20-03-2026, 11:49 AM
Part - 9
రేపల్లె....
శాంభవి తన గదికి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకుని చుడీదార్ లో వస్తుంది. అందరూ బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళుతూ ఉంటారు.
శివప్రసాద్ గారు తన ఆఫీసు రూమ్ కి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలకు సొల్యూషన్స్ చూస్తున్నారు. శివప్రసాద్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో మందు , సిగరెట్ నిషేధం.
భాను ప్రసాద్ గారి పొలం వెళ్లి వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. ఆ ఊరు నుండి, పక్క ఊరు నుండి యువత ఆయన దగ్గరకు వచ్చే సలహాలు తీసుకుంటూ ఉంటారు. ధరణి లెక్చరర్ గా కాలేజ్ కి వెళ్ళింది.
లలిత్, చరణ్, స్వరూప్ కాలేజ్ కి కాలేజెస్ కి వెళ్లి వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేశారు.
శాంభవి కాలేజీకి బయలుదేరగానే శకుంతలాగారు శాంభవి నీ ఆపి చెబుతూ ఉంటారు.
బంగారం తిన్నగా తలవంచుకుని, కాలేజీకి వెళ్లి బాగా చదువుకొని, తలదించుకుని ఇంటికి వచ్చాయి అమ్మ అని చెబుతారు. దానికి శాంభవి అలాగే బామ్మ అని తలు ఊపుతుంది.
అది చూసిన సులోచన పాపం అత్తయ్య గారు బంగారం ఎంతో అమాయకురాలు అనుకుంటున్నారు. అది ఎంత రాక్షసొ నాకు కథ తెలిసింది.
నేను మీకు చెప్పలేను అనుకుంటూ జయంతితో కలిసి లోపలికి వెళ్ళిపోతారు. రామచంద్రయ్య గారు భార్య మనస్సు అర్థమయ్యి నవ్వుకుంటారు.
శాంభవి కాలేజీకి వెళ్లగానే మిత్ర అడుగుతుంది మనం ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అవుతామా అని..
దానికి శాంభవి నేను సెలెక్ట్ అయినా రాను అని చెబుతుంది. ఎందుకు రావు అని మిత్ర అడిగితే??
నేను మా అన్నయ్యలను, నాన్నలను, రాముని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెబుతుంది. క్లాస్ కి వెళుతున్న ధరణి ఆ మాటలు విని ఆలోచిస్తూ క్లాస్ కి వెళుతుంది.
హైదరాబాద్...
రుద్ర ఆఫీస్ కి రెడీ అవుతూ ఉండగా సంతోష్ అక్కడికి వచ్చి రుద్రా అని పిలుస్తారు. చెప్పండి డాడీ అంటూ వేళ్ళతో హెయిర్ ని సరి చేస్తూ ఉంటాడు.
రాత్రి పబ్లో జరిగింది తెలిసింది, జాగ్రత్త రుద్ర. వాళ్లు విష నాగులు కన్నా ప్రమాదం అంటే, నీ కొడుకు గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు డాడ్ అంటాడు.
లేదు, రుద్ర మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళు ఎంత ప్రమాదకరం అని చెబుతున్నాను.
వాళ్లు చిమ్మిన విషానికి మీ చిన్న మామయ్య లైఫ్ ఏమయింది?? మీ మామ ఏమి తక్కువ వాడు కాదు కదా!!
అనగానే, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని అడుగుతాడు. మీరు జాగ్రత్త శత్రువుని తక్కువ అంచనా వేయొద్దని చెబుతున్నాను అని చెప్పి, పద ఇప్పటికే లేట్ అయింది అంటూ బయటికి వెళ్తారు.
రుద్ర బయలుదేరగానే, విహాన్ నుంచి కాల్ వస్తుంది..కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అనగానే, బయలుదేరావా అనగానే ఆ స్టార్ట్ అయ్యాను.
డైరెక్ట్ గా టెండర్ ఆఫీసుకు వస్తున్నాను అని చెబుతాడు. ఓకే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దారిలో ధీరజ్ నెక్కించుకుని టెండర్ ఆఫీస్ కి బయలుదేరుతాడు.
గదిలో కూర్చున్న రాఘవేంద్ర గారికి మనసు అంతా గందరగోళంగా ఉంటుంది ఇది అని చెప్పలేని భావం మొదలవుతుంది. రాఘవేంద్ర గారు గది బయటకు వచ్చి జితేంద్ర అని పిలుస్తారు.
ఆఫీస్ కి రెడీ అవుతున్న జితేంద్ర బయటకు వచ్చి ఏమైంది నాన్నగారు అంటే, మనసంతా గందరగోళంగా ఉంది నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దేవేంద్ర కి చెప్పు.
మనం ఇప్పుడే గురువుగారు వద్దకు వెళ్దాం అని చెబుతాడు. దానికి జితేంద్ర గారు పదండి అని చెప్పి, దేవేంద్ర కి ఫోన్ చేసి వర్క్ గురించి చెప్పి.. గురువుగారు ఆశ్రమం ఉన్న శ్రీశైలం వెళ్తారు. (ఆశ్రమం అంతా కల్పితం)
భర్త మాటలు విన్న అనసూయ కి కంగారు వచ్చి కౌసల్యాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళుతుంది.
