Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan
#6
బిహేవియర్ ని కొన్ని బేసిక్స్ తో చెబుతారు.
1. దేశం
2. అవసరం
3. పరిస్థితులు
4. ఆహార అలవాట్లు
5. సంప్రదాయం మొ||

సైకాలజీ లో దేశం అనే కాన్సెప్ట్ కి పరిధి కొంత వరకే
ఒక దేశానికి సంప్రదాయమైంది ఇంకో దేశానికి వ్యతిరేకం కావచ్చు.
అమెరికా దేశాలలో కుడివైపు రోడ్ కు నడిచే అలవాటు., ఆవిధంగానే గవర్నమెంట్ కూడా infrastructure డెవలప్ చేస్తుంది. రోడ్స్ కానీ..., హౌసెస్ కానీ అనేకం
చివరకు ఫ్యాక్టరీస్ అన్నీ కూడా....

మన దేశ సంప్రదాయం వాస్తు ఆధారితం
కుడి వైపుని శుభంగా భావిస్తారు అందుకనే టర్నింగ్స్ కూడా కుడి వైపు ఉంది రోడ్ కు ఎడమవైపున నడిపిస్తారు.
ఇది ఏ దేశం నుండో కాపీ కట్టారేమో నాకు తెలియదు కానీ..

ఒక దేశ చరిత్ర, వారి మతం, వారి సంప్రదాయాలు వ్యక్తి ప్రగతిని నిర్ణయిస్తాయి.

అంత్త్రోపోలజి - మానవ పరిణామ సిద్దాంతం లేదా శాస్త్రం.

IAS సెలెక్టివ్ గా తీసుకున్న వారిని ఒక ప్రశ్న అడిగారు.
ఎందుకు హిందూస్తాన్ లో పిత్రుస్వామ్య కుటుంబాలు ఉన్నాయ్. దీనికి అంత్రోపోలిజి ప్రకారంగా చెప్పండి అంటూ...

అందుకు ఆ కాండిడేట్ చెప్పిన సమాధానం
మానవ పరిణామ సిద్ధాంతం లో స్త్రీ స్వామ్య కుటుంబాలే ఉండేవి.

మానవుల జీవనం వ్యవసాయం తో మొదలవ్వలేదు. కానీ ఆహార అన్వేషణతో మొదలయింది అది ఎలాగంటే.

దొరికిన ఆహారాన్ని తిని కడుపు నింపుకోవడం. అది అడవిలో దొరికిన కందమూలాలైనా ఏవైనా సరే ఏరుకుని తినడమే పనిగా ఉండేది.
ఆ తరువాత స్త్రీ సంపర్కం
ఆపైన కుటుంబ పాలన; దానికి నివాస యోగ్యమైన స్థలం మరియు నివాసాలు లేదా ఆవాసాలు
ఆ ఆవాసాలు కూడా గుహలు
తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయుధాలు కావాలి., అవి జంతువుల నుండి రక్షించుకోనెందుకు,
తరువాత ఆ ఆయుధాలు ఒక్కసారే వినియోగించే అవకాశం రావడం తో రాతి ఆయుదాలకి పదును పెట్టడానికి కుదరక లోహానికై అన్వేషణ చేశారు.
అయితే ఇంతవరకూ స్త్రీ మాత్రమే స్వామ్యం కలిగి ఉండేది.
ఎందుకంటే....మానవుడు ఆహారం అన్వేషించి తీసుకుని రావడం అనేది తన భార్య కోసమో లేక కోరుకున్న స్త్రీ కోసమో జరిగేది. అందువల్ల
మేలయిన ఆహారం తీసుకువచ్చినవాడు ఆమెకి ఆ రోజు భర్త అయ్యేవాడు.
అంటే నేటి భర్త రేపటి పాలేరు. ఇలా తెలియకుండానే స్త్రీ భోగవస్తువు అయ్యింది.

ఆ స్త్రీ మీద మోజు తీరడం తో మొగాడు ఆహరం తీసుకురావడం బంద్ చేసేవాడు. ఆవిధంగా తన ఆహారాదులు థానే సమకూర్చుకోవలసి వచ్చేది స్త్రీకి.

