Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 42



ల్యాబ్ లోకి జింగ్ ని తీసుకొచ్చి తన చాతి మీద ఉన్న సింబల్ చూపించి ఇకనుంచి ఇతని పేరు హిడిచి ఇతని శరీరంలోకి నా పూర్వీకుల శక్తిని ప్రవేశపెట్టాను అని చెప్పాడు రేపాలా.

************

హిడిచి ని ఎవరు ఎదుర్కోలేరు అని చెప్పిన రేపాలా వైపు చూసి "జింగ్ పిరికివాడు కళింగ సృష్టించిన తోడేలు అరుపు వింటేనే వణికిపోయేవాడు,

అలాంటిది వచ్చే వాడు నీతో సమానమైన వాడు అనుకుంటున్నావు మారి ధైర్యంగా ఎలా ఎదుర్కొంటాడు?" అని అనుమానంగా అడిగాడు చింగ్ యా.

ఆ మాటకి చింగ్ యా వైపు చూసి "రేపాలా శక్తి మీద డౌట్ వద్దు అతను ఏదైనా చేయగలడు." అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు కళింగ.

"నాశక్తి మాటలతో కాదు చేతలతో చూపిస్తాను, కళింగ నువ్వు సృష్టించిన రెండు తోడేళ్ళని బయటికి వదులు హిడిచి వాటితో పోరాడుతాడు." అని చెప్పాడు రేపాలా.

"నువ్వు చింగ్ యా మాటలు పట్టించుకోకు అనవసరంగా రెండు తోడేళ్ళని మనం నష్టపోతాము." అని చెప్పాడు కళింగ.

"ఆ తోడేళ్ల కన్నా శక్తివంతమైన మనుషుల్ని సృష్టించి  ఇస్తాను వాటిని బయటకు వదులు నా శక్తిని తక్కువ అంచనా వేసినా వాళ్లకి నేను ఏమిటో చూపించే వరకు
నా మనసు ప్రశాంతంగా ఉండదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు రేపాలా.

"సరే!" అని అక్కడ ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేశాడు కళింగ.

బటన్ ప్రెస్ అవడంతో డోర్ ఓపెన్ అయ్యి భయంకరంగా అరుస్తూ భారీ తోడేళ్లు రెండు బయటికి వచ్చి ఖాళీ ప్లేస్ లో ఆవేశంగా పరిగెడుతూ ఉన్నాయి.

మంచు తోడేళ్ల వైపు చూస్తూ "వీటి బాడీలోకి బుల్లెట్స్ కూడా దిగావు, దాని పంజా దెబ్బ తగిలితే మనిషి పైకి లెగలేడు." అని ఆనందంగా చూస్తూ చెప్పాడు కళింగ.

హిడిచి వైపు చూసి "ఆ రెండు తోడేళ్ళని చీల్చి చెండాడి వాటి రక్తం తాగి నీ శక్తిని చూపించు!" అని కసిగా చెప్పాడు రేపాలా.

ఆ మాట విని షర్టు విప్పి శరీరాన్ని భారీ ఆకారంలోకి మార్చుకుని వేగంగా పరిగెడు తోడేళ్లు దగ్గరికి వెళ్ళాడు హిడిచి.

అక్కడికి వచ్చిన హిడిచి వైపు ఎర్రటి కళ్ళతో కసిగా చూస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి రెండు తోడేళ్లు.

ఏమి జరుగుతుందా అని టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు చింగ్ యా.

వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న తోడేళ్లను చూసి ఒక కాలు మడిచి కొంచెం వంగి ముందుగా వచ్చిన తోడేలుని రెండు చేతులతో పట్టుకొని పైకి లేపి భయంకరంగా అరుస్తూ రెండు భాగాలుగా చేసి రక్తం తాగి "నా దాహం కాస్తా తీరింది." అని సంతోషంగా అరుస్తూ ఉన్నాడు హిడిచి.

