23-03-2026, 07:43 AM
Part - 18
ధీరజ్ అల అడగగానే రుద్ర చురుగ్గా చూస్తూ, అవును.. నాకు మరదలు అని ఆరాటం ఉంది.
మీకు చెల్లెలు కదా! అందుకే మీకు ఆరాటం లేదు అని రివర్స్ కౌంటర్ వేస్తాడు. అబ్బా బావకి బుక్కయ్యాను అనుకుని ఏదో సరదాకి అన్నానులే బావ అని పళ్ళు ఇకలిస్తాడు.
అవన్నీ ఎందుకు, ఈ ప్రూఫ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూపించి.. మన అమ్మాయిని మనం తెచ్చుకుందాం అని విహాన్ అంటాడు.
దానికి రుద్ర వద్దు విహాన్ అలా చేస్తే ఇంకా ప్రమాదం. మీ చెల్లి పెరిగిన వాతావరణం మనకు తెలియదు.
హరి చెప్పిన ప్రకారం ఆ మదర్ ప్రాణాలు అన్ని ఆ బేబీ పైనే ఉన్నాయి. అలాగే ఆ కుటుంబంతో రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది.
ఇప్పుడు మనం వెళ్లి ఇది మేటర్ అని చెప్పి, ప్రూఫ్ చూపిస్తే, వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎవరైనా తట్టుకోలేని వాళ్లు ఉంటే చాలా రిస్క్.
పైగా మీ చెల్లి మెంటాలిటీ కూడా మనకు తెలియదు కదా! అనగానే అవును అది నిజమే అని మిగిలిన ముగ్గురూ అనుకుంటారు.
ఇది చాలా సెన్సిటివ్ మేటర్. చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఆ ఫ్యామిలీలో ఎవరూ బాధపడకుండా చేసి మన ఇంటికి తెచ్చుకోవాలి అని రుద్రా అనగానే... ఇది చాలా పెద్ద టాస్క్ బావ అని ధీరజ్ అంటాడు.
తప్పదు మరి ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది అని అద్వైత్ అంటాడు. వర్క్ ఫినిష్ చేసుకుని అందరూ బృందావనం చేరుకుంటారు.
బృందావనం కొత్త రంగులతో కొత్త పెళ్ళికూతురు లాగా ముస్తాబయింది. రాబోయే యువరాణి కోసం గది అంతా ముస్తాబయింది.
యువరాణికి అవసరమైన ప్రతి చిన్న అవసరాన్ని దేవేంద్ర గారు దగ్గరుండి సెలెక్ట్ చేసి తెచ్చారు.
ఆర్డర్ ఇచ్చిన జ్యువలరీ అంతా వచ్చేసింది. అయినా దేవేంద్రకి తృప్తి చెందక స్వయంగా వెళ్లి సెలెక్ట్ చేసి మరికొన్ని తెచ్చారు.
ముత్యాలు, పగడాలు సెట్స్ స్పెషల్ గా చేపించారు. అనసూయ గారికి మాత్రమే ఏమీ అర్థం కావడం లేదు ప్యాలెస్ మొత్తం చాలా కళగా కనపడుతుంది. అందరి మొహంలో సంతోషం ఉట్టిపడుతుంది.
కానీ తనకు ఏమీ తెలియడం లేదు. కుటుంబ సంతోషంలో తను లేదు అనే బాధ చాలా ఎక్కువగా ఉంది ఎలా విషయం తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది.
కారు ఆగిన సౌండ్ వినిపించి గుమ్మం వైపు చూస్తారు. మనవళ్లు వస్తూ కనిపిస్తారు.
ధీరజ్ ని అడిగితే ఏమైనా తెలియొచ్చు అనుకుని, ధీరజ్ అని పిలుస్తారు. చెప్పండి గ్రానీ అని వెళితే, ఈ వైభోగానికి కారణం ఏమిటి?? నువ్వైనా చెప్పు అని అడుగుతారు.
దానికి ధీరజ్ క్షమించండి గ్రానీ, నేను ఈ ఇంటి వాడిని కాకపోయినా తాతగారి మాటను నేను పాటిస్తానని చెప్పి వెనక్కి తిరుగుతాడు.
ఏదో బుస కొడుతున్నట్టు అనిపిస్తుందని పక్కకి చూడగానే... రుద్ర, విహాన్, అద్వైత్ కోపంతో బుసకొడుతూ ఉంటారు..
ఇప్పుడు ఏం జరిగిందని వీళ్ళు ఇలా ఉన్నారు అని.. ఏమైందిరా అని వెళతాడు. అంతే అక్కడ సోఫాలో పడేసి ముగ్గురు మూడు పక్కల నుంచి కుమ్ముతారు.
ఒరేయ్ చెప్పి కుమ్మండి రా అని ధీరజ్ అరుస్తూ ఉంటే.. ఏరా ఏం కూసావురా నువ్వు.. ఈ ఇంటి వాడు కాదని అంటావా అని.. మళ్ళీ కుమ్ముతారు.
అబ్బా ఏదో ఫ్లోలో అలా అనేసాను. మళ్ళీ అనను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమాలుతాడు. ఇప్పటికి వదిలేస్తున్నాము. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదులుతారు.
రుద్ర అనసూయ గారి ముందుకు వచ్చి గ్రాని మీ బాధ అర్థం అవుతుంది. కానీ మేము ఎవ్వరం ఏమీ చేయలేము.
నువ్వు నిజంగానే పశ్చాత్తా పడుతున్నావు అని తాతగారికి అనిపిస్తే.. ఖచ్చితంగా క్షమిస్తారు. లేదు నటన అయితే దానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. అనసూయ గారు బాధగా లోపలికి వెళ్ళిపోతారు.
రేపల్లె...
ఇంకా మూడు రోజుల్లో శాంభవి హైదరాబాద్ ప్రయాణానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. భాను గారు, కూతురు ఏ రోజు ఏ డ్రస్సు వేసుకోవాలి ఏమి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి అని నీట్ గా నెల రోజులకు సరిపడా విధంగా ప్యాక్ చేస్తున్నారు.
ఆ లగేజ్ చూసి ధరణి, జయంతి నోరు వదిలేసి చూస్తున్నారు. భాను గారు ధరణిని చూసి దరు ఇంకా ఏమైనా మర్చిపోయానా అని అడిగితే... అవునండి మర్చిపోయారు అంటుంది.
ఇంకా ఏం మర్చిపోయాను అని అడిగితే....ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని మర్చిపోయారు అని చెబుతుంది.
దానికి భాను గారు అంత వెటకారం వద్దులే.. ఇప్పటివరకు శాంభవి ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైనా అవసరం అయితే ఇబ్బంది పడుతుందని ఒక నెలకి ప్యాక్ చేస్తున్నాను అని చెప్తారు.
ఏంటి ఇవన్నీ ఒక నెల కా అని... మరి వచ్చే నెలకి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళొచ్చు అంటారు. దానికి జయంతి వీళ్ళని మార్చలేము అని అంటుంది.
శకుంతల గారు అందర్నీ పిలుస్తారు. రామచంద్రయ్య గారు వచ్చి చెప్పమ్మా అనగానే...
రాము ఎల్లుండి పౌర్ణమి, హోమానికి ఏర్పాట్లు చూడు. అలాగే బంగారం మొదటిసారి ఊరు దాటి వెళుతుంది. సిద్ధాంతి గారిని అడిగి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏమైనా పూజలు చేయాలేమో కనుక్కో అని కూడా పురయించుతారు.
కోడలు ఇద్దరు అత్తగారి పక్కకు చేరి అత్తయ్య గారు అని పిలుస్తారు. ఏంటి మీ నస అంటే... శాంభవి పక్కనున్న హైదరాబాద్ వెళుతుంటే వీళ్లు ఇంత హడావిడి చేస్తున్నారు.
రేపు దానికి పెళ్లి కుదిరితే మన పరిస్థితి ఏమిటి అంటే, దానికి సులోచన గారు చేతులు పైకెత్తి చూస్తారు.
రాము గారు సిద్ధాంతిని కలిసి విషయం చెపుతారు. సిద్ధాంతి గారు అమ్మవారిని ధ్యానించి, శాంభవి జాతకం చూస్తారు.
రాము గారి వంక చూసి కంగారు పడకండి. శాంభవిది ఆ కన్నయ్య లాగానే అని.. ఒక నిమిషం ఆగి వెళ్ళిన చోట శాంభవికి రాజభోగం ఉంది.
అలాగే తన ముందు ఒక శక్తి ఉంది. ప్రపంచాన్ని శాసించే వాడు తన ముందు ఉంటాడు. ఎలాంటి దుఃఖం, కష్టం రానివ్వడు.
ఇక్కడ ఎలా ఉందో.. అక్కడ అలాగే ఉంటుందని చెప్పి పంపిస్తారు.
పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం హోమం పూర్తయ్యే వరకు.
తామర పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. సాయంత్రం హోమానికి శాంభవి చిలకపచ్చ పట్టు పరికిణి, రెడ్ కలర్ వోనీ వేసుకుని రెడీ అవుతుంది.
అందరి కళ్ళకి అప్పుడే పాలకడలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లాగా కనబడుతుంది. ఆ లక్ష్మీదేవి వచ్చి లలితా దేవి హోమం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది.
అక్కడ బృందావనంలో అందరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిద్రమని మరి ఎదురు చూస్తున్నారు.
మరి ఈ నిరీక్షణకు ఫలితం??
కథ కొనసాగుతుంది....
మీకు చెల్లెలు కదా! అందుకే మీకు ఆరాటం లేదు అని రివర్స్ కౌంటర్ వేస్తాడు. అబ్బా బావకి బుక్కయ్యాను అనుకుని ఏదో సరదాకి అన్నానులే బావ అని పళ్ళు ఇకలిస్తాడు.
అవన్నీ ఎందుకు, ఈ ప్రూఫ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూపించి.. మన అమ్మాయిని మనం తెచ్చుకుందాం అని విహాన్ అంటాడు.
దానికి రుద్ర వద్దు విహాన్ అలా చేస్తే ఇంకా ప్రమాదం. మీ చెల్లి పెరిగిన వాతావరణం మనకు తెలియదు.
హరి చెప్పిన ప్రకారం ఆ మదర్ ప్రాణాలు అన్ని ఆ బేబీ పైనే ఉన్నాయి. అలాగే ఆ కుటుంబంతో రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది.
ఇప్పుడు మనం వెళ్లి ఇది మేటర్ అని చెప్పి, ప్రూఫ్ చూపిస్తే, వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎవరైనా తట్టుకోలేని వాళ్లు ఉంటే చాలా రిస్క్.
పైగా మీ చెల్లి మెంటాలిటీ కూడా మనకు తెలియదు కదా! అనగానే అవును అది నిజమే అని మిగిలిన ముగ్గురూ అనుకుంటారు.
ఇది చాలా సెన్సిటివ్ మేటర్. చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఆ ఫ్యామిలీలో ఎవరూ బాధపడకుండా చేసి మన ఇంటికి తెచ్చుకోవాలి అని రుద్రా అనగానే... ఇది చాలా పెద్ద టాస్క్ బావ అని ధీరజ్ అంటాడు.
తప్పదు మరి ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది అని అద్వైత్ అంటాడు. వర్క్ ఫినిష్ చేసుకుని అందరూ బృందావనం చేరుకుంటారు.
బృందావనం కొత్త రంగులతో కొత్త పెళ్ళికూతురు లాగా ముస్తాబయింది. రాబోయే యువరాణి కోసం గది అంతా ముస్తాబయింది.
యువరాణికి అవసరమైన ప్రతి చిన్న అవసరాన్ని దేవేంద్ర గారు దగ్గరుండి సెలెక్ట్ చేసి తెచ్చారు.
ఆర్డర్ ఇచ్చిన జ్యువలరీ అంతా వచ్చేసింది. అయినా దేవేంద్రకి తృప్తి చెందక స్వయంగా వెళ్లి సెలెక్ట్ చేసి మరికొన్ని తెచ్చారు.
ముత్యాలు, పగడాలు సెట్స్ స్పెషల్ గా చేపించారు. అనసూయ గారికి మాత్రమే ఏమీ అర్థం కావడం లేదు ప్యాలెస్ మొత్తం చాలా కళగా కనపడుతుంది. అందరి మొహంలో సంతోషం ఉట్టిపడుతుంది.
కానీ తనకు ఏమీ తెలియడం లేదు. కుటుంబ సంతోషంలో తను లేదు అనే బాధ చాలా ఎక్కువగా ఉంది ఎలా విషయం తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది.
కారు ఆగిన సౌండ్ వినిపించి గుమ్మం వైపు చూస్తారు. మనవళ్లు వస్తూ కనిపిస్తారు.
ధీరజ్ ని అడిగితే ఏమైనా తెలియొచ్చు అనుకుని, ధీరజ్ అని పిలుస్తారు. చెప్పండి గ్రానీ అని వెళితే, ఈ వైభోగానికి కారణం ఏమిటి?? నువ్వైనా చెప్పు అని అడుగుతారు.
దానికి ధీరజ్ క్షమించండి గ్రానీ, నేను ఈ ఇంటి వాడిని కాకపోయినా తాతగారి మాటను నేను పాటిస్తానని చెప్పి వెనక్కి తిరుగుతాడు.
ఏదో బుస కొడుతున్నట్టు అనిపిస్తుందని పక్కకి చూడగానే... రుద్ర, విహాన్, అద్వైత్ కోపంతో బుసకొడుతూ ఉంటారు..
ఇప్పుడు ఏం జరిగిందని వీళ్ళు ఇలా ఉన్నారు అని.. ఏమైందిరా అని వెళతాడు. అంతే అక్కడ సోఫాలో పడేసి ముగ్గురు మూడు పక్కల నుంచి కుమ్ముతారు.
ఒరేయ్ చెప్పి కుమ్మండి రా అని ధీరజ్ అరుస్తూ ఉంటే.. ఏరా ఏం కూసావురా నువ్వు.. ఈ ఇంటి వాడు కాదని అంటావా అని.. మళ్ళీ కుమ్ముతారు.
