అప్పుడు  మహారాజుల్లో  ఒకరు  ఖచ్చితంగా  ఇది    వంశం  వాళ్ళ  వల్లే  అయ్యుంటుంది    వంశం  లో  వారంతా  చనిపోయారు, ఇద్దరినీ కూడా  చంపెయ్యడానికి మన సైన్యాన్ని తూర్పు  భాగం  వైపున్న  అడవుల  వైపు  పంపించాం  వాళ్ళని  రేపటిలోగా  పట్టుకొని  చంపేస్తారు  అంటదు .   తర్వాత  మంత్రవాదుల్లో  ఒకరు  మనం  వాళ్ళని  మాత్రమే  కాదు  వారి  పూర్వికులైన  సమాధులని  తవ్వి  వాటిని  కాల్చి బూడిద  చెయ్యాలి  అప్పుడు  కానీ  మనం    ఆపద  నుండి  బయటపడలేం  అని  అంటారు  అందుకు  అందరు  ఒప్పుకొని  అందు  కోసం  వారి  సమాధులని  వెతికి  కాల్చేయడం  ప్రారంభిస్తారు.
హురువు  వంశస్థుల  సమాధులన్ని  ఒకొక్కటిగా    సమాధుల  మీదున్న  వారి  విగ్రహాలని  బట్టి  వాటిని  గుర్తించి  తవ్వి  కాల్చడం  మొదలు  పెడతారు . ప్రదోత్య  మాత్రం  తన  చెల్లెల్ని  గురించి  బాధపడుతూ  తన  చెల్లెలి  శవాన్ని కాల్చేస్తాడు.యువరాజు  అడవిలో  చాల  దూరం  పరిగెత్తి  అలసిపోయి    రోజు  అడవిలోనే  దిక్కు  తోచని  స్థితిలో  ఎం  చెయ్యాలో  తేలిక  ఉండిపోతాడు.   రోజు  అడవిలోనే  తన  తమ్ముడితో  పాటు అక్కడే ఉన్న జంతువులని చంపి కడుపు  నింపుకుంటారు  ఇద్దరు. మరుఖండ్వా  నిద్రపోతాడు  కానీ  మఖ్రద్వ  తన  తల్లి  చివరిసారి  తనతో  చెప్పిన  మాటలు  గుర్తు  చేసుకుంటాడు   "మఖ్రద్వ  నేనొకవేళ  తిరిగి  రాకపోతే  బాధపడకు, తమ్ముడిని  బాగా  చూసుకో , ఇద్దరు  కలిసే  ఉండండి  ఎం  జరిగిన  సరే  హురువు  వంశం  మీతోనే అంతం అయిపోకూడదు " అని ఇద్దరు కొడుకుల  మీద  ముద్దు  పెట్టి  వెళ్ళిపోతుంది. అదే  మఖ్రద్వ  తన  అమ్మ  ను  చుసిన  చివరి  చూపు . మఖ్రద్వ  నిద్రలోకి  జారుకుంటారు   తెల్లవారుతుంది  మఖ్రద్వకి  మెలుకువ  వస్తుంది .
 తన  తమ్ముడిని  ఎత్తుకొని  దగ్గరలో  ఉండే  నీటి  కొలను  లో  నీళ్లు  తాగుతుంటాడు    సమయంలో  పై  నుండి  ఒక  గ్రహశకలం    గ్రాహం  పై  పడుతూ  ఉండటం  నీటిలో  చూస్తాడు . ఇటువైపు  రాజులూ , ప్రజలు  కూడా  చూస్తుంటారు  వాళ్ళు  చివరి శవాన్ని  అప్పుడే  కాల్చేసి  ఉంటారుఒక్కసారిగా  అది  దిశను  మార్చుకుని  మఖ్రద్వ  తన  మీదకి  రావడం  గమనిస్తాడు నిజానికి శకలం  తమ  పూర్వీకుడైన  అతి  భయఙ్కరమైన  ఎలాంటి  జాలి  దయ  లేని  అతడి  వంశస్థుడు  సమాధి  మీద  పడాలి  కానీ    సమయానికే    మహారాజులు  మంత్రవాదులు  కలిసి  అతడి  సమాధి  ని  తవ్వి  శరీరాన్ని  కాల్చేస్తారు . అందువల్ల    గ్రహశకలం  దిశా  మార్చుకుని  తన  మీదకు  వస్తుంది  అక్కడి  నుంచి  పరిగెత్తి  కొద్దీ  దూరం  వెళ్ళగానే    గ్రహ  శకలం  నీటి  కొలను  మీద  పడి నీరు  మొత్తం  ఇంకిపోతాయి .  నీటి   కొలను  దగ్గరగా  ఉండడం  వలన తాను  ఎగిరిపడి  చెట్టుకు  తగులుకుంటాడు .
