08-04-2026, 07:35 AM
Part - 65
శేషాద్రి అని నాగేంద్ర గట్టిగా అరుస్తాడు. ఎందుకు నాన్న అరుస్తున్నారు ఇప్పుడు మీరు. లేకపోతే నువ్వు చేస్తున్నది ఏమిటి.
మన శత్రువు అయినా రుద్ర దగ్గరికి వెళతావా.. ఆ గజపతి, భూపతులు మనకు ఎంత శత్రువులో తెలుసు కదా...
మరి వాళ్ళ శత్రువులని తెలిసే భూపతిల ఇంటికి నీ కూతుర్ని పంపించాలనుకున్నారా.. శేషాద్రి అంటే.. ఎందుకు మాట్లాడితే అరుస్తున్నారు.
నేను అడిగిన దాంట్లో తప్పేముంది. ఆరోజు మయూరిని ఎలా చేయాలి అనుకున్నారు. కోపంతో కళ్ళు ఎర్ర చేస్తూ చేతులు రెండు బిగిస్తాడు.
మీరు ఎంత కోపంగా చూసిన అదే నిజం కదా.. ఇప్పుడు చేయడం లేదు కదా.. మీ కూతురి జీవితం ఏమైనా మీకు పరవాలేదు ఏమో గాని నా కూతురు జీవితం నాకు చాలా ముఖ్యం.
అది సంతోషంగా ఉంటే నాకు చాలు. పగ పగ అని మీరు మీ కూతురు జీవితాన్ని నాశనం చేసినట్టు నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. చెయ్యను.
త్వరలోనే అక్క బావ వస్తున్నారు. ఏం చెప్పకుంటారో చెప్పుకోండి అనే సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతాడు. భర్తలో వచ్చిన మార్పు కి జ్యోతి ఆశ్చర్యపోతూ..భర్త వెనకాలే వెళుతుంది.
లక్ష్మి భర్త దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని అడుగుతుంది. లక్ష్మీ అంటే.. ఎందుకు ఈ కోపం. పగ పగ అంటున్నారు.
దేనికోసం... దీనివల్ల మీకేం వచ్చింది. అయినవాళ్ళందరూ దూరమై మీరు మీ కూతురు పగ.. పగ అని తిరిగి ఏం సాధించారు.
మయూరి జీవితం మోడుభారీపోయింది. దాని వయసు వాళ్లందరూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే ఒంటరిగా ఆ గదిలో ఆ ఫోటోలు చూస్తూ కాలం గడుపుతుంది.
ఇంత వయసు వచ్చిన మీకే భార్య అవసరం కనపడుతుంది. అలాంటిది అది అలా బతుకుతున్నా సరే మీకు ఏమీ బాధ లేదు. ఏం మనిషి అండి మీరు.
ఇదేనా మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ అని అడుగుతుంది. కోపం తట్టుకోలేక.. ఎదురు ప్రశ్నిస్తున్న భార్యకు సమాధానం చెప్పలేక గట్టిగా కొడతాడు.
చంప మీద చెయ్యి వేసుకుని ఇంతకు మించి మీరు ఏమి చేయగలరు లెండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్లే అయిపోతున్నారు.
రుద్ర నిన్ను వదలను నా అనుభవం అంత లేదు నీ వయసు. నాకే సవాలు విసురుతున్నావా.. ఏం చేయాలి అని నా మనవరాళ్ళ ఇద్దరు జీవితంతో ఆడుకుంటున్నావు అని ఆలోచిస్తూ ఉంటారు.
అల్లుడు గుర్తుకు రాగానే ఒళ్లంతా చెమటలు పడతాయి. మయూరి ఇదంతా విని మౌనంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.
దేవేంద్ర ఫోటో చూస్తూ.. నా ప్రేమ నీకు కనపడలేదా... ఎప్పుడో చనిపోయిన నీ భార్యని ప్రేమిస్తూ ఎదురుగుండా ఉన్న నన్ను వదిలేస్తున్నావు.
