26-03-2026, 07:09 AM
Part - 31 (చివరి భాగం)
యాగానికి అవసరమైన సామాగ్రి అంతా
యాగశాల వద్దకు చేర్చారు...
యాగశాల వద్ద ఆదిత్య, రుద్ర, గోవింద రావు మంజునాథ రావు, సత్యనారాయణ రావు మాత్రమే ఉన్నారు..
సింభిక యాగశాలకి దూరంగా నుంచుని ఉంది..
యాగం మొదలుపెట్టే ముందు గోవింద రావు మాట్లాడుతూ.. "మనం చేసేది సాధారణమైన యాగం కాదు. మహా శక్తివంతమైనది. అత్యంత కష్టతరమైనది.చేసే యాగం లో ఎటువంటి తప్పులు జరిగినా ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి..యాగం మొదలు పెట్టిన తరువాత మన ఏకాగ్రత మొత్తం యాగం మీదే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో యాగాన్ని మధ్యలో ఆపకూడదు..యాగం నిర్విఘ్నంగా పూర్తయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆదిత్య ఆ దుష్టశక్తి బారి నుండి బయట పడతాడు.."
"చూడు రుద్ర..!! నువ్వు యాగ పరిరక్షణ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవాలి.. యాగానికి ఎటువంటి విఘ్నం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే...!! ఎందుకంటే యాగం మొదలు పెట్టిన తర్వాత మా వైపు నుండి నీకు ఎటువంటి సహాయం నీకు అందదు...!! జాగ్రత్తగా ఉండు...!!"అని మిగిలిన వారి వైపు చూసి "ఇక యాగం ప్రారంభిద్దాం రండి...!!"అని అన్నారు..
హోమగుండం దగ్గర ప్రత్యంగిరా దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచారు...
హోమగుండం నాలుగు వైపున నలుగురు కూర్చున్నారు...
యాగం ప్రారంభం అయ్యింది...
హోమగుండం రగిల్చారు.. ముగ్గురు
వేద మంత్రాలతో యాగాన్ని జరిపిస్తున్నారు...
ఆదిత్య హోమగుండానికి నెయ్యి,వనమూలికలు, సమిధలు ఒక్కొక్కటిగా సమర్పిస్తున్నాడు...
రుద్ర మాత్రం యాగశాల చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నాడు...
కొంతసేపటి తర్వాత యాగశాల దగ్గర పద్మాసనం వేసుకుని, ధ్యానంలోకి వెళ్ళాడు...
సింభిక రుద్ర తో పాటే అక్కడే కూర్చుంది.కానీ ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో అని భయపడుతూనే ఉంది...
మరోవైపు నికుంబల యాగం మాత్రం నిర్విఘ్నంగా జరగసాగింది...
ఇంతలో మంజునాథ రావు ఇంటివద్ద.....!!
భాను ఒక్కతే ఇంట్లో ఉంది..
యాగం మొదలు పెట్టే గడియలు మొదలవ్వకముందే గుడికి వెళ్ళమని, ఇంట్లో ఉండొద్దని,గోవింద రావు,భాను కి చెప్పారు.. కానీ గుడికి బయలుదేరే ముందు, తన స్నేహితులు రావడంతో ఆలస్యం అయింది..కొంతసేపటికి వాళ్లు వెళ్లిపోవడంతో, వేగంగా తన ఇంటి నుంచి బయటకు వచ్చి, గుడికి బయలుదేరింది..
కొద్దిసేపట్లో గుడి దగ్గరకు చేరుకుంటుంది అనేలోగా..
అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది..
దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి..
భీకరమైన గాలులు వీస్తూ, పెద్ద వర్షం మొదలయ్యింది..
భాను వేగంగా ఆ వర్షంలో గుడి ప్రాంగణంలోకి వెళ్లబోతుండగా, ఆకస్మాత్తుగా ఎవరో గట్టిగా తన ముఖం పై కొట్టినట్టు దూరంగా ఎగిరి పడింది..
పడిన తరువాత తను ఇంక పైకి లేవలేదు.
సృహ తప్పిపోయింది... తన పడిన చోట పెద్ద సుడిగాలి లేచి భానుని ఎత్తుకుపోయింది...
ఆ సంఘటన చూసి, చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యపోయారు...
మరోపక్క యాగశాల వద్ద....
ధ్యానంలో ఉన్న రుద్ర ఒక్కసారిగా కళ్లు తెరిచి పైకి లేచాడు.. తన మనసెందుకో కీడు శంకించసాగింది..
ఉన్నట్టుండి రుద్ర అలా ఒక్కసారిగా పైకి లేవడంతో సింభిక కంగారు పడుతూ..."ఏమైంది రుద్ర...? ఏదైనా ప్రమాదమా..??"అని భయంగా అడిగింది..
రుద్ర గంభీరంగా సింభిక వైపు చూసి అవునన్నట్లుగా తల ఊపాడు..
వెనక్కి తిరిగి యాగశాల వైపు చూశాడు..
యాగం వేద మంత్రాలతో నిర్విఘ్నంగా జరుగుతోంది....
అప్పటికి సమయం మధ్యాహ్నం 1:00 దాటుతోంది..
ఇంకో మూడు గడియలు గడిస్తే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది..
రుద్ర అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొసాగాయి...
ఇక రుద్ర ఆలస్యం చేయకుండా, ఒక కర్ర తీసుకొని వేగంగా యాగశాల చుట్టూ వృత్తాకారంలో వలయాలు గీయసాగాడు...
రెండు అడుగుల వెడల్పు తేడాతో మూడు వృత్తాలు యాగశాల చుట్టూ గీసాడు..
రుద్ర చేస్తున్న పనిని గోవింద రావు దూరం నుంచి గమనించసాగారు... కానీ అదేమీ పట్టనట్టు యాగాన్ని జరిపించసాగారు..
ఆ వృత్తాల నుంచి బయటకు వస్తూ...!!
"సింభికా...!! చెప్పేది శ్రద్ధగా విను...!! ఇప్పుడు ఇక్కడ జరగబోయేది, యాగం జరిపిస్తున్న వారికి కనిపించడానికి వీల్లేదు..! నీ శక్తిని ఉపయోగించి ఈ మూడు వృత్తాలను రక్షణ వలయాలుగా మార్చు... ఒకవేళ ఈ రెండు వృత్తాలను చేదించి, ఆ దుష్టశక్తులు మూడో వలయం లోపలకి రావడానికి ప్రయత్నిస్తే.. వెంటనే వాళ్లందరినీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో...!! నా గురించి ఆలోచించవద్దు...!! "అని తను మూడు వలయాలు దాటి బయట రక్షణగా నుంచున్నాడు..
