31-03-2026, 01:57 PM
(This post was last modified: 31-03-2026, 01:58 PM by madank6969. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode 03:
రాజ్యంలో శాంతి కొద్ది కాలమే నిలిచింది. మహారాజు ఒక విచిత్రమైన అంతుచిక్కని వ్యాధి భారినపడ్డాడు. రాజ భవనం అంతా భయాందోళనతో నిండిపోయింది. రాజవైద్యులు వచ్చి పరీక్షించారు... కానీ ఎవరికీ కారణం అర్థం కాలేదు.
చివరికి హిమాలయాల నుంచి వచ్చిన ఒక వృద్ధ సన్యాసి వైద్యుడు రాజును చూసి “మహారాజా... ఇది ‘కాలకూట విష జ్వరం’. ఇది సాధారణ వ్యాధి కాదు... ఇది ఒక పురాతన శాపం లాంటిది. దీనికి ఏకైక ఔషధం – హిమాలయాల అతి గుప్తమైన ‘అమృత సంజీవని’ మూలిక. అది మంచు కప్పిన శిఖరాల మధ్య మాత్రమే పెరుగుతుంది. కానీ అక్కడకు చేరుకోవడం అసాధ్యం. అక్కడ రాక్షస జంతువులు, మంచు తుఫానులు, భూకంపాలు, గాలులు – ఎవరూ బతికి బయటపడలేరు. అంతేకాదు... ఆ మూలికను తీసుకురాగలిగేది రాజుకు అత్యంత ప్రాణసమానమైన ఆత్మ సఖి మాత్రమే. లేదంటే ఆ మూలిక శక్తిహీనమవుతుంది.” అని చెప్పాడు.
రాజు బలహీనంగా కళ్లు తెరిచి చూశాడు. అతని మనసులో భయం, ఆశ, సందేహం – అన్నీ కలిసిపోయాయి. “నా ఆత్మ సఖురాలు... పద్మావతి మాత్రమే” అని కలవరపడ్డాదు. కానీ ఆమెను ఆ ప్రమాదకర ప్రయాణానికి పంపడం అతనికి భయంగా ఉంది. రాజు రాత్రంతా నిద్రపోలేక, బాధతో మూలుగుతూ గడిపాడు.
మరుసటి రోజు ఉదయం రాజు పద్మావతిని పిలిపించాడు. ఆమె రాజు పక్కన కూర్చుని చేతులు పట్టుకున్నది. రాజు బలహీన స్వరంతో “పద్మావతీ... నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. హిమాలయాలకు వెళ్లి ఆ మూలిక తెచ్చి నన్ను కాపాడు. నువ్వు నా ఆత్మ సఖురాలివి... నీ ప్రేమ లేకుండా ఔషధం పనిచేయదు.” అని అన్నాడు
పద్మావతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గొంతు గద్గదంగా, “మహారాజా... మీ కోసం నా ప్రాణాలు ఇస్తాను. వెళ్తాను” అంది. రాజు ఆలోచించి, రహస్యంగా మదన సింహాను, బుల్లిని పిలిపించాడు. “మదన సింహా... నువ్వు నా రాజ్యాన్ని కాపాడావు. ఇప్పుడు నా జీవితాన్ని కాపాడాలి. రాణి పద్మావతిని హిమాలయాలకు తీసుకెళ్లి, అమృత సంజీవని తెచ్చి ఇవ్వాలి. నువ్వే ఆమె రక్షకుడివి, ఆమె ఏకైక ప్రాణ సఖి బుల్లి ఆమెకు తోడుగా వస్తుంది. ఈ ప్రయాణం పూర్తి రహస్యం. రాజ్యంలో ఏ ఒక్కరికీ తెలియకూడదు. ఎవరికైనా తెలిస్తే... రాజ్యంలో మళ్లీ తిరుగుబాటు మొదలవుతుంది. రాణిని సురక్షితంగా తిరిగి తీసుకురా... లేకపోతే నా మరణానికి కారణం నువ్వే అవుతావు.” అని అన్నాడు.
మదన సింహా తల వంచి, “మహారాజా... మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మహారాణి గారికి ఏ విధమైన ప్రమాదం రాకుండా కాపాడతాను” అన్నాడు. కానీ అతని మనసులో ఒక ఆలోచన – “ఇది నా అవకాశం... రాణితో ఒంటరిగా, రహస్యంగా, ఎవరూ లేని పర్వత దారుల్లో... ఆమెను నా సొంతం చేసుకోవచ్చు.”
బుల్లి కూడా తల వంచింది. ఆమెకు మదన్తో ఆ రాత్రి జరిగిన ఉద్దీపన గుర్తొచ్చి, చిన్నగా నవ్వుకుంది.
ఆ రాత్రి గడిచిన తరువాత వేకువకామున సమయంలో... ముగ్గురూ రహస్య ద్వారం గుండా బయలుదేరారు. పద్మావతి సాధారణ బట్టలు ధరించి, ముఖం కప్పుకుని ఉంది. మదన ముందు, ఆమెకు రక్షణగా ఉన్నాడు. బుల్లి వెనుక వస్తోంది.
ఏమి జరగబోతోంది? రాణి లొంగుతుందా? మదన సింహా తన కోరికను తీర్చుకొంటాడా?
కథ... ఇంకా మరింత ఉద్విగ్నంగా కొనసాగుతుంది...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)