24-04-2026, 09:01 AM
కనురెప్ప
![[Image: Picture1.png]](https://i.ibb.co/zHBr8Mr6/Picture1.png)
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త.
ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట.
అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ, తన పుస్తకాలు భద్ర పరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు. కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమి స్తాడు అతను.
ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ, తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి, ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురు తుల్యులులాంటి చాలా మందిని కలిసి, కావలసిన విషయ సేకరణ పొందాడు.
చిట్టచివరగా తను హైకాలేజ్ లో చదువుకునే టప్పటి తన తెలుగుమాస్టారు .. విశిష్ట గ్రంధ కర్త అయిన పద్మప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు.
ఆరోజు..
సాయంకాలం వరకు చాలా కష్టపడి ప్రయాణించి పద్మప్రభాకరo గారు నివసించే ఊరు వెళ్లి ఆయనకు నమస్కరించి, విషయం వివరంగా వివరించి, ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు సత్యకీర్తి.
మాస్టారు పద్మప్రభాకరం గారికి 90 ఏళ్లు వయస్సు పైబడి ఉంటుంది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేశ విదేశాల్లో సైతం ఆయన సన్మానాలు సత్కారాలు పొందారు. అన్ని దేశాలలోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. లెక్కకు మించిన బిరుదులు పొందారు. తన శిష్యుడు చెప్పింది విని అతని మీద అభిమానంతో కాదనలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ … లోపలకెళ్లి తను రచించిన.. కట్టలు కట్టబడి ఉన్న పాత కొత్త గ్రంధాలన్నీ జాగ్రత్తగా ఏరిఏరి, దుమ్ము దులుపుతూ, చివరికి ఓ గ్రంథం చేతులతో పట్టుకుంటూ బయటకు వచ్చారు.
'' సత్యకీర్తీ! ఇది నేను రాసిన గ్రంథం నాయనా. ఇది ఎప్పుడో 1990 సంవత్సరంలో ప్రచురింప బడింది. నువ్వు కూడా చాలా గ్రంథాలు రాశావు కదా. నువ్వు సామాన్యుడివి కాదు.. నీ గురించి నాకు తెలుసు.. అయితే నువ్వే నా శిష్యుడు అని మాత్రం ఇంతవరకూ తెలియదు.. నా శిష్యుడు ఇంత గొప్పవాడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. చాలా సంతోషం '' అంటూ లోపల్నుంచి వచ్చిన మాస్టారు బయట కుర్చీలో కూర్చున్నారు. శిష్యుని ఎదురుగా... చాలా పేజీలు తిరగేసి .. ' దొరికింది' .. అంటూ ఒకచోట ఆగారు.
'' సత్యకీర్తీ! ' విజ్ఞానసాగరం ' అనే ఈ ఆధ్యా త్మిక గ్రంథములోని ఈ రెండు పేజీల ముఖ్యమైన మేటర్ నీకు ఇస్తాను. అందులో నుంచి నీకు పనికి వచ్చిన వాక్యాలు నువ్వు ఇప్పుడు రాస్తున్న గ్రంథంలో ఎక్కడైనా అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతో నీ గ్రంథానికి బలం వస్తుంది... నా శిష్యుడు అయిన నీకు సహాయ పడ్డ తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు వచ్చింది దీనికోసమే.. నేను చదువుతాను. నువ్వు రాసుకో నాయనా....'' అంటూ చదవడం ఆరంభించారు మాస్టారు.
“చాలా ఆనందం మాస్టారు! ఈ మీ విజ్ఞానసాగరం గ్రంథంలో నాకు పనికి వచ్చే ఈ రెండు పేజీలు రోడ్డు అవతలకు వెళ్లి ఫోటోస్టాట్ తీయించుకుని.. 10 నిమిషాలలో మీ గ్రంథం మీకు పట్టుకుని వచ్చి ఇస్తాను. మీకు చదివే శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు.. పైగా నాకు కూడా చాలా లేట్ అవుతుంది. ఆ గ్రంథం ఒకసారి ఇవ్వండి మాస్టారు..'' అంటూ వినయంగా అడిగాడు సత్యకీర్తి.
'' పుస్తకం బయటకు పట్టుకుని వెళ్తానంటే ఎవరికీ ఇవ్వను నాయనా. నీ సెల్ కెమెరాతో కాపీ వస్తుం దేమో.. ప్రయత్నించరాదూ.''
'' అలారాదు మాస్టారు. నాది చిన్న సెల్.. కెమెరా కి అనువైనదికాదు.. ''
''ఏమీ అనుకోవద్దు నాయనా. ఇదిగో పేపరుపెన్ను... వ్యాసం చదువుతాను రాసుకో ...'' అంటూ చదవడం ఆరంభించారు పద్మప్రభాకరం మాస్టారు గారు. సత్యకీర్తి చాలాసేపు పూర్తిగా రాసుకున్నాడు
''వయసు చూస్తే 90 పైపడినట్టు ఉన్నారు. మనిషి మీద నమ్మకం లేని బ్రతుకు ఎందుకు..?'' అంటూ మాస్టారుని ఒకపక్క మనసులో చీదరించుకుంటూ, మరోపక్క పుస్తకాల పట్ల ఆయన వాత్సల్యానికి పొగడకుండా ఉండలేకపోయాడు సత్యకీర్తి.