సింభిక రుద్ర చెప్పినట్టుగానే 3 వలయాలను శక్తి వలయాలుగా మార్చేసింది..
సింభిక మాయ వల్ల,బయట ఏం జరుగుతున్నా సరే,
లోపల ఉన్న వాళ్ళకి మామూలుగానే కనిపిస్తుంది...
ఆకాశం మొత్తం పూర్తిగా మేఘావృతమై పోయింది... మిట్టమధ్యాహ్నం కూడా అర్ధరాత్రి లాగా చీకటి గా మారిపోయింది.. గాలి కూడా ఉధృతంగా వీయడం మొదలు పెట్టింది..
జరగబోయే యుద్ధానికి నేను సిద్ధం అన్నట్లుగా రుద్ర ధైర్యంగా నుంచుని ఉన్నాడు...
నేను నీకు తోడుగా ఉంటాను అన్నట్టుగా అతని పక్కగా వచ్చి నుంచుంది సింభిక..
ఇంతలో ఒక్కసారిగా ఆకాశం పెద్దగా ఉరిమింది..
రుద్ర కొద్ది దూరంలో ఒక మెరుపు నేలను బలంగా తాకి, చిన్న పేలుడు సంభవించింది..
ఆ పేలుడు జరిగిన ప్రదేశం నుండి నేలని తోలుచుకుంటూ 2 రాకాసి శక్తులు బయటకు వచ్చాయి..
అవి పంచవక్రి అనుచరగణాలైన విర్కోర,విస్కర్ష.
ఆ యాగాన్ని ఆపడానికి అక్కడికి వచ్చాయి...
రుద్ర వాటిని చూడగానే తన నుంచొని ఉన్న చోటే నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుండిపోయాడు..
తను సింభిక వైపు చూసి ఏం చేయ్యాలో నీకు తెలుసు కదా..!! అన్నట్లుగా చూసి కళ్ళు మూసుకున్నాడు..
తన అరచేతులు ముందుకు చాపి గాలిలోకి చేతులు ఊపాడు..
రుద్ర అలా చెయ్యగానే నేలనుండి వెలుగు రేఖలు చిమ్ముతూ నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులాగా మారిపోయాయి..
ఆ రెండు రాకాసులు చూస్తూ ఉండగానే 2 రాక్షస జీవులు గా మారిపోయి, భీకరంగా అరుస్తూ రుద్ర వైపు దూసుకురాసాగాయి..
రుద్ర మాత్రం కళ్ళు మూసుకుని, మంత్ర పఠనం చేయసాగాడు..
అవి వేగంగా రుద్ర వైపు దూసుకు వస్తూ. అతనికి కొద్ది దూరంలో ఉన్న సింభిక చూసి వాటిలో ఒకటి దాని వైపు వెళ్లసాగింది...
అలా ఆ రెండు రాకాసులు చెరో వైపు నుండి దాడి చేయడానికి సిద్ధమయ్యాయి..
కానీ రుద్ర మాత్రం కదలకుండా అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోయాడు..
ఇక సింభిక అలా చూస్తూ ఉండలేక తన శక్తులతో దాడి ప్రారంభించింది...
వాటి పై బండ రాళ్ల వర్షం కురిపించింది..
ఆ దాడి వల్ల వాటి వేగం కొంచెం తగ్గింది తప్ప,
వాటికి ఏ మాత్రం గాయాలు తగలలేదు...
ఈసారి వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
రుద్ర ని వదిలేసి, సింభిక మీద దాడి చేయడం కోసం వేగంగా దానివైపు రాసాగాయి..
సింభిక కూడా ఆ రెండిటి పైకి తిరిగి దాడి మొదలు పెట్టింది.
కానీ అవి మాత్రం వాటికి ఏమీ అవ్వనట్లుగా వేగంగా వచ్చి,సింభిక మీదకు దూకాయి..
అలాగే దాని మీద పడబోయే లోపు, వాటిని ఏదో మెరుపులాంటి శక్తి వేగంగా ఢీకొట్టింది... దాని దెబ్బకి అవి దూరంగా ఎగిరి పడ్డాయి...
ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని,సింభిక చూడగా అప్పటివరకు కూర్చున్న చోట నుండి కదలనీ రుద్ర,
లేచి నుంచుని ఉన్నాడు..
అతని కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి...
తమ పైకి అలా మెరుపు దాడి జరగడంతో,
వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
తిరిగి పైకి లేచి రుద్ర పైకి రాబోతుండగా, రుద్ర తన నుంచున్న చోట నుండి చేతులు గాలిలోకి ఎత్తి ఏవో మంత్రాలు చదివాడు..
కారు మబ్బులు కమ్ముకొని ఉన్న ఆకాశం నుండి, ఒక పెద్ద మెరుపు వచ్చి నేలపై ఉన్న ఆ రాక్షసులను ఢీకొట్టింది..
ఆ దెబ్బకి అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించి, ఆ రెండు దూరంగా ఎగిరి పడ్డాయి... కొద్దిసేపటికి రుద్ర,సింభిక అక్కడికి వెళ్లి చూడగా అవి తీవ్రంగా గాయపడి ఉన్నాయి..
ప్రమాదం తప్పిందని వెనక్కి తిరిగి యాగం జరుగుతున్న చోటికి వచ్చారు...
అలా వచ్చి రాగానే రుద్ర ముందు
ఒక భయంకరమైన ప్రేలుడు సంభవించింది...
ఆ దాటికి రుద్ర సింభిక దూరంగా ఎగిరి పడ్డారు.
తన శక్తుల వల్ల సింభిక తప్పించుకోగలిగింది గాని,
రుద్ర మాత్రం ఆ ఆకస్మిక దాడి నుండి తప్పించుకోలేకపోయాడు..
కొద్దిసేపటికి సింభిక ఆ దాడి ప్రభావం నుండి తేరుకుంది.. వేగంగా రుద్ర దగ్గరకు వెళ్లగా,ఆ దాడి ఎక్కడినుంచి జరిగిందని చుట్టూ చూడగా ఎవరూ కనిపించలేదు..
సింభిక అనుమానంతో పైకి చూసింది...
గాలిలో ఆకాశంలోని మెరుపుల వెలుగులో
ఒక విచిత్రమైన రాకాసి ఎగురుతూ కనిపించింది..
సింభిక చూస్తూ ఉండగానే అది నేలపై దిగింది..