అది చూసి చెమటలు తుడుచుకుని "రేపాలా! నీ శక్తి మీద నమ్మకం వచ్చింది జింగ్ ని మామూలు మనిషిగా మారమను నాకు చాలా భయంగా ఉంది." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాటకి నవ్వుతూ "అతని రక్త దాహం తీరితే గాని మళ్లీ మామూలు మనిషిగా మారడు." అని చెప్పి మరొక తోడేలు హిడిచి మీద ఎటాక్ చేయడం చూస్తూ ఉన్నాడు రేపాలా.

గాలిలోకి ఎగిరిన రెండో తోడేలు ని చూసి తను కూడా గాలిలోకి ఎగిరి దాని మెడ పట్టుకుని రక్తం తాగుతూ నేల మీదకి తీసుకువచ్చి బలంగా రెండు చేతులతో తోడేలు తలని వేరుచేసి దూరంగా గిరాటు వేసి

భయంకరంగా అరుస్తూ మళ్ళీ మామూలు మనిషిగా మారి తోడేళ్ల కోసం ఉంచిన నీళ్లతో స్నానం చేసి ల్యాబ్ లోపలికి వచ్చాడు హిడిచి.

ల్యాబ్ లోపలికి వచ్చిన హిడిచి భుజం మీద చేయి వేసి సంతోషంగా చూస్తూ "నా నమ్మకాన్ని నిలబెట్టావు!" అని కళింగ వైపు చూసి

"ఆ రెండు తోడేళ్ల ప్రాణాలని ఇద్దరి మనుషుల శరీరాల్లోకి పంపిస్తాను సిద్ధంచెయ్ ! వాళ్ళు హిడిచి కి సేవకులుగా ఉంటారు." అని చెప్పాడు రేపాలా.

ఆ మాటకి చింగ్ యా వైపు చూసి "రెండు మనుషుల బాడీ లు కావాలి!" అని చెప్పాడు కళింగ.

"ఈవినింగ్ కి ఏరేంజ్ చేస్తాను." అని చెప్పి హిడిచి వైపు భయంగా చూస్తూ ల్యాబ్ నుంచి బయటికి వెళ్ళాడు చింగ్ యా.

రేపాలా వైపు చూస్తూ "ఇక్కడ రెండు దేశాల ఆర్మీ ఉండదు ఒకవేళ ఇండియన్ మిలిటరీ ఎటాక్ చేస్తే  మనం ల్యాబ్ నీ కాపాడుకోవాలి నీ సైన్యాన్ని నిద్రలో నుంచి బయటకు తీసుకురా..!" అని చెప్పాడు కళింగ.

"నువ్వు అధైర్య పడకు మిత్రమా! నేను ఉండగా ల్యాబ్ దగ్గరికి ఎవరు రాలేరు నా సైన్యాన్ని నిద్ర లేపే సమయం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తాను." అని చెప్పాడు రేపాలా.

"సరే!" అని ల్యాబ్ లోపలకి వెళ్లి తన ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నాడు కళింగ.

************

బ్లాక్ హోల్ లో నుంచి బయటకువచ్చి తన వెనకాల అందరూ రావడం చూసి పద్మాన్ని జేబులో పెట్టుకున్నాడు యోధ.

బ్లాక్ హోల్ క్లోజ్ అవడంతో బ్యాగ్ లో నుంచి స్వెటర్ తీసి వేసుకుంటూ "చాలా చలిగా ఉంది మనం వాళ్ల ప్లేస్ కి వచ్చేసామా..?" అని డౌట్ గా చుట్టూ చూస్తూ అడిగింది పూజా.

"కళింగ మనకి పంపించిన లోకేషన్ కి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి, దగ్గర్లో ఉన్న గుడి దగ్గరికి రావాలని అనుకున్నాను కానీ ఇక్కడ గుడి ఏమీ కనపడటం లేదు." అని చుట్టూ చూస్తూ అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న మొక్కలు పక్కకి జరిపి "అదిగో శివాలయం! ఇక్కడ రోజు అశ్వద్ధామ వచ్చి పూజ చేసుకుంటాడు అంటారు.

