Yesterday, 10:46 AM
Part - 35
రుద్ర మనసు,,దేవేంద్ర కళ్ళు శాంభవి చుట్టూనే ఉంటాయి. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసంలో ఉంటుంది అందుకనే శాంభవిఫ్యామిలీ అందరూ కూడా ఉపవాసంలోనే ఉంటారు.
అది తెలియని చారులత, కౌసల్య టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి అందరిని బ్రేక్ ఫాస్ట్ కి పిలుస్తారు. దానికి ధరణి ఈరోజు మేము ఎవరిము తినమండి అని చెబుతారు.
దేనికి అంటే... సాయంత్రం హోమం ఉంది కదా హోమం దాకా అమ్మాయి ఏమీ తినదు. అందుకనే మేము ఎవరిము కూడా ఏమీ తినము అని చెబుతుంది.
ఓ అవునా మాకు ఆ విషయం తెలీదు కదా సరే అయితే అని చెప్పి పెదనాన్న గారిని పెద్దమ్మ గారి నాయనా పిలవండి అంటే...వాళ్ళు కూడా తినరు అని చెబుతుంది.
అందరూ ఉపవాసమే ఉంటారా అంటే... అవును సాయంత్రం హోమం అయ్యాకే భోజనం చేస్తాము అని చెబుతుంది.
సరేలెండి అని దేవేంద్ర వాళ్లని టిఫిన్ కి పిలుస్తారు. శివ గారు వాళ్ళు ఎవరూ రావడం లేదు ఏంటి అంటే ఈరోజు శాంభవి ఉపవాసంలో ఉంటుంది కదా అందుకే వాళ్ళు ఎవరు కూడా తినరు అన్నయ్య అంటే....
నా కూతురు ఉపవాసంలో ఉంటే నేను మాత్రం ఎలా తినగలను అని చెప్పి ఆయన కూడా వద్దు అని చెబుతారు.
ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ మానేస్తారు. అందరూ హోమం అయిన తర్వాత భోజనం చేద్దామని ఫిక్స్ అయిపోతారు.
రాఘవేంద్ర గారు కూడా నా మనవరాలు కోసం నేను ఉపవాసం ఉండలేనా అని ఆయన ఆగిపోతారు. సాయంత్రం హోమానికి సరిపడా అన్ని పనులు జరుగుతూఉంటాయి.
శ్రీశైలం నుంచి గురువుగారు కూడా వస్తారు. అయినా లోపలకి రావడంతోనే రాఘవేంద్ర గారు ఎదురు వెళ్లి నమస్కారం చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు.
గురువుకి చేయవలసిన అన్ని మర్యాదలు చేసి అందర్నీ పరిచయం చేసే శాంభవి ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తారు.
అందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి శాంభవిని దగ్గరికి పిలుస్తారు. శాంభవి భయం భయంగానే ఆయన ముందుకు వెళ్లి నిలబడుతుంది.
ఎందుకు తల్లి అంత భయపడుతున్నావు. నీకు ఆ తల్లి ఆశీర్వాదం నిండుగా ఉంది అని చెప్పి ఒక రుద్రాక్ష తీసి ఇది అమ్మాయి మెడలో వేయండి.
ఎటువంటి చెడు శక్తి అమ్మాయి వైపు చూడలేదు అని చెప్పి ఇస్తారు. రుద్రను కూడా పిలిచి ఇద్దరికీ ఒకేసారి ఆశీర్వాదం ఇస్తారు.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు... ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. బృందావనానికి మాత్రం ఆ ఆశీర్వాదం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
కానీ శాంభవి ఫ్యామిలీకి మాత్రం అయోమయంగా ఉంటుంది కానీ పైకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు.
శాంభవి కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూస్తూ ఉంటారు. గురువుగారు తన శిష్యులు వైపు తిరిగి ఈరోజు హోమం ఎటువంటి విఘ్నాలు రాకుండా జరగాలి.
ఆ ఏర్పాట్లు చూడండి.
రాఘవేంద్ర వైపు తిరిగి ఈరోజు నుంచి నీ కుటుంబానికి మంచి రోజులు వస్తున్నాయి. అమ్మాయి చేత పూజ గదిలో కూడా దీపం వెలిగించు అని చెబుతారు.
ఆ మాటకే సంతోషంగా చేతులెత్తి నమస్కరిస్తారు. నువ్వు ఎప్పటికైనా రుణపడి ఉండాల్సి వస్తే అది ఆ కుటుంబానికే..
ఎప్పుడూ ఆ కుటుంబం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రాఘవేంద్ర అని చెబుతారు.
తప్పకుండా గురువుగారు అని సాయంత్రం హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. అది ఒక వేడుకలాగా వాళ్ళు చేస్తూ ఉంటే... రామచంద్రయ్య గారి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.
జితేంద్ర రామచంద్రయ్య గారి దగ్గరకు వచ్చి మా ఇంటిలో ఆడపిల్లలు లేక ఆ ఆడపిల్ల అందం ఇన్ని రోజులకి కనిపించేటప్పటికీ మా వాళ్ళ ఆగలేకపోతున్నారు అని కవర్ చేస్తాడు.
అవునా అని చెప్పి ఇంకా అందరూ ఆ విషయం పట్టించుకోవడం మానేస్తారు. సాయంత్రం దీపాలు పెట్టే వేళ అయిన తర్వాత మళ్లీ అందరూ రెడీ అయి వస్తారు.
అప్పుడే మళ్ళీ శాంభవి మళ్లీ రెడీ అయి బిస్కెట్ కలర్ పట్టు పరికిణికి, మెరూన్ కలర్ వోని వేసుకుని...చంద్రహారం, కాసులపేరు, పచ్చల నక్లీస్ పెట్టుకుని ఉంటుంది.
రెండు చేతులకి వంకీలు పెడతారు. చేతినిండా గాజులు వేస్తారు. నుదుటిన పాపడి చైన్, నడుముకి వడ్డాణం, సారీ చైన్, కాళ్ళకి పట్టిలు తో మొత్తం అలంకరించేస్తారు.
శాంభవి ఇబ్బందిగా చారు ని చూస్తూ ఎందుకు అంటీ మరి ఇలా పెట్టేశారు అంటే... అరే ఆడపిల్ల అలా అనకూడదు ఎంత బాగా రెడీ అవుతే ఇంటికి అంత లక్ష్మి కళ.
ఏంత ముద్దుగా ఉన్నావో అని రెండు చేతులతో మెటికలు విరిచి దిష్టి చుక్క పెడుతుంది. బుట్ట బొమ్మ లాగా ఉన్నవు. పద వెళదాము అని చెప్పి తీసుకుని బయటికి వస్తుంది.
గురువుగారు పూజ గది అంతా ప్రక్షాళన చేసి పూజకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి శాంభవితో పూజ చేపిస్తారు.
పూజ చేపించి శాంభవితో దీపం పెట్టిస్తారు.
ఆ దీపపు వెలుగులో బృందావనం అంతా వెలిగిపోతూ ఉంటుంది. పూజ అయిన తర్వాత లలితాదేవి హోమం మొదలుపెడతారు.
శాంభవి హోమం దగ్గర కూర్చొగానే రుద్రను కూడా పిలిచి శాంభవి పక్కన కూర్చోమని ఇద్దరు చేత హోమం చేపిస్తారు.
శాంభవి ఫ్యామిలీకి మాత్రం అంతా గందరగోళంగా అనిపిస్తుంది. విష్ణుకు మాత్రం అది నచ్చదు. శాంభవి పక్కన తన కొడుకుని ఊహించుకుంటూ ఉంటే....
రుద్ర తో హోమం చేపించడం ఎందుకో మనసుకి కష్టంగా అనిపిస్తుంది. ఎక్కడినుండో వచ్చి శాంభవి తో హోమం చేపిస్తున్నారు అని సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.