నేను నీకోసం పరుగులు పెడుతూ ఉంటే నీ మేనల్లుడు నా మీద పగ సాధిస్తున్నాడు. ఎందుకు దేవ్ ఇలా చేయడం. మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటే ఈ పగలు పూర్తిగా తగ్గిపోతాయి కదా లేదు లేదు అసలు ఉండనే ఉండవు కదా..
అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒప్పుకో దేవ్.. మైనపు బొమ్మని కౌగిలించుకొని కబుర్లు చెబుతూ ఉంటుంది.
రెండు రోజులు బాగా తిప్పించుకున్న తర్వాత రుద్ర అపాయింట్మెంట్ ఇస్తాడు. రుద్రా క్యాబిన్లో రుద్రాలతో పాటు మిగిలిన ముగ్గురు బావమరుదులు కూర్చుని ఉంటే శేషాద్రి మాత్రం నిలబడి ఉంటాడు.
రుద్ర చైర్ లో కూర్చుని తిరుగుతూ చెప్పు శేషాద్రి నా అపాయింట్మెంట్ కోసం ఎందుకో తెగ పరుగులు పెడుతున్నావు.
ఏమైనా అవసరం ఉందా.. ప్లీజ్ రుద్ర నీకు అన్నీ తెలుసు. తెలిసే నాతో చెప్పేస్తున్నావా.. అయ్యో మిస్టర్ శేషాద్రి... మీలాంటి గొప్పవాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది చెప్పు.
ఏంటి విషయం నేను ఏమైనా సహాయం చేయలా.. మోకాళ్ళ మీద కూర్చుని నిషా, ఆశా జీవితాన్ని నిలబెట్టు అంటాడు.
మీ ఇంటి ఆడపిల్లల జీవితం నేను నిలబెట్టడం ఏమిటి.. నాకేమిటి సంబంధం. ప్లీజ్ రుద్ర వాళ్ళిద్దర్నీ నువ్వే అరేంజ్ చేసావని నాకు తెలుసు.
ఆ పెళ్లి చేసుకున్నది ఎవరో మాకు ఎవరూ తెలియదు. దయచేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇస్తే ఏమి చేస్తావ్.
వాళ్ళని చంపి మీ పిల్లలు ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేస్తావా.. లేదు లేదు కాపురానికి పంపిస్తాను అంటే.. గట్టిగా నవ్వుతూ నువ్వు పంపిస్తే మాత్రం వాళ్ళు ఏలుకుంటారా..
మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పెళ్లి చేశావు. మా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు రుద్ర . ఇప్పుడు కరెక్ట్ లైన్ కు వచ్చావు మిస్టర్ శేషాద్రి అంటాడు.
నువ్వు నాకు ఒక పని చేసి పెడితే వాళ్ళ మొగుళ్ళు ఎక్కడ ఉన్నారో చెబుతాను. చెప్పు చేస్తాను అంటే.. త్వరలో నా పెళ్లి అంటాడు.
తెలుసు అంటే.. పర్వాలేదే అని మా పెళ్లి అయ్యేవరకు మీ ఇంట్లో ఎవ్వరూ కూడా పిచ్చపిచ్చ వేషాలు వేయకూడదు. పెళ్లి చెడగొట్టాలి. పెళ్లిలో ఎవరినైనా నాశనం చేయాలి అన్న ఆలోచన రానివ్వకూడదు.
ఎవరైనా ఆ పని చేయాలి అనుకుంటే ముందుండి ఆపాల్సింది నువ్వే అంటాడు.. ఆ మాటకి శేషాద్రి ఏమీ మాట్లాడకుండా నీళ్లు నములుతూ ఉంటాడు.
ఏమిటి అల సైలెంట్ అయిపోయావు చెయ్యవా.
చెయ్యకపోతే నేనేమీ చేయలేను.. అసలే ఆశ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అనుకుంటా అన్ని వెటకారంగా అంటాడు.
ఈ విషయం నీకు ఎలా తెలుసు. శత్రువు నీడని నిద్రలో కూడా పసగడతాను. అలాంటిది మీ గురించి నేను తెలుసుకోకుండా ఉంటాను మిస్టర్.
బావగారికి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తారు అంటాడు. అది మరీ మంచిది కదా.. నాకు శత్రుశేషం ఉండదు అంటాడు.
