28-03-2026, 08:30 AM
Part - 31
అన్నయ్య కోసం నువ్వు ఇల్లరకం వెళ్లలేవా రుద్ర అని గడ్డం పట్టుకుని అడుగుతారు. సంతోష్ వస్తున్నా నవ్వుని పంటి కిందపెడతారు.
ఆ నవ్వుకి బుగ్గలు ఉబ్బుతూ ఉంటాయి. ఎందుకు నాన్న అంత కష్టంగా నవ్వుని ఆపుకుంటున్నారు. అయినా నువ్వేంటి అమ్మ ఎవరైనా కోడల్ని తెచ్చుకుంటారు.
నువ్వు ఏకంగా మీ అన్నయ్య కోసం నన్ను ఇల్లరికం పంపించడానికి రెడీ అయిపోయావు. పోని అది ఏమైనా ఇక్కడ అంటే వెళ్లి రేపల్లె లో.
ముందు మీరు ఒక పని చేయండి. వాళ్లతో ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇల్లరికం పంపించే ఆలోచన మైండ్ లో నుంచి తీసేయ్ అని రుసరసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు.
అప్పటిదాకా కష్టంగా నవ్వుని ఆపుకున్న సంతోష్ ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు. ఎందుకండి మీరు అలా నవ్వుతున్నారు అంటే... నీ కొడుకు పాట్లు చూడలేక .
అయినా నువ్వేంటి చారు ఎలా శాంభవి ని మన ఇంటికి తీసుకురావాలని ఆలోచించడం మానేసి ఇలా ఎలాగైనా పెళ్లి చేసేయాలని కంగారు పడుతున్నావు.
నువ్వు మరీ అంత టెన్షన్ పడకు ముందు రుద్ర చెప్పినట్టుగా ముందు ఆ వాళ్లతో ఫ్రెండ్షిప్స్ చెయ్. అది స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది ఆలోచించవచ్చు.
బాగా అలసిపోయావు పడుకో అని చెప్పి వెళ్లి పడుకుంటాడు. రోజులు అలా మెల్లిగా సాగుతూ ఉన్నాయి.
దేవేంద్ర గారికి శివ,భాను ప్రసాద్ గారితో మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది.. చారులత కౌసల్య కూడా ధరణి జయంతితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
విహాన్, అద్వైత్ కూడా లలిత్, చరణ్, స్వరూప్ తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీళ్ళతో ధీరజ్ కూడా కలుస్తూ ఉంటాడు.
రుద్ర మాత్రం వీళ్ళందర్నీ అబ్జర్వ్ చేస్తూ మయూరి బ్యాచ్ మీద ఒక లుక్ వేస్తా ఉంటాడు.
మయూరి పెట్టిన ఇన్ఫర్మర్ తెలుసుకున్న విషయం మొత్తం మయూరీకి చెబుతాడు. అందులో ఎక్కడా కూడా అనుమానించవలసిన విషయం ఏమీ ఉండదు.
శాంభవి వాళ్ళ ఫ్యామిలీకి కాలేజెస్ ఉండడం వల్ల బిజినెస్ పర్పస్ కోసం దేవేంద్ర కి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకుంటుంది.
రోజులు అలా ముందుకు వెళుతూ ఉండగా పౌర్ణమి దగ్గరికి వస్తుంది. ప్రతి పౌర్ణమికి శాంభవితో లలితా దేవి హోమం తప్పనిసరిగా జరిపిస్తూ ఉంటారు.
ఈసారి పౌర్ణమి కి శాంభవిని రేపల్లెకి తీసుకురావాలి అంటే తను స్టడీస్ పర్పస్ గా అక్కడ కంపెనీలో ఉండిపోతుంది. ఆ ఒక్క రోజుకి లీవ్ పెట్టి అయినా తీసుకురావాలి అని ఫిక్స్ అవుతారు.
ముందుగా విషయం దేవేంద్ర గారితో మాట్లాడాలి అని శివ గారు దేవేంద్ర కి ఫోన్ చేస్తారు. దేవేంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శివ ఏంటి విశేషాలు అంటే...
మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని ఇబ్బందిగా చెబుతారు. చెప్పండి ఏమిటి నా దగ్గర మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అనగానే...
ప్రతి పౌర్ణమి కి శాంభవితో లలితా దేవి హోమం చేయించాలి. అది శాంభవి ఆయుష్ కి, సౌభాగ్యానికి సంబంధించినది అని చెబుతారు.