టెండర్ ఆఫీస్ కి బయలుదేరిన రుద్ర కారుకి పురిటినప్పులతో ఒక అమ్మాయి అడ్డు వస్తుంది. కాపాడండి అని అరుస్తూ ఉంటుంది.
రుద్ర ధీరజ్ కారు దిగి అమ్మాయిని బ్యాక్ సీట్లో పడుకోబెడతారు. ఆ అమ్మాయితో... నీతో ఎవరూ లేరు ఏంటి అని అడుగుతారు.
దానికి అమ్మాయి నా భర్త ఆటో కోసం వెళ్లి ఇంకా రాలేదు అని చెబుతోంది.
అవునా...... అంటూ కారు ని ముందుకు దూకిస్తాడు. ఇంతలో అద్వైత్ ఫోన్ చేసి, మీరు ఇంకా రాలేదేంటి?? మేము వచ్చి చాలా సేపు అయింది. చిన్నాన్న కూడా వచ్చారు అని చెబుతాడు.
దానికి రుద్ర అవునా... చిన్న మామకు మంచి గిఫ్ట్ ఉంది అని చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు.
రుద్ర ఇచ్చే గిఫ్ట్ ఏమిటి??
పురిటి నొప్పులతో బాధపడుతున్న అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేస్తారు??
కథ కొనసాగుతుంది....
శాంభవి తన గదికి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకుని చుడీదార్ లో వస్తుంది. అందరూ బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళుతూ ఉంటారు.
శివప్రసాద్ గారు తన ఆఫీసు రూమ్ కి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలకు సొల్యూషన్స్ చూస్తున్నారు. శివప్రసాద్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో మందు , సిగరెట్ నిషేధం.
భాను ప్రసాద్ గారి పొలం వెళ్లి వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. ఆ ఊరు నుండి, పక్క ఊరు నుండి యువత ఆయన దగ్గరకు వచ్చే సలహాలు తీసుకుంటూ ఉంటారు. ధరణి లెక్చరర్ గా కాలేజ్ కి వెళ్ళింది.
లలిత్, చరణ్, స్వరూప్ కాలేజ్ కి కాలేజెస్ కి వెళ్లి వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేశారు.
శాంభవి కాలేజీకి బయలుదేరగానే శకుంతలాగారు శాంభవి నీ ఆపి చెబుతూ ఉంటారు.
బంగారం తిన్నగా తలవంచుకుని, కాలేజీకి వెళ్లి బాగా చదువుకొని, తలదించుకుని ఇంటికి వచ్చాయి అమ్మ అని చెబుతారు. దానికి శాంభవి అలాగే బామ్మ అని తలు ఊపుతుంది.
అది చూసిన సులోచన పాపం అత్తయ్య గారు బంగారం ఎంతో అమాయకురాలు అనుకుంటున్నారు. అది ఎంత రాక్షసొ నాకు కథ తెలిసింది.
నేను మీకు చెప్పలేను అనుకుంటూ జయంతితో కలిసి లోపలికి వెళ్ళిపోతారు. రామచంద్రయ్య గారు భార్య మనస్సు అర్థమయ్యి నవ్వుకుంటారు.
శాంభవి కాలేజీకి వెళ్లగానే మిత్ర అడుగుతుంది మనం ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అవుతామా అని..
దానికి శాంభవి నేను సెలెక్ట్ అయినా రాను అని చెబుతుంది. ఎందుకు రావు అని మిత్ర అడిగితే??
నేను మా అన్నయ్యలను, నాన్నలను, రాముని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెబుతుంది. క్లాస్ కి వెళుతున్న ధరణి ఆ మాటలు విని ఆలోచిస్తూ క్లాస్ కి వెళుతుంది.
హైదరాబాద్...
రుద్ర ఆఫీస్ కి రెడీ అవుతూ ఉండగా సంతోష్ అక్కడికి వచ్చి రుద్రా అని పిలుస్తారు. చెప్పండి డాడీ అంటూ వేళ్ళతో హెయిర్ ని సరి చేస్తూ ఉంటాడు.
రాత్రి పబ్లో జరిగింది తెలిసింది, జాగ్రత్త రుద్ర. వాళ్లు విష నాగులు కన్నా ప్రమాదం అంటే, నీ కొడుకు గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు డాడ్ అంటాడు.
లేదు, రుద్ర మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళు ఎంత ప్రమాదకరం అని చెబుతున్నాను.
వాళ్లు చిమ్మిన విషానికి మీ చిన్న మామయ్య లైఫ్ ఏమయింది?? మీ మామ ఏమి తక్కువ వాడు కాదు కదా!!
అనగానే, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని అడుగుతాడు. మీరు జాగ్రత్త శత్రువుని తక్కువ అంచనా వేయొద్దని చెబుతున్నాను అని చెప్పి, పద ఇప్పటికే లేట్ అయింది అంటూ బయటికి వెళ్తారు.
రుద్ర బయలుదేరగానే, విహాన్ నుంచి కాల్ వస్తుంది..కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అనగానే, బయలుదేరావా అనగానే ఆ స్టార్ట్ అయ్యాను.
డైరెక్ట్ గా టెండర్ ఆఫీసుకు వస్తున్నాను అని చెబుతాడు. ఓకే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దారిలో ధీరజ్ నెక్కