Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే? ఎపిసోడ్ 48




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]

నాయక్ పంపించిన శాటిలైట్ పిక్చర్స్ చూసి టెర్రరిస్టుల మీద అటాక్ చేయడానికి వేరే రూట్లో బయలుదేరారు యోధ వాళ్ళు.

గుప్తా బ్లడ్ తీసి ఎలుక మీద పోయడంతో దాని సైజు పెరగడం చూసి ఫార్మా కంపెనీ వాళ్ళతో పాటు ముష్రు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.

**************

ఎలుక సైజు పెరగడం చూసి 'గుప్త రక్తం పోస్తే సైజు పెరుగుతుంది ఏంటి అసలు ఇలా ఎలా జరుగుతుంది?' అని మనసులో అనుకున్నడు ముష్రు.

పెద్దది అవుతున్న ఏలుక ని చూసి నవ్వుతూ ఉన్నాడు గుప్తా.

ఫార్మ కంపెనీ వాళ్ళ వైపు చూసి "మిస్టర్ జార్జ్! కిజికిస్థాన్ లో ప్రయోగం ఆగినందుకు కంగారు పడ్డావు కదా ఇప్పుడు సంతోషంగా ఉందా..?" అని అడిగాడు కళింగ.

సైజు పెరుగుతున్న ఎలుక వైపు ఆశ్చర్యంగా చూస్తూ "వండర్ఫుల్! నెక్స్ట్ ఏం జరుగుతుంది?" అని ఆత్రుతగా అడిగాడు జార్జ్.

"ఆ ఎలుక భయంకరంగా తయారవుతుంది తనకు ఎదురుపడిన వాళ్ళని చంపుకు తింటుంది 24 గంటల తర్వాత చనిపోతుంది.

అప్పుడు మీకు కావలసిన వైరస్ దాని బాడీ నుండి బయటకు వచ్చి గాలిలో కలిసిపోతుంది దానిని ఎవరు కనిపెట్టలేరు.

ఆ వైరస్ వల్ల మనిషి ఒక్కసారిగా చావడు బాడీలో ఒక్కొక్క పార్ట్ పాడైపోతూ మీ మందులు వాడుతూ అతని దగ్గర మందులు కొనడానికి డబ్బులు లేక చనిపోతాడు." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.

"గుడ్! ఆ వైరస్ ని తగ్గించే మెడిసిన్ కూడా నాకు కావాలి బ్రతకాలి అని ఆశ ఉన్నవాడు ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతాడు అతడి కోసం నాకు యాంటీ డోస్ కావాలి." అని అడిగాడు జార్జ్.

"షూర్! కన్ఫామ్ గా ఇస్తాను మనం అనుకున్న ఫస్ట్ పేమెంట్ నా స్విస్ అకౌంట్ కి ట్రాన్సర్ చేయండి." అని అడిగాడు కలింగ.

"వన్ మినిట్!" అని తన లాప్టాప్ ఓపెన్ చేశాడు జార్జ్.

అది చూసి గ్లాస్ బాక్స్ లో ఉన్న ఎలుక వైపు చూసి రెండు వేళ్ళు పైకి లేపాడు గుప్తా.

ఆ సైగతో అప్పటివరకు పెరిగిన దాని సైజు కన్నా రెట్టింపు సైజు పెరిగి గ్లాస్ బాక్స్ బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎటాక్ చేసి జార్జ్ చేతిలో ఉన్న లాప్టాప్ ని దాని పళ్ళతో ముక్కలు ముక్కలు చేసి భయంకరంగా అరుస్తూ ఉంది ఆ ఎలుక.

భయంకరంగా ఉన్న ఎలుకని చూసి భయంతో అక్కడి నుంచి బయటికి పరుగు తీశారు ఫార్మ కంపెనీ వాళ్ళు.

అది చూసి గుప్తా వెనక్కి వెళ్లి "సడన్ గా దీనికి ఏమైంది? రక్తం ఏమైనా కాస్త ఎక్కువ అయిందా..?" అని భయంగా చూస్తూ అడిగాడు సయ్యద్.

"నాకు అర్థం కావడం లేదు." అని తన దగ్గర ఉన్న గన్ తీసి ఎలుకని షూట్ చేస్తూ బిగుసుకుపోయి చూస్తున్న ముష్రు ని చూసి "బయటికి వెళ్లి తొందరగా హిడిచి ని తీసుకురా..!" అని అరుస్తూ చెప్పాడు కళింగ.

ఆ మాట విని బయటకు పరిగెత్తి "హిడిచి హీడిచి!" అని అరుస్తూ వెళ్ళాడు ముష్రు.