అందుకే మీ పర్మిషన్ అడుగుదామని ఫోన్ చేశాను అని చెబుతాడు. దానికి ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు.
నేను ఏ విషయం అన్నది రుద్రని అడిగి చెబుతాను. ఆఫీసు లో వర్క్ మొత్తం పిల్లలే చూసుకుంటున్నారు. నేను ఎప్పుడైనా వెళ్లి చూస్తూ ఉంటాను.
ఒక్క శాంభవి టీం కి మాత్రమే నేను గైడ్ చేస్తున్నాను అని చెబుతారు. సరేనండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తారు.
రాఘవేంద్ర గారు జితేంద్ర, దేవేంద్ర వంక చూస్తూ ఏంటి శివ అడుగుతున్నాడు అంటే... వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెబుతాడు.
దానికి రాఘవేంద్ర గారు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది నాన్నగారు అంతా అలా ఆలోచిస్తున్నారు అంటే ఆ హోమం ఏదో మన ఇంట్లోనే జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.
అది ఎలా సాధ్యం దానికి శివ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకోవాలి కదా అని అంటాడు. అదే ఆలోచిస్తున్నాను అని నేను ఇప్పుడే గురువుగారికి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకొని శ్రీశైలం ఫోన్ చేస్తాడు.
ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడు ఫోన్ తీసుకుని వెళ్లి గురువు గారికి ఇచ్చి రాఘవేంద్ర గారి దగ్గరి నుంచి అని ఇస్తాడు.
దానికి గురువుగారు చిరునవ్వుతో చెప్పు రాఘవేంద్ర ఎందుకు అంత ఆలోచనలో ఉన్నావు అంటే.. నేనేమీ చెప్పకుండానే మీకు ఎలా తెలిసింది అంటే...
మనవరాల గురించే కదా ఈ పౌర్ణమికి నేనే దగ్గర ఉండి హోమం చేపిస్తాను. నీ మనవరాలు నీ ఇంట అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.
ఆ తల్లి కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతుంది. మేము పౌర్ణమి కి అక్కడికి చేరుకుంటాము అని చెబుతారు. సంతోషం గురువుగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి కొడుకు వైపు చూసి ఆరోజు హోమం మన ఇంట్లోనే జరుగుతుంది.
గురువుగారు స్వయంగా వస్తున్నారు అని ఆనందంగా చెబుతారు. అయితే ఇప్పుడు ఎలాగా వీళ్ళని ఒప్పించాలి అంటే ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళు సలహా కూడా తీసుకుందాము అని మనవలకి కాల్ చేసి రమ్మని చెబుతారు.
అలాగే చారుకు కూడా ఫోన్ చేసి రమ్మంటారు. ఏంటి ఇంత సడన్గా అందరిని రమ్మన్నారు అని అందరూ వస్తారు. రుద్ర ఏంటి తాతయ్య అంత సంతోషంగా ఉన్నారు మమ్మల్ని అందరినీ రమ్మన్నారు అని అడుగుతాడు.
దానికి రాఘవేంద్ర గారు సంతోషంగా నా మనవరాలు మన ఇంటికి వచ్చే టైం వచ్చేసింది అని జరిగిందంతా చెబుతారు. అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తారు.
దానికి రుద్ర ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది ప్రాజెక్ట్ వర్క్ మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి అసలు కుదరదు అని చెప్పండి.
ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కంపెనీ రూల్స్ ప్రకారం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వదు కాబట్టి హోమం మనం ఇక్కడే చేద్దాము అని ఒప్పించండి అని చెబుతాడు.
ఈ ఆలోచన ఏదో బాగుంది అని వెంటనే శివ గారికి ఫోన్ చేస్తాడు. దేవేంద్ర ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న శివ గారు వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి దేవేంద్ర అనగానే...
రుద్ర చెప్పినట్టే గానే మొత్తం చెబుతాడు.ఇప్పుడు ఎలా అనే డల్ అవుతారు. మీరు ఏమీ అనుకోను అంటే శాంభవి తో హోమం మా ఇంట్లో చేపిద్దాము.
మీ ఇంటికి మా ఇంటికి కలిపి తను ఒక్కర్తె ఆడపిల్ల. మా ఇంటి ఆడపిల్లగానే అనుకునే మేము అడుగుతున్నాము. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇక్కడ పురమాయిస్తాను అని చెబుతాడు.