అందుకే జనాలు ఎవరు లేని ప్లేస్ లో కూడా శివయ్యకి మారేడు దళాలు నందీశ్వరుడికి అరటి పళ్ళు పెట్టి ఉంచారు." అని చూపించడు భూషణ్.

"అవునా?" అని ఆశ్చర్యంగా చూస్తూ "పదండి దర్శనం చేసుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్ కి స్టార్ట్ అవుదాము." అని చెప్పాడు యోధ.

"సరే!" అని అందరూ దర్శనం చేసుకుంటూ ఉండగా నందీశ్వరుడు దగ్గర ఉన్న రెండు అరటిపళ్లు తీసుకుని తింటూ ఉన్నాడు గబ్బర్ సింగ్.

అది చూసి "ఏంటయ్యా! నాకోసం పెట్టినా పళ్ళు నువ్వు తింటున్నావు?" అని అడిగాడు నంద.

ఆ మాటకి తినడం ఆపి ఆశ్చర్యంగా చూస్తూ "ఈ పళ్ళు మీకోసం పెట్టలేదు సార్! నందీశ్వరుడికి పెట్టారు ప్రసాదం కదా అని తీసుకుని కళ్ళకు అద్దుకొని మరి తింటున్నాను." అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే తిను తిను! ప్రసాదం పెట్టి మేము తినే వరకు ఎవరు అగుతారు వెంటనే తీసుకొని తినేస్తారు కదా!" అని నిట్టూరుస్తూ చెప్పాడు నంద.

ఆ మాటకి క్యూబ్ దగ్గరికి వెళ్లి "మీరు ఇద్దరు విభీషణ మహా రాజు గారి సైన్యం కదా! మారి తనే నందీశ్వరుడు అయ్యినట్లు బాధపడుతున్నాడు ఏంటి?" అని నెమ్మదిగా అడిగాడు గబ్బర్ సింగ్.

అంతలో నందీశ్వరుడు చెవులో చెబుతున్న పూజా ని చూసి "నీ కోరిక శివయ్య దగ్గరికి చేరుతుందిలే తప్పకుండా తీరుతుంది." అని నవ్వుతూ చెప్పాడు నంద.

"అవునా థాంక్యూ!" అని సిగ్గుపడుతూ చెప్పింది పూజా.

ఆ మాట విని నంద దగ్గరికి వెళ్లి "ఏంటి? ఎవరైనా మనసులో అనుకుంటే నీకు వినపడుతుందా..?" అని అనుమానంగా అడిగాడు గబ్బర్ సింగ్.

"మనసులో అనుకుంటే వినపడదు నా చెవిలో చెబితే వినబడుతుంది." అని చెప్పాడు నంద.

"మనసులో అనుకుంటే నాకు వినపడుతుంది." అని షర్ట్ సరి చేసుకుంటూ చెప్పాడు గుప్తా.

"మీకు అన్ని వినబడతాయి ఇంతకీ ఆ అమ్మాయి ఏం కోరుకుంది?" అని ఆత్రుతగా అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ విషయాలన్ని నీకెందుకయ్యా! గబ్బర్ సింగ్ పోయిన పర్వాలేదు నేను క్షేమంగా వెనక్కి వెళ్ళాలి అనుకుంది." అని వెటకారంగా చూస్తూ చెప్పాడు క్యూబ్.

ఆ మాటకి నవ్వుతూ "ధర్మ గారు, గుప్తా గారు తోడు ఉండగా నాకేమీ అవుతుంది." అని ధైర్యంగా చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరేగాని! నీకు మనం వెళ్లే దారిలో మాయ రూపంలో ఎవరైనా ఎదురుపడితే వెంటనే నాతో చెప్పు!" అని చెప్పాడు క్యూబ్.

