21-03-2026, 07:46 AM
Part - 11
అనసూయ గారు, కౌసల్య గారిని తీసుకుని గుడికి వెళతారు. గుడిలో పూజలు, అభిషేకాలు చేపిస్తారు. అన్నదానానికి డొనేషన్ ఇచ్చి గుడి ఆవరణలోకి కూర్చుంటారు.
ఎందుకు అత్తయ్య అంత కంగారు పడుతున్నారు... అంటే దానికి అనసూయ గారు తెలియదు కౌసల్య మీ మావయ్య గారు జితేంద్ర ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్లారు.
.ఏమి వినాలి వస్తుందా అని కంగారుగా ఉందని చెబుతారు. కంగారు పడకండి అత్తయ్య అంతా మంచే జరుగుతుంది.
ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అమ్మ కరుణించదా చెప్పండి... అని అత్తగారికి ధైర్యం చెప్పి బయలుదేరుతారు.
గుడి ఆవరణలో చెట్టు దగ్గర కూర్చున్న బైరాగి దగ్గరకి అనసూయ వెళ్లి నమస్కరించి... పళ్ళు, ఫలహారం సమర్పిస్తుంది.
దానికి బైరాగి అనసూయను చూసి మేము స్వీకరించలేము తల్లి. తీసుకువెళ్ళు అంటే..
స్వామి ఎంత కాలం నాకి ఈ శిక్ష అని బాధపడుతుంది.
చేసుకున్న వారికి చేసుకున్నంత తల్లి అని అంటారు. నేను మూర్కోత్వంలో చేసిన పనికి... నా కొడుకు జీవితంలో సంతోషం లేదు. నా భర్త నాతో మాట్లాడడం లేదు అని బాధపడుతుంది.
దానికి బైరాగి నీది మూర్ఖత్వం కాదు..అహంకారంతో చేశావు. తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు. మహాపాపం అయితే ప్రాయశ్చిత్తం ఉంటుందా తల్లి అని అడుగుతారు.
దానికి అనసూయ నాకు ఎంత కాలం ఈ శిక్ష అంటే... అమ్మ అనుమతి ఇచ్చేవరకు అని చెప్పి కళ్ళు మూసుకుంటారు. బాధతో , భారమైన మనసుతో అనసూయ, కౌసల్య ఇంటిదారి పడతారు.
రాఘవేంద్ర గారు, జితేంద్ర గారు శ్రీశైలంలో ఉన్న గురువుగారు ఆశ్రమానికి చేరుతారు.
లోపలికి వెళ్లి శిష్యులతో గురువుగారిని కలవాలి అని చెబుతారు. అప్పుడే లోపలి నుండి ఇంకో శిష్యుడు వచ్చి మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి లోపలికి తీసుకువెళతాడు.
ధ్యానంలో ఉన్న గురువుగారు కళ్ళు తెరిచి ఏమైంది రాఘవేంద్ర అని అడుగుతారు.
మీరు సర్వజ్ఞులు... చెప్పక ముందే మేము వచ్చిన సంగతి తెలిసినవారు. ఎందుకు వచ్చామో తెలియదా గురువుగారు అని వినయం గా అడిగితే....
దానికి ఆయన చిరునవి నవ్వి, మనసులో చెప్పలేని భావం కలిగితే ఎందుకు అంత కంగారు అని అడుగుతారు.
ఇది దేనికి సూచన అని అర్థం కావడం లేదు. మీరు చెప్పినప్పుడు నుంచి ... శాంతి హోమాలు, అమ్మవారికి అభిషేకాలు , అన్నదానాలు అన్ని చేపిస్తున్నాము.
అయినా ఇంకా అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాలేదు మేము అని బాధపడతారు.
బాధపడకు రాఘవేంద్ర కాలమే అన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది అని...
అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకుంటారు. 10 నిమిషాలకు కళ్ళు తెరిచే ప్రసన్న వదనంతో రాఘవేంద్రను చూస్తూ అమ్మ అనుగ్రహానికి దగ్గర అవుతున్నారు.
అంతా మంచికే జరుగుతుంది.వారసురాలు రాబోతుంది అని చెప్పగానే, సంతోషంతో రాఘవేంద్ర, జితేంద్ర ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటే,
అవును.. రాఘవేంద్ర అమ్మ ఆజ్ఞ అయింది అని చెబుతారు.
ఎలా మేము మా వారసురాల్ని గుర్తించాలి అంటే..అన్ని వాటి అంతట అవే తెలుస్తాయి.
జాగ్రత్తగా ఉండండి. మీ వారసురాలని శత్రువుకి తెలిస్తే చాలా ప్రమాదం.
ఇప్పుడు వరకు ద్వేషం అంటే ఏమిటో తెలియని చోట ఉంది. కన్నీరు రాకుండా పెంచారు. అక్కడ అంత అపురూపంగా పెరిగింది.
మీ వారసురాలు అనే శత్రువులకు తెలిస్తే చాలా ప్రమాదం అని చెబుతారు.
అలాగే గురువుగారు అని చెబుతూ...ఒక విషయం అండి అంటారు. ఏమిటి అని అడుగుతారు.
ఆత్రం ఆగక అడుగుతున్నాము. ఎన్ని రోజుల్లో మా వారసురాలు రాగలదు అనగానే....
గురువుగారు చిన్న నవ్వి నవ్వి ఈ పౌర్ణమి అయిన మర్నాడు తను మీ సంస్థలో అడుగుపెడుతుంది. గుర్తించండి అని చెబుతారు.
దానికి సంతోషంతో పౌర్ణమి అంటే ఇంకా పదిరోజులే ఉంది. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అని గురువుగారికి కృతజ్ఞతలు చెప్పి...ఆనందంతో ఇంటికి బయలుదేరుతారు..