హోమం పూర్తయిన తరువాత అందర్నీ దీవించి రామచంద్రయ్య గారి వైపు తిరిగి మీ మనవరాలకి కళ్యాణ ఘడియలు దగ్గరికి వచ్చేసాయి.
తనని ప్రాణంగా చూసుకునే కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. తన మనస్సు లో మెదిలే ఆలోచనని తనకంటే ముందే పసిగెట్టే వ్యక్తి తనకు భర్తగా వస్తాడు.
మీ దగ్గర ఎంత సంతోషంగా, స్వేచ్చగా ఉందో ఆ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. శుభం భూయాత్ అని దీవించి రాఘవేంద్ర ఇంక మేము బయలుదేరుతాము.
వచ్చిన పని అయిపోయింది అని చెప్పి మరలా శ్రీశైలం వెళ్ళిపోతారు. ఆ మాటలకి బృందావనం అంతా సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది.
కానీ శివ గారు, భాను గారికి చాలా బెంగగా అనిపించి శాంభవిని రెండు పక్కల నుంచి పట్టుకుని శాంభవి వైపే చూస్తూ ఉంటారు.
ధరణి జయంతి కి మాత్రం గురువుగారు చెప్పిన మాటలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తన కూతురు మెట్టినింట కూడా అలాగే సంతోషాలతో ఉంటుంది అంటే ఏ తల్లి కైనా ఆనందమే కదా...
వాళ్ళిద్దరూ సంతోషంగా భర్తల వైపు చూస్తే చాలా బెంగగా కనిపిస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని దగ్గరికి వెళ్లి ఏమైందండీ అని అడుగుతారు.
అప్పుడే శాంభవికి పెళ్లి ఏంటి... మా చిట్టి తల్లి కి లోకజ్ఞానం తెలియదు. అది ఇంకా చిన్న పిల్ల అని శాంభవిని ఇంకా గట్టిగా పట్టుకుంటారు.
ఆ మాటకే అక్క చెల్లెలు ఇద్దరు నోరు వదిలేసి చూస్తారు. వీళ్ళ వెనక ఉన్న రుద్రకి ఆ మాటలు విని గట్టిగా పొలమారుతుంది.
ధీరజ్ వెంటనే మంచినీళ్లు ఇచ్చి ఎందుకు బావ అంత గట్టిగా పోలమారింది అని తలపై కొడుతూ ఉంటాడు. ఏమీ లేదు బామ్మర్ది నా ఫ్యూచర్ కనపడింది అని చెప్పి వాటర్ తాగుతూ ఆ తండ్రి కూతుర్ని చూస్తూ ఉంటాడు.
ధరణి కోపంగా భర్త వంక చూస్తూ మన పెళ్లి అప్పటికి నా వయసెంత... మళ్ళి మనది లవ్ మ్యారేజ్ అని రుసరసలాడుతుంది.
నువ్వు నా కూతురు ఒక్కటేనా... అని అడిగితే అంటే మీ ఉద్దేశం ఏమిటి? అని అడుగుతుంది. నా ఉద్దేశం ఏమీ లేదు...పద బంగారం భోం చేద్దాం అని కూతురిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు.
చూసావా అక్క వీళ్ళిద్దరి ఎలా తయారయ్యారో..అసలు దానికి రేపు పెళ్లి అయితే వచ్చే అల్లుడు మీద మనం జాలిపడాలి అక్క అనగానే...
దానికి జయంతి అది నిజమే లే ధరణి... శోభనపు గదిలో కూతురు ఎక్కడ నలిగిపోతుందా అని గదిలో కూడా పంపించేటట్లు లేరు బాబులిద్దరూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
వీళ్ళ వెనక ఉండి ఈ మాటలు విన్న రుద్ర, ధీరజ్ మాత్రం నోరు వదిలేసి మరి చూస్తారు. ధీరజ్ తేరుకుని రుద్రను చూసి గట్టిగా నవ్వుతాడు.
బావ నీకు ఎంత కష్టం వచ్చింది. శత్రువులు నీకు ఎక్కడో లేరు బావ... నీ మామ లు, బావల రూపంలోనే ఉన్నట్టున్నారు అని నవ్వుతాడు.