కానీ శివ గారు ఏమంటారు అన్న టెన్షన్ లోనే ఉంటారు. ఒకసారి నేను నాన్నగారితో, నానమ్మతో మాట్లాడి మీకు ఏ విషయం చెబుతాను అని ఫోన్ పెట్టేస్తారు.
రామచంద్రయ్య గారు ఏమైంది శివ అని అడిగితే దేవేంద్ర గారు చెప్పిన విషయం మొత్తం చెబుతాడు.
దానికి శకుంతల గారు ఆలోచిస్తూ ఎక్కడ జరిగిన శాంభవి చేతుల మీద గానే కదా జరుగుతుంది. పురమాయించండి పర్వాలేదు అని చెబుతారు.
అలాగే అని చెప్పి దేవేంద్ర కి ఫోన్ చేసి అక్కడే పురమాయించుదాము అని చెబుతాడు. దానికి బృందావనం అంతా చాలా సంతోషంతో ఉంటుంది.
మేమే అన్ని ఏర్పాట్లు చేస్తాము అమ్మాయిని తీసుకురండి సరిపోతుంది అని ఫోన్ పెట్టేస్తారు. రాఘవేంద్ర గారి సంతోషంగా కొడుకులతో ఇల్లంతా రంగులు వేయించండి.
కూతురు, కోడలతో చెబుతారు శాంభవి కి కావాల్సిన ప్రతి అవసరాన్ని చూడండి. అలాగే ఆరోజు నా మనవరాలు పెట్టుకోవడానికి ఏడు వారాల నగలు తెప్పించండి అని సంతోషంతో చెబుతారు.
దానికి చారులత నాన్నగారు మీరు అంత ఆవేశపడకండి. అన్నయ్య ఎప్పుడో శాంభవిగా కావాల్సిన ప్రతి వస్తువు తెప్పించేసాడు.
మనం ఆ రోజుకు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది అని... మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను కోప్పడకండి అంటే...
నేను చాలా సంతోషంగా ఉన్నాను పర్వాలేదు అడుగు చారు అంటే.. మరి అమ్మకి ఈ విషయం చెబుతారా అని అడుగుతుంది.
చారు అని గట్టిగా అరుస్తారు. కోప్పడకండి నాన్న అమ్మ సెపరేట్ గా ఉంటే వాళ్ళు అనుమానంగా అడుగుతారు కదా.. ఎందుకు అలాగా ఉన్నారని అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి.
మన ఇంటి గుట్టు మనమే ఎందుకు బయట పెట్టాలి అని అడుగుతుంది. ఈ వంకనైనా అనసూయ ని క్షమిస్తారేమో అని చిన్న ఆశతో కౌసల్య, చారు లత చూస్తూ ఉంటారు.
ఆ మాటలకి ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు ఆలోచించి మనకు బాగా కావాల్సిన వాళ్ళతో ఇక్కడ హోమం చేపిస్తున్నామని మాత్రమే చెప్పు.
ఆరోజు మాకు నచ్చకపోయినా మా పక్కనే ఉండాలి అని చెప్పు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలియనివ్వద్దు అని అక్కడి నుండి వెళ్లిపోతారు.
దేవేంద్ర కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హమ్మయ్య ఒక గండం గడిచింది అని ఊపిరి తీసుకుంటారు. అనసూయ గారికి ఈ విషయాలు గురించి ఏమీ తెలియదు కదా... ఆవిడ ఎప్పుడు గదిలోనే ఉంటారు.
అమ్మ అన్న పిలుపుకి అనసూయ గారు తల పైకెత్తి చూస్తారు. అక్కడ చారులత, కౌసల్య కనిపిస్తారు. వాళ్ళిద్దరూ వంక అనుమానంగా చూస్తూ చెప్పు చారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది.
దానికి చారులత వెళ్లి అనసూయ పక్కన కూర్చుని నీకు ఒక విషయం చెప్పాలి అమ్మ అని... రాఘవేంద్ర గారు ఎలాగైతే చెప్పమన్నారు అలాగే చెబుతుంది.
ఎవరు అంత ముఖ్యమైన వాళ్ళు అని అడుగుతారు. దానికి చారులత అది అన్నయ్య బిజినెస్ మీటింగ్లో పరిచయమయ్యారు బాగా క్లోజ్ అయ్యారు.
ఒక రకంగా చెప్పాలి అంటే మన ఫ్యామిలీ లాగా నే. అందుకనే నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెబుతుంది.
