17-05-2026, 07:30 AM
రుద్రం భజే? ఎపిసోడ్ 45
యోధ వాళ్ళు టూరిస్టులం ల్యాబ్ కోసం వెతుకుతున్నామని చెప్పడంతో అవునా అయితే నా వెనకాల రండి హిమాలయాలు చూపిస్తూ ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడు నారదుడు.
***********
'నారాయణ నారాయణ!' అంటూ నడుస్తూ ఉన్న సాధువు దగ్గరికి వెళ్లి "స్వామి! మీకు ల్యాబ్ ఎక్కడ ఉందో తెలుసా..?" అని అడిగింది పూజా.
"నాకు ఈ హిమాలయాలు మాత్రమే కాదు ముల్లోకాలు తెలుసు తిరుగుతూనే ఉంటా కదా!" అని చెప్పాడు నారదుడు.
"మీకు ఈ ఏరియాలో గన్స్ పట్టుకుని తిరుగుతూన్న మనుషులు ఎవరైనా కనిపించారా..?" అని అడిగింది సుహా.
ఆ మాటకి యోధ వైపు చూసి "అతని దగ్గర మూడు గన్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర కుడా ఉన్నాయి నాతోపాటు తిరుగుతూ మళ్లీ నన్నే అడుగుతున్నారా..?" అని నవ్వుతూ అడిగాడు నారదుడు.
ఆ మాట విని పూజ దగ్గరికి వెళ్లి "మేడం! నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి పవర్స్ ఉంటాయి మన దగ్గర గన్స్ ఉన్నాయి అని ఎలా కనిపెట్టేసాడో చూడండి." నెమ్మదిగా చెప్పాడు పుష్కర్.
"నీ బొంద! మన బీమ్ బాయ్ ని చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు ఆ ఫిగర్ అటువంటిది చేతిలో గన్ లేకపోయినా సరే పట్టుకున్నట్లు కనిపిస్తూనే ఉంటుంది." అని చెప్పింది పూజా.
"స్వామి! మనం చాలా లోపలికి వెళుతున్నట్లు ఉన్నాము." అని డౌట్ గా చూస్తూ అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుకుంటూ "ఏంటి! ఈ ప్లేస్ చూసినట్లు ఉందా..?" అని అడిగాడు నారదుడు.
"యోధ! మనం ఏజెంట్స్ ని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు 24 మందిని చంపావు కదా ఆ ప్లేస్ దగ్గరికి వెళుతున్నము." అని చెప్పింది సుహా.
అక్కడ ఉన్న రాయి వైపు చూసి "యోధ! మనం పెన్ డ్రైవ్ లో చూసినా ప్లేస్ ఇదే! 25 సంవత్సరాల క్రితం ఆ పద్మంతో ప్రయోగం ఇక్కడే చేసారు." అని చెప్పింది దీప్తి.
ఆ ప్లేస్ వైపు చూస్తూ "ఎస్! ఈ సాధువు మనల్ని ఇక్కడికి తీసుకు వస్తున్నాడు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"ఆ సాధువు మమ్మల్ని కావాలని ప్లేస్ కి తీసుకు వెళుతున్నారు." అని చెప్పి దగ్గరకు వెళ్లి "స్వామి! మీరు 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమైనా చూసారా..?" అని అడిగాడు యోధ.
"25 సంవత్సరాల క్రితం చూసాను కొంతకాలం క్రితం నువ్వు ఇక్కడ కొంతమందిని మట్టు పెట్టడం చూశాను, వారి శరీరాలను కోపంతో ఆ కొండమీదికి గిరాటు వేయడం కూడా చూశాను." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని దూరంగా ఉన్న కొండ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? ఆ 24 మందిని చంపి ఇక్కడ నుంచి అక్కడికి గిరాటు వేసావా..?" అని అడిగింది పూజా.
"నిజంగానే అంత దూరం ఎలా విసిరావు?' అని యోధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప్తి.
"ఆరోజు క్లాత్ మీద ఉన్న జైశ్రీరామ్ అనే అక్షరాలని తొక్కలని చూసారు పిచ్చి కోపం వచ్చింది ఒక్కొక్కడి వెన్నుపూసలు విరకొట్టి కాళ్లు పట్టుకుని గిరాటు వేస్తుంటే అక్కడికి వెళ్లి పడ్డారు." అని చెప్పాడు యోధ.