దాన్ని చూడగానే సింభికకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆలోచించకుండా దాని మీదకి దాడి మొదలుపెట్టింది...
గాలిలో నిప్పుల బంతులు సృష్టించి, దాని మీదకు విసిరింది...
అవి వేగంగా దానిని సమీపించి,తిరిగి సింభిక మీదకు వచ్చి పడ్డాయి.... ఆ దాడి నుండి కొద్దిలో తప్పించుకుంది... అప్పుడు అర్థమైంది సింభికకు వచ్చింది కరొముఖి అని...
ఈ హఠాత్ పరిణామానికి సింభిక బిత్తరపోయింది....
ఏం చెయ్యాలో అర్థం కాలేదు..
వేగంగా రుద్ర దగ్గరకు వెళ్ళింది...కానీ తను సృహాలో లేడు..
ఇంతలో కరొముఖి,సింభికను తన శక్తితో బంధించి,
తన ముందు నిలిపి,కోపంగా చూస్తూ, మింగేయడానికి భయంకరంగా నోరు తెరిచింది...
సింభిక తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది.
కరొముఖి పూర్తిగా తన నోరు తెరిచి,సింభికను మింగేయబోతూ, ఏదో అనుమానంతో పక్కకి చూసింది...
వేగంగా ఒక శక్తి వచ్చి, కరొముఖిని ఢీ కొట్టింది..
ఆ శక్తి దెబ్బకు దూరంగా ఎగిరి పడింది...
సింభిక తనను బంధించిన శక్తి వదిలేయడంతో నేలపై పడింది.. వేగంగా రుద్ర వైపు వెళ్ళసాగింది.
ఇంతలో ఆశక్తి దాడిలో గాయపడ్డ కరొముఖి వికృతంగా అరిచింది...
అలా అరవగానే దాని ముందు కొన్ని రాక్షస జీవులు ప్రత్యక్షమయ్యాయి..
వాటిని రుద్ర,సింభికల మీదకు ఉసిగొల్పింది...
అవి వేగంగా వాళ్ళ వైపు వెళ్ళసాగాయి..
సింభిక కూడా వాటి మీద దాడి చేస్తున్న సరే, వాటికి ఏమి కావటం లేదు..
ఇక భయంతో రుద్ర ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది...
అలా కళ్లు మూసుకుని ఉన్న సింభికకు దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి...
అనుమానం తో కళ్ళు తెరిచి చూడగానే.. మరో వైపు నుండి నల్లటి కుక్కలు వేగంగా రాకాసి జీవులు మీదకి దూకాయి...
ఆ కుక్కల మీద కోపంతో కరొముఖి వాటి మీదకి ఒక శక్తిని ప్రయోగించింది...
కానీ ఆ శక్తిని మరో శక్తి ఢీ కొట్టింది..
ఆ శక్తిని ప్రయోగించింది ఎవరు అని సింభిక వెనక్కి తిరిగి చూడగా అక్కడ మంత్రదండంతో దృఢంగా నుంచుని
సిద్ధ భైరవులు కనిపించారు..
తన శక్తిని అడ్డుకున్నందుకు ఆయన మీద కోపంతో మరో శక్తి ప్రయోగించ పోతుండగా,సిద్ధ భైరవులు దాని చుట్టూ శక్తిని ఆవాహన చేసి, మంత్ర బంధనం చేశారు..
ఇది ఇలా ఉండగా మరోవైపు యాగం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.. అసలు బయట ఏం జరుగుతుందో లోపల ఎవ్వరికీ తెలియదు...
సిద్ధ భైరవులు దానిని బంధించిన తరువాత వేగంగా రుద్ర వద్దకు చేరుకున్నారు....
అతను కరొముఖి దాడి వల్ల గాయపడ్డాడని అర్థం చేసుకున్నారు..
వెంటనే తన శక్తిని ఉపయోగించి రుద్ర గాయాలను మాన్పి,అతన్ని సృహా లోకి తెచ్చారు.
రుద్ర సృహా లోకి వచ్చాడు....
ఎదురుగుండా సిద్ధ భైరవులు కనిపించగానే ఆనందంతో "గురుదేవా..!! తమరు ఎప్పుడు వచ్చారు..?"అని అడిగాడు..
"నువ్వు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నావని తెలిసి వచ్చాను... ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం లేదు..కరొముఖితో ఇప్పుడు మనం పోరాడుతున్నాం.. దానిని మనం ఎంతో సేపు ఇలా బంధించి ఉంచలేము... యాగం జరిగే వరకు దానిని మనం ఆపగలిగితే చాలు..."అని సిద్ధ భైరవులు రుద్ర తో చెప్తూ ఉండగానే...
బంధించబడి ఉన్న కరొముఖి వికృతంగా అరిచింది..
అలా అరవడంతోనే దాన్ని పట్టి ఉంచిన బంధనాలు మాయమైపోయాయి...
అది అక్కడ నుంచి రుద్ర దాడిలో గాయపడ్డ,
విర్కోర,విస్కర్ష ల దగ్గరకు వెళ్లి తన శక్తితో వాటిని
కాపాడింది...
ఇప్పుడు అవి కూడా కరొముఖితో కలిసాయి..
వాటిని చూసిన తర్వాత జరగబోయేది ఏంటో
రుద్ర కి సిద్ధ భైరవులకి అర్థం అయింది..
సిద్ధ భైరవులు రుద్ర వైపు చూసి.." మనం వీటిని బంధించకపోతే ఏదో విధంగా యాగాన్ని నాశనం చేస్తాయి.. పంచవక్రీ ఇక్కడికి వచ్చే లోపు ఎలాగైనా సరే వీటిని బంధించాలి.."అని రుద్ర తో చెప్పి.."అయిదు విఘడియలు మా చుట్టూ రక్షణ రక్షణ వలయం ఏర్పాటు చేయగలవవా..??"అని సింభికను అడగగానే చేయగలను అన్నట్లుగా తలూపింది...
ఇక ఆలస్యం చేయకుండా రుద్ర సిద్ధ భైరవ లు ఇద్దరు నేలపై పద్మాసనం వేసుకొని మంత్ర పఠనం ప్రారంభించారు... సిద్ధ భైరవులు చెప్పినట్టుగానే తమ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసింది..
రక్షణ వలయం చూసిన వెంటనే కోపంతో మూడు రాకాసులు కలిసి, దానిపై తమ శక్తి తో దాడి చేయడం ప్రారంభించాయి...