నువ్వు ఆగారా అని ధీరజ్ వెనకాల పరిగెడితే... నేను ఆగను బావోయ్...ఆగితే నీ చేతిలో నా పని అయిపోతుందని చెప్పి వెళ్లి జితేంద్ర పక్కన సెటిల్ అవుతాడు.
రుద్ర ఇంకా ఏమీ చేయలేక వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాడు అందరికీ భోజనాలు వడ్డిస్తారు శాంభవి మాత్రం శివ గారు భాను గారు మధ్యలో కూర్చుని భోంచేస్తూ ఉంటుంది.
భోజనాలు అయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు శాంభవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ చారునే హెల్ప్ చేసి దిష్టి తీసి పడుకోబెట్టి బయటికి వస్తుంది.
బయటకు వచ్చిన చారులతని అనసూయ గారు పిలుస్తారు . ఏంటమ్మా అని అడిగితే ఒకసారి నాతో గదిలోకి రా అని లోపలికి తీసుకువెళ్లి....
తలుపులు వేసి చారులత చేతులు పట్టుకుని నాకు నిజం చెప్పు చారు. ఆ అమ్మాయి మన దేవేంద్ర కూతురా అని ఆత్రంగా అడుగుతారు.
అవ్వన్నీ నీకు ఎందుకు అమ్మ... రెస్ట్ తీసుకో అని చేతులు వెనెక్కి తీసుకుంటుంది. మన ఇంట్లో దీపం వెలిగగించింది.
అది చేయగలిగేది ఒక్క దేవేంద్ర కూతరు మాత్రమే అని నాకు తెలుసు.
నీ నోటి వెంట వినాలి అని చిన్న ఆశ అనగానే చారు వాళ్ళ అమ్మ వంక చూస్తూ నీకు నిజం తెలిసింది కదా. శాంభావి కి ఆ మయూరి తో కలిసి ఎలాంటి హాని తలపెట్టకు.
ఈసారి నా కొడుకు ఊరుకోడు అని గట్టిగా చెబుతారు.
ఆ మాటలకి అనసూయ సమాదానం ఏమిటి...
అది తెలియని చారులత, కౌసల్య టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి అందరిని బ్రేక్ ఫాస్ట్ కి పిలుస్తారు. దానికి ధరణి ఈరోజు మేము ఎవరిము తినమండి అని చెబుతారు.
దేనికి అంటే... సాయంత్రం హోమం ఉంది కదా హోమం దాకా అమ్మాయి ఏమీ తినదు. అందుకనే మేము ఎవరిము కూడా ఏమీ తినము అని చెబుతుంది.
ఓ అవునా మాకు ఆ విషయం తెలీదు కదా సరే అయితే అని చెప్పి పెదనాన్న గారిని పెద్దమ్మ గారి నాయనా పిలవండి అంటే...వాళ్ళు కూడా తినరు అని చెబుతుంది.
అందరూ ఉపవాసమే ఉంటారా అంటే... అవును సాయంత్రం హోమం అయ్యాకే భోజనం చేస్తాము అని చెబుతుంది.
సరేలెండి అని దేవేంద్ర వాళ్లని టిఫిన్ కి పిలుస్తారు. శివ గారు వాళ్ళు ఎవరూ రావడం లేదు ఏంటి అంటే ఈరోజు శాంభవి ఉపవాసంలో ఉంటుంది కదా అందుకే వాళ్ళు ఎవరు కూడా తినరు అన్నయ్య అంటే....
నా కూతురు ఉపవాసంలో ఉంటే నేను మాత్రం ఎలా తినగలను అని చెప్పి ఆయన కూడా వద్దు అని చెబుతారు.
ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ మానేస్తారు. అందరూ హోమం అయిన తర్వాత భోజనం చేద్దామని ఫిక్స్ అయిపోతారు.
రాఘవేంద్ర గారు కూడా నా మనవరాలు కోసం నేను ఉపవాసం ఉండలేనా అని ఆయన ఆగిపోతారు. సాయంత్రం హోమానికి సరిపడా అన్ని పనులు జరుగుతూఉంటాయి.
శ్రీశైలం నుంచి గురువుగారు కూడా వస్తారు. అయినా లోపలకి రావడంతోనే రాఘవేంద్ర గారు ఎదురు వెళ్లి నమస్కారం చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు.
గురువుకి చేయవలసిన అన్ని మర్యాదలు చేసి అందర్నీ పరిచయం చేసే శాంభవి ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తారు.
అందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి శాంభవిని దగ్గరికి పిలుస్తారు. శాంభవి భయం భయంగానే ఆయన ముందుకు వెళ్లి నిలబడుతుంది.
ఎందుకు తల్లి అంత భయపడుతున్నావు. నీకు ఆ తల్లి ఆశీర్వాదం నిండుగా ఉంది అని చెప్పి ఒక రుద్రాక్ష తీసి ఇది అమ్మాయి మెడలో వేయండి.
ఎటువంటి చెడు శక్తి అమ్మాయి వైపు చూడలేదు అని చెప్పి ఇస్తారు. రుద్రను కూడా పిలిచి ఇద్దరికీ ఒకేసారి ఆశీర్వాదం ఇస్తారు.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు... ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. బృందావనానికి మాత్రం ఆ ఆశీర్వాదం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
కానీ శాంభవి ఫ్యామిలీకి మాత్రం అయోమయంగా ఉంటుంది కానీ పైకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు.
శాంభవి కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూస్తూ ఉంటారు. గురువుగారు తన శిష్యులు వైపు తిరిగి ఈరోజు హోమం ఎటువంటి విఘ్నాలు రాకుండా జరగాలి.
ఆ ఏర్పాట్లు చూడండి.
రాఘవేంద్ర వైపు తిరిగి ఈరోజు నుంచి నీ కుటుంబానికి మంచి రోజులు వస్తున్నాయి. అమ్మాయి చేత పూజ గదిలో కూడా దీపం వెలిగించు అని చెబుతారు.
ఆ మాటకే సంతోషంగా చేతులెత్తి నమస్కరిస్తారు. నువ్వు ఎప్పటికైనా రుణపడి ఉండాల్సి వస్తే అది ఆ కుటుంబానికే..
ఎప్పుడూ ఆ కుటుంబం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రాఘవేంద్ర అని చెబుతారు.
తప్పకుండా గురువుగారు అని సాయంత్రం హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. అది ఒక వేడుకలాగా వాళ్ళు చేస్తూ ఉంటే... రామచంద్రయ్య గారి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.
జితేంద్ర రామచంద్రయ్య గారి దగ్గరకు వచ్చి మా ఇంటిలో ఆడపిల్లలు లేక ఆ ఆడపిల్ల అందం ఇన్ని రోజులకి కనిపించేటప్పటికీ మా వాళ్ళ ఆగలేకపోతున్నారు అని కవర్ చేస్తాడు.
అవునా అని చెప్పి ఇంకా అందరూ ఆ విషయం పట్టించుకోవడం మానేస్తారు. సాయంత్రం దీపాలు పెట్టే వేళ అయిన తర్వాత మళ్లీ అందరూ రెడీ అయి వస్తారు.
అప్పుడే మళ్ళీ శాంభవి మళ్లీ రెడీ అయి బిస్కెట్ కలర్ పట్టు పరికిణికి, మెరూన్ కలర్ వోని వేసుకుని...చంద్రహారం, కాసులపేరు, పచ్చల నక్లీస్ పెట్టుకుని ఉంటుంది.
రెండు చేతులకి వంకీలు పెడతారు. చేతినిండా గాజులు వేస్తారు. నుదుటిన పాపడి చైన్, నడుముకి వడ్డాణం, సారీ చైన్, కాళ్ళకి పట్టిలు తో మొత్తం అలంకరించేస్తారు.