ప్లీజ్ రుద్ర మేము చేసిన దానికి ఆడపిల్లలు ఇద్దరిని బలి చేయొద్దు. అలాంటి నీచపు పనులు చేసేది మీరు..
నీకు ఆప్షన్ ఇచ్చాను. వాడుకోమంటున్నాను నీ ఇష్టం అంటాడు.
శేషాద్రి ఇంకా అలాగే మోకాళ్ళ మీద ఉంటే నువ్వు బయటికి వెళ్తే మేము వర్క్ చేసుకోవాలి. నీలాగా పనీపాటా లేని వాళ్ళము కాదు.
శేషాద్రి మౌనంగా లేచి నీ పెళ్ళికి మా కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే నిజంగా వాళ్ల జాడ చెబుతావా అని అడుగుతాడు.
ఆ మాటకి రుద్ర నవ్వుతూ నేను మాటంటే మాటే. ఏ రోజైనా మా కుటుంబాలు మాట తప్పాయ అని అడుగుతాడు. లేదు అని తల ఊపుతాడు.
ఇంకేం నీ పనిలో నువ్వు ఉండు మా పనిలో మేము ఉంటాము. సరే అన్ని ఇంటికి వెళతాడు. వెళ్ళగానే మయూరి అని పిలుస్తాడు.
బయటికి వచ్చి ఏంటన్నయ్య అంటే.. ఇలా వచ్చి కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు. అన్నయ్య ఏమిటిది అని కంగారుగా అంటే.. ప్లీజ్ మయూరి నేను చెప్పేది విను.
జ్యోతి, లక్ష్మీ కూడా అక్కడే ఉంటారు.. చెప్పు అన్నట్టుగా మయూరి చూస్తే.. ఈరోజు రుద్రని కలిశాను. రుద్రా చెప్పిందంతా చెబుతాడు.
మయూరి మౌనంగా వింటూ ఉంటుంది. ప్లీజ్ మయూరి... నీ జీవితం ఎలాగో ఎటు కాకుండా అయిపోయింది. వాళ్ళిద్దరూ నీ కళ్ళముందే పెరిగారు కదా..
వాళ్ల జీవితం బాగుండాలని నీకు లేదా.. ఆలోచించు. రుద్ర పెళ్ళికి అడ్డుపడకుండా ఉండు. నీ కాళ్లు పట్టుకుంటాను అని పాదాలు టచ్ చేస్తాడు.
అన్నయ్య అంటూ కాళ్ళు వెనక్కి లాక్కుంటుంది. కన్నీళ్ళతో చూస్తున్న అన్నయ్యని నువ్వు రుద్ర మాటలు నమ్ముతున్నావా..
లక్ష్మి వెంటనే వాళ్ళు ఏమి మనలాంటి వాళ్ళు కాదు. ఆ కుటుంబాలు మాటిచ్చారంటే మాటే అంటుంది. దానికి విరక్తిగా నవ్వుతూ మరి నాకు ఇచ్చిన మాట అంటే..
ఆ మాటకి లక్ష్మీ నీకు మాట ఎవరూ ఇవ్వలేదు మయూరి. ఆరోజు అక్కడ దేవేంద్ర లేడు. అనసూయ కూడా దేవేంద్ర ఒప్పుకుంటే అని మాట్లాడింది..తర్వాత మీరిద్దరే కదా అనసూయ మనసుని పాడు చేశారు అంటుంది.
మయూరి మౌనంగా ఉంటే జ్యోతి ముందుకు వచ్చి చూడు మయూరి. నిన్ను ఏరోజు ఏ విషయంలో కూడా నేను బ్రతిమాలింది లేదు.
ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. అలాగే మన ఇంటి పరువుకు సంబంధించినది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లారో లేదో కూడా తెలియదు.
ఒకవేళ వెళ్లి ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి. నీ కాళ్లు పట్టుకుంటాను అని పట్టుకోపోతుంది. వదిన నువ్వు చేసేది ఏమిటి..