ఒకరిది బాధ, ఒకరిది ఆనందం, ఒకరిది చెప్పలేని ఉద్వేగం...
ఎందుకు అత్తయ్య అంత కంగారు పడుతున్నారు... అంటే దానికి అనసూయ గారు తెలియదు కౌసల్య మీ మావయ్య గారు జితేంద్ర ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్లారు.
.ఏమి వినాలి వస్తుందా అని కంగారుగా ఉందని చెబుతారు. కంగారు పడకండి అత్తయ్య అంతా మంచే జరుగుతుంది.
ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అమ్మ కరుణించదా చెప్పండి... అని అత్తగారికి ధైర్యం చెప్పి బయలుదేరుతారు.
గుడి ఆవరణలో చెట్టు దగ్గర కూర్చున్న బైరాగి దగ్గరకి అనసూయ వెళ్లి నమస్కరించి... పళ్ళు, ఫలహారం సమర్పిస్తుంది.
దానికి బైరాగి అనసూయను చూసి మేము స్వీకరించలేము తల్లి. తీసుకువెళ్ళు అంటే..
స్వామి ఎంత కాలం నాకి ఈ శిక్ష అని బాధపడుతుంది.
చేసుకున్న వారికి చేసుకున్నంత తల్లి అని అంటారు. నేను మూర్కోత్వంలో చేసిన పనికి... నా కొడుకు జీవితంలో సంతోషం లేదు. నా భర్త నాతో మాట్లాడడం లేదు అని బాధపడుతుంది.
దానికి బైరాగి నీది మూర్ఖత్వం కాదు..అహంకారంతో చేశావు. తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు. మహాపాపం అయితే ప్రాయశ్చిత్తం ఉంటుందా తల్లి అని అడుగుతారు.
దానికి అనసూయ నాకు ఎంత కాలం ఈ శిక్ష అంటే... అమ్మ అనుమతి ఇచ్చేవరకు అని చెప్పి కళ్ళు మూసుకుంటారు. బాధతో , భారమైన మనసుతో అనసూయ, కౌసల్య ఇంటిదారి పడతారు.
రాఘవేంద్ర గారు, జితేంద్ర గారు శ్రీశైలంలో ఉన్న గురువుగారు ఆశ్రమానికి చేరుతారు.
లోపలికి వెళ్లి శిష్యులతో గురువుగారిని కలవాలి అని చెబుతారు. అప్పుడే లోపలి నుండి ఇంకో శిష్యుడు వచ్చి మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి లోపలికి తీసుకువెళతాడు.
ధ్యానంలో ఉన్న గురువుగారు కళ్ళు తెరిచి ఏమైంది రాఘవేంద్ర అని అడుగుతారు.
మీరు సర్వజ్ఞులు... చెప్పక ముందే మేము వచ్చిన సంగతి తెలిసినవారు. ఎందుకు వచ్చామో తెలియదా గురువుగారు అని వినయం గా అడిగితే....
దానికి ఆయన చిరునవి నవ్వి, మనసులో చెప్పలేని భావం కలిగితే ఎందుకు అంత కంగారు అని అడుగుతారు.
ఇది దేనికి సూచన అని అర్థం కావడం లేదు. మీరు చెప్పినప్పుడు నుంచి ... శాంతి హోమాలు, అమ్మవారికి అభిషేకాలు , అన్నదానాలు అన్ని చేపిస్తున్నాము.
అయినా ఇంకా అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాలేదు మేము అని బాధపడతారు.
బాధపడకు రాఘవేంద్ర కాలమే అన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది అని...
అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకుంటారు. 10 నిమిషాలకు కళ్ళు తెరిచే ప్రసన్న వదనంతో రాఘవేంద్రను చూస్తూ అమ్మ అనుగ్రహానికి దగ్గర అవుతున్నారు.
అంతా మంచికే జరుగుతుంది.వారసురాలు రాబోతుంది అని చెప్పగానే, సంతోషంతో రాఘవేంద్ర, జితేంద్ర ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటే,
అవును.. రాఘవేంద్ర అమ్మ ఆజ్ఞ అయింది అని చెబుతారు.
ఎలా మేము మా వారసురాల్ని గుర్తించాలి అంటే..అన్ని వాటి అంతట అవే తెలుస్తాయి.
జాగ్రత్తగా ఉండండి. మీ వారసురాలని శత్రువుకి తెలిస్తే చాలా ప్రమాదం.
ఇప్పుడు వరకు ద్వేషం అంటే ఏమిటో తెలియని చోట ఉంది. కన్నీరు రాకుండా పెంచారు. అక్కడ అంత అపురూపంగా పెరిగింది.
మీ వారసురాలు అనే శత్రువులకు తెలిస్తే చాలా ప్రమాదం అని చెబుతారు.
అలాగే గురువుగారు అని చెబుతూ...ఒక విషయం అండి అంటారు. ఏమిటి అని అడుగుతారు.
ఆత్రం ఆగక అడుగుతున్నాము. ఎన్ని రోజుల్లో మా వారసురాలు రాగలదు అనగానే....
గురువుగారు చిన్న నవ్వి నవ్వి ఈ పౌర్ణమి అయిన మర్నాడు తను మీ సంస్థలో అడుగుపెడుతుంది. గుర్తించండి అని చెబుతారు.
దానికి సంతోషంతో పౌర్ణమి అంటే ఇంకా పదిరోజులే ఉంది. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అని గురువుగారికి కృతజ్ఞతలు చెప్పి...ఆనందంతో ఇంటికి బయలుదేరుతారు..
ఒకరిది బాధ, ఒకరిది ఆనందం, ఒకరిది చెప్పలేని ఉద్వేగం...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)