శాంభవి ఇబ్బందిగా చారు ని చూస్తూ ఎందుకు అంటీ మరి ఇలా పెట్టేశారు అంటే... అరే ఆడపిల్ల అలా అనకూడదు ఎంత బాగా రెడీ అవుతే ఇంటికి అంత లక్ష్మి కళ.
ఏంత ముద్దుగా ఉన్నావో అని రెండు చేతులతో మెటికలు విరిచి దిష్టి చుక్క పెడుతుంది. బుట్ట బొమ్మ లాగా ఉన్నవు. పద వెళదాము అని చెప్పి తీసుకుని బయటికి వస్తుంది.
గురువుగారు పూజ గది అంతా ప్రక్షాళన చేసి పూజకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి శాంభవితో పూజ చేపిస్తారు.
పూజ చేపించి శాంభవితో దీపం పెట్టిస్తారు.
ఆ దీపపు వెలుగులో బృందావనం అంతా వెలిగిపోతూ ఉంటుంది. పూజ అయిన తర్వాత లలితాదేవి హోమం మొదలుపెడతారు.
శాంభవి హోమం దగ్గర కూర్చొగానే రుద్రను కూడా పిలిచి శాంభవి పక్కన కూర్చోమని ఇద్దరు చేత హోమం చేపిస్తారు.
శాంభవి ఫ్యామిలీకి మాత్రం అంతా గందరగోళంగా అనిపిస్తుంది. విష్ణుకు మాత్రం అది నచ్చదు. శాంభవి పక్కన తన కొడుకుని ఊహించుకుంటూ ఉంటే....
రుద్ర తో హోమం చేపించడం ఎందుకో మనసుకి కష్టంగా అనిపిస్తుంది. ఎక్కడినుండో వచ్చి శాంభవి తో హోమం చేపిస్తున్నారు అని సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.
హోమం పూర్తయిన తరువాత అందర్నీ దీవించి రామచంద్రయ్య గారి వైపు తిరిగి మీ మనవరాలకి కళ్యాణ ఘడియలు దగ్గరికి వచ్చేసాయి.
తనని ప్రాణంగా చూసుకునే కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. తన మనస్సు లో మెదిలే ఆలోచనని తనకంటే ముందే పసిగెట్టే వ్యక్తి తనకు భర్తగా వస్తాడు.
మీ దగ్గర ఎంత సంతోషంగా, స్వేచ్చగా ఉందో ఆ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. శుభం భూయాత్ అని దీవించి రాఘవేంద్ర ఇంక మేము బయలుదేరుతాము.
వచ్చిన పని అయిపోయింది అని చెప్పి మరలా శ్రీశైలం వెళ్ళిపోతారు. ఆ మాటలకి బృందావనం అంతా సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది.
కానీ శివ గారు, భాను గారికి చాలా బెంగగా అనిపించి శాంభవిని రెండు పక్కల నుంచి పట్టుకుని శాంభవి వైపే చూస్తూ ఉంటారు.
ధరణి జయంతి కి మాత్రం గురువుగారు చెప్పిన మాటలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తన కూతురు మెట్టినింట కూడా అలాగే సంతోషాలతో ఉంటుంది అంటే ఏ తల్లి కైనా ఆనందమే కదా...
వాళ్ళిద్దరూ సంతోషంగా భర్తల వైపు చూస్తే చాలా బెంగగా కనిపిస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని దగ్గరికి వెళ్లి ఏమైందండీ అని అడుగుతారు.
అప్పుడే శాంభవికి పెళ్లి ఏంటి... మా చిట్టి తల్లి కి లోకజ్ఞానం తెలియదు. అది ఇంకా చిన్న పిల్ల అని శాంభవిని ఇంకా గట్టిగా పట్టుకుంటారు.
ఆ మాటకే అక్క చెల్లెలు ఇద్దరు నోరు వదిలేసి చూస్తారు. వీళ్ళ వెనక ఉన్న రుద్రకి ఆ మాటలు విని గట్టిగా పొలమారుతుంది.