అలా కొద్ది నిమిషాలు గడిచిన తరువాత రక్షణ వలయం నాశనమైపోతుంది అనే తరుణంలో మూడు రాకాసులు నుంచున్న చోట నుండి వెలుగులు రావడం మొదలైంది..
అవి నుంచున్న ప్రదేశం నుండి కదలలేకపోయాయి..
అవి ఎటూ కదల్లేక వికృతంగా అరవసాగాయి..
ఆ వెలుగులు కాస్త పెద్దవై,ఆ మూడింటిని ఏదో అగాధంలోకి లాగేసుకున్నాయి...
అలా పంచవక్రీ అనుచరగణాల కథ సమాప్తం అయ్యింది...
వాటి పీడ విరగడయినందుకు సంతోషించారు..
కొద్ది నిమిషాలలో యాగం పూర్తవుతుంది..
(నికుంబల యాగం చివరిలో అమ్మవారికి
ఎండు మిరపకాయలు హోమ గుండంలో సమర్పిస్తారు..)
పంచవక్రీ కోసం ముగ్గురు ఎదురు చూడసాగారు.
ఇంతలో రుద్ర కి కొంచెం దూరంలో ఎవరో నుంచోని కనిపించారు..
" ఎవరది..??" అని అడిగాడు రుద్ర..
ఆకారం రుద్ర కి కొంచెం దగ్గరగా వచ్చింది..
అక్కడ రుద్ర కి నవ్వుతూ భాను కనిపించింది..
రుద్ర ఆశ్చర్యపోయాడు..!!
"ఇక్కడికి ఎందుకు వచ్చావు భాను..??"అని అడుగుతూ ముందుకి వెళ్లబోతుండగా...
సిద్ధ భైరవులు "రుద్ర ఆగు..!" అని అరిచారు.
"ఏమైంది గురుదేవా..?"అని అనుమానంగా అడిగాడు రుద్ర..
ఇంతలో ఒక్కసారిగా భాను మొఖం ఒక రాకాసి లాగా మారిపోయింది.
తన నోరు తెరవగానే నాలిక వేగంగా రుద్ర మీదకి వచ్చింది...
ప్రమాదాన్ని గ్రహించిన సిద్ధ భైరవులు వెంటనే రుద్ర ని పక్కకి తోసేశారు..
రుద్ర కింద పడడంతో ఆ నాలిక అతనికి వెనకాల ఉన్న ఒక చెట్టు లోకి చోచ్చుకుపోయింది..
హఠాత్పరిణామానికి రుద్ర ఆశ్చర్యపోయాడు..
అందరూ చూస్తూ ఉండగానే భాను ఒక పెద్ద మహా పిశాచిలా గా మారిపోయింది..
" పంచవక్రి వచ్చేసింది...!!"అని సింభిక భయంతో అరిచింది...
ఇక వాళ్ళకి తెరుకునే అవకాశం ఇవ్వకుండా
పంచవక్రి వేగంగా వాళ్ళ పై ఒక్కసారిగా తన శక్తులతో విరుచుకుపడింది...
దాని శక్తి దాటికి రుద్ర, సిద్ధ భైరవులు, సింభిక తీవ్రంగా గాయపడ్డారు..
మరోవైపు యాగం పూర్తయ్యింది అనడానికి సూచనగా ఎండు మిరపకాయలు ఆదిత్య చేతుల మీదుగా హోమ గుండానికి సమర్పించబడ్డాయి....
యాగానికి రక్షణగా ఉన్న రక్షణ కవచాలు పై,
పంచవక్రి ఒక్కసారిగా దాడి చేసింది..
ఆ శక్తి దాటికి 3 రక్షణ కవచాలు నాశనం అయిపోయాయి..
ఆ రక్షణ కవచాలు నాశనమైపోగానే,
అక్కడి పరిస్థితికి ముగ్గురికి కనిపించింది...
పంచవక్రీ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ అతని మీదకి రాబోతుండగా.... ఆదిత్య వెంటనే తన చేతి నుండి ఒక శక్తి ని సృష్టించి, దాని మీదకి విసిరాడు.. ఆ ధాటికి అది కొద్ది దూరం ఎగిరి పడింది...
ఆదిత్య కోపంతో దాని మీదకి వెళ్ళసాగాడు..
అలా ముందుకు వెళ్తున్న ఆదిత్య చేతిలో ఒక మంత్రదండం ప్రత్యక్షమైంది...
దాని మీదకి మరో దాడి చేయబోతుండగా..
పంచవక్రీ, భాను గా మారిపోయింది..
ఆదిత్య తన దాడి చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు..
కానీ భాను శరీరంలో ఉన్న పంచవక్రీ మాత్రం ఆదిత్య మీదకి దాడి చేసింది..
ఇక ఆదిత్యకి భాను శరీరంలో అది ఉన్నంతసేపు తను ఏమీ చేయలేడు అని అర్థమయింది...
ఇక కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించి,
ఒక శక్తి ని భాను మీదకి విసిరాడు..
ఆ శక్తి భాను శరీరం నుండి పంచవక్రి ని వేరు చేసింది..
భాను శరీరంనుండి వేరుపడ్డ పంచవక్రి కోపంగా ఆదిత్య వైపు దూసుకుని వస్తుండగా....
ఒక్కసారిగా అక్కడ సింహగర్జన వినిపించింది...
ఆ గర్జన అడవి అంతా ప్రతిధ్వనించింది...
ఆకాశంలో కమ్ముకొని ఉన్న మబ్బులన్ని చెదిరిపోయాయి...
నిర్మలమైన ఆకాశం ప్రత్యక్షమైంది...
నేలపై సృహ తప్పి గాయాలతో పడి ఉన్న రుద్ర సిద్ధ భైరవులు సింబిక మామూలుగా మారిపోయి, పైకి లేచారు... భాను కూడా పైకి లేచింది..
పంచవక్రి ముందు సింహం మీద ఆసీనులై ఉన్న ప్రత్యంగిరా మాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు..
ఆ తల్లిని అలా చూడగానే అందరూ సాష్టాంగ పడి నమస్కారం చేశారు..
అమ్మవారిని అలా చూడగానే పంచవక్రీ గడగడా వణికిపోయింది..
అమ్మవారు తన కంటి చూపుతోనే దానిని నిలువునా బస్మం చేశారు... ఆ తరువాత అందరినీ ఆశీర్వదిస్తూ మాయమైపోయారు...
ఆ రోజుతో ఆదిత్య కి పట్టిన పంచవక్రీ పీడ విరగడ అయిపోయింది...
అందరూ ఆనందంగా ఇంటికి బయలుదేరారు...
కథ సమాప్తం....!!!
యాగశాల వద్దకు చేర్చారు...
యాగశాల వద్ద ఆదిత్య, రుద్ర, గోవింద రావు మంజునాథ రావు, సత్యనారాయణ రావు మాత్రమే ఉన్నారు..
సింభిక యాగశాలకి దూరంగా నుంచుని ఉంది..
యాగం మొదలుపెట్టే ముందు గోవింద రావు మాట్లాడుతూ.. "మనం చేసేది సాధారణమైన యాగం కాదు. మహా శక్తివంతమైనది. అత్యంత కష్టతరమైనది.చేసే యాగం లో ఎటువంటి తప్పులు జరిగినా ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి..యాగం మొదలు పెట్టిన తరువాత మన ఏకాగ్రత మొత్తం యాగం మీదే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో యాగాన్ని మధ్యలో ఆపకూడదు..యాగం నిర్విఘ్నంగా పూర్తయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆదిత్య ఆ దుష్టశక్తి బారి నుండి బయట పడతాడు.."
"చూడు రుద్ర..!! నువ్వు యాగ పరిరక్షణ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవాలి.. యాగానికి ఎటువంటి విఘ్నం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే...!! ఎందుకంటే యాగం మొదలు పెట్టిన తర్వాత మా వైపు నుండి నీకు ఎటువంటి సహాయం నీకు అందదు...!! జాగ్రత్తగా ఉండు...!!"అని మిగిలిన వారి వైపు చూసి "ఇక యాగం ప్రారంభిద్దాం రండి...!!"అని అన్నారు..
హోమగుండం దగ్గర ప్రత్యంగిరా దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచారు...
హోమగుండం నాలుగు వైపున నలుగురు కూర్చున్నారు...
యాగం ప్రారంభం అయ్యింది...
హోమగుండం రగిల్చారు.. ముగ్గురు
వేద మంత్రాలతో యాగాన్ని జరిపిస్తున్నారు...
ఆదిత్య హోమగుండానికి నెయ్యి,వనమూలికలు, సమిధలు ఒక్కొక్కటిగా సమర్పిస్తున్నాడు...
రుద్ర మాత్రం యాగశాల చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నాడు...
కొంతసేపటి తర్వాత యాగశాల దగ్గర పద్మాసనం వేసుకుని, ధ్యానంలోకి వెళ్ళాడు...
సింభిక రుద్ర తో పాటే అక్కడే కూర్చుంది.కానీ ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో అని భయపడుతూనే ఉంది...
మరోవైపు నికుంబల యాగం మాత్రం నిర్విఘ్నంగా జరగసాగింది...
ఇంతలో మంజునాథ రావు ఇంటివద్ద.....!!
భాను ఒక్కతే ఇంట్లో ఉంది..
యాగం మొదలు పెట్టే గడియలు మొదలవ్వకముందే గుడికి వెళ్ళమని, ఇంట్లో ఉండొద్దని,గోవింద రావు,భాను కి చెప్పారు.. కానీ గుడికి బయలుదేరే ముందు, తన స్నేహితులు రావడంతో ఆలస్యం అయింది..కొంతసేపటికి వాళ్లు వెళ్లిపోవడంతో, వేగంగా తన ఇంటి నుంచి బయటకు వచ్చి, గుడికి బయలుదేరింది..
కొద్దిసేపట్లో గుడి దగ్గరకు చేరుకుంటుంది అనేలోగా..
అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది..
దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి..
భీకరమైన గాలులు వీస్తూ, పెద్ద వర్షం మొదలయ్యింది..
భాను వేగంగా ఆ వర్షంలో గుడి ప్రాంగణంలోకి వెళ్లబోతుండగా, ఆకస్మాత్తుగా ఎవరో గట్టిగా తన ముఖం పై కొట్టినట్టు దూరంగా ఎగిరి పడింది..
పడిన తరువాత తను ఇంక పైకి లేవలేదు.
సృహ తప్పిపోయింది... తన పడిన చోట పెద్ద సుడిగాలి లేచి భానుని ఎత్తుకుపోయింది...
ఆ సంఘటన చూసి, చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యపోయారు...
మరోపక్క యాగశాల వద్ద....
ధ్యానంలో ఉన్న రుద్ర ఒక్కసారిగా కళ్లు తెరిచి పైకి లేచాడు.. తన మనసెందుకో కీడు శంకించసాగింది..
ఉన్నట్టుండి రుద్ర అలా ఒక్కసారిగా పైకి లేవడంతో సింభిక కంగారు పడుతూ..."ఏమైంది రుద్ర...? ఏదైనా ప్రమాదమా..??"అని భయంగా అడిగింది..
రుద్ర గంభీరంగా సింభిక వైపు చూసి అవునన్నట్లుగా తల ఊపాడు..
వెనక్కి తిరిగి యాగశాల వైపు చూశాడు..
యాగం వేద మంత్రాలతో నిర్విఘ్నంగా జరుగుతోంది....
అప్పటికి సమయం మధ్యాహ్నం 1:00 దాటుతోంది..
ఇంకో మూడు గడియలు గడిస్తే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది..
రుద్ర అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొసాగాయి...
ఇక రుద్ర ఆలస్యం చేయకుండా, ఒక కర్ర తీసుకొని వేగంగా యాగశాల చుట్టూ వృత్తాకారంలో వలయాలు గీయసాగాడు...
రెండు అడుగుల వెడల్పు తేడాతో మూడు వృత్తాలు యాగశాల చుట్టూ గీసాడు..
రుద్ర చేస్తున్న పనిని గోవింద రావు దూరం నుంచి గమనించసాగారు... కానీ అదేమీ పట్టనట్టు యాగాన్ని జరిపించసాగారు..
ఆ వృత్తాల నుంచి బయటకు వస్తూ...!!
"సింభికా...!! చెప్పేది శ్రద్ధగా విను...!! ఇప్పుడు ఇక్కడ జరగబోయేది, యాగం జరిపిస్తున్న వారికి కనిపించడానికి వీల్లేదు..! నీ శక్తిని ఉపయోగించి ఈ మూడు వృత్తాలను రక్షణ వలయాలుగా మార్చు... ఒకవేళ ఈ రెండు వృత్తాలను చేదించి, ఆ దుష్టశక్తులు మూడో వలయం లోపలకి రావడానికి ప్రయత్నిస్తే.. వెంటనే వాళ్లందరినీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో...!! నా గురించి ఆలోచించవద్దు...!! "అని తను మూడు వలయాలు దాటి బయట రక్షణగా నుంచున్నాడు..
సింభిక రుద్ర చెప్పినట్టుగానే 3 వలయాలను శక్తి వలయాలుగా మార్చేసింది..
సింభిక మాయ వల్ల,బయట ఏం జరుగుతున్నా సరే,
లోపల ఉన్న వాళ్ళకి మామూలుగానే కనిపిస్తుంది...
ఆకాశం మొత్తం పూర్తిగా మేఘావృతమై పోయింది... మిట్టమధ్యాహ్నం కూడా అర్ధరాత్రి లాగా చీకటి గా మారిపోయింది.. గాలి కూడా ఉధృతంగా వీయడం మొదలు పెట్టింది..
జరగబోయే యుద్ధానికి నేను సిద్ధం అన్నట్లుగా రుద్ర ధైర్యంగా నుంచుని ఉన్నాడు...
నేను నీకు తోడుగా ఉంటాను అన్నట్టుగా అతని పక్కగా వచ్చి నుంచుంది సింభిక..
ఇంతలో ఒక్కసారిగా ఆకాశం పెద్దగా ఉరిమింది..
రుద్ర కొద్ది దూరంలో ఒక మెరుపు నేలను బలంగా తాకి, చిన్న పేలుడు సంభవించింది..
ఆ పేలుడు జరిగిన ప్రదేశం నుండి నేలని తోలుచుకుంటూ 2 రాకాసి శక్తులు బయటకు వచ్చాయి..
అవి పంచవక్రి అనుచరగణాలైన విర్కోర,విస్కర్ష.
ఆ యాగాన్ని ఆపడానికి అక్కడికి వచ్చాయి...
రుద్ర వాటిని చూడగానే తన నుంచొని ఉన్న చోటే నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుండిపోయాడు..
తను సింభిక వైపు చూసి ఏం చేయ్యాలో నీకు తెలుసు కదా..!! అన్నట్లుగా చూసి కళ్ళు మూసుకున్నాడు..
తన అరచేతులు ముందుకు చాపి గాలిలోకి చేతులు ఊపాడు..
రుద్ర అలా చెయ్యగానే నేలనుండి వెలుగు రేఖలు చిమ్ముతూ నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులాగా మారిపోయాయి..
ఆ రెండు రాకాసులు చూస్తూ ఉండగానే 2 రాక్షస జీవులు గా మారిపోయి, భీకరంగా అరుస్తూ రుద్ర వైపు దూసుకురాసాగాయి..
రుద్ర మాత్రం కళ్ళు మూసుకుని, మంత్ర పఠనం చేయసాగాడు..
అవి వేగంగా రుద్ర వైపు దూసుకు వస్తూ. అతనికి కొద్ది దూరంలో ఉన్న సింభిక చూసి వాటిలో ఒకటి దాని వైపు వెళ్లసాగింది...
అలా ఆ రెండు రాకాసులు చెరో వైపు నుండి దాడి చేయడానికి సిద్ధమయ్యాయి..
కానీ రుద్ర మాత్రం కదలకుండా అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోయాడు..
ఇక సింభిక అలా చూస్తూ ఉండలేక తన శక్తులతో దాడి ప్రారంభించింది...
వాటి పై బండ రాళ్ల వర్షం కురిపించింది..
ఆ దాడి వల్ల వాటి వేగం కొంచెం తగ్గింది తప్ప,
వాటికి ఏ మాత్రం గాయాలు తగలలేదు...
ఈసారి వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
రుద్ర ని వదిలేసి, సింభిక మీద దాడి చేయడం కోసం వేగంగా దానివైపు రాసాగాయి..
సింభిక కూడా ఆ రెండిటి పైకి తిరిగి దాడి మొదలు పెట్టింది.
కానీ అవి మాత్రం వాటికి ఏమీ అవ్వనట్లుగా వేగంగా వచ్చి,సింభిక మీదకు దూకాయి..
అలాగే దాని మీద పడబోయే లోపు, వాటిని ఏదో మెరుపులాంటి శక్తి వేగంగా ఢీకొట్టింది... దాని దెబ్బకి అవి దూరంగా ఎగిరి పడ్డాయి...
ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని,సింభిక చూడగా అప్పటివరకు కూర్చున్న చోట నుండి కదలనీ రుద్ర,
లేచి నుంచుని ఉన్నాడు..
అతని కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి...
తమ పైకి అలా మెరుపు దాడి జరగడంతో,
వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
తిరిగి పైకి లేచి రుద్ర పైకి రాబోతుండగా, రుద్ర తన నుంచున్న చోట నుండి చేతులు గాలిలోకి ఎత్తి ఏవో మంత్రాలు చదివాడు..
కారు మబ్బులు కమ్ముకొని ఉన్న ఆకాశం నుండి, ఒక పెద్ద మెరుపు వచ్చి నేలపై ఉన్న ఆ రాక్షసులను ఢీకొట్టింది..
ఆ దెబ్బకి అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించి, ఆ రెండు దూరంగా ఎగిరి పడ్డాయి... కొద్దిసేపటికి రుద్ర,సింభిక అక్కడికి వెళ్లి చూడగా అవి తీవ్రంగా గాయపడి ఉన్నాయి..
ప్రమాదం తప్పిందని వెనక్కి తిరిగి యాగం జరుగుతున్న చోటికి వచ్చారు...
అలా వచ్చి రాగానే రుద్ర ముందు
ఒక భయంకరమైన ప్రేలుడు సంభవించింది...
ఆ దాటికి రుద్ర సింభిక దూరంగా ఎగిరి పడ్డారు.
తన శక్తుల వల్ల సింభిక తప్పించుకోగలిగింది గాని,
రుద్ర మాత్రం ఆ ఆకస్మిక దాడి నుండి తప్పించుకోలేకపోయాడు..
కొద్దిసేపటికి సింభిక ఆ దాడి ప్రభావం నుండి తేరుకుంది.. వేగంగా రుద్ర దగ్గరకు వెళ్లగా,ఆ దాడి ఎక్కడినుంచి జరిగిందని చుట్టూ చూడగా ఎవరూ కనిపించలేదు..
సింభిక అనుమానంతో పైకి చూసింది...
గాలిలో ఆకాశంలోని మెరుపుల వెలుగులో
ఒక విచిత్రమైన రాకాసి ఎగురుతూ కనిపించింది..
సింభిక చూస్తూ ఉండగానే అది నేలపై దిగింది..
దాన్ని చూడగానే సింభికకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆలోచించకుండా దాని మీదకి దాడి మొదలుపెట్టింది...
గాలిలో నిప్పుల బంతులు సృష్టించి, దాని మీదకు విసిరింది...
అవి వేగంగా దానిని సమీపించి,తిరిగి సింభిక మీదకు వచ్చి పడ్డాయి.... ఆ దాడి నుండి కొద్దిలో తప్పించుకుంది... అప్పుడు అర్థమైంది సింభికకు వచ్చింది కరొముఖి అని...
ఈ హఠాత్ పరిణామానికి సింభిక బిత్తరపోయింది....
ఏం చెయ్యాలో అర్థం కాలేదు..
వేగంగా రుద్ర దగ్గరకు వెళ్ళింది...కానీ తను సృహాలో లేడు..
ఇంతలో కరొముఖి,సింభికను తన శక్తితో బంధించి,
తన ముందు నిలిపి,కోపంగా చూస్తూ, మింగేయడానికి భయంకరంగా నోరు తెరిచింది...
సింభిక తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది.
కరొముఖి పూర్తిగా తన నోరు తెరిచి,సింభికను మింగేయబోతూ, ఏదో అనుమానంతో పక్కకి చూసింది...
వేగంగా ఒక శక్తి వచ్చి, కరొముఖిని ఢీ కొట్టింది..
ఆ శక్తి దెబ్బకు దూరంగా ఎగిరి పడింది...
సింభిక తనను బంధించిన శక్తి వదిలేయడంతో నేలపై పడింది.. వేగంగా రుద్ర వైపు వెళ్ళసాగింది.
ఇంతలో ఆశక్తి దాడిలో గాయపడ్డ కరొముఖి వికృతంగా అరిచింది...
అలా అరవగానే దాని ముందు కొన్ని రాక్షస జీవులు ప్రత్యక్షమయ్యాయి..
వాటిని రుద్ర,సింభికల మీదకు ఉసిగొల్పింది...
అవి వేగంగా వాళ్ళ వైపు వెళ్ళసాగాయి..
సింభిక కూడా వాటి మీద దాడి చేస్తున్న సరే, వాటికి ఏమి కావటం లేదు..
ఇక భయంతో రుద్ర ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది...
అలా కళ్లు మూసుకుని ఉన్న సింభికకు దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి...
అనుమానం తో కళ్ళు తెరిచి చూడగానే.. మరో వైపు నుండి నల్లటి కుక్కలు వేగంగా రాకాసి జీవులు మీదకి దూకాయి...
ఆ కుక్కల మీద కోపంతో కరొముఖి వాటి మీదకి ఒక శక్తిని ప్రయోగించింది...
కానీ ఆ శక్తిని మరో శక్తి ఢీ కొట్టింది..
ఆ శక్తిని ప్రయోగించింది ఎవరు అని సింభిక వెనక్కి తిరిగి చూడగా అక్కడ మంత్రదండంతో దృఢంగా నుంచుని
సిద్ధ భైరవులు కనిపించారు..
తన శక్తిని అడ్డుకున్నందుకు ఆయన మీద కోపంతో మరో శక్తి ప్రయోగించ పోతుండగా,సిద్ధ భైరవులు దాని చుట్టూ శక్తిని ఆవాహన చేసి, మంత్ర బంధనం చేశారు..
ఇది ఇలా ఉండగా మరోవైపు యాగం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.. అసలు బయట ఏం జరుగుతుందో లోపల ఎవ్వరికీ తెలియదు...
సిద్ధ భైరవులు దానిని బంధించిన తరువాత వేగంగా రుద్ర వద్దకు చేరుకున్నారు....
అతను కరొముఖి దాడి వల్ల గాయపడ్డాడని అర్థం చేసుకున్నారు..
వెంటనే తన శక్తిని ఉపయోగించి రుద్ర గాయాలను మాన్పి,అతన్ని సృహా లోకి తెచ్చారు.
రుద్ర సృహా లోకి వచ్చాడు....
ఎదురుగుండా సిద్ధ భైరవులు కనిపించగానే ఆనందంతో "గురుదేవా..!! తమరు ఎప్పుడు వచ్చారు..?"అని అడిగాడు..
"నువ్వు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నావని తెలిసి వచ్చాను... ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం లేదు..కరొముఖితో ఇప్పుడు మనం పోరాడుతున్నాం.. దానిని మనం ఎంతో సేపు ఇలా బంధించి ఉంచలేము... యాగం జరిగే వరకు దానిని మనం ఆపగలిగితే చాలు..."అని సిద్ధ భైరవులు రుద్ర తో చెప్తూ ఉండగానే...
బంధించబడి ఉన్న కరొముఖి వికృతంగా అరిచింది..
అలా అరవడంతోనే దాన్ని పట్టి ఉంచిన బంధనాలు మాయమైపోయాయి...
అది అక్కడ నుంచి రుద్ర దాడిలో గాయపడ్డ,
విర్కోర,విస్కర్ష ల దగ్గరకు వెళ్లి తన శక్తితో వాటిని
కాపాడింది...
ఇప్పుడు అవి కూడా కరొముఖితో కలిసాయి..
వాటిని చూసిన తర్వాత జరగబోయేది ఏంటో
రుద్ర కి సిద్ధ భైరవులకి అర్థం అయింది..
సిద్ధ భైరవులు రుద్ర వైపు చూసి.." మనం వీటిని బంధించకపోతే ఏదో విధంగా యాగాన్ని నాశనం చేస్తాయి.. పంచవక్రీ ఇక్కడికి వచ్చే లోపు ఎలాగైనా సరే వీటిని బంధించాలి.."అని రుద్ర తో చెప్పి.."అయిదు విఘడియలు మా చుట్టూ రక్షణ రక్షణ వలయం ఏర్పాటు చేయగలవవా..??"అని సింభికను అడగగానే చేయగలను అన్నట్లుగా తలూపింది...
ఇక ఆలస్యం చేయకుండా రుద్ర సిద్ధ భైరవ లు ఇద్దరు నేలపై పద్మాసనం వేసుకొని మంత్ర పఠనం ప్రారంభించారు... సిద్ధ భైరవులు చెప్పినట్టుగానే తమ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసింది..
రక్షణ వలయం చూసిన వెంటనే కోపంతో మూడు రాకాసులు కలిసి, దానిపై తమ శక్తి తో దాడి చేయడం ప్రారంభించాయి...
అలా కొద్ది నిమిషాలు గడిచిన తరువాత రక్షణ వలయం నాశనమైపోతుంది అనే తరుణంలో మూడు రాకాసులు నుంచున్న చోట నుండి వెలుగులు రావడం మొదలైంది..
