Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#51
రుద్రం భజే! ఎపిసోడ్ 16



ఆ వస్తూవు ఆక్టివేట్ అయితే కుబేరుడి నగరం అలకాపురి తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పాడు ముష్రు.

**************
ముష్రు చెప్పింది విని ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! ఏకంగా కుబేరుడు కే టెండర్ పెట్టాలని చూస్తున్నారు కదారా..!" అని చెప్పింది పూజా.

"ఆ నగరం కోసం ఇప్పుడు వెతకడం కాదు 1951 సంవత్సరం నుంచి వెతుకుతూనే ఉన్నారు మొదట రష్యా జపాన్, తర్వాత అమెరికా, ఇప్పుడు చైనా, పాకిస్తాన్ కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతోంది.

ఈసారి కళింగ రంగంలోకి దిగాడు తనకి రేపాల అనే తాంత్రికుడు సహాయంగా ఉన్నాడు ఇద్దరు కలిసి కచ్చితంగా సాధిస్తారు అనుకున్నను, కానీ ఈసారి యోధ రూపంలో వాళ్లకి పెద్ద ఆటంకం ఏర్పడింది." అని చెప్పాడు  ముష్రు.

"నా రూపంలోనా..? వాళ్ళు ఇంకా నాకు ఎదురు పడలేదు కదా! ఎదురుపడితే ఆటంకం కాదు ఎవరు ప్రాణాలతో ఉండరు." అని చెప్పాడు యోధ.

"నువ్వు అన్నదే జరిగింది ఆ రోజు ఇండియన్ గవర్నమెంట్ తరఫున బందీలుగా ఉన్నవాళ్లని రిలీజ్ చేయించడానికి వచ్చావు కదా! అప్పుడు నువ్వు చంపిన వాళ్లలో సోల్జర్స్ మాత్రమే కాదు రెపాలా మనుషులు కూడా ఉన్నారు.

ఆ ముందు రోజే కాల్ చేసి ఇలాంటి వస్తువు మరొకటి ఎక్కడ ఉందో తెలిసింది అని చెప్పారు కానీ అప్పుడే నువ్వు ఎంటర్ అయ్యావు ఆ విషయం తెలిసిన వాళ్ళందరినీ చంపేసావు." అని చెప్పాడు ముష్రు.

"యోధ! నువ్వు తెలియకుండా చేసినా మంచే జరిగింది." అని సంతోషంగా చెప్పింది దీప్తి.

"అలా అయితే కళింగ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడా..?" అని అడిగాడు యోధ.

"కళింగ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నిజంగా నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ వస్తువు ఉన్న విషయం మాత్రం తెలిసింది. ఖచ్చితంగ దీనికోసం ఏం చేయడానికి అయ్యినా రెడీ అవుతాడు." అని చెప్పాడు ముష్రూ.

"కళింగ ఏం చేసినా సరే నా చేతిలో నుంచి ఈ వస్తువుని దీనిని తీసుకోవడం ఎవరికి తరంకాదు." అని చెప్పాడు యోధ.

"నువ్వేంటో నాకు తెలుసు! కానీ కళింగ గురించి మీకు ఎవరికి తెలియదు, వాడు ఒక మాంత్రికుడు లాంటి సైంటిస్ట్ తనకి కావాల్సిందని కోసం ఏమైనా చేస్తాడు." అని చెప్పాడు ముష్రు.

"మాంత్రికుడు లాంటి సైంటిస్ట్ అంటే? ఏం ప్రయోగాలు చేస్తాడు?" అని అనుమానంగా అడిగింది పూజా.

"హిమాలయాల అడుగునా ఉన్న పురాతనమైన జీవుల కళేబరాలు బయటకు తీస్తున్నాడు అనే విషయం తెలిసి   అంతర్జాతీయ సైంటిస్ట్ యూనియన్ కళింగ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో చైనా మిలటరీ సాయంతో పాకిస్తాన్ లో ఉన్న కారకొరం పర్వతాలలో తన ల్యాబ్ ఓపెన్ చేసాడు.

 ఆ ప్లేస్ కి ఇండియన్ మిలిటరీ వెళ్లలేదు కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు, కళేబరాల నుంచి తీసిన వైరస్ ని మనుషులకి ఎక్కించి మొదటి ప్రయోగం చేసాడు.

అది సక్సెస్ అయ్యి ప్రపంచన్ని ఒక కుదుపు కుదిపింది దాంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టం పోయిన కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రం విపరీతంగా లాభపడ్డాయి.