అంతా బాగానే ఉంది కానీ..
మాస్టారు తన.. ప్రచురింపబడిన పుస్తకాలను బీరువాల్లో .. అలమరలలో చక్కగా పేర్చలేకపోయారు కట్టలుకట్టి..పోగులుగా పడేశారు. కొన్నిబూజులు పట్టి ఉన్నాయి.. మరికొన్ని అట్టలు ఊడిపోయి చిందరవందరగా ఉన్నాయి. కావలసిన పుస్తకం వెంటనే తీసుకునేటట్లు ఇండెక్స్ అమరిక లేదు. ఇన్ని వందలాది మహత్తరమైన గ్రంథాల పట్ల ఎందుకు మాస్టారు సరైన శ్రద్ధ తీసుకోలేకపోయారు
..!? వయసు భారమా..? అయ్యుండొచ్చు... పోనీ ఆయన కుటుంబ సభ్యులు..?.. ఏమో ..?.. ఎవరి కుటుంబ విధానాలు ఎలాంటివో...!! కిటికీలోంచి పుస్తకాలు ఉన్న గదులను పరికిస్తూ కించిత్తు బాధ పడ్డాడు సత్యకీర్తి.
'' ఈ నా విజ్ఞానసాగరం పుస్తకం ఇప్పుడు ఎక్కడ అమ్మటం లేదు.. అని తెలిసింది నాయనా. ఏ కారణం చేతనైనా ఈ పుస్తకం పోతే మళ్లీ నేను కొనుక్కుందాం అన్నా దొరకదు కదా. అందుకనే ఎవరికీ ఇవ్వటం లేదు. మిగిలిన అన్ని పుస్తకాలలోకి ఈ పుస్తకం నా ప్రాణం. .. మరో విషయం .. నీకు వినిపించిన ఈ రెండుపేజీల ''దిగువనే '.. ఇదిగో ఈ ఖాళీ లో ఈరోజు జరిగింది సింపుల్ గా రాసి తారీకు కూడా వేసి సంతకం పెట్టుకుంటాను. ఇది నా అలవాటు అన్నమాట.. ఇంకో మాట వయసు పైబడిన వాడిని కదా.. నీ పుస్తకావిష్కరణకు రాలేను. నువ్వు నీ గ్రంథం ప్రింట్ చేశాక వీలు పడితే ఓ పుస్తకం పోస్టులో పంపు.''.. . అంటూ మాస్టారు పద్మ ప్రభాకరo గారు.. తన పుస్తకాన్ని లోపలకు తీసుకెళ్ళిపోయి భద్రపరుచుకున్నారు.
సత్య కీర్తి మాస్టారు నుండి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆయన నుండి తెచ్చిన కొన్ని వాక్యాలను తన గ్రంథంలో కొన్నిచోట్ల అమర్చి గ్రంథం ప్రచురించి పుస్తకావిష్కరణ కూడా కావించి తెలుగు మాస్టారు కోరినట్టు ఆయనకు కూడా ఒక పుస్తకం బుక్ పోస్టులో పంపడం కూడా జరిగిపోయింది.
మూడు నెలలు గడిచి పోయింది.
ఈరోజు..
సత్యకీర్తి మళ్లీ తన తెలుగుమాస్టార్ని కలవడానికి చెల్లూరు బయలుదేరాడు.
తను పోస్టులో పంపిన తన గ్రంథం మీద పద్మ ప్రభాకరం మాస్టారు గారి అభిప్రాయం తెలుసు కోవాలి అన్నది సత్యకీర్తి ..ప్రయాణ ఉద్దేశం.
చెల్లూరు వచ్చి ఊరు బయట టీ బడ్డీ కొట్టు దగ్గర ఆగాడు సత్యకీర్తి.
'' ఓ రెండు మసాలా గారెలు ఇవ్వవోయి. '' అడిగాడు బడ్డీకొట్టు అతన్ని.
వెంటనే బడ్డీవాల తన దగ్గరున్న దళసరి బైండ్ పుస్తకంలోంచి ఓ డబల్ పేపర్ కసక్కన లాగి అందులో రెండు మసాలాగారెలు కొంచెం చెట్నీ వేసి సత్యకీర్తి కి అందించాడు.
ఆకలి మీద ఉన్న సత్యకీర్తి బడ్డీవాల అందించిన మసాలాగారెలు తింటూ ఆ గారెలు పెట్టి బడ్డీవాల ఇచ్చిన.. పేపర్లోని అక్షరాలు స్పష్టంగా కనబడటం
తో చదవనారంభించాడు ఆత్రుతగా.