ఆ అరుపులు విని "నేను ఉండగా వాడిని ఎందుకు పిలుస్తున్నారు." అంటూ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ల్యాబ్ లోపలికి వెళ్లి వీరంగం వేస్తున్న ఎలుకను ఆశ్చర్యంగా "ఓరి మీ దుంప తెగ! ఆ ఎలుకను ఏమి చేశార్రా... అంత సైజు పెరిగింది." అని నవ్వుతున్న గుప్త వైపు చూసి

'తమరి మహత్యమ స్వామి!' అనుకుని షూట్ చేస్తున్న కలింగ దగ్గరికి వెళ్లి భుజం మీద కొట్టి "నువ్వు తప్పుకో నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని "గబ్బర్ జాగ్రత్త! అది కరిస్తే వైరస్ ఎటాక్ అవుతుంది దానికి ఇంకా నేను యాంటీ డోస్  కనిపెట్టలేదు." అని చెప్పాడు కళింగ.

"అవునా?" అని ఏలుక వైపు భయంగా చూస్తూ గుప్తా వైపు చూసి 'స్వామి ప్లీజ్! ఒక్కసారి!' అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ సైగ చూసి "సరే!" అని తల ఊపుతూ పైకి ఎత్తిన రెండు వేళ్లు కిందకి దించాడు గుప్తా.

అది చూసి "హమ్మయ్య!" అనుకోని ఎలుక దగ్గరికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.

దగ్గరికి వస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి అక్కడ ఉన్న గ్లాస్ బాక్స్ లోకి వెళ్లి సైలెంట్ గా ఉంది ఎలుక.

అది చూసి ఊపిరిపీల్చుకుని "కళింగ! ఇంకా ప్రాబ్లం లేదు నేను మంత్రం వేసాను అది నువ్వు చెప్పినట్లు వింటుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని గ్లాస్ బాక్స్ లో సైలంట్ గా ఉన్న ఎలుక వైపు ఆశ్చర్యంగా చూస్తూ "గబ్బర్ గారు!  మీరు నిజంగా గ్రేట్!" అని సంతోషంగా చూస్తూ చెప్పాడు కళింగ.

అంతలో ముష్రు తో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాస్ బాక్స్ లో ఉన్న ఏలుక ని పట్టుకుని తింటూ ఉన్నాడు హిడిచి.

అది చూసి "ఒరేయ్ దరిద్రుడా! దాంట్లో వైరస్ ఉందంట ఆకలి వేస్తే అక్కడ కుక్క బిస్కెట్లు ఉన్నాయి వెళ్లి తిను అడ్డమైనవి తినకు!" అని తిడుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

ముష్రు వైపు చూసి "గబ్బర్ గారిని యంగ్ ని ఇక్కడినుంచి తీసుకువెళ్లు!" అని చెప్పి బయట ఉన్న ఫార్మ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్లి "సారి ఫర్ ద డిస్టబెన్స్ దానికి కాస్త డోస్ ఎక్కువైంది. పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాము." అని నవ్వుతూ అడిగాడు కళింగ.

"ఆ వైరస్ కి యాంటీడోస్ ఇంకా కనిపెట్టలేదని ఇప్పుడేగా చెప్పావు అది కూడా అయిన తర్వాత కాల్ చెయ్! అప్పుడు పేమెంట్ విషయం చూద్దాము." అని చెప్పి తన మనుషులని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు జార్జ్.

అది విని డల్ గా కళింగ దగ్గరికి వచ్చి "సైంటిస్ట్! మరి ఇప్పుడు విరుగుడు మందు ఎలా..! రెండు రోజుల్లో కనిపెట్టేస్తావా..? చేతికి వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది." అని నిరాశగా చూస్తూ అడిగాడు సయ్యద్.

అక్కడికి వచ్చి హీడిచి ని తీసుకు వెళుతూ "ఈ వైరస్ కి విరుగుడు మందు కనిపెట్టడం అసాధ్యం!  అని చెప్పాడు రేపాలా.

ఆ మాట విని కంగారుగా చూస్తూ "అయితే! మనం ఇన్నాళ్లు పడ్డ కష్టం ఈ మంచు కొండల్లో కరిగిపోయినట్టేనా..?" అని అడిగాడు సయ్యద్

"గబ్బర్ దగ్గర ఉన్న పద్మం లో ప్రయాణించి అలకాపురి నగరానికి చేరుకొని లోపల ఉన్న కల్పవృక్షాన్ని మనం స్వాధీనం చేసుకుంటే విరుగుడు మందు దొరికినట్లే!" అని చెప్పాడు రేపాలా.

"ఎస్! గబ్బర్ తో డీల్ చేసుకుని త్వరగా ఆ పద్మం మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేతికి వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోయింది." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.

రూమ్ లో నుంచి వాళ్ళ మాటలు వింటూ 'అమ్మ వెధవల్లారా..! దానికోసమే పద్మం కావాలని ఆరాటపడుతున్నారు రండి రండి నాతో డీల్ అంటే మూడు చెరువుల నీళ్లు తాగినట్లే!' అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.

"సయ్యద్! గబ్బర్ ని మచ్చికా చేసుకుని అసలు అతనికి ఏం కావాలో అడుగు." అని చెప్పాడు రేపాలా.

"ఆ సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడే వెళ్లి క్షణాల్లో తెలుసుకుని పద్మం తీసుకుని వస్తాను." అని చెప్పాడు సయ్యద్.