 తనకు  తన  తమ్ముడికి  కొన్ని  గాయాలు  అవుతాయి . తన  తమ్ముడి  తల మీద  కారుతున్న  రక్తాన్ని  తుడుస్తాడు. ఆలా  తుడుస్తున్న  తన  చేతి  మీద  కూడా  గాయం    రక్తం  కారుతుంటుంది  అని  తెలుసుకుంటాడు . అప్పుడు  తాను    నీటి  కొలను  వైపు  చూస్తాడు  అక్కడ  పడిన    గ్రహ  శకలం  దగ్గరకు  వెళ్తే  అందులో  ఒక  లోహం  మెరుస్తూ ఉంటుంది. తన  గాయమై  రక్తం  కారుతున్న  చేతితోనే    లోహాన్ని  ముట్టుకుంటాడు .తన  రక్తం    మెరుస్తున్న  లోహం  పై  పడగానే వెంటనే  అతను, అతను ఎత్తుకున్న  తన  తమ్ముడు  ఇద్దరు  వేరే  లోకానికి వెళ్లారు. వాళ్ళ శరీరాలు అక్కడే  ఉన్న  వాళ్ళ మైండ్ presence వేరే చోటు ఉంటుంది. యువరాజు  చుట్టూ చూస్తుంటాడు తాను ఎక్కడున్నాడో తనకేమి అర్థమవ్వదు  . ఆలా  చూస్తుండగా  తనకు  దూరంగా  ఒక  సింహాసనం కనిపిస్తుంది .   సింహాసనం  నుండి  ఒక  రకమైన  శబ్దం  వినిపిస్తుంటుంది  ఎవరో  బాధ  తో  నొప్పి  తట్టుకోలేక  అరుస్తున్న  శబ్దం  అది.   అది    ఉన్న  చోటంతా  వ్యాపిస్తూ  ఉంటుంది . ఆలా  తాను  సింహాసనాన్ని  చూస్తుండగా  వెనకనుండి  ఒకరు  : నువ్విప్పుడు  మహాప్రభువు  సింహాసనం  ముందు  ఉన్నావుమోకరిల్లు  అని  ఒక  ఆడగొంతు  వినిపిస్తుంది  తాను  ఆలా  చెప్పి  అక్కడ  నెల  మీద  కొడుతోంది  అప్పుడు  ఒక  ప్రకంపన  వాళ్ళ  యువరాజు  ఒంటి  మోకాలి  మీద  కూర్చుంటాడు .
వెనక  ఇద్దరు  నడుచుకుంటూ  యువరాజు  పక్కనుంచి  వెళ్లి  ఎదురుగ  మహాప్రభువు  సింహాసనం  ముందు  ఉన్న  ఎనిమిది  సింహాసనాల్లో  వారి  వారి  స్థానాల్లో  కూర్చుంటారు . అందులో  ఒకరు  : మహాప్రభువు  లోహం  ఒక  చిన్న  పిల్లోడికి  దక్కింది  అని నిరాశపడతాడు. అప్పుడు  అక్కడ  ఉండే  ఇంకొకరు  ఏది  ఏమైనా మనం  చెయ్యాల్సిన  పని  మనం  చెయ్యాలి  అని  చెప్పి   యువరాజుతో   లోహం నిన్ను  ఎంచుకోవడం  వాళ్ళ  నువ్వు  శక్తివంతుడివి  అయ్యావ్    లోహాన్ని తాకడం వాళ్ళ  నీ  శరీరం  కూడా    లోహం  లగే  ధృద్ధమైనదిగా  శక్తివంతంగా  తయారయింది  అని  చెప్తుంది .   లోహం  తో  నువ్వు  ఆయుధాల్ని  తయారు  చేసుకోవచ్చు  అలాగే  చనిపోయిన  వారిని  కూడా  బ్రతికించవచ్చు  అని  చెప్తుంది .   మాటలు  అన్ని వింటున్న యువరాజుకు  తనకు  తెలియని  భాషలో  మాట్లాడుతున్న  తనకు  ఎలా  అర్థమవుతోందో  అర్థం  కావడం  లేదు . ఆలా  అంత  విన్న  తరవాత  తాను  మల్లి  తన  గ్రహంలోకి  వస్తాడు . తన  ఒంటి  మీద  గాయాలన్ని   నయమవుతాయి . ఆలా    లోహంతో  తాను  ఒక  ఖడ్గాన్ని  తయారు  చేసుకుంటాడు . అప్పుడే    గ్రహశకలం  పడిన  చోటు  తెలుసుకొని  అక్కడికి  వచ్చిన  సైనికులు  తనని  చంపడానికి  ప్రయత్నిస్తారు  అప్పుడు  యువరాజు  అందరిని  చంపేస్తాడు  వాళ్ళతో  పోరాడే  తప్పుడు  తన  మీదకు  ఎన్నో  సార్లు  ఆయుధాలు   తగిలిన  తనకు  ఒక్క  చిన్న  గాయం  కూడా
అవ్వదు . ఆలా  తన  తమ్ముడికి  కూడా  ఒక  కవచాన్ని  తయారు  చేస్తాడు . ఆలా  ఒక్కడే  తన  రాజ్యాన్ని తిరిగి దక్కిచుకోవడానికి తన  రాజ్యానికి  వెళ్తాడు.తన  సేనాధిపతి తన  సైన్యాన్ని  తిరిగి  విడిపిస్తాడు .   లోహ ప్రభావం  వాళ్ళ అతను  ఇంతకూ  ముందు  కంటే క్రూరంగా  మారుతుంటాడు...
[+] 2 users Like zenitsu_a34's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Apocalypse : where it begins? - by zenitsu_a34 - 20-04-2024, 11:12 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 21-04-2024, 02:36 AM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 21-04-2024, 06:42 PM
RE: Apocalypse : where it begins? - by BR0304 - 23-04-2024, 02:09 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 23-04-2024, 07:46 PM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 26-04-2024, 09:32 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 29-04-2024, 09:21 AM
RE: Apocalypse : where it begins? - by sri7869 - 12-05-2024, 10:22 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by k3vv3 - 14-05-2024, 02:17 PM
RE: Apocalypse : where it begins? - by Uday - 16-05-2024, 04:58 PM



Users browsing this thread: 1 Guest(s)