'' అందుచేత.. ప్రతిమనిషి.... జాగ్రత్తగా విని, గుండె పుటల్లో చెక్కుకోవలసిన చివరిమాట ఒకటే..!!
మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!.
అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం అది కూడా ముఖ్యం కాదు.!!
మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..'' బాధ్యత ''..ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''
'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''
ఆ వాక్యాలు చదివి ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు సత్యకీర్తి.
చూస్తే.. బడ్డీవాలా బల్లమీద తెలుగుమాస్టారి... ''విజ్ఞానసాగరం'' గ్రంథం ఉంది....!
ఆ పుస్తకంలో నుంచి చాలా కాగితాలు చింపి అతను మసాలాగారెలు పొట్లాలు కట్టగాకట్టగా .. ఇంకొన్ని... కాగితాలు మాత్రమే మిగిలిఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే.. తను చేతిలో పెట్టుకు తింటున్న.. '' మసాలాగారెలు '' పేపర్లో బాగా దిగువన మాస్టారు సంతకం కూడా ఉంది. అది… ఇదివరలో తను మాస్టార్ ని... కలిసినప్పుడు... ఆ రోజు తనతో జరిగిన సంఘటన, పేపరు దిగువ ఖాళీలో తారీకుతో సహా సింపుల్ గా రాసి.. క్రింద పెట్టిన సంతకమే!!!
ఈ రెండు పేజీలలోని వాక్యాలే... సత్యకీర్తి తన గ్రంథంలో పెట్టుకోవడం కూడా జరిగింది. !!!
ఎంత చిత్రం?? మాస్టారి ఇంట్లోని తనకు ఓ ఐదు నిమిషాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒరిజినల్ గ్రంథం పేపర్ కటింగ్లోనే తను మసాలాగారెలు తినటమా?
సత్యకీర్తి.. వెంటనే మసాలాగారెలు కింద పడేసి పరుగులాంటి నడకతో.. మాస్టారు ఇంటిని సమీపించి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు.
తెలుగు మాస్టారు పద్మప్రభాకరoగారు నెలక్రితం చనిపోయారట!! అతని కొడుకులు... కోడళ్ళు కూతుళ్ళు...అల్లుళ్ళు ఇతర దేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారట!!!
మాస్టారు భార్య సామాన్య చదవరి. ఆయన కాలంచేయడంతో కర్మకాండలు అయిన వెంటనే ఆ ఇంటిని అమ్మేసి కొడుకులతో పాటు '' ఆమె'' అమెరికా వెళ్ళిపోతూ తన లగేజీతో పాటు మాస్టారి పుస్తకాలన్నీ మోయలేక.. కొడుకులు కూడా ఆ పుస్తకాలను చీదరించుకుని చిరాకుపడటంతో తూకానికి చిత్తుకాగితాల వాడికి ఆవిడ
'' ఆయన మహోన్నత మహోజ్జ్వల గ్రంథాలన్నీ'' అమ్మేసిందట!!!!!
అలా వచ్చిపడిందన్నమాట మసాలాగారెల బడ్డీకొట్టు లోకి... మాస్టారి...'' విజ్ఞానసాగరం '' గ్రంథం!..
ఈ విషయం గ్రహించిన సత్యకీర్తి మరొక్కక్షణం అక్కడ ఉండలేక వెంటనే తన ఊరు వచ్చి ఇంటికి వెళ్లి గాబరాగా ఆతృతగా తన పిల్లలిద్దర్ని పిలి చాడు..జయేంద్ర.. లలితశ్రీ...ఇద్దరూ వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డారు.
'' ఇన్నాళ్లు మీరిద్దరూ నా రూముల్లోకి వస్తుంటే..' వద్దు ' అనే వాడిని. నా గ్రంథాలు.. మీరు చదువు తుంటే...'మీ చదువు ఏదో మీరు చదువుకుంటూ గొప్పవాళ్ళు కండి..నా పుస్తకాల జోలికి రాకండి ' అంటూ కసురుకునే వాడిని. తప్పుచేశాను.. నాకిప్పుడు జ్ఞానోదయమయింది.
గతం గతః.. ఇప్పుడు మీ ఇద్దరికీ చిన్న పరీక్ష పెడుతున్నానర్ర'' అన్నాడు.. పిల్లలు ఇద్దరి వైపు చూస్తూ సత్యకీర్తి.
పిల్లలిద్దరికీ విషయం అర్థం కాలేదు.
సత్యకీర్తి తను రాసిన గ్రంథాలు ఉన్న చెరో రూమ్ లోకి ఆ ఇద్దరినీ విడివిడిగా పంపిస్తూ.. ఒకరోజు గడపమన్నాడు.... ఆ సమయంలో తను రచించిన ' వంద పేజీల' పుస్తకాలు మాత్రమే చదవడానికి ప్రయత్నించమని అన్నాడు. “ఎవరు ఎక్కువ పుస్త కాలు చదువుతారో దాన్నిబట్టి నేను ఒక నిర్ణయా నికి కూడా వస్తాను.'' అంటూ చెప్పాడు.
ఈసారి సత్యకీర్తి మనసు తేలికపడింది. ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి పుస్తకాలమీద ప్రీతి ఎక్కువగా ఉన్నట్టు నిర్ణయించి, వారికి తన కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన పుస్తకాల ఆస్తి బాధ్యత అప్పచెప్పాలన్నది అతని ఉద్దేశ్యం.
తను ఇచ్చిన సమయం గడిచాక .. సత్యకీర్తి వాళ్లు ఉన్న రూముల్లోకి వెళ్ళాడు.
ఇంజనీర్ చదువుతున్న జయేంద్ర వెళ్ళిన రూమ్ లోని పుస్తకాలు..ఇదివరకటిలా సక్రమంగా కాకుండా చాలా చిందరవందరగా పడిఉన్నాయి.. అతడిని పిలిచి అడగగా... 3 పుస్తకాలు చదివేసినట్టు గర్వంగా చెప్పుకున్నాడు.. 100 పేజీల పుస్తకాల గురించి వెతకటంతో.. గత్తర అయిన పుస్త కాల్ని మళ్లీ పేర్చడానికి సమయం సరిపోలేదని.. చెప్పాడు.. తండ్రితో.
ఇక.. కూతురు లలితశ్రీ మెడిసన్.. ఆమె ఒక పుస్తకం మాత్రమే చదివిందట.. సత్యకీర్తి కోపంగా ఆమె గడిపిన రూమ్లోకి వెళ్లి అంతా పరికించాడు అయితే..ఆమె చెప్పిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.
లలితశ్రీ ముందుగా తనకు తండ్రి ఇచ్చిన రూమ్ లో ..బీరువాలో ..అలమరలో ఉన్న పుస్తకాలు సక్రమమైన పద్ధతిలో పెట్టింది.. దులుపు గుడ్డకర్ర తో దుమ్ములన్నీ దులిపి రూమంతా శుభ్రం చేసింది.
పుస్తకాలు చెదలు పట్టకుండా ఉపయోగించడానికి తండ్రి కిటికీ లో పెట్టిన స్ప్రే కూడా తీసి...రూమంతా స్ప్రే చేసింది. అంతేనా కొన్ని పుస్తకాలు చిరుగు పడితే కిటికీలో ఉన్న గమ్ము బాటిల్ తీసి
అంటించి ఆరబెట్టండి.. ఇవన్నీ చేయడంలో తను కేవలం ఒక పుస్తకం మాత్రమే చదవగలిగాను అని
సమయం చాలలేదని తనను క్షమించమని చేతులు కట్టుకు కోరింది తండ్రిని.
దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన సత్యకీర్తి కుమార్తె లలితశ్రీని దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దాడి
''అమ్మా.. లలితశ్రీ మా తెలుగుమాస్టారు చనిపోయి నాకొక ' జీవితరహస్యం' పాఠం లా నేర్పారు. తన ఆస్తులనే కాదు తన కీర్తి ప్రతిష్టలను కూడా వెనుక ఉన్నవారు నిలుపగలిగేలా .. రక్షించ గలిగేలా ఎవరో ఒకరిని తయారు చేసుకోవడం ప్రతి మనిషికి చాలా ' ముఖ్యం' అన్నది...ఆయన నేర్పిన పాఠం తల్లి.. కవులకు.. రచయితలకు.. చిత్రకారులకు.... వ్యాపారస్తులకు.. ఇంకా చాలా మందికి.. ఇది వర్తిస్తుంది.
ఇకపోతే నేను పెట్టిన పరీక్షలో నా ' కీర్తిప్రతిష్టల వారసత్వం' నిలబెట్టే వారసురాలువి..'' నువ్వే ''
అని.. నీలో క్రమశిక్షణను బట్టి నేను నిర్ణయించు కున్నానమ్మ. నేను కష్టపడి రచించిన నా గ్రంథాలన్ని.. నా అనంతరం చెదపట్టకుండా...అగ్నికి ఆహుతి కాకుండా.. అనామకుల పరం కాకుండా.. తడిచి ముద్దవ్వ కుండా... చివరికి చిత్తుకాగితాల వాడి తూకానికి బలి కాకుండా... చూడవలసిన రక్షణ బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా.''..... అంటూ తన గ్రంథాలున్న రెండురూమ్ ల తాళాలగుత్తి కూతురు లలితశ్రీ కి అందించాడు ప్రేమతో సత్యకీర్తి.
నిజమే...
మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!. అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం.. అది కూడా ముఖ్యం కాదు.!!
మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..''బాధ్యత'' ఆపకుండా, దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''
'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''
తన తెలుగు మాస్టారి మహోన్నత గ్రంథంలోని వాక్యాలు మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు ... సత్యకీర్తి!
****
![[Image: Picture1.png]](https://i.ibb.co/zHBr8Mr6/Picture1.png)
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త.
ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట.
అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ, తన పుస్తకాలు భద్ర పరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు. కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమి స్తాడు అతను.
ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ, తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి, ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురు తుల్యులులాంటి చాలా మందిని కలిసి, కావలసిన విషయ సేకరణ పొందాడు.
చిట్టచివరగా తను హైకాలేజ్ లో చదువుకునే టప్పటి తన తెలుగుమాస్టారు .. విశిష్ట గ్రంధ కర్త అయిన పద్మప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు.
ఆరోజు..
సాయంకాలం వరకు చాలా కష్టపడి ప్రయాణించి పద్మప్రభాకరo గారు నివసించే ఊరు వెళ్లి ఆయనకు నమస్కరించి, విషయం వివరంగా వివరించి, ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు సత్యకీర్తి.
మాస్టారు పద్మప్రభాకరం గారికి 90 ఏళ్లు వయస్సు పైబడి ఉంటుంది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేశ విదేశాల్లో సైతం ఆయన సన్మానాలు సత్కారాలు పొందారు. అన్ని దేశాలలోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. లెక్కకు మించిన బిరుదులు పొందారు. తన శిష్యుడు చెప్పింది విని అతని మీద అభిమానంతో కాదనలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ … లోపలకెళ్లి తను రచించిన.. కట్టలు కట్టబడి ఉన్న పాత కొత్త గ్రంధాలన్నీ జాగ్రత్తగా ఏరిఏరి, దుమ్ము దులుపుతూ, చివరికి ఓ గ్రంథం చేతులతో పట్టుకుంటూ బయటకు వచ్చారు.
'' సత్యకీర్తీ! ఇది నేను రాసిన గ్రంథం నాయనా. ఇది ఎప్పుడో 1990 సంవత్సరంలో ప్రచురింప బడింది. నువ్వు కూడా చాలా గ్రంథాలు రాశావు కదా. నువ్వు సామాన్యుడివి కాదు.. నీ గురించి నాకు తెలుసు.. అయితే నువ్వే నా శిష్యుడు అని మాత్రం ఇంతవరకూ తెలియదు.. నా శిష్యుడు ఇంత గొప్పవాడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. చాలా సంతోషం '' అంటూ లోపల్నుంచి వచ్చిన మాస్టారు బయట కుర్చీలో కూర్చున్నారు. శిష్యుని ఎదురుగా... చాలా పేజీలు తిరగేసి .. ' దొరికింది' .. అంటూ ఒకచోట ఆగారు.
'' సత్యకీర్తీ! ' విజ్ఞానసాగరం ' అనే ఈ ఆధ్యా త్మిక గ్రంథములోని ఈ రెండు పేజీల ముఖ్యమైన మేటర్ నీకు ఇస్తాను. అందులో నుంచి నీకు పనికి వచ్చిన వాక్యాలు నువ్వు ఇప్పుడు రాస్తున్న గ్రంథంలో ఎక్కడైనా అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతో నీ గ్రంథానికి బలం వస్తుంది... నా శిష్యుడు అయిన నీకు సహాయ పడ్డ తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు వచ్చింది దీనికోసమే.. నేను చదువుతాను. నువ్వు రాసుకో నాయనా....'' అంటూ చదవడం ఆరంభించారు మాస్టారు.
“చాలా ఆనందం మాస్టారు! ఈ మీ విజ్ఞానసాగరం గ్రంథంలో నాకు పనికి వచ్చే ఈ రెండు పేజీలు రోడ్డు అవతలకు వెళ్లి ఫోటోస్టాట్ తీయించుకుని.. 10 నిమిషాలలో మీ గ్రంథం మీకు పట్టుకుని వచ్చి ఇస్తాను. మీకు చదివే శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు.. పైగా నాకు కూడా చాలా లేట్ అవుతుంది. ఆ గ్రంథం ఒకసారి ఇవ్వండి మాస్టారు..'' అంటూ వినయంగా అడిగాడు సత్యకీర్తి.
'' పుస్తకం బయటకు పట్టుకుని వెళ్తానంటే ఎవరికీ ఇవ్వను నాయనా. నీ సెల్ కెమెరాతో కాపీ వస్తుం దేమో.. ప్రయత్నించరాదూ.''
'' అలారాదు మాస్టారు. నాది చిన్న సెల్.. కెమెరా కి అనువైనదికాదు.. ''
''ఏమీ అనుకోవద్దు నాయనా. ఇదిగో పేపరుపెన్ను... వ్యాసం చదువుతాను రాసుకో ...'' అంటూ చదవడం ఆరంభించారు పద్మప్రభాకరం మాస్టారు గారు. సత్యకీర్తి చాలాసేపు పూర్తిగా రాసుకున్నాడు
''వయసు చూస్తే 90 పైపడినట్టు ఉన్నారు. మనిషి మీద నమ్మకం లేని బ్రతుకు ఎందుకు..?'' అంటూ మాస్టారుని ఒకపక్క మనసులో చీదరించుకుంటూ, మరోపక్క పుస్తకాల పట్ల ఆయన వాత్సల్యానికి పొగడకుండా ఉండలేకపోయాడు సత్యకీర్తి.
అంతా బాగానే ఉంది కానీ..
మాస్టారు తన.. ప్రచురింపబడిన పుస్తకాలను బీరువాల్లో .. అలమరలలో చక్కగా పేర్చలేకపోయారు కట్టలుకట్టి..పోగులుగా పడేశారు. కొన్నిబూజులు పట్టి ఉన్నాయి.. మరికొన్ని అట్టలు ఊడిపోయి చిందరవందరగా ఉన్నాయి. కావలసిన పుస్తకం వెంటనే తీసుకునేటట్లు ఇండెక్స్ అమరిక లేదు. ఇన్ని వందలాది మహత్తరమైన గ్రంథాల పట్ల ఎందుకు మాస్టారు సరైన శ్రద్ధ తీసుకోలేకపోయారు
..!? వయసు భారమా..? అయ్యుండొచ్చు... పోనీ ఆయన కుటుంబ సభ్యులు..?.. ఏమో ..?.. ఎవరి కుటుంబ విధానాలు ఎలాంటివో...!! కిటికీలోంచి పుస్తకాలు ఉన్న గదులను పరికిస్తూ కించిత్తు బాధ పడ్డాడు సత్యకీర్తి.
'' ఈ నా విజ్ఞానసాగరం పుస్తకం ఇప్పుడు ఎక్కడ అమ్మటం లేదు.. అని తెలిసింది నాయనా. ఏ కారణం చేతనైనా ఈ పుస్తకం పోతే మళ్లీ నేను కొనుక్కుందాం అన్నా దొరకదు కదా. అందుకనే ఎవరికీ ఇవ్వటం లేదు. మిగిలిన అన్ని పుస్తకాలలోకి ఈ పుస్తకం నా ప్రాణం. .. మరో విషయం .. నీకు వినిపించిన ఈ రెండుపేజీల ''దిగువనే '.. ఇదిగో ఈ ఖాళీ లో ఈరోజు జరిగింది సింపుల్ గా రాసి తారీకు కూడా వేసి సంతకం పెట్టుకుంటాను. ఇది నా అలవాటు అన్నమాట.. ఇంకో మాట వయసు పైబడిన వాడిని కదా.. నీ పుస్తకావిష్కరణకు రాలేను. నువ్వు నీ గ్రంథం ప్రింట్ చేశాక వీలు పడితే ఓ పుస్తకం పోస్టులో పంపు.''.. . అంటూ మాస్టారు పద్మ ప్రభాకరo గారు.. తన పుస్తకాన్ని లోపలకు తీసుకెళ్ళిపోయి భద్రపరుచుకున్నారు.
సత్య కీర్తి మాస్టారు నుండి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆయన నుండి తెచ్చిన కొన్ని వాక్యాలను తన గ్రంథంలో కొన్నిచోట్ల అమర్చి గ్రంథం ప్రచురించి పుస్తకావిష్కరణ కూడా కావించి తెలుగు మాస్టారు కోరినట్టు ఆయనకు కూడా ఒక పుస్తకం బుక్ పోస్టులో పంపడం కూడా జరిగిపోయింది.
మూడు నెలలు గడిచి పోయింది.
ఈరోజు..
సత్యకీర్తి మళ్లీ తన తెలుగుమాస్టార్ని కలవడానికి చెల్లూరు బయలుదేరాడు.
తను పోస్టులో పంపిన తన గ్రంథం మీద పద్మ ప్రభాకరం మాస్టారు గారి అభిప్రాయం తెలుసు కోవాలి అన్నది సత్యకీర్తి ..ప్రయాణ ఉద్దేశం.
చెల్లూరు వచ్చి ఊరు బయట టీ బడ్డీ కొట్టు దగ్గర ఆగాడు సత్యకీర్తి.
'' ఓ రెండు మసాలా గారెలు ఇవ్వవోయి. '' అడిగాడు బడ్డీకొట్టు అతన్ని.
వెంటనే బడ్డీవాల తన దగ్గరున్న దళసరి బైండ్ పుస్తకంలోంచి ఓ డబల్ పేపర్ కసక్కన లాగి అందులో రెండు మసాలాగారెలు కొంచెం చెట్నీ వేసి సత్యకీర్తి కి అందించాడు.
ఆకలి మీద ఉన్న సత్యకీర్తి బడ్డీవాల అందించిన మసాలాగారెలు తింటూ ఆ గారెలు పెట్టి బడ్డీవాల ఇచ్చిన.. పేపర్లోని అక్షరాలు స్పష్టంగా కనబడటం
తో చదవనారంభించాడు ఆత్రుతగా.