ఈ విధంగా స్త్రీ....పది మంది మగవారిలో తనకు నచ్చిన వాణ్ణి లోనికి తీసుకు వెళ్ళేది. కానీ రావడం రాకపోవడం అనేది మగవాడి ఇష్టం అయ్యేది.

ఇలా అందంగా ఉన్న ఐశ్వర్యారాయ్ ని అందరూ కోరుకునే వారు కానీ అందం తరిగిపోయిన, లేదా అందంగా లేని స్త్రీని దూరం పెట్టేవారు.

దాంతో అందమైన అమ్మాయిలకి డిమాండ్ పెరిగి, వారితో కూడి., అందమైన పుత్రికని పొందేవారు.

ఆ అందమైన అమ్మాయిని తన ఇంటికి తీసుకు రావడానికి ఆ అమ్మాయి తండ్రికి కన్యకోసం శుల్కం ఇవ్వడం మొదలయింది.
అలా అందమైన అమ్మాయికి శుల్కం అందంగా లేని అమ్మాయికి ఏ విధమైన శుల్కం లేదు.

కానీ ఇది మరో రూపం లో దారి తీసింది. తన కూతురు అందంగా ఉంటే తండ్రి కొన్ని యోజనాల భూమి, పశువులు తీసుకొని కూతురిని అమ్మేవాడు.

స్త్రీ కన్యత్వాన్ని అర్పించుకోవడం అనేది కూడా వారికి ఒక ప్రశ్నగా మిగిలేది.

ఇటువంటి సంప్రదాయం నుండి పిత్రుస్వామ్య కుటుంబం ఏర్పడింది అది ఎలా అంటే....

కన్యాశుల్కం వల్లనే...........అందం లేని అమ్మాయికి పెళ్ళి కాకపోతే........

ఆ అమ్మాయి తండ్రికి భారం అయ్యి, పెళ్ళి కాకుండా ఇంట్లో ఉండటం, మిగిలిన సోదరుల వివాహం కాకపోవడం, ఆపైన వివాహం కాని సోదరుడు సోదరికి అండగా ఉండటానికి వివాహాలు కాకపోవడం., వారి వారి ఆస్తులు అనుభవించేవారు లేకపోవడంతో....

అమ్మాయిని వదిలించుకోవడానికి ఎదురు పైసలు ఇచ్చి పెళ్ళికి కట్నం ఇచ్చే సంప్రదాయం అదే వరకట్నం మొదలయింది.

ఇక్కడ ultimate గా స్త్రీని కట్టడి చేసినట్లు కనిపిస్తోంది. అప్పుడే పుట్టిన శ్లోకం లేదా ఒక వచనం ఏంటంటే........

న: స్త్రీ స్వాతంత్ర్యమర్హతి

దానికి తండ్రి, భర్త, కొడుకు ఇందరు కాపాడుతూ ఉంటె ఇంకా స్వాతంత్ర్యం ఎందుకు అని

కానీ అస్సలు గుర్తించని విశేషం ఏంటంటే ఇదే సైకాలజీ లో పెద్ద టర్నింగ్
అదే ఆహరం మాంసం తినే, మసాలాలు తినే కుటుంబాలకు శరీరం లో వచ్చే మార్పులు

ఇదే ఒక పెద్ద టర్నింగ్

ఇన్ని మసాలాలు తిన్న కొవ్వు అప్పుడప్పుడూ గీత దాటమంటుంది. అప్పుడు ఎం చెయ్యాలి?

అందుకే ఎడ్యుకేషన్ ముఖ్యం అయ్యింది. అంతే కానీ ఆహార వ్యవహారాల్లో...లేదా స్త్రీకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అలవాటు ఇవ్వలేకపోయ్యాయి.
అందుకు కుల వ్యవస్థ కూడా ఒక బలమైన పాత్ర నిర్వహించింది.

ఇది నిజం


______________________________
సంఘ క్షేమం కోరుకోవడం మంచిదే కానీ స్వ క్షేమం కూడా ముఖ్యమే..
Like Reply


Messages In This Thread
RE: ఈ నింగి ఈ నేల నువ్వు నేనూ...by kamalkishan - by Milf rider - 19-10-2019, 06:45 PM



Users browsing this thread: 1 Guest(s)