దానికి అనసూయ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే...ఏమీ లేదు మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని కూతురు వైపు, కోడలు వైపు చూసి అడుగుతారు.
దానికి చారులత, కౌసల్య సమాధానం ఏమిటి...
ఆ నవ్వుకి బుగ్గలు ఉబ్బుతూ ఉంటాయి. ఎందుకు నాన్న అంత కష్టంగా నవ్వుని ఆపుకుంటున్నారు. అయినా నువ్వేంటి అమ్మ ఎవరైనా కోడల్ని తెచ్చుకుంటారు.
నువ్వు ఏకంగా మీ అన్నయ్య కోసం నన్ను ఇల్లరికం పంపించడానికి రెడీ అయిపోయావు. పోని అది ఏమైనా ఇక్కడ అంటే వెళ్లి రేపల్లె లో.
ముందు మీరు ఒక పని చేయండి. వాళ్లతో ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇల్లరికం పంపించే ఆలోచన మైండ్ లో నుంచి తీసేయ్ అని రుసరసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు.
అప్పటిదాకా కష్టంగా నవ్వుని ఆపుకున్న సంతోష్ ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు. ఎందుకండి మీరు అలా నవ్వుతున్నారు అంటే... నీ కొడుకు పాట్లు చూడలేక .
అయినా నువ్వేంటి చారు ఎలా శాంభవి ని మన ఇంటికి తీసుకురావాలని ఆలోచించడం మానేసి ఇలా ఎలాగైనా పెళ్లి చేసేయాలని కంగారు పడుతున్నావు.
నువ్వు మరీ అంత టెన్షన్ పడకు ముందు రుద్ర చెప్పినట్టుగా ముందు ఆ వాళ్లతో ఫ్రెండ్షిప్స్ చెయ్. అది స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది ఆలోచించవచ్చు.
బాగా అలసిపోయావు పడుకో అని చెప్పి వెళ్లి పడుకుంటాడు. రోజులు అలా మెల్లిగా సాగుతూ ఉన్నాయి.
దేవేంద్ర గారికి శివ,భాను ప్రసాద్ గారితో మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది.. చారులత కౌసల్య కూడా ధరణి జయంతితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
విహాన్, అద్వైత్ కూడా లలిత్, చరణ్, స్వరూప్ తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీళ్ళతో ధీరజ్ కూడా కలుస్తూ ఉంటాడు.
రుద్ర మాత్రం వీళ్ళందర్నీ అబ్జర్వ్ చేస్తూ మయూరి బ్యాచ్ మీద ఒక లుక్ వేస్తా ఉంటాడు.
మయూరి పెట్టిన ఇన్ఫర్మర్ తెలుసుకున్న విషయం మొత్తం మయూరీకి చెబుతాడు. అందులో ఎక్కడా కూడా అనుమానించవలసిన విషయం ఏమీ ఉండదు.
శాంభవి వాళ్ళ ఫ్యామిలీకి కాలేజెస్ ఉండడం వల్ల బిజినెస్ పర్పస్ కోసం దేవేంద్ర కి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకుంటుంది.
రోజులు అలా ముందుకు వెళుతూ ఉండగా పౌర్ణమి దగ్గరికి వస్తుంది. ప్రతి పౌర్ణమికి శాంభవితో లలితా దేవి హోమం తప్పనిసరిగా జరిపిస్తూ ఉంటారు.
ఈసారి పౌర్ణమి కి శాంభవిని రేపల్లెకి తీసుకురావాలి అంటే తను స్టడీస్ పర్పస్ గా అక్కడ కంపెనీలో ఉండిపోతుంది. ఆ ఒక్క రోజుకి లీవ్ పెట్టి అయినా తీసుకురావాలి అని ఫిక్స్ అవుతారు.
ముందుగా విషయం దేవేంద్ర గారితో మాట్లాడాలి అని శివ గారు దేవేంద్ర కి ఫోన్ చేస్తారు. దేవేంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శివ ఏంటి విశేషాలు అంటే...
మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని ఇబ్బందిగా చెబుతారు. చెప్పండి ఏమిటి నా దగ్గర మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అనగానే...
ప్రతి పౌర్ణమి కి శాంభవితో లలితా దేవి హోమం చేయించాలి. అది శాంభవి ఆయుష్ కి, సౌభాగ్యానికి సంబంధించినది అని చెబుతారు.
అందుకే మీ పర్మిషన్ అడుగుదామని ఫోన్ చేశాను అని చెబుతాడు. దానికి ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు.