"ఇంక నయం చేతికి వీలుగా ఉంది కదా అని ఇటువైపు విసిరితే వెళ్లి మన బోర్డర్లో పడేవారు." అని చెప్పింది దీప్తి.
"నువ్వు మంచి పని చేశావు కానీ దీంట్లో ఒక ప్రమాదం దాగి ఉంది. అది తెలియాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి!" అన్నాడు నారదుడు.
ఆ మాట విని "నాకు కథలంటే భలే ఇష్టం చెప్పండి చెప్పండి." అని సంతోషంగా ముందుకు వచ్చింది పూజా.
"పూర్వం రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కొన్ని వరాలను ప్రసాదించాడు వాటిలో శక్తివంతమైన రెండు పద్మలు కూడా ఉన్నాయి వాటి ద్వారా ఏ లోకానికైనా వెళ్లే మార్గం తెరుచుకుంటుంది.
రావణాసురుడు ఆ పద్మాన్ని హిడిచి జాతికి చెందిన రాక్షసులకి ఇచ్చి కుబేరుడు నగరమైన అలకాపురని కైవసం చేసుకోమని పంపించాడు.
అప్పుడు ఆ పద్మం ద్వారా రాక్షసులు కైలాస పర్వతం దగ్గరికి చేరుకుని అలకాపురి నగరానికి వెళ్లడానికి ప్రయత్నించారు.
ఆ నగరానికి రక్షణగా ఉన్న శివగణాలు ఆ రాక్షసులను ఎదుర్కొన్నారు వారి నుంచి తప్పించుకోని పారిపోవడానికి పద్మలోకి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ శివగణాలు వాళ్లని పద్మ లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక గుహలోకి పంపించి భూస్థాపితం చేశారు.
అప్పుడే ఆ పద్మంలో ఒక లోకం తలుపులు తెరుచుకున్నాయి అక్కడ శిమిరా అనే ఒక శక్తివంతమైన రాక్షసుడుని ఇంద్రుడు బంధించి ఉంచాడు.
ఆ విషయం తెలుసుకున్న శివగణాలు ఆ శిమిరా ని బయటికి రానివ్వకుండా పద్మాన్ని కూడా హిమాలయాలలో భూస్థాపితం చేశారు.
కానీ శిమిరా ఆ లోకం నుంచి బయటికి వచ్చి పద్మంలో తిష్ట వేసుకుని ఎప్పుడూ బయటికి వద్దామా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.
కలికాలంలో ఆరోజు రానే వచ్చింది కొందరి దుర్మార్గుల చేతికి ఆ పద్మం చేరింది దాని శక్తి తెలుసుకోవడానికి చేయరాని ప్రయోగాలు చేశారు ఆ క్రమంలోని శిమిరా భూమి మీదకు వచ్చి ఆ కొండ మీదకి చేరుకున్నాడు.
అదృష్టవశాత్తు ఆ పద్మాన్ని ముగ్గురు మహావీరులు ఆ దుర్మార్గుల చెంత నుంచి కాపాడి తీసుకువెళ్లేరు కానీ భూమి మీదకి వచ్చిన శిమిరా ఆ కొండమీదే ఉన్నాడు.
నువ్వు అక్కడికి 24 మంది మానవులను పంపించి అతని ఆకలి తీర్చి కాస్త శక్తిని ఇచ్చావు." అని చెప్పాడు నారదుడు.
"అంటే స్వామి! ఇప్పుడు ఆ శిమిరా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా..?" అని డౌట్ గా అడిగింది సుహా.
"రేపలా అని హిడిచి వంశానికి చెందిన ఒక మాంత్రికుడు శిమిరా భూమి మీదకి వచ్చాడు అనే విషయం తెలుసుకుని అతని కోసం వెతుకుతూ ఉన్నాడు ఒకవేళ ఇద్దరూ కలిస్తే కాస్త ఇబ్బంది ఎదురవుతుంది." అని చెప్పాడు నారదుడు.