"సరేగాని! నేను తయారుచేసిన మెడిసిన్ టెస్ట్ చేయడానికి టెర్రరిస్టులు కావాలి అని అడిగాను వస్తున్నారా..!" అని అడిగాడు కళింగ.

"కాసేపట్లో ఇక్కడే ఉంటారు నీకు ఎంతమంది కావాలో అంత మందిని వాడుకో మిగతా వాళ్ళని తీసుకెళ్లి ఇండియా బోర్డర్లో వదిలిపెడతాను." అని నవ్వుతూ చెప్పాడు సయ్యద్.

అక్కడికి వస్తూ "ఆ టెర్రరిస్టులతో పాటు మన దగ్గర ఉన్న 12 మంది ఇండియన్ సోల్జర్స్ కూడా ఆ మెడిసిన్ ఇచ్చి బోర్డర్ దగ్గర వదిలిపెట్టండి." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాటలు విని రూమ్ లో ఉన్న ముష్రు వైపు చూసి "ఆ మెడిసిన్ ఏమిటి! ఎలా పనిచేస్తుంది?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ మెడిసిన్ కళింగ ఐదు సంవత్సరాలు కష్టపడి హిమాలయాల కింద దొరికిన జంతువుల డిఎన్ఏ నుంచి  కనిపెట్టాడు.

అది మనిషి శరీరంలోకి వెళ్లిన వెంటనే అతను రాక్షసుడుగా మారిపోతాడు ఎవర్ని గుర్తుపట్టలేదు ఎదురుగా మనిషి కనిపిస్తే చాలు చంపేస్తాడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక జాంబీలాగ తయారవుతాడు." అని చెప్పాడు ముష్రు.

ఆ మాటవిని భూషణ్ వాళ్ళ వైపు భయంగా చూస్తూ "మహారాజ! ఇప్పుడు పరిస్థితి ఏంటి! యోధా సార్ వాళ్లు కూడా ఇంకా ఇక్కడికి రాలేదు." అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.

"సయ్యద్ నీతో మాట్లాడడానికి వస్తున్నాడు కదా! నీ స్టైల్ లో మాట్లాడు జరగాల్సింది మేము చూసుకుంటాము." అని చెప్పాడు క్యూబ్.

గబ్బర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "సార్! ఎవరితో మాట్లాడుతున్నారు?" అని డౌట్ గా అడిగాడు ముష్రు.

"మా తాతయ్యతో ఆ విషయాన్ని నీకు ఎందుకురా..! నేను మెడిటేషన్ లో ఉంటాను ఆ సయ్యద్ గాడు వస్తే పిలువు!" అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకున్నాడు గబ్బర్ సింగ్.

*************

నారదుడితోపాటు వేరే రూట్లో తీవ్రవాదుల వెనక్కి వచ్చి చూస్తూ "గైస్! వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉన్నారు మీరు కొంచెం కష్టపడాలి." అని చెప్పాడు యోధ.

ఆ మాటవిని చేతిలో ఉన్న గన్ తీప్పుతూ "నో ప్రాబ్లం! అంత పెద్ద రాక్షసుడిని చంపిన దాన్ని వీళ్ళను చంపలేనా..!" అని ధైర్యంగా చూస్తూ చెప్పింది పూజా.

"ఈ రాక్షసులకు ఎటువంటి శాపాలు ఉన్నాయో నాకు మాత్రం తెలియదు." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! వీళ్ళకి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి శాపం ఉంది." అని గన్ తీసి మధ్యలో ఉన్న టెర్రరిస్ట్ తల మీద షూట్ చేశాడు యోధ.

బుల్లెట్ తగిలిన మనిషి కింద పడడం చూసి వెనక్కి తిరిగిన ముగ్గురి తలలో షూట్ చేశారు సుహా వాళ్ళు.

అది చూసి "నారాయణ నారాయణ! ఈ ఆయుధం చాలా బాగుంది కలికాలంలో నారాయణుడు అవతారం ఎత్తినప్పుడు కూడా ఈ ఆయుధాలు వాడుతారు అనుకుంటా! వెళ్లేటప్పుడు ఒకటి తీసుకువెళ్లి ముక్కోటి దేవతలకు చూపించాలి.' అనుకున్నాడు నారదుడు.

అంతలో టెర్రరిస్టులు కూడా తిరిగి ఫైరింగ్ చేయడంతో అక్కడ ఉన్న రాళ్ల వెనుకా ఉండి ఫైరింగ్ చేస్తూ ఉన్నారు యోధ వాళ్ళు.

ఒక రాయి వెనకాల దాక్కుని "స్వామీజీ ఎక్కడ? ఆయనకి బుల్లెట్ తగిలితే మనకి ల్యాబ్ దారి చూపించే వాళ్ళు ఉండరు." అనుకుని తలతిప్పి నారదుడు బాడీలో నుంచి బుల్లెట్స్ బయటికి వెళ్లడం చూసి

"స్వామీజీకి  బుల్లెట్ తగిలిన ఏమీ అవడం లేదు ఏమిటి!" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పూజా.


[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 19-05-2026, 08:16 AM



Users browsing this thread: 1 Guest(s)