ధీరజ్ వెంటనే మంచినీళ్లు ఇచ్చి ఎందుకు బావ అంత గట్టిగా పోలమారింది అని తలపై కొడుతూ ఉంటాడు. ఏమీ లేదు బామ్మర్ది నా ఫ్యూచర్ కనపడింది అని చెప్పి వాటర్ తాగుతూ ఆ తండ్రి కూతుర్ని చూస్తూ ఉంటాడు.
ధరణి కోపంగా భర్త వంక చూస్తూ మన పెళ్లి అప్పటికి నా వయసెంత... మళ్ళి మనది లవ్ మ్యారేజ్ అని రుసరసలాడుతుంది.
నువ్వు నా కూతురు ఒక్కటేనా... అని అడిగితే అంటే మీ ఉద్దేశం ఏమిటి? అని అడుగుతుంది. నా ఉద్దేశం ఏమీ లేదు...పద బంగారం భోం చేద్దాం అని కూతురిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు.
చూసావా అక్క వీళ్ళిద్దరి ఎలా తయారయ్యారో..అసలు దానికి రేపు పెళ్లి అయితే వచ్చే అల్లుడు మీద మనం జాలిపడాలి అక్క అనగానే...
దానికి జయంతి అది నిజమే లే ధరణి... శోభనపు గదిలో కూతురు ఎక్కడ నలిగిపోతుందా అని గదిలో కూడా పంపించేటట్లు లేరు బాబులిద్దరూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
వీళ్ళ వెనక ఉండి ఈ మాటలు విన్న రుద్ర, ధీరజ్ మాత్రం నోరు వదిలేసి మరి చూస్తారు. ధీరజ్ తేరుకుని రుద్రను చూసి గట్టిగా నవ్వుతాడు.
బావ నీకు ఎంత కష్టం వచ్చింది. శత్రువులు నీకు ఎక్కడో లేరు బావ... నీ మామ లు, బావల రూపంలోనే ఉన్నట్టున్నారు అని నవ్వుతాడు.
నువ్వు ఆగారా అని ధీరజ్ వెనకాల పరిగెడితే... నేను ఆగను బావోయ్...ఆగితే నీ చేతిలో నా పని అయిపోతుందని చెప్పి వెళ్లి జితేంద్ర పక్కన సెటిల్ అవుతాడు.
రుద్ర ఇంకా ఏమీ చేయలేక వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాడు అందరికీ భోజనాలు వడ్డిస్తారు శాంభవి మాత్రం శివ గారు భాను గారు మధ్యలో కూర్చుని భోంచేస్తూ ఉంటుంది.
భోజనాలు అయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు శాంభవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ చారునే హెల్ప్ చేసి దిష్టి తీసి పడుకోబెట్టి బయటికి వస్తుంది.
బయటకు వచ్చిన చారులతని అనసూయ గారు పిలుస్తారు . ఏంటమ్మా అని అడిగితే ఒకసారి నాతో గదిలోకి రా అని లోపలికి తీసుకువెళ్లి....
తలుపులు వేసి చారులత చేతులు పట్టుకుని నాకు నిజం చెప్పు చారు. ఆ అమ్మాయి మన దేవేంద్ర కూతురా అని ఆత్రంగా అడుగుతారు.
అవ్వన్నీ నీకు ఎందుకు అమ్మ... రెస్ట్ తీసుకో అని చేతులు వెనెక్కి తీసుకుంటుంది. మన ఇంట్లో దీపం వెలిగగించింది.
అది చేయగలిగేది ఒక్క దేవేంద్ర కూతరు మాత్రమే అని నాకు తెలుసు.
నీ నోటి వెంట వినాలి అని చిన్న ఆశ అనగానే చారు వాళ్ళ అమ్మ వంక చూస్తూ నీకు నిజం తెలిసింది కదా. శాంభావి కి ఆ మయూరి తో కలిసి ఎలాంటి హాని తలపెట్టకు.
ఈసారి నా కొడుకు ఊరుకోడు అని గట్టిగా చెబుతారు.
ఆ మాటలకి అనసూయ సమాదానం ఏమిటి...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)