ఏ రోజు నువ్వు నన్ను వదినగా గుర్తించలేదు. మీ ఇంటి పనిమనిషి నిన్ను బ్రతిమాలుతుంది అనుకో మయూరి అంటుంది.
లక్ష్మీ వెంటనే అమ్మ జ్యోతి ఏమిటా మాటలు..మరి ఏమి చేయమంటారు అత్తయ్య. ఎంత బ్రతిమాలుతున్న సరే ఆ మనిషి కరుగుతుందా..
పిల్లలు భవిష్యత్తు పాడైపోయినా పరవాలేదు పగ సాధించాలి అనుకుంటుంది. చచ్చిన తర్వాత ఆ పగను తీసుకుని పైకి వెళుతుందా.. ఏం మనుషులు అత్తయ్య వీళ్ళు అని మొదటిసారి తన బాధని ఆవేశాన్ని బయటకి కక్కుతుంది.
ఏనాడు మాట్లాడని వదిన కూడా అలా మాట్లాడేటప్పటికి మయూరి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి సరే అన్నయ్య వాళ్ళ పెళ్లి వరకు నేను ఎటువంటి ప్రయత్నాలు చెయ్యను.
వాళ్ల పెళ్లి ఆపను సరేనా అంటుంది. ఈ మాట అన్నావు అదే చాలు. నువ్వు మాటిచ్చావు అంటే నాన్నగారు కూడా ఆ మాట దాటరు.
థాంక్యూ మయూరి.. వెంటనే రుద్రా కి కాల్ చేస్తాడు. చెప్పు అని రుద్రా అనగానే.... మయూరి ఒప్పుకుంది అంటే మంచిది.
మయూరి మాత్రం మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది. రుద్ర, శాంభవిల పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ భూపతుల స్వగ్రామానికి చేరుకుంటారు.
శాంభవి కుటుంబానికి అందరూ రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు. అది చూసిన శాంభవి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థం అయిన వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు.
కౌసల్య ధరణి దగ్గరికి ఒక బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఏమిటి కౌసల్య అని ధరణి అడిగితే ఇవి మా తోటికోడలి చీర నగలు అని చెబుతుంది. దేనికోసం అంటే శాంభవి కోసం.
శాంభవి ఫ్యామిలీ రియాక్షన్...
మన శత్రువు అయినా రుద్ర దగ్గరికి వెళతావా.. ఆ గజపతి, భూపతులు మనకు ఎంత శత్రువులో తెలుసు కదా...
మరి వాళ్ళ శత్రువులని తెలిసే భూపతిల ఇంటికి నీ కూతుర్ని పంపించాలనుకున్నారా.. శేషాద్రి అంటే.. ఎందుకు మాట్లాడితే అరుస్తున్నారు.
నేను అడిగిన దాంట్లో తప్పేముంది. ఆరోజు మయూరిని ఎలా చేయాలి అనుకున్నారు. కోపంతో కళ్ళు ఎర్ర చేస్తూ చేతులు రెండు బిగిస్తాడు.
మీరు ఎంత కోపంగా చూసిన అదే నిజం కదా.. ఇప్పుడు చేయడం లేదు కదా.. మీ కూతురి జీవితం ఏమైనా మీకు పరవాలేదు ఏమో గాని నా కూతురు జీవితం నాకు చాలా ముఖ్యం.
అది సంతోషంగా ఉంటే నాకు చాలు. పగ పగ అని మీరు మీ కూతురు జీవితాన్ని నాశనం చేసినట్టు నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. చెయ్యను.
త్వరలోనే అక్క బావ వస్తున్నారు. ఏం చెప్పకుంటారో చెప్పుకోండి అనే సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతాడు. భర్తలో వచ్చిన మార్పు కి జ్యోతి ఆశ్చర్యపోతూ..భర్త వెనకాలే వెళుతుంది.
లక్ష్మి భర్త దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని అడుగుతుంది. లక్ష్మీ అంటే.. ఎందుకు ఈ కోపం. పగ పగ అంటున్నారు.
దేనికోసం... దీనివల్ల మీకేం వచ్చింది. అయినవాళ్ళందరూ దూరమై మీరు మీ కూతురు పగ.. పగ అని తిరిగి ఏం సాధించారు.