'' అందుచేత.. ప్రతిమనిషి.... జాగ్రత్తగా విని, గుండె పుటల్లో చెక్కుకోవలసిన చివరిమాట ఒకటే..!!
మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!.
అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం అది కూడా ముఖ్యం కాదు.!!
మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..'' బాధ్యత ''..ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''
'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''
ఆ వాక్యాలు చదివి ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు సత్యకీర్తి.
చూస్తే.. బడ్డీవాలా బల్లమీద తెలుగుమాస్టారి... ''విజ్ఞానసాగరం'' గ్రంథం ఉంది....!
ఆ పుస్తకంలో నుంచి చాలా కాగితాలు చింపి అతను మసాలాగారెలు పొట్లాలు కట్టగాకట్టగా .. ఇంకొన్ని... కాగితాలు మాత్రమే మిగిలిఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే.. తను చేతిలో పెట్టుకు తింటున్న.. '' మసాలాగారెలు '' పేపర్లో బాగా దిగువన మాస్టారు సంతకం కూడా ఉంది. అది… ఇదివరలో తను మాస్టార్ ని... కలిసినప్పుడు... ఆ రోజు తనతో జరిగిన సంఘటన, పేపరు దిగువ ఖాళీలో తారీకుతో సహా సింపుల్ గా రాసి.. క్రింద పెట్టిన సంతకమే!!!
ఈ రెండు పేజీలలోని వాక్యాలే... సత్యకీర్తి తన గ్రంథంలో పెట్టుకోవడం కూడా జరిగింది. !!!
ఎంత చిత్రం?? మాస్టారి ఇంట్లోని తనకు ఓ ఐదు నిమిషాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒరిజినల్ గ్రంథం పేపర్ కటింగ్లోనే తను మసాలాగారెలు తినటమా?
సత్యకీర్తి.. వెంటనే మసాలాగారెలు కింద పడేసి పరుగులాంటి నడకతో.. మాస్టారు ఇంటిని సమీపించి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు.
తెలుగు మాస్టారు పద్మప్రభాకరoగారు నెలక్రితం చనిపోయారట!! అతని కొడుకులు... కోడళ్ళు కూతుళ్ళు...అల్లుళ్ళు ఇతర దేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారట!!!
మాస్టారు భార్య సామాన్య చదవరి. ఆయన కాలంచేయడంతో కర్మకాండలు అయిన వెంటనే ఆ ఇంటిని అమ్మేసి కొడుకులతో పాటు '' ఆమె'' అమెరికా వెళ్ళిపోతూ తన లగేజీతో పాటు మాస్టారి పుస్తకాలన్నీ మోయలేక.. కొడుకులు కూడా ఆ పుస్తకాలను చీదరించుకుని చిరాకుపడటంతో తూకానికి చిత్తుకాగితాల వాడికి ఆవిడ
'' ఆయన మహోన్నత మహోజ్జ్వల గ్రంథాలన్నీ'' అమ్మేసిందట!!!!!
అలా వచ్చిపడిందన్నమాట మసాలాగారెల బడ్డీకొట్టు లోకి... మాస్టారి...'' విజ్ఞానసాగరం '' గ్రంథం!..
ఈ విషయం గ్రహించిన సత్యకీర్తి మరొక్కక్షణం అక్కడ ఉండలేక వెంటనే తన ఊరు వచ్చి ఇంటికి వెళ్లి గాబరాగా ఆతృతగా తన పిల్లలిద్దర్ని పిలి చాడు..జయేంద్ర.. లలితశ్రీ...ఇద్దరూ వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డారు.
'' ఇన్నాళ్లు మీరిద్దరూ నా రూముల్లోకి వస్తుంటే..' వద్దు ' అనే వాడిని. నా గ్రంథాలు.. మీరు చదువు తుంటే...'మీ చదువు ఏదో మీరు చదువుకుంటూ గొప్పవాళ్ళు కండి..నా పుస్తకాల జోలికి రాకండి ' అంటూ కసురుకునే వాడిని. తప్పుచేశాను.. నాకిప్పుడు జ్ఞానోదయమయింది.
గతం గతః.. ఇప్పుడు మీ ఇద్దరికీ చిన్న పరీక్ష పెడుతున్నానర్ర'' అన్నాడు.. పిల్లలు ఇద్దరి వైపు చూస్తూ సత్యకీర్తి.
పిల్లలిద్దరికీ విషయం అర్థం కాలేదు.
సత్యకీర్తి తను రాసిన గ్రంథాలు ఉన్న చెరో రూమ్ లోకి ఆ ఇద్దరినీ విడివిడిగా పంపిస్తూ.. ఒకరోజు గడపమన్నాడు.... ఆ సమయంలో తను రచించిన ' వంద పేజీల' పుస్తకాలు మాత్రమే చదవడానికి ప్రయత్నించమని అన్నాడు. “ఎవరు ఎక్కువ పుస్త కాలు చదువుతారో దాన్నిబట్టి నేను ఒక నిర్ణయా నికి కూడా వస్తాను.'' అంటూ చెప్పాడు.