"స్వామి! ఆ శిమిరా ని పద్మ లో నుంచి ఆ లోకానికి పంపిస్తే సరిపోతుంది కదా!" అని అడిగాడు యోధ.
"ఆ పద్మం మీ దగ్గర ఉంటే ఆ పని చేయొచ్చు కానీ నువ్వు చేసిన పని వల్ల అతనికి కాస్త శక్తి వచ్చింది కాబట్టి ఆ లోకానికి తిరిగి పంపించడం కన్నా పై లోకాలకు పంపించడం మంచిది." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని "రాక్షసుడు అంటున్నారు మనుషుల చేతిలో చస్తాడా..?" అని డౌట్ గా అడిగాడు వర్ధన్.
"మరణం లేని జీవి ఉందా ఒక యుగం కాకపోతే మరో యుగంలో అయ్యినా మరణం తప్పదు." అని చెప్పాడు నారదుడు.
"స్వామి! నేను ఆ రేపాలా వెన్నుపూస మీద నా కాలు వేసి తొక్కడనికి ఇక్కడికి వచ్చాను వాడికి హెల్ప్ చేస్తాడు అని తెలిసిన తర్వాత రాక్షసుడు అయితే ఏంటి చంపేయడమే!" అని కసిగా చెప్పాడు యోధ.
"చాలా సంతోషం మీకు నేను కూడా కాస్త సహాయం చేస్తాను మనం ఆ కొండమీదికి చేరుకుంటే ఆ ల్యాబ్ దగ్గరికి కుడా సులభంగా వెళ్లొచ్చు!" అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని భయంగా నీతూ దగ్గరికి వచ్చి "మేడం! ఒక్కసారి ఆలోచించండి ఆ రాక్షసుడికి మనల్ని ఆహారంగా వేయాలని ఈ సాధువు ప్లాన్ వేయలేదు కదా!" అని డౌట్ గా అడిగాడు ఏకవీర.
"నారాయణ నారాయణ! నేను మంచి వైఫై ఉంటాను గాని చెడు వైపు ఉండను." అని చెప్పాడు నారదుడు.
"కరెక్ట్! నేను చాలా సినిమాల్లో చూశాను నారాయణ నారాయణ అన్న వాళ్ళు రాక్షసులకి యాంటీగా ఉంటారు." అని చెప్పింది పూజా.
"నాకు తెలిసి అతను రాక్షసుడు కాదు ఏ గ్రహాంతరవాసి అయి ఉంటాడు పదండి వెళ్లి లేపేద్దాము." అని చెప్పాడు రాఖి.
"విజ్ఞానం పెరిగింది కాబట్టి కొత్త పేర్లు ఏదైనా ఒకటే కదా వేరే లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడు అని నేను చెప్పాను, మీరు గ్రహాంతరవాసి అనుకోండి నేను రాక్షసుడు అనుకుంటాను మట్టు పెట్టడమే మనకు కావలసింది." అని చెప్పాడు నారదుడు.
"సరే! అక్కడికి వెళ్లి రూట్ చూపించండి ఆ శిమిరాని చంపి ల్యాబ్ దగ్గరికి వెళదాము అందరికీ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది." అని చెప్పాడు యోధ.
"నారాయణ నారాయణ!" అంటూ కొండమీదికి వెళ్లే రూట్లో బయలుదేరాడు నారదుడు.
*************
ల్యాబ్ దగ్గర బయట ఉన్న గ్రౌండ్ లోకి తీసుకువెళ్లి బోన్ లో ఉన్న తోడేళ్లని చూపించి "గబ్బర్ గారు! మా హిడిచి పట్టుకునే ఉడతలు ఇవే!
ఈ రెండు తోడేళ్లని మచ్చికా చేసుకుని మీ శక్తిని చూపించండి అప్పుడు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాము." అని చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయడు రేపాలా.
భారీ ఆకారంలో నోరు తెరుచుకుని భయంకరంగా అరుస్తున్న బోన్ లో ఉన్న రెండు తోడేళ్ల వైపు చూస్తూ భయంతో బిగిసుకుపోయి
"ఒరేయ్ దరిద్రుడా! తోడేళ్ళ ముందు నిలబెట్టి ఉడతలు అంటావేమిటిరా..! వీటిని చూస్తేనే గుండె ఆగిపోయేటట్లు ఉంది.