అబ్బా ఏదో ఫ్లోలో అలా అనేసాను. మళ్ళీ అనను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమాలుతాడు. ఇప్పటికి వదిలేస్తున్నాము. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదులుతారు.
రుద్ర అనసూయ గారి ముందుకు వచ్చి గ్రాని మీ బాధ అర్థం అవుతుంది. కానీ మేము ఎవ్వరం ఏమీ చేయలేము.
నువ్వు నిజంగానే పశ్చాత్తా పడుతున్నావు అని తాతగారికి అనిపిస్తే.. ఖచ్చితంగా క్షమిస్తారు. లేదు నటన అయితే దానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. అనసూయ గారు బాధగా లోపలికి వెళ్ళిపోతారు.
రేపల్లె...
ఇంకా మూడు రోజుల్లో శాంభవి హైదరాబాద్ ప్రయాణానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. భాను గారు, కూతురు ఏ రోజు ఏ డ్రస్సు వేసుకోవాలి ఏమి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి అని నీట్ గా నెల రోజులకు సరిపడా విధంగా ప్యాక్ చేస్తున్నారు.
ఆ లగేజ్ చూసి ధరణి, జయంతి నోరు వదిలేసి చూస్తున్నారు. భాను గారు ధరణిని చూసి దరు ఇంకా ఏమైనా మర్చిపోయానా అని అడిగితే... అవునండి మర్చిపోయారు అంటుంది.
ఇంకా ఏం మర్చిపోయాను అని అడిగితే....ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని మర్చిపోయారు అని చెబుతుంది.
దానికి భాను గారు అంత వెటకారం వద్దులే.. ఇప్పటివరకు శాంభవి ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైనా అవసరం అయితే ఇబ్బంది పడుతుందని ఒక నెలకి ప్యాక్ చేస్తున్నాను అని చెప్తారు.
ఏంటి ఇవన్నీ ఒక నెల కా అని... మరి వచ్చే నెలకి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళొచ్చు అంటారు. దానికి జయంతి వీళ్ళని మార్చలేము అని అంటుంది.
శకుంతల గారు అందర్నీ పిలుస్తారు. రామచంద్రయ్య గారు వచ్చి చెప్పమ్మా అనగానే...
రాము ఎల్లుండి పౌర్ణమి, హోమానికి ఏర్పాట్లు చూడు. అలాగే బంగారం మొదటిసారి ఊరు దాటి వెళుతుంది. సిద్ధాంతి గారిని అడిగి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏమైనా పూజలు చేయాలేమో కనుక్కో అని కూడా పురయించుతారు.
కోడలు ఇద్దరు అత్తగారి పక్కకు చేరి అత్తయ్య గారు అని పిలుస్తారు. ఏంటి మీ నస అంటే... శాంభవి పక్కనున్న హైదరాబాద్ వెళుతుంటే వీళ్లు ఇంత హడావిడి చేస్తున్నారు.
రేపు దానికి పెళ్లి కుదిరితే మన పరిస్థితి ఏమిటి అంటే, దానికి సులోచన గారు చేతులు పైకెత్తి చూస్తారు.
రాము గారు సిద్ధాంతిని కలిసి విషయం చెపుతారు. సిద్ధాంతి గారు అమ్మవారిని ధ్యానించి, శాంభవి జాతకం చూస్తారు.
రాము గారి వంక చూసి కంగారు పడకండి. శాంభవిది ఆ కన్నయ్య లాగానే అని.. ఒక నిమిషం ఆగి వెళ్ళిన చోట శాంభవికి రాజభోగం ఉంది.
అలాగే తన ముందు ఒక శక్తి ఉంది. ప్రపంచాన్ని శాసించే వాడు తన ముందు ఉంటాడు. ఎలాంటి దుఃఖం, కష్టం రానివ్వడు.
ఇక్కడ ఎలా ఉందో.. అక్కడ అలాగే ఉంటుందని చెప్పి పంపిస్తారు.
పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం హోమం పూర్తయ్యే వరకు.
తామర పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. సాయంత్రం హోమానికి శాంభవి చిలకపచ్చ పట్టు పరికిణి, రెడ్ కలర్ వోనీ వేసుకుని రెడీ అవుతుంది.
అందరి కళ్ళకి అప్పుడే పాలకడలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లాగా కనబడుతుంది. ఆ లక్ష్మీదేవి వచ్చి లలితా దేవి హోమం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది.
అక్కడ బృందావనంలో అందరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిద్రమని మరి ఎదురు చూస్తున్నారు.
మరి ఈ నిరీక్షణకు ఫలితం??
కథ కొనసాగుతుంది....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)