21-03-2026, 09:00 PM
అందరికి నమస్కారం! నేను ఎటు వంటి ఆటంకాలు లేకుండా ఒక కథ మొదలు పెట్టాలి అనుకోని మొదలెట్టిన ఈ కథ " ఆదిలోనే హంసపాదు " అన్నట్టు అయ్యింది. ఈ మధ్యలోనే కాస్త సమయంలో దొరకడంతో కథను మళ్ళీ రాయడం మొదలెట్టాను. దయచేసి నన్ను క్షమించి, కథను ఆదరించండి. ఇక కథలోకి వెళ్దాం..
కాలం అలా సాగిపోతుంది. అక్కడికి వచ్చిన అంగ్లేయులకి మన నల్లయోధుడు అన్ని రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నాడు. అంగ్లేయులకి ముఖ్యంగా నలుగురు ముఖ్య అధికారులుగా వచ్చారు. ఏనుగు దంతాలతో పాటు, దగ్గర గనుల్లో ఉండే బంగారం, వజ్రాల గురించి ఆరా తీసి పై అధికారులకి నివేదిక ఇవ్వడం వీరి పని. అయితే అక్కడి ప్రజలకి సహజ సంపద దేవుడితో సమానం. ఆంగ్లేయులు మట్టుకు వాటిని సంపద గానే చూస్తూ వాటిని కొల్లగొట్టడానికి ఎంతకైనా తెగించేవారు. అయితే దానికోసం వారు ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న బలవంతుల సహాయం కోరి, బలహీనులను బానిసలుగా చేసుకొని, బలవంతులకి ముడుపులు అప్పచెప్పేవారు. ఇక్కడ కూడా మన నల్లయోధుడు ఆ ప్రజల నాయకుడిగా బలవంతుడిగా కనబడ్డాడు. అంతే కాదు, మిగతా ప్రాంతాల్లో ప్రజలకంటే ఇక్కడి వాళ్ళు శరీరకంగా చాలా దృఢంగా ఉన్నారు.
నల్ల యోధుడు తెల్ల దొరలకి అన్ని ప్రాంతాలు తిరిగి చూపెట్టడమే కాకుండా, ఒక అంగరక్షకుడిగా ఉంటూ, కొన్ని సార్లు వాళ్ళ ప్రాణాలను సైతం కాపాడడంతో, తెల్ల దొరలకి నల్ల యోధుడి మీద అపారమైన నమ్మకం కలిగింది. అయితే ఇదే సమయంలో నల్ల యోధునికి నెమ్మదిగా తెల్ల దొరల వ్యాపార రహస్యాలు.. తమ ప్రాంతంలో ఉన్న సంపదకి విదేశాల్లో ఉన్న అపారమైన విలువ తెలిసింది. అంతే కాదు.. డబ్బుతో అధికారం.. ఆ అధికారంతో ఈ జాగాన్ని ఏలవచ్చు అనే విషయాలు కూడా తెలిసాయి. తెల్ల దొరలు ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు ఆరునెలలు గాడిచాయి, ఈ సమయంలో దొరలు ఆ ప్రాంతం మీద పెట్టిన శ్రద్ధ వారి వారి ఇళ్లలో ఉన్న మనుషుల మీద పెట్టడం తగ్గింది. మాములుగా నల్ల యోధున్ని తమ వ్యాపార, అధికారక లావాదేవీలకి మాత్రమే దొరలు వినియోగించే వారు. కాలం గడుస్తున్న కొద్దీ, తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ, తమ శ్రీమతులని పరిచయం చేస్తూ, ఇంటి వద్ద ఏదయినా అవసరాలు ఉన్న, నల్లయోధుడికి చెప్పి చేయించుకోవాల్సింది అని చెప్పేవారు. అదే విధంగా నల్లయోధుడు కూడా దొరసానులకి కావాల్సిన పనులు గ్రామంలో ప్రజలకి చెప్పి, చేయిస్తున్న ఉండేవాడు. అలాగే అక్కడ ప్రత్యేకంగా దొరికే వస్తువులు.. ఆహారం.. తాజాగా దొరల ఇళ్లకు చేరేది. వివిధ దేశాలకు పంపబడే బృందాల్లో ఒక వైద్యుడు, ఒక సైనిక అధికారి, ఒక భౌగోళిక శాస్త్రవేత్త వెంట ఉండేవారు. ఒక రోజు దొరల బృందం సంపద అన్వేషణకి నల్ల యోధున్ని వెంట పెట్టుకొని వెళ్లారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళాక ఒక కీలకమైన పటం కుటీరాల వద్దే మర్చిపోయినట్టు గమనించారు. వాళ్ళు దాదాపుగా 2 గంటలు ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నారు. అయితే తనకి ఒక దగ్గరి దారి తెలుసనీ ఒక గంటలో వెళ్లి వస్తానని నల్లయోధుడు తిరుగు ప్రయాణం అయ్యాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)