మయూరి జీవితం మోడుభారీపోయింది. దాని వయసు వాళ్లందరూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే ఒంటరిగా ఆ గదిలో ఆ ఫోటోలు చూస్తూ కాలం గడుపుతుంది.
ఇంత వయసు వచ్చిన మీకే భార్య అవసరం కనపడుతుంది. అలాంటిది అది అలా బతుకుతున్నా సరే మీకు ఏమీ బాధ లేదు. ఏం మనిషి అండి మీరు.
ఇదేనా మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ అని అడుగుతుంది. కోపం తట్టుకోలేక.. ఎదురు ప్రశ్నిస్తున్న భార్యకు సమాధానం చెప్పలేక గట్టిగా కొడతాడు.
చంప మీద చెయ్యి వేసుకుని ఇంతకు మించి మీరు ఏమి చేయగలరు లెండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్లే అయిపోతున్నారు.
రుద్ర నిన్ను వదలను నా అనుభవం అంత లేదు నీ వయసు. నాకే సవాలు విసురుతున్నావా.. ఏం చేయాలి అని నా మనవరాళ్ళ ఇద్దరు జీవితంతో ఆడుకుంటున్నావు అని ఆలోచిస్తూ ఉంటారు.
అల్లుడు గుర్తుకు రాగానే ఒళ్లంతా చెమటలు పడతాయి. మయూరి ఇదంతా విని మౌనంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.
దేవేంద్ర ఫోటో చూస్తూ.. నా ప్రేమ నీకు కనపడలేదా... ఎప్పుడో చనిపోయిన నీ భార్యని ప్రేమిస్తూ ఎదురుగుండా ఉన్న నన్ను వదిలేస్తున్నావు.
నేను నీకోసం పరుగులు పెడుతూ ఉంటే నీ మేనల్లుడు నా మీద పగ సాధిస్తున్నాడు. ఎందుకు దేవ్ ఇలా చేయడం. మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటే ఈ పగలు పూర్తిగా తగ్గిపోతాయి కదా లేదు లేదు అసలు ఉండనే ఉండవు కదా..
అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒప్పుకో దేవ్.. మైనపు బొమ్మని కౌగిలించుకొని కబుర్లు చెబుతూ ఉంటుంది.
రెండు రోజులు బాగా తిప్పించుకున్న తర్వాత రుద్ర అపాయింట్మెంట్ ఇస్తాడు. రుద్రా క్యాబిన్లో రుద్రాలతో పాటు మిగిలిన ముగ్గురు బావమరుదులు కూర్చుని ఉంటే శేషాద్రి మాత్రం నిలబడి ఉంటాడు.
రుద్ర చైర్ లో కూర్చుని తిరుగుతూ చెప్పు శేషాద్రి నా అపాయింట్మెంట్ కోసం ఎందుకో తెగ పరుగులు పెడుతున్నావు.
ఏమైనా అవసరం ఉందా.. ప్లీజ్ రుద్ర నీకు అన్నీ తెలుసు. తెలిసే నాతో చెప్పేస్తున్నావా.. అయ్యో మిస్టర్ శేషాద్రి... మీలాంటి గొప్పవాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది చెప్పు.
ఏంటి విషయం నేను ఏమైనా సహాయం చేయలా.. మోకాళ్ళ మీద కూర్చుని నిషా, ఆశా జీవితాన్ని నిలబెట్టు అంటాడు.
మీ ఇంటి ఆడపిల్లల జీవితం నేను నిలబెట్టడం ఏమిటి.. నాకేమిటి సంబంధం. ప్లీజ్ రుద్ర వాళ్ళిద్దర్నీ నువ్వే అరేంజ్ చేసావని నాకు తెలుసు.
ఆ పెళ్లి చేసుకున్నది ఎవరో మాకు ఎవరూ తెలియదు. దయచేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇస్తే ఏమి చేస్తావ్.
వాళ్ళని చంపి మీ పిల్లలు ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేస్తావా.. లేదు లేదు కాపురానికి పంపిస్తాను అంటే.. గట్టిగా నవ్వుతూ నువ్వు పంపిస్తే మాత్రం వాళ్ళు ఏలుకుంటారా..
మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పెళ్లి చేశావు. మా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు రుద్ర . ఇప్పుడు కరెక్ట్ లైన్ కు వచ్చావు మిస్టర్ శేషాద్రి అంటాడు.
నువ్వు నాకు ఒక పని చేసి పెడితే వాళ్ళ మొగుళ్ళు ఎక్కడ ఉన్నారో చెబుతాను. చెప్పు చేస్తాను అంటే.. త్వరలో నా పెళ్లి అంటాడు.
తెలుసు అంటే.. పర్వాలేదే అని మా పెళ్లి అయ్యేవరకు మీ ఇంట్లో ఎవ్వరూ కూడా పిచ్చపిచ్చ వేషాలు వేయకూడదు. పెళ్లి చెడగొట్టాలి. పెళ్లిలో ఎవరినైనా నాశనం చేయాలి అన్న ఆలోచన రానివ్వకూడదు.
ఎవరైనా ఆ పని చేయాలి అనుకుంటే ముందుండి ఆపాల్సింది నువ్వే అంటాడు.. ఆ మాటకి శేషాద్రి ఏమీ మాట్లాడకుండా నీళ్లు నములుతూ ఉంటాడు.
ఏమిటి అల సైలెంట్ అయిపోయావు చెయ్యవా.
చెయ్యకపోతే నేనేమీ చేయలేను.. అసలే ఆశ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అనుకుంటా అన్ని వెటకారంగా అంటాడు.
ఈ విషయం నీకు ఎలా తెలుసు. శత్రువు నీడని నిద్రలో కూడా పసగడతాను. అలాంటిది మీ గురించి నేను తెలుసుకోకుండా ఉంటాను మిస్టర్.
బావగారికి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తారు అంటాడు. అది మరీ మంచిది కదా.. నాకు శత్రుశేషం ఉండదు అంటాడు.
ప్లీజ్ రుద్ర మేము చేసిన దానికి ఆడపిల్లలు ఇద్దరిని బలి చేయొద్దు. అలాంటి నీచపు పనులు చేసేది మీరు..
నీకు ఆప్షన్ ఇచ్చాను. వాడుకోమంటున్నాను నీ ఇష్టం అంటాడు.
శేషాద్రి ఇంకా అలాగే మోకాళ్ళ మీద ఉంటే నువ్వు బయటికి వెళ్తే మేము వర్క్ చేసుకోవాలి. నీలాగా పనీపాటా లేని వాళ్ళము కాదు.
శేషాద్రి మౌనంగా లేచి నీ పెళ్ళికి మా కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే నిజంగా వాళ్ల జాడ చెబుతావా అని అడుగుతాడు.
ఆ మాటకి రుద్ర నవ్వుతూ నేను మాటంటే మాటే. ఏ రోజైనా మా కుటుంబాలు మాట తప్పాయ అని అడుగుతాడు. లేదు అని తల ఊపుతాడు.
ఇంకేం నీ పనిలో నువ్వు ఉండు మా పనిలో మేము ఉంటాము. సరే అన్ని ఇంటికి వెళతాడు. వెళ్ళగానే మయూరి అని పిలుస్తాడు.
బయటికి వచ్చి ఏంటన్నయ్య అంటే.. ఇలా వచ్చి కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు. అన్నయ్య ఏమిటిది అని కంగారుగా అంటే.. ప్లీజ్ మయూరి నేను చెప్పేది విను.
జ్యోతి, లక్ష్మీ కూడా అక్కడే ఉంటారు.. చెప్పు అన్నట్టుగా మయూరి చూస్తే.. ఈరోజు రుద్రని కలిశాను. రుద్రా చెప్పిందంతా చెబుతాడు.
మయూరి మౌనంగా వింటూ ఉంటుంది. ప్లీజ్ మయూరి... నీ జీవితం ఎలాగో ఎటు కాకుండా అయిపోయింది. వాళ్ళిద్దరూ నీ కళ్ళముందే పెరిగారు కదా..