బాబోయ్! ఈరోజు నా పని అవుట్! గుప్తా చెప్పినట్లు నా పెళ్ళాం చేతిలో కాదు ఈ తోడేళ్ల పంటి కింద పడి చచ్చిపోయేటట్లు ఉన్నాను. " అని భయంతో వణుకుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
అక్కడికి వచ్చి గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "భయపడకు నేను ఉన్న కదా!" అని చెప్పాడు భూషణ్.
"ఈ తోడేళ్లకి కు మీరు మహారాజు అని తెలియదు కదా!" అని భయంగా చూస్తూ అడిగాడు గబ్బర్.
"ఆ రెండు తోడేళ్లు బయటికి వచ్చిన తర్వాత భయపడకుండా ధైర్యంగా చూస్తూ ఉండు." అని చెప్పాడు భూషణ్.
ల్యాబ్ లోపలకి వచ్చిన రేపాలని చూసి బాటన్ ప్రెస్ చేసి "ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ పవర్ ఏమిటో తెలుస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.
బోన్లో నుంచి రెండు తోడేళ్లు గబ్బర్ సింగ్ వైపు పరిగెత్తుకు రావడం చూసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు ముష్రు.
వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి భూషణ్ వైపు చూసి తోక ఊపుకుంటూ గబ్బర్ సింగ్ ముందు సైలెంట్ గా కూర్చున్నాయి రెండు తోడేళ్లు.
"గబ్బర్! ఇప్పుడు ధైర్యం వచ్చిందా నేను వాటిని 30 నిమిషాలు మాత్రమే ఆపగలను ఈలోపు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం!" అని చెప్పాడు భూషణ్.
"మహారాజ! ఆమాత్రం టైమ్ చాలు చాలారేగిపోతాను చూడండి." అని సంతోషంగా చూస్తూ "ఒరేయ్ రేపాలా! ఆ బిస్కెట్లు పట్టుకురా...!" అని గట్టిగా అరిచాడు గబ్బర్ సింగ్.
***********
'నారాయణ నారాయణ!' అంటూ నడుస్తూ ఉన్న సాధువు దగ్గరికి వెళ్లి "స్వామి! మీకు ల్యాబ్ ఎక్కడ ఉందో తెలుసా..?" అని అడిగింది పూజా.
"నాకు ఈ హిమాలయాలు మాత్రమే కాదు ముల్లోకాలు తెలుసు తిరుగుతూనే ఉంటా కదా!" అని చెప్పాడు నారదుడు.
"మీకు ఈ ఏరియాలో గన్స్ పట్టుకుని తిరుగుతూన్న మనుషులు ఎవరైనా కనిపించారా..?" అని అడిగింది సుహా.
ఆ మాటకి యోధ వైపు చూసి "అతని దగ్గర మూడు గన్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర కుడా ఉన్నాయి నాతోపాటు తిరుగుతూ మళ్లీ నన్నే అడుగుతున్నారా..?" అని నవ్వుతూ అడిగాడు నారదుడు.
ఆ మాట విని పూజ దగ్గరికి వెళ్లి "మేడం! నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి పవర్స్ ఉంటాయి మన దగ్గర గన్స్ ఉన్నాయి అని ఎలా కనిపెట్టేసాడో చూడండి." నెమ్మదిగా చెప్పాడు పుష్కర్.
"నీ బొంద! మన బీమ్ బాయ్ ని చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు ఆ ఫిగర్ అటువంటిది చేతిలో గన్ లేకపోయినా సరే పట్టుకున్నట్లు కనిపిస్తూనే ఉంటుంది." అని చెప్పింది పూజా.
"స్వామి! మనం చాలా లోపలికి వెళుతున్నట్లు ఉన్నాము." అని డౌట్ గా చూస్తూ అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుకుంటూ "ఏంటి! ఈ ప్లేస్ చూసినట్లు ఉందా..?" అని అడిగాడు నారదుడు.
"యోధ! మనం ఏజెంట్స్ ని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు 24 మందిని చంపావు కదా ఆ ప్లేస్ దగ్గరికి వెళుతున్నము." అని చెప్పింది సుహా.
అక్కడ ఉన్న రాయి వైపు చూసి "యోధ! మనం పెన్ డ్రైవ్ లో చూసినా ప్లేస్ ఇదే! 25 సంవత్సరాల క్రితం ఆ పద్మంతో ప్రయోగం ఇక్కడే చేసారు." అని చెప్పింది దీప్తి.
ఆ ప్లేస్ వైపు చూస్తూ "ఎస్! ఈ సాధువు మనల్ని ఇక్కడికి తీసుకు వస్తున్నాడు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"ఆ సాధువు మమ్మల్ని కావాలని ప్లేస్ కి తీసుకు వెళుతున్నారు." అని చెప్పి దగ్గరకు వెళ్లి "స్వామి! మీరు 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమైనా చూసారా..?" అని అడిగాడు యోధ.
"25 సంవత్సరాల క్రితం చూసాను కొంతకాలం క్రితం నువ్వు ఇక్కడ కొంతమందిని మట్టు పెట్టడం చూశాను, వారి శరీరాలను కోపంతో ఆ కొండమీదికి గిరాటు వేయడం కూడా చూశాను." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని దూరంగా ఉన్న కొండ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? ఆ 24 మందిని చంపి ఇక్కడ నుంచి అక్కడికి గిరాటు వేసావా..?" అని అడిగింది పూజా.
"నిజంగానే అంత దూరం ఎలా విసిరావు?' అని యోధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప్తి.
"ఆరోజు క్లాత్ మీద ఉన్న జైశ్రీరామ్ అనే అక్షరాలని తొక్కలని చూసారు పిచ్చి కోపం వచ్చింది ఒక్కొక్కడి వెన్నుపూసలు విరకొట్టి కాళ్లు పట్టుకుని గిరాటు వేస్తుంటే అక్కడికి వెళ్లి పడ్డారు." అని చెప్పాడు యోధ.
"ఇంక నయం చేతికి వీలుగా ఉంది కదా అని ఇటువైపు విసిరితే వెళ్లి మన బోర్డర్లో పడేవారు." అని చెప్పింది దీప్తి.
"నువ్వు మంచి పని చేశావు కానీ దీంట్లో ఒక ప్రమాదం దాగి ఉంది. అది తెలియాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి!" అన్నాడు నారదుడు.
ఆ మాట విని "నాకు కథలంటే భలే ఇష్టం చెప్పండి చెప్పండి." అని సంతోషంగా ముందుకు వచ్చింది పూజా.
"పూర్వం రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కొన్ని వరాలను ప్రసాదించాడు వాటిలో శక్తివంతమైన రెండు పద్మలు కూడా ఉన్నాయి వాటి ద్వారా ఏ లోకానికైనా వెళ్లే మార్గం తెరుచుకుంటుంది.
రావణాసురుడు ఆ పద్మాన్ని హిడిచి జాతికి చెందిన రాక్షసులకి ఇచ్చి కుబేరుడు నగరమైన అలకాపురని కైవసం చేసుకోమని పంపించాడు.
అప్పుడు ఆ పద్మం ద్వారా రాక్షసులు కైలాస పర్వతం దగ్గరికి చేరుకుని అలకాపురి నగరానికి వెళ్లడానికి ప్రయత్నించారు.
ఆ నగరానికి రక్షణగా ఉన్న శివగణాలు ఆ రాక్షసులను ఎదుర్కొన్నారు వారి నుంచి తప్పించుకోని పారిపోవడానికి పద్మలోకి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ శివగణాలు వాళ్లని పద్మ లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక గుహలోకి పంపించి భూస్థాపితం చేశారు.
అప్పుడే ఆ పద్మంలో ఒక లోకం తలుపులు తెరుచుకున్నాయి అక్కడ శిమిరా అనే ఒక శక్తివంతమైన రాక్షసుడుని ఇంద్రుడు బంధించి ఉంచాడు.
ఆ విషయం తెలుసుకున్న శివగణాలు ఆ శిమిరా ని బయటికి రానివ్వకుండా పద్మాన్ని కూడా హిమాలయాలలో భూస్థాపితం చేశారు.