నేను ఏ విషయం అన్నది రుద్రని అడిగి చెబుతాను. ఆఫీసు లో వర్క్ మొత్తం పిల్లలే చూసుకుంటున్నారు. నేను ఎప్పుడైనా వెళ్లి చూస్తూ ఉంటాను.
ఒక్క శాంభవి టీం కి మాత్రమే నేను గైడ్ చేస్తున్నాను అని చెబుతారు. సరేనండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తారు.
రాఘవేంద్ర గారు జితేంద్ర, దేవేంద్ర వంక చూస్తూ ఏంటి శివ అడుగుతున్నాడు అంటే... వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెబుతాడు.
దానికి రాఘవేంద్ర గారు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది నాన్నగారు అంతా అలా ఆలోచిస్తున్నారు అంటే ఆ హోమం ఏదో మన ఇంట్లోనే జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.
అది ఎలా సాధ్యం దానికి శివ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకోవాలి కదా అని అంటాడు. అదే ఆలోచిస్తున్నాను అని నేను ఇప్పుడే గురువుగారికి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకొని శ్రీశైలం ఫోన్ చేస్తాడు.
ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడు ఫోన్ తీసుకుని వెళ్లి గురువు గారికి ఇచ్చి రాఘవేంద్ర గారి దగ్గరి నుంచి అని ఇస్తాడు.
దానికి గురువుగారు చిరునవ్వుతో చెప్పు రాఘవేంద్ర ఎందుకు అంత ఆలోచనలో ఉన్నావు అంటే.. నేనేమీ చెప్పకుండానే మీకు ఎలా తెలిసింది అంటే...
మనవరాల గురించే కదా ఈ పౌర్ణమికి నేనే దగ్గర ఉండి హోమం చేపిస్తాను. నీ మనవరాలు నీ ఇంట అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.
ఆ తల్లి కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతుంది. మేము పౌర్ణమి కి అక్కడికి చేరుకుంటాము అని చెబుతారు. సంతోషం గురువుగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి కొడుకు వైపు చూసి ఆరోజు హోమం మన ఇంట్లోనే జరుగుతుంది.
గురువుగారు స్వయంగా వస్తున్నారు అని ఆనందంగా చెబుతారు. అయితే ఇప్పుడు ఎలాగా వీళ్ళని ఒప్పించాలి అంటే ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళు సలహా కూడా తీసుకుందాము అని మనవలకి కాల్ చేసి రమ్మని చెబుతారు.
అలాగే చారుకు కూడా ఫోన్ చేసి రమ్మంటారు. ఏంటి ఇంత సడన్గా అందరిని రమ్మన్నారు అని అందరూ వస్తారు. రుద్ర ఏంటి తాతయ్య అంత సంతోషంగా ఉన్నారు మమ్మల్ని అందరినీ రమ్మన్నారు అని అడుగుతాడు.
దానికి రాఘవేంద్ర గారు సంతోషంగా నా మనవరాలు మన ఇంటికి వచ్చే టైం వచ్చేసింది అని జరిగిందంతా చెబుతారు. అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తారు.
దానికి రుద్ర ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది ప్రాజెక్ట్ వర్క్ మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి అసలు కుదరదు అని చెప్పండి.
ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కంపెనీ రూల్స్ ప్రకారం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వదు కాబట్టి హోమం మనం ఇక్కడే చేద్దాము అని ఒప్పించండి అని చెబుతాడు.
ఈ ఆలోచన ఏదో బాగుంది అని వెంటనే శివ గారికి ఫోన్ చేస్తాడు. దేవేంద్ర ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న శివ గారు వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి దేవేంద్ర అనగానే...
రుద్ర చెప్పినట్టే గానే మొత్తం చెబుతాడు.ఇప్పుడు ఎలా అనే డల్ అవుతారు. మీరు ఏమీ అనుకోను అంటే శాంభవి తో హోమం మా ఇంట్లో చేపిద్దాము.
మీ ఇంటికి మా ఇంటికి కలిపి తను ఒక్కర్తె ఆడపిల్ల. మా ఇంటి ఆడపిల్లగానే అనుకునే మేము అడుగుతున్నాము. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇక్కడ పురమాయిస్తాను అని చెబుతాడు.
కానీ శివ గారు ఏమంటారు అన్న టెన్షన్ లోనే ఉంటారు. ఒకసారి నేను నాన్నగారితో, నానమ్మతో మాట్లాడి మీకు ఏ విషయం చెబుతాను అని ఫోన్ పెట్టేస్తారు.