అవి నుంచున్న ప్రదేశం నుండి కదలలేకపోయాయి..
అవి ఎటూ కదల్లేక వికృతంగా అరవసాగాయి..
ఆ వెలుగులు కాస్త పెద్దవై,ఆ మూడింటిని ఏదో అగాధంలోకి లాగేసుకున్నాయి...
అలా పంచవక్రీ అనుచరగణాల కథ సమాప్తం అయ్యింది...
వాటి పీడ విరగడయినందుకు సంతోషించారు..
కొద్ది నిమిషాలలో యాగం పూర్తవుతుంది..
(నికుంబల యాగం చివరిలో అమ్మవారికి
ఎండు మిరపకాయలు హోమ గుండంలో సమర్పిస్తారు..)
పంచవక్రీ కోసం ముగ్గురు ఎదురు చూడసాగారు.
ఇంతలో రుద్ర కి కొంచెం దూరంలో ఎవరో నుంచోని కనిపించారు..
" ఎవరది..??" అని అడిగాడు రుద్ర..
ఆకారం రుద్ర కి కొంచెం దగ్గరగా వచ్చింది..
అక్కడ రుద్ర కి నవ్వుతూ భాను కనిపించింది..
రుద్ర ఆశ్చర్యపోయాడు..!!
"ఇక్కడికి ఎందుకు వచ్చావు భాను..??"అని అడుగుతూ ముందుకి వెళ్లబోతుండగా...
సిద్ధ భైరవులు "రుద్ర ఆగు..!" అని అరిచారు.
"ఏమైంది గురుదేవా..?"అని అనుమానంగా అడిగాడు రుద్ర..
ఇంతలో ఒక్కసారిగా భాను మొఖం ఒక రాకాసి లాగా మారిపోయింది.
తన నోరు తెరవగానే నాలిక వేగంగా రుద్ర మీదకి వచ్చింది...
ప్రమాదాన్ని గ్రహించిన సిద్ధ భైరవులు వెంటనే రుద్ర ని పక్కకి తోసేశారు..
రుద్ర కింద పడడంతో ఆ నాలిక అతనికి వెనకాల ఉన్న ఒక చెట్టు లోకి చోచ్చుకుపోయింది..
హఠాత్పరిణామానికి రుద్ర ఆశ్చర్యపోయాడు..
అందరూ చూస్తూ ఉండగానే భాను ఒక పెద్ద మహా పిశాచిలా గా మారిపోయింది..
" పంచవక్రి వచ్చేసింది...!!"అని సింభిక భయంతో అరిచింది...
ఇక వాళ్ళకి తెరుకునే అవకాశం ఇవ్వకుండా
పంచవక్రి వేగంగా వాళ్ళ పై ఒక్కసారిగా తన శక్తులతో విరుచుకుపడింది...
దాని శక్తి దాటికి రుద్ర, సిద్ధ భైరవులు, సింభిక తీవ్రంగా గాయపడ్డారు..
మరోవైపు యాగం పూర్తయ్యింది అనడానికి సూచనగా ఎండు మిరపకాయలు ఆదిత్య చేతుల మీదుగా హోమ గుండానికి సమర్పించబడ్డాయి....
యాగానికి రక్షణగా ఉన్న రక్షణ కవచాలు పై,
పంచవక్రి ఒక్కసారిగా దాడి చేసింది..
ఆ శక్తి దాటికి 3 రక్షణ కవచాలు నాశనం అయిపోయాయి..
ఆ రక్షణ కవచాలు నాశనమైపోగానే,
అక్కడి పరిస్థితికి ముగ్గురికి కనిపించింది...
పంచవక్రీ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ అతని మీదకి రాబోతుండగా.... ఆదిత్య వెంటనే తన చేతి నుండి ఒక శక్తి ని సృష్టించి, దాని మీదకి విసిరాడు.. ఆ ధాటికి అది కొద్ది దూరం ఎగిరి పడింది...
ఆదిత్య కోపంతో దాని మీదకి వెళ్ళసాగాడు..
అలా ముందుకు వెళ్తున్న ఆదిత్య చేతిలో ఒక మంత్రదండం ప్రత్యక్షమైంది...
దాని మీదకి మరో దాడి చేయబోతుండగా..
పంచవక్రీ, భాను గా మారిపోయింది..
ఆదిత్య తన దాడి చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు..
కానీ భాను శరీరంలో ఉన్న పంచవక్రీ మాత్రం ఆదిత్య మీదకి దాడి చేసింది..
ఇక ఆదిత్యకి భాను శరీరంలో అది ఉన్నంతసేపు తను ఏమీ చేయలేడు అని అర్థమయింది...
ఇక కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించి,
ఒక శక్తి ని భాను మీదకి విసిరాడు..
ఆ శక్తి భాను శరీరం నుండి పంచవక్రి ని వేరు చేసింది..
భాను శరీరంనుండి వేరుపడ్డ పంచవక్రి కోపంగా ఆదిత్య వైపు దూసుకుని వస్తుండగా....
ఒక్కసారిగా అక్కడ సింహగర్జన వినిపించింది...
ఆ గర్జన అడవి అంతా ప్రతిధ్వనించింది...
ఆకాశంలో కమ్ముకొని ఉన్న మబ్బులన్ని చెదిరిపోయాయి...
నిర్మలమైన ఆకాశం ప్రత్యక్షమైంది...
నేలపై సృహ తప్పి గాయాలతో పడి ఉన్న రుద్ర సిద్ధ భైరవులు సింబిక మామూలుగా మారిపోయి, పైకి లేచారు... భాను కూడా పైకి లేచింది..
పంచవక్రి ముందు సింహం మీద ఆసీనులై ఉన్న ప్రత్యంగిరా మాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు..
ఆ తల్లిని అలా చూడగానే అందరూ సాష్టాంగ పడి నమస్కారం చేశారు..
అమ్మవారిని అలా చూడగానే పంచవక్రీ గడగడా వణికిపోయింది..
అమ్మవారు తన కంటి చూపుతోనే దానిని నిలువునా బస్మం చేశారు... ఆ తరువాత అందరినీ ఆశీర్వదిస్తూ మాయమైపోయారు...
ఆ రోజుతో ఆదిత్య కి పట్టిన పంచవక్రీ పీడ విరగడ అయిపోయింది...
అందరూ ఆనందంగా ఇంటికి బయలుదేరారు...
కథ సమాప్తం....!!!
ఇట్లు - మీ బొల్లోజు నిరంజన్ కుమార్...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)