కానీ శిమిరా ఆ లోకం నుంచి బయటికి వచ్చి పద్మంలో తిష్ట వేసుకుని ఎప్పుడూ బయటికి వద్దామా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.
కలికాలంలో ఆరోజు రానే వచ్చింది కొందరి దుర్మార్గుల చేతికి ఆ పద్మం చేరింది దాని శక్తి తెలుసుకోవడానికి చేయరాని ప్రయోగాలు చేశారు ఆ క్రమంలోని శిమిరా భూమి మీదకు వచ్చి ఆ కొండ మీదకి చేరుకున్నాడు.
అదృష్టవశాత్తు ఆ పద్మాన్ని ముగ్గురు మహావీరులు ఆ దుర్మార్గుల చెంత నుంచి కాపాడి తీసుకువెళ్లేరు కానీ భూమి మీదకి వచ్చిన శిమిరా ఆ కొండమీదే ఉన్నాడు.
నువ్వు అక్కడికి 24 మంది మానవులను పంపించి అతని ఆకలి తీర్చి కాస్త శక్తిని ఇచ్చావు." అని చెప్పాడు నారదుడు.
"అంటే స్వామి! ఇప్పుడు ఆ శిమిరా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా..?" అని డౌట్ గా అడిగింది సుహా.
"రేపలా అని హిడిచి వంశానికి చెందిన ఒక మాంత్రికుడు శిమిరా భూమి మీదకి వచ్చాడు అనే విషయం తెలుసుకుని అతని కోసం వెతుకుతూ ఉన్నాడు ఒకవేళ ఇద్దరూ కలిస్తే కాస్త ఇబ్బంది ఎదురవుతుంది." అని చెప్పాడు నారదుడు.
"స్వామి! ఆ శిమిరా ని పద్మ లో నుంచి ఆ లోకానికి పంపిస్తే సరిపోతుంది కదా!" అని అడిగాడు యోధ.
"ఆ పద్మం మీ దగ్గర ఉంటే ఆ పని చేయొచ్చు కానీ నువ్వు చేసిన పని వల్ల అతనికి కాస్త శక్తి వచ్చింది కాబట్టి ఆ లోకానికి తిరిగి పంపించడం కన్నా పై లోకాలకు పంపించడం మంచిది." అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని "రాక్షసుడు అంటున్నారు మనుషుల చేతిలో చస్తాడా..?" అని డౌట్ గా అడిగాడు వర్ధన్.
"మరణం లేని జీవి ఉందా ఒక యుగం కాకపోతే మరో యుగంలో అయ్యినా మరణం తప్పదు." అని చెప్పాడు నారదుడు.
"స్వామి! నేను ఆ రేపాలా వెన్నుపూస మీద నా కాలు వేసి తొక్కడనికి ఇక్కడికి వచ్చాను వాడికి హెల్ప్ చేస్తాడు అని తెలిసిన తర్వాత రాక్షసుడు అయితే ఏంటి చంపేయడమే!" అని కసిగా చెప్పాడు యోధ.
"చాలా సంతోషం మీకు నేను కూడా కాస్త సహాయం చేస్తాను మనం ఆ కొండమీదికి చేరుకుంటే ఆ ల్యాబ్ దగ్గరికి కుడా సులభంగా వెళ్లొచ్చు!" అని చెప్పాడు నారదుడు.
ఆ మాట విని భయంగా నీతూ దగ్గరికి వచ్చి "మేడం! ఒక్కసారి ఆలోచించండి ఆ రాక్షసుడికి మనల్ని ఆహారంగా వేయాలని ఈ సాధువు ప్లాన్ వేయలేదు కదా!" అని డౌట్ గా అడిగాడు ఏకవీర.
"నారాయణ నారాయణ! నేను మంచి వైఫై ఉంటాను గాని చెడు వైపు ఉండను." అని చెప్పాడు నారదుడు.
"కరెక్ట్! నేను చాలా సినిమాల్లో చూశాను నారాయణ నారాయణ అన్న వాళ్ళు రాక్షసులకి యాంటీగా ఉంటారు." అని చెప్పింది పూజా.
