Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(5) తల్లి పిల్లా న్యాయం _ completed
#36
వంశీ..

నువ్వు చాలా మంచివాడివి, తెలివికలవాడివి. నా పదిహేనో యేట ప్రేమలో పడిన తరువాత మళ్ళీ ఇంకొకరితో నేను మనస్ఫూర్తిగా తనువు పంచుకుంది నీతోనే.. నువ్వే నా కూతురిని ప్రేమించిన వాడివని నేను కలలో కూడా ఊహించలేదు. నిహారికని నేను ఇష్టంగా కనకున్నా ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. అది నా ప్రాణం. నా బంగారపు బొమ్మని జాగ్రత్తగా చూసుకో..

నిహారిక రెండవ కవరు చించింది.
నిహా.. సారీ ఫర్ ఎవరీతింగ్. తెలిసి చేసినా తెలియక చేసినా, నా వల్ల తప్పు జరిగిపోయింది. నీ మనసెంత విరిగిపోయి ఉంటుందో నేనూహించగలను. ఇన్నేళ్లు నీకోసమే నా ఆశలు, కోరికలు అన్నీ చంపుకున్నాను. నీకు నా అవసరం లేదని నాకు అర్ధమైంది. ఇక నా సంతోషం  గురించి నేనాలోచించుకునే సమయం వచ్చింది. అందుకే వెళుతున్నాను. నీ వయసులో నేనిప్పుడు నా బాధని పంచుకునేవాళ్ళు నా పక్కన ఎవ్వరు లేరు, కానీ నీ పక్కన వంశీ ఉన్నాడు. ఆ విలువైన బంధాన్ని కాపాడుకో.. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను, నీ అమ్మ నువ్వు అన్నది కాదు. నీ మీద నాకు కోపమూ లేదు. జాగ్రత్త తల్లీ..
ఆ కాయితాలు, షేర్లు, డిపాజిట్లు అవన్నీ నీకోసం నేను ఇష్టంగా పడ్డ కష్టం. ఉంటాను. నిన్ను ప్రేమించడం మాత్రమే తెలిసిన పూజా పూర్ణవి.

ఒక్కసారిగా చీకటిగా అనిపించింది నిహారికకి, భయమేసి వెంటనే వంశీకి విషయం చెప్పింది. ఇద్దరు కలిసి వెతికినా, తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసినా లాభం లేకపోయింది. స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

కంగారు పడకు, తనెక్కడికి వెళ్ళదు. ఏదైనా అఘాయిత్యానికి పాలుపడేంత పిరికిది కూడా కాదు. మనం భయపడాల్సిన పనిలేదు అన్నాడు వంశీ నమ్మకంగా.. కాంర్ అప్పటికే నిహారిక పూర్తిగా కుంగిపోయింది.

అమ్మ గురించి నాకు బాగా తెలుసు, ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ప్రాణం మీదకి వచ్చినా ఆ నిర్ణయం మార్చుకోదు. అమ్మ ఇక రాదేమో అంది ఏడుస్తూ..

నాకేం అర్ధం కాట్లేదు నిహారిక.. అని వంశీ అంటే అమ్మని లంజా అని తిట్టిన సంగతి నిహారిక వంశీకి చెప్పేసింది. వంశీ  తన నోటితో చాలా సార్లు తిట్టాడు. కానీ అది వేరు, ఇది వేరు.. పూజ ఆత్మాభిమానం దెబ్బతీసింది నిహారిక. లోపల  వంశీకి కూడా కంగారుగానే ఉంది. మీ అమ్మ పని చేస్తున్న దెగ్గరికి వెళదాం అన్నాడు. బండి అవసరం పడుతుందని నిహారికతో పాటు బండి మీదే గుంటూరు బైలుదేరారు. ఒక్కో కిలోమీటర్ వెళ్తున్న కొద్దీ పూజతో జరిగిన ప్రతీ సంఘటన గుర్తుకువస్తుంది వంశీకి.. అవన్నీ తలుచుకుంటూనే గుంటూరు చేరారు. వంశీ మనసులో జరుగుతున్న భయంకరమైన అలజడి తన బుర్రని చేరలేదంతే..  

అది చేరితే ?

***

ఇరవై ఐదేళ్ల క్రితం,
కృష్ణపట్నం పక్కన ఉండే ఊర్లలో లింగవరం అనే చిన్న ఊరు.
సిన్నమ్మా.. ఓ సిన్నమ్మా..
గొంతు వినగానే ఇంట్లో నుంచి బైటికి పరిగెత్తుకుంటూ వచ్చింది పూజ. నిన్న గూడూరు పెళ్ళికి బోతే కలిసినాడు గిరిధర్. నచ్చినవాని యెంటబడి వేధించాడు. ఏడిపించినాడు, బతిమిలాడినాడు, మాటలు చెప్పినాడు, చివరికి పూజని మెప్పించాడు. వాడి గొంతు వినగానే కంగారుగా బైటికి వచ్చింది.