ఆ ఫార్మా కంపెనీలు కళింగకి ఫండింగ్ చేయడం మొదలుపెట్టాయి దాంతో అక్కడ వింత వింత ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు.

ఆ ప్లేస్ కి ఎవ్వరూ రాకుండా చైనా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాదులు సెక్యూరిటీగా ఉన్నారు.

ఇప్పుడు చేసే కళింగ ప్రయోగం సక్సెస్ అయితే భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్నా హిమాలయాలు ఇంకా ఉండవు అదేవిధంగా కైలాస పర్వతంలో రహస్యంగా ఉన్న అలకపురి లాంటి నగరాలు బయటకు వస్తాయి.

తను అనుకున్నది సాధిస్తాడు భారత్ కి శత్రు దేశాలైన రెండు దేశాలకి సహాయం చేసిన వాడు అవుతాడు." అని చెప్పాడు ముష్రు.

తను చెప్పింది విని కోపంగా చూస్తూ "అలాంటివి మనిషి బతికి ఉండకూడదు." అని చెప్పింది నీతూ.

"చావు దగ్గర పడి కైలాస పర్వతం జోలికి వెళ్లారు." అని చెప్పి ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిప్ట్ చేసి "జైహింద్ సార్! ఈ వస్తువుతో వాళ్లు ఏమి చేయబోతున్నారో తెలిసింది. అంతే కాదు కళింగ గురించి భయంకరమైన నిజాలు తెలిసాయి." అని వివరంగా చెప్పాడు యోధ.

"ఓ మై గాడ్! మీరు ఇమీడియట్ గా ఆ వస్తువుని కళింగ మనిషిని తీసుకుని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని ఫోన్ పెట్టేసి నీతూ వైపు చూసి "మనం వెంటనే ఢిల్లీ బయలుదేరాలి." అని చెప్పాడు యోధ.

"మనం వెళ్ళిన తర్వాత కళింగ మనుషులు ఇక్కడికి వస్తే!" అని డౌట్ గా అడిగింది దీప్తి.

ఆ మాటకి ముష్రు వైపు చూసి "కళింగతో ఎలా కాంటాక్ట్ అవుతావు?" అని అడిగాడు యోధ.

తన జేబులో నుంచి పేజర్ తీసి చూపించి "ఏ విషయమైనా మెసేజ్ మాత్రమే ఫోన్ లో మాట్లాడు." అని చెప్పాడు ముష్రు.

"ఓకే!" అని అలోచించి "ఆ వస్తూవు హ్యాండ్ ఓవర్ అయింది కానీ యాక్టివేట్ చేయడం కుదరలేదు దానిని తీసుకుని ఢిల్లీ బయలుదేరాను అని మెసేజ్ చెయ్!" అని చెప్పాడు యోధ.

తను చెప్పింది విని మెసేజ్ టైప్ చేసి యోధ వైపు చూసి "మీరు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తున్నాను నా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీదే!" అని చెప్పి సెండ్ చేసాడు ముష్రు.

తన చేతిలో ఉన్న ప్లెజర్ తీసుకుని "నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు." అని పుష్కర్ వాళ్ళ వైపు చూసి "ముష్రుని మీ రూమ్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి బయలుదేరడానికి ప్రిపేర్ అవ్వండి." అని చెప్పాడు యోధ.

"మరి ఈ మిషన్ ఏం చేద్దాము?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ మిషన్ ఇక్కడే ఉంటుంది పదండి." అని చెప్పి వెళ్లి జీప్ ఎక్కడు యోధ.

**************

కారకొరం పర్వతాలలో గిల్లెట్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ లో  గ్లాస్ రూమ్ లో ఉన్న మనిషికి వైరస్ ఇంజక్ట్ చేసి చింగ్ యా దగ్గరికి వచ్చి పేజర్ లో ముష్రు  పంపిన మెసేజ్ చూపించాడు కళింగ.

"సైంటిస్ట్! నీ మనిషిని ఢిల్లీ హవేలీ హోటల్ కి వెళ్లి ముస్తఫాని కలవమను అతను అన్ని ఏర్పాటు చేసి భద్రంగా ఇక్కడికి పంపిస్తాడు." అని చెప్పాడు సయ్యద్.

"మీర్జా దగ్గర ఉన్న మొబైల్ ఆన్ అయినట్టు సిగ్నల్ వచ్చింది అంటే అతను ఆఫీసర్స్ కి దొరికిపోయాడు అని అర్ధం!