వాళ్ల జీవితం బాగుండాలని నీకు లేదా.. ఆలోచించు. రుద్ర పెళ్ళికి అడ్డుపడకుండా ఉండు. నీ కాళ్లు పట్టుకుంటాను అని పాదాలు టచ్ చేస్తాడు.
అన్నయ్య అంటూ కాళ్ళు వెనక్కి లాక్కుంటుంది. కన్నీళ్ళతో చూస్తున్న అన్నయ్యని నువ్వు రుద్ర మాటలు నమ్ముతున్నావా..
లక్ష్మి వెంటనే వాళ్ళు ఏమి మనలాంటి వాళ్ళు కాదు. ఆ కుటుంబాలు మాటిచ్చారంటే మాటే అంటుంది. దానికి విరక్తిగా నవ్వుతూ మరి నాకు ఇచ్చిన మాట అంటే..
ఆ మాటకి లక్ష్మీ నీకు మాట ఎవరూ ఇవ్వలేదు మయూరి. ఆరోజు అక్కడ దేవేంద్ర లేడు. అనసూయ కూడా దేవేంద్ర ఒప్పుకుంటే అని మాట్లాడింది..తర్వాత మీరిద్దరే కదా అనసూయ మనసుని పాడు చేశారు అంటుంది.
మయూరి మౌనంగా ఉంటే జ్యోతి ముందుకు వచ్చి చూడు మయూరి. నిన్ను ఏరోజు ఏ విషయంలో కూడా నేను బ్రతిమాలింది లేదు.
ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. అలాగే మన ఇంటి పరువుకు సంబంధించినది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లారో లేదో కూడా తెలియదు.
ఒకవేళ వెళ్లి ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి. నీ కాళ్లు పట్టుకుంటాను అని పట్టుకోపోతుంది. వదిన నువ్వు చేసేది ఏమిటి..
ఏ రోజు నువ్వు నన్ను వదినగా గుర్తించలేదు. మీ ఇంటి పనిమనిషి నిన్ను బ్రతిమాలుతుంది అనుకో మయూరి అంటుంది.
లక్ష్మీ వెంటనే అమ్మ జ్యోతి ఏమిటా మాటలు..మరి ఏమి చేయమంటారు అత్తయ్య. ఎంత బ్రతిమాలుతున్న సరే ఆ మనిషి కరుగుతుందా..
పిల్లలు భవిష్యత్తు పాడైపోయినా పరవాలేదు పగ సాధించాలి అనుకుంటుంది. చచ్చిన తర్వాత ఆ పగను తీసుకుని పైకి వెళుతుందా.. ఏం మనుషులు అత్తయ్య వీళ్ళు అని మొదటిసారి తన బాధని ఆవేశాన్ని బయటకి కక్కుతుంది.
ఏనాడు మాట్లాడని వదిన కూడా అలా మాట్లాడేటప్పటికి మయూరి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి సరే అన్నయ్య వాళ్ళ పెళ్లి వరకు నేను ఎటువంటి ప్రయత్నాలు చెయ్యను.
వాళ్ల పెళ్లి ఆపను సరేనా అంటుంది. ఈ మాట అన్నావు అదే చాలు. నువ్వు మాటిచ్చావు అంటే నాన్నగారు కూడా ఆ మాట దాటరు.
థాంక్యూ మయూరి.. వెంటనే రుద్రా కి కాల్ చేస్తాడు. చెప్పు అని రుద్రా అనగానే.... మయూరి ఒప్పుకుంది అంటే మంచిది.
మయూరి మాత్రం మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది. రుద్ర, శాంభవిల పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ భూపతుల స్వగ్రామానికి చేరుకుంటారు.
శాంభవి కుటుంబానికి అందరూ రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు. అది చూసిన శాంభవి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థం అయిన వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు.
కౌసల్య ధరణి దగ్గరికి ఒక బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఏమిటి కౌసల్య అని ధరణి అడిగితే ఇవి మా తోటికోడలి చీర నగలు అని చెబుతుంది. దేనికోసం అంటే శాంభవి కోసం.
శాంభవి ఫ్యామిలీ రియాక్షన్...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)