ఈసారి సత్యకీర్తి మనసు తేలికపడింది. ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి పుస్తకాలమీద ప్రీతి ఎక్కువగా ఉన్నట్టు నిర్ణయించి, వారికి తన కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన పుస్తకాల ఆస్తి బాధ్యత అప్పచెప్పాలన్నది అతని ఉద్దేశ్యం.
తను ఇచ్చిన సమయం గడిచాక .. సత్యకీర్తి వాళ్లు ఉన్న రూముల్లోకి వెళ్ళాడు.
ఇంజనీర్ చదువుతున్న జయేంద్ర వెళ్ళిన రూమ్ లోని పుస్తకాలు..ఇదివరకటిలా సక్రమంగా కాకుండా చాలా చిందరవందరగా పడిఉన్నాయి.. అతడిని పిలిచి అడగగా... 3 పుస్తకాలు చదివేసినట్టు గర్వంగా చెప్పుకున్నాడు.. 100 పేజీల పుస్తకాల గురించి వెతకటంతో.. గత్తర అయిన పుస్త కాల్ని మళ్లీ పేర్చడానికి సమయం సరిపోలేదని.. చెప్పాడు.. తండ్రితో.
ఇక.. కూతురు లలితశ్రీ మెడిసన్.. ఆమె ఒక పుస్తకం మాత్రమే చదివిందట.. సత్యకీర్తి కోపంగా ఆమె గడిపిన రూమ్లోకి వెళ్లి అంతా పరికించాడు అయితే..ఆమె చెప్పిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.
లలితశ్రీ ముందుగా తనకు తండ్రి ఇచ్చిన రూమ్ లో ..బీరువాలో ..అలమరలో ఉన్న పుస్తకాలు సక్రమమైన పద్ధతిలో పెట్టింది.. దులుపు గుడ్డకర్ర తో దుమ్ములన్నీ దులిపి రూమంతా శుభ్రం చేసింది.
పుస్తకాలు చెదలు పట్టకుండా ఉపయోగించడానికి తండ్రి కిటికీ లో పెట్టిన స్ప్రే కూడా తీసి...రూమంతా స్ప్రే చేసింది. అంతేనా కొన్ని పుస్తకాలు చిరుగు పడితే కిటికీలో ఉన్న గమ్ము బాటిల్ తీసి
అంటించి ఆరబెట్టండి.. ఇవన్నీ చేయడంలో తను కేవలం ఒక పుస్తకం మాత్రమే చదవగలిగాను అని
సమయం చాలలేదని తనను క్షమించమని చేతులు కట్టుకు కోరింది తండ్రిని.
దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన సత్యకీర్తి కుమార్తె లలితశ్రీని దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దాడి
''అమ్మా.. లలితశ్రీ మా తెలుగుమాస్టారు చనిపోయి నాకొక ' జీవితరహస్యం' పాఠం లా నేర్పారు. తన ఆస్తులనే కాదు తన కీర్తి ప్రతిష్టలను కూడా వెనుక ఉన్నవారు నిలుపగలిగేలా .. రక్షించ గలిగేలా ఎవరో ఒకరిని తయారు చేసుకోవడం ప్రతి మనిషికి చాలా ' ముఖ్యం' అన్నది...ఆయన నేర్పిన పాఠం తల్లి.. కవులకు.. రచయితలకు.. చిత్రకారులకు.... వ్యాపారస్తులకు.. ఇంకా చాలా మందికి.. ఇది వర్తిస్తుంది.
ఇకపోతే నేను పెట్టిన పరీక్షలో నా ' కీర్తిప్రతిష్టల వారసత్వం' నిలబెట్టే వారసురాలువి..'' నువ్వే ''
అని.. నీలో క్రమశిక్షణను బట్టి నేను నిర్ణయించు కున్నానమ్మ. నేను కష్టపడి రచించిన నా గ్రంథాలన్ని.. నా అనంతరం చెదపట్టకుండా...అగ్నికి ఆహుతి కాకుండా.. అనామకుల పరం కాకుండా.. తడిచి ముద్దవ్వ కుండా... చివరికి చిత్తుకాగితాల వాడి తూకానికి బలి కాకుండా... చూడవలసిన రక్షణ బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా.''..... అంటూ తన గ్రంథాలున్న రెండురూమ్ ల తాళాలగుత్తి కూతురు లలితశ్రీ కి అందించాడు ప్రేమతో సత్యకీర్తి.
నిజమే...
మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!. అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం.. అది కూడా ముఖ్యం కాదు.!!
మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..''బాధ్యత'' ఆపకుండా, దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''
'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''
తన తెలుగు మాస్టారి మహోన్నత గ్రంథంలోని వాక్యాలు మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు ... సత్యకీర్తి!
****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)