"నాకు తెలిసి అతను రాక్షసుడు కాదు ఏ గ్రహాంతరవాసి అయి ఉంటాడు పదండి వెళ్లి లేపేద్దాము." అని చెప్పాడు రాఖి.
"విజ్ఞానం పెరిగింది కాబట్టి కొత్త పేర్లు ఏదైనా ఒకటే కదా వేరే లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడు అని నేను చెప్పాను, మీరు గ్రహాంతరవాసి అనుకోండి నేను రాక్షసుడు అనుకుంటాను మట్టు పెట్టడమే మనకు కావలసింది." అని చెప్పాడు నారదుడు.
"సరే! అక్కడికి వెళ్లి రూట్ చూపించండి ఆ శిమిరాని చంపి ల్యాబ్ దగ్గరికి వెళదాము అందరికీ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది." అని చెప్పాడు యోధ.
"నారాయణ నారాయణ!" అంటూ కొండమీదికి వెళ్లే రూట్లో బయలుదేరాడు నారదుడు.
*************
ల్యాబ్ దగ్గర బయట ఉన్న గ్రౌండ్ లోకి తీసుకువెళ్లి బోన్ లో ఉన్న తోడేళ్లని చూపించి "గబ్బర్ గారు! మా హిడిచి పట్టుకునే ఉడతలు ఇవే!
ఈ రెండు తోడేళ్లని మచ్చికా చేసుకుని మీ శక్తిని చూపించండి అప్పుడు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాము." అని చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయడు రేపాలా.
భారీ ఆకారంలో నోరు తెరుచుకుని భయంకరంగా అరుస్తున్న బోన్ లో ఉన్న రెండు తోడేళ్ల వైపు చూస్తూ భయంతో బిగిసుకుపోయి
"ఒరేయ్ దరిద్రుడా! తోడేళ్ళ ముందు నిలబెట్టి ఉడతలు అంటావేమిటిరా..! వీటిని చూస్తేనే గుండె ఆగిపోయేటట్లు ఉంది.
బాబోయ్! ఈరోజు నా పని అవుట్! గుప్తా చెప్పినట్లు నా పెళ్ళాం చేతిలో కాదు ఈ తోడేళ్ల పంటి కింద పడి చచ్చిపోయేటట్లు ఉన్నాను. " అని భయంతో వణుకుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
అక్కడికి వచ్చి గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "భయపడకు నేను ఉన్న కదా!" అని చెప్పాడు భూషణ్.
"ఈ తోడేళ్లకి కు మీరు మహారాజు అని తెలియదు కదా!" అని భయంగా చూస్తూ అడిగాడు గబ్బర్.
"ఆ రెండు తోడేళ్లు బయటికి వచ్చిన తర్వాత భయపడకుండా ధైర్యంగా చూస్తూ ఉండు." అని చెప్పాడు భూషణ్.
ల్యాబ్ లోపలకి వచ్చిన రేపాలని చూసి బాటన్ ప్రెస్ చేసి "ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ పవర్ ఏమిటో తెలుస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.
బోన్లో నుంచి రెండు తోడేళ్లు గబ్బర్ సింగ్ వైపు పరిగెత్తుకు రావడం చూసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు ముష్రు.
వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి భూషణ్ వైపు చూసి తోక ఊపుకుంటూ గబ్బర్ సింగ్ ముందు సైలెంట్ గా కూర్చున్నాయి రెండు తోడేళ్లు.
"గబ్బర్! ఇప్పుడు ధైర్యం వచ్చిందా నేను వాటిని 30 నిమిషాలు మాత్రమే ఆపగలను ఈలోపు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం!" అని చెప్పాడు భూషణ్.
"మహారాజ! ఆమాత్రం టైమ్ చాలు చాలారేగిపోతాను చూడండి." అని సంతోషంగా చూస్తూ "ఒరేయ్ రేపాలా! ఆ బిస్కెట్లు పట్టుకురా...!" అని గట్టిగా అరిచాడు గబ్బర్ సింగ్.
" రుద్రం భజే? ఎపిసోడ్ 45 " రచనకు రేటింగ్ ఇవ్వండి



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)