అయినా సరే ముష్రూ ఆ వస్తువుని తీసుకుని వస్తున్నాడు అంటే వాళ్లే అతనితో ఈ మెసేజ్ పెట్టించి ఉండాలి, లేకపోతే అక్కడ నుంచి తప్పించుకునైనా ఉండాలి.

కాబట్టి నా అసిస్టెంట్ తీసుకురావడానికి కరెక్ట్ పర్సన్ ని పంపండి ఇండియన్ ఆర్మీ కి ఎట్టి పరిస్థితిలో ఈ ప్లేస్ గురించి తెలియకూడదు." అని చెప్పాడు కళింగ.

"ఒకవేళ తెలిసిన వాళ్ళు ఏమి చేయలేరు ఇక్కడికి వాళ్ళ యుద్ధ విమానాలు రావడానికి పర్మిషన్ లేదు, సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయడానికి సోల్జర్స్ ని పంపిన ప్రాణాలతో తిరిగి వెళ్ళరు." అని చెప్పాడు చింగ్ యా.

"మీరు చెప్పింది కరెక్ట్ జనరల్! కానీ ఇండియన్ మిలిటరీని తక్కువ అంచనా వేయకూడదు ఒక్కడు 24 మందిని చంపి శరీరాలు కూడా కనపడకుండా చేశాడు మర్చిపోయారా..?" అని చెప్పాడు కళింగ.

"మీరేమీ ఫిగర్ అవ్వకండి మీ మనిషి ముస్తఫాని కలిస్తే చాలు బోర్డర్ దాటినట్లే! ఒకవేళ అక్కడికి ఎవరైనా ఆఫీసర్లు వచ్చిన వాడు చూసుకుంటాడు." అని చెప్పాడు  సయ్యద్.

"సరే!'" అని చేప్పి సయ్యద్ చెప్పిన అడ్రస్ ని ముష్రు కి మెసేజ్ పంపించాడు కళింగ.

గ్లాస్ రూమ్ లో ఉన్న మనిషిని చూసి "ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది? ఫార్మ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తున్నారు." అని అడిగాడు జింగ్.

"టుడేస్ లో రెడీ అవుతుంది ట్రైల్ వేయడానికి ఒక మంచి ప్లేస్ చూడండి సముద్రం అయితే బెస్ట్!" అని చెప్పాడు కళింగ.

"ఓకే! ఎక్కడ టెస్ట్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను." అని చెప్పాడు చింగ్ యా.

****************

ఆదే సమయంలో అరవకొండాలో జీప్ లో గుడి దగ్గరికి వచ్చి పుష్కర్ వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడ ఉన్న నారాయణ రావు వైపు చూసి స్మైల్ ఇచ్చి "అంకుల్! మీకు కుబేరుడి నగరం అలాకాపూరి గురించి తెలుసా?" అని అడిగింది దీప్తి.

"కుబేరుడు! యక్షరాజు ధనాధిపతి, పరమశివుడు కొలువైనటువంటి కైలాస పర్వతం దగ్గర ఆయన నగరం అలాకాపూరి ఉంటుంది.

అక్కడే కల్పవృక్షం కుడా ఉంటుంది  కానీ అక్కడికి మానవ మాత్రులకి ప్రవేశం ఉండదు, ధనం మీద ఆశ లేనటువంటి మునులకు, ఋషులకు మాత్రమే అనుమతి ఉంటుంది." అని చెప్పి అనుమానంగా చూస్తూ

"అవును! ఇప్పుడెందుకు దాని గురించి అడుగుతున్నారు." అని అడిగాడు నారాయణ రావు.

"నాన్నగారు! స్వామి వారి పాదాల దగ్గర ఉన్న వస్తువుతో అలాకాపూరి నగరం తలుపులు తేరవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఆది కాకుండా ఇలాంటి వస్తువే మరొకటి ఉంది దాని గురించి వెతుకుతున్నారని తెలిసింది  అసలు ఇదంతా నిజమేనా అంటారా..?" అని అడిగాడు యోధ.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఉండండి." అని చెప్పి గర్భగుడిలోకి వెళ్లి  ఒక రాగి రేకుని తీసుకువచ్చి
"ఆ వస్తువు ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు నారాయణ రావు.

"అంకుల్! ఆ రేకు ఏమిటి దానిమీద ఏదో రాసి ఉంది." అని అనుమానంగా అడిగింది పూజా.

"ఇది కుబేరుడు స్వహస్తాలతో రాసిన పత్రం అంటారు." అని చెప్పాడు  నారాయణ రావు.

ఆ మాట విని ఆ రాగి రేకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరు.......
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 01-05-2026, 10:34 PM



Users browsing this thread: 1 Guest(s)