ఏందీ అంది కంగారుగా
ఇటు రామ్మే... నీతో మాట్లాడాలా
ఇంకా ఏముండాది మాట్లాడేదానికీ.. నిన్నే అయిపోయుళ్లా
ఏమైపోయినది మ్మే..
నిన్న మీ అమ్మ చెప్పుండ్లా నీకు నాకు వరస గాదనీ.. నేను నీకు పిన్ని వరస అవుతాను
అందుకే గదమ్మే సిన్నమ్మా.. అని కేకేసింది
ఏం గావాలా ?
ఊరికే వచ్చా
నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు కానీయ్.. మర్యాదగా యింటికి బో జెప్తన్నా.. 
లేదంటే యేమ్ జేత్తా ?
ఇలా తగులుకున్నావేంది గిరి.. ఎవరైనా జూస్తే యేమనుకుంటారు

నేను నా సిన్నమ్మ దెగ్గరికి వచ్చినాననుకుంటారు. ఒల్లు అనుకుంటూనే ఉంటారులే.. మ్మేయి నీతో స్నేహం జేద్దామని వచ్చినాను. అట్ట  కసురుతావేందీ..

ఇప్పుడు గాదు. రేపు మా నాయిన బళ్ళో జేర్చేదానికి కృష్ణపట్నం తీసుకుపోతున్నాడు. యెల్లుండి మా బాయి బడి దెగ్గరికిరా అప్పుడు యింటా నంటే అట్టట్నే అని పరిగెత్తాడు గిరి.

గిరి వెళ్ళిపోగానే ఎవ్వరు చూడలేదు కదా అని చూసుకుని లోపలికెళ్లి మళ్ళీ టీవీలొ నిమగ్నమైంది.

పదో తరగతి బడికి కృష్ణపట్నం పోవాల. ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు. పొద్దున్నే ఎనిమిది గంటల బస్సు,  సాయంత్రం ఐదు గంటల బస్సు అని నాన్న బుర్రలో నాటుకుపోయేలా పలుమార్లు చెప్పాడు. 

***

చెనా చెనా చెనా... చెనా చెనా 

అలికిడికి లేచింది పూజ. చిరుతిళ్ళు అమ్మడానికి వచ్చారు. టీ వాడు వెళుతుంటే పిలిచి టీ తీసుకుని తాగింది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని బైటికి చూస్తుంటే సెలయేరు కనిపించేసరికి చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకువచ్చి నవ్వుకుంది. 

***

గుంటూరు 

పూజ ఆఫీస్ దెగ్గర నుంచి, తన కోలీగ్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరినీ ఎంక్వయిరీ చేసారు. ఆఫీసులొ రెసిగ్నేషన్ మెయిల్ ద్వారా పంపించందని తెలిసింది. బ్యాంకుకి వెళ్లి డీటెయిల్స్ అడిగితే పీయఫ్ అమౌంట్ డ్రా చేసి కూతురు అకౌంటుకి ట్రాన్స్ఫర్ చెయ్యమని రిక్వెస్ట్ లెటర్ పెట్టినట్టు ఉంది. ఎవ్వరిని అడిగినా పూజ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. 


ఆ రాత్రి గుంటూరులో పూజ ఇంట్లోనే పడుకున్నారు. నిహారిక బాధ చూడలేక ధైర్యం చెపుతూ జో కొడితే వంశీ ఒళ్ళో పడుకుంది. తెల్లారి లేచేసరికి వంశీ ఇల్లంతా వెతకడం చూసి లేచి దెగ్గరికి వెళ్ళింది. వంశీ నిహారికని చూసి ఏమైనా తెలుస్తుందేమోనని చూస్తున్నా అని వెతుకుతుంటే ములలో చిన్న సంచి దొరికింది. తీసి చూసాడు, నిహారికవి పూజవి ఫోటోలు ఉన్నాయి. ఇద్దరు మంచం మీద కూర్చుని అవన్నీ చూస్తుంటే వంశీ మీ నాన్న ఫోటో ఒక్కటి కూడా లేదు అన్నాడు. నిహారిక అది పట్టించుకోకుండా వంశీ చేతిలో ఉన్నవి తీసుకుని లెదర్ అట్టతో ఉన్న డైరీ తెరిచింది. వంశీ కూడా తొంగి చూసాడు.

అందులో మొదటగా తన అమ్మ చేతిరాతతో రాసిన పేరు.. గిరిధర్
Like Reply


Messages In This Thread
RE: (5) తల్లి పిల్లా న్యాయం - by Raagaa - 09-04-2026, 01:21 AM



Users browsing this thread: 1 Guest(s)