రామచంద్రయ్య గారు ఏమైంది శివ అని అడిగితే దేవేంద్ర గారు చెప్పిన విషయం మొత్తం చెబుతాడు.
దానికి శకుంతల గారు ఆలోచిస్తూ ఎక్కడ జరిగిన శాంభవి చేతుల మీద గానే కదా జరుగుతుంది. పురమాయించండి పర్వాలేదు అని చెబుతారు.
అలాగే అని చెప్పి దేవేంద్ర కి ఫోన్ చేసి అక్కడే పురమాయించుదాము అని చెబుతాడు. దానికి బృందావనం అంతా చాలా సంతోషంతో ఉంటుంది.
మేమే అన్ని ఏర్పాట్లు చేస్తాము అమ్మాయిని తీసుకురండి సరిపోతుంది అని ఫోన్ పెట్టేస్తారు. రాఘవేంద్ర గారి సంతోషంగా కొడుకులతో ఇల్లంతా రంగులు వేయించండి.
కూతురు, కోడలతో చెబుతారు శాంభవి కి కావాల్సిన ప్రతి అవసరాన్ని చూడండి. అలాగే ఆరోజు నా మనవరాలు పెట్టుకోవడానికి ఏడు వారాల నగలు తెప్పించండి అని సంతోషంతో చెబుతారు.
దానికి చారులత నాన్నగారు మీరు అంత ఆవేశపడకండి. అన్నయ్య ఎప్పుడో శాంభవిగా కావాల్సిన ప్రతి వస్తువు తెప్పించేసాడు.
మనం ఆ రోజుకు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది అని... మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను కోప్పడకండి అంటే...
నేను చాలా సంతోషంగా ఉన్నాను పర్వాలేదు అడుగు చారు అంటే.. మరి అమ్మకి ఈ విషయం చెబుతారా అని అడుగుతుంది.
చారు అని గట్టిగా అరుస్తారు. కోప్పడకండి నాన్న అమ్మ సెపరేట్ గా ఉంటే వాళ్ళు అనుమానంగా అడుగుతారు కదా.. ఎందుకు అలాగా ఉన్నారని అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి.
మన ఇంటి గుట్టు మనమే ఎందుకు బయట పెట్టాలి అని అడుగుతుంది. ఈ వంకనైనా అనసూయ ని క్షమిస్తారేమో అని చిన్న ఆశతో కౌసల్య, చారు లత చూస్తూ ఉంటారు.
ఆ మాటలకి ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు ఆలోచించి మనకు బాగా కావాల్సిన వాళ్ళతో ఇక్కడ హోమం చేపిస్తున్నామని మాత్రమే చెప్పు.
ఆరోజు మాకు నచ్చకపోయినా మా పక్కనే ఉండాలి అని చెప్పు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలియనివ్వద్దు అని అక్కడి నుండి వెళ్లిపోతారు.
దేవేంద్ర కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హమ్మయ్య ఒక గండం గడిచింది అని ఊపిరి తీసుకుంటారు. అనసూయ గారికి ఈ విషయాలు గురించి ఏమీ తెలియదు కదా... ఆవిడ ఎప్పుడు గదిలోనే ఉంటారు.
అమ్మ అన్న పిలుపుకి అనసూయ గారు తల పైకెత్తి చూస్తారు. అక్కడ చారులత, కౌసల్య కనిపిస్తారు. వాళ్ళిద్దరూ వంక అనుమానంగా చూస్తూ చెప్పు చారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది.
దానికి చారులత వెళ్లి అనసూయ పక్కన కూర్చుని నీకు ఒక విషయం చెప్పాలి అమ్మ అని... రాఘవేంద్ర గారు ఎలాగైతే చెప్పమన్నారు అలాగే చెబుతుంది.
ఎవరు అంత ముఖ్యమైన వాళ్ళు అని అడుగుతారు. దానికి చారులత అది అన్నయ్య బిజినెస్ మీటింగ్లో పరిచయమయ్యారు బాగా క్లోజ్ అయ్యారు.
ఒక రకంగా చెప్పాలి అంటే మన ఫ్యామిలీ లాగా నే. అందుకనే నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెబుతుంది.
దానికి అనసూయ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే...ఏమీ లేదు మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని కూతురు వైపు, కోడలు వైపు చూసి అడుగుతారు.
దానికి చారులత, కౌసల్య సమాధానం ఏమిటి...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)