"ఆ ఆఫర్ నా ఒక్కడికే ఉందా..! వాళ్లు మీకు కనపడరా..?" అని భయంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"ఇక్కడ అతీత శక్తులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ మాయా ని మేము ఒక్కొక్కసారి కనిపెట్టలేము కానీ నీ కంటికి అందరూ కనపడతారు."  అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి భయంగా చూస్తూ "మిమ్మల్ని కాదు సార్! నాకు ఈ శక్తి ఇచ్చినందుకు మా ముత్తాతని అనాలి, పెద్ద పులి కోసం వేటగాడు మేకని వదిలినట్లు మీరు అందరూ కలిసి నన్ను వదులుతున్నారు ముందు ముందు ఏం జరుగుతుందో ఏమిటో!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే ఇంక స్టార్ట్ అవుదామా? వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు." అని చెప్పి గబ్బర్ సింగ్ వైపు చూసి

"ముందు నువ్వు ఉండు నీ వెనకాల ధర్మ, గుప్తా, ముష్రు  వస్తారు మేము కొంచెం దూరంగా ఉంటాము, మీ దగ్గరికి ఎవరు వచ్చారో చూసిన తర్వాత మేము ఎంటర్ అవుతాము." అని చెప్పి ముష్రు చేతికి మైక్రోఫోన్ ఇచ్చి "ఎప్పటికప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తూ ఉండు." అని చెప్పాడు యోధ.

"ఓకే సార్!' అని మైక్రో ఫోన్ ని తన చేతికి ఉన్న రింగ్ కింద పెట్టుకుని గబ్బర్ సింగ్ వైపు చూసి "రెడీ!" అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని వెటకారంగా చూస్తూ "రెడీ అంట రెడీ! వీడి సోమ్ము ఏం పోయింది పోతే నేనే కదా!" అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని "నువ్వు పోవులే కానీ మీకోసం వచ్చే వాళ్ళకి  అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఫేస్ లో భయం కనిపించింది అంటే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు." అని చెప్పింది నీతూ.

"ఓకే మేడం!' అని ధర్మ ఇచ్చిన కర్ర, గుప్తా ఇచ్చిన సూట్ కేసు పట్టుకుని "భయపడకూడదు అంట! వచ్చే వాళ్ళు ఏమన్నా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ..!" అనుకుంటూ ముందుకి వెళ్ళాడు గబ్బర్ సింగ్.

"యోధ! మేము ధర్మ వాళ్ళ వెనకాల వెళతాము మీరు వేరే వైపు నుంచి రండి." అని చెప్పి నంద, క్యూబ్ తో కలిసి వెళ్ళాడు భూషణ్.

"సరే!" అని నీతూ వాళ్ళని తీసుకుని వేరే వైపు నుంచి వెళుతూ "నేను చెప్పే వరకు ఎవరు గన్ యూస్ చేయకండి. అసలు వాళ్ళు ఎటాక్ మోడ్ లో ఉన్నారా నార్మల్ మోడ్ లో ఉన్నారో తెలుసుకోవాలి." అని చెప్పాడు యోధ.

కాసేపటికి కర్ర పట్టుకుని దర్జాగా నడిచి వస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి "వీడే అనుకుంటా రేపాలా తో ఫోన్లో మాట్లాడింది. యంగ్ వాళ్ళని తీసుకొని ధైర్యంగానే వస్తున్నాడు.

పవర్ ఫుల్ మాంత్రికుడు అనుకుంటా చేతిలో మంత్రదండం కూడా ఉంది ఆ సూట్ కేసులో ఆ వస్తువు ఉందనుకుంటా!" అని మనసులో అనుకున్నడు సయ్యద్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 42 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 16-05-2026, 06:01 AM



Users browsing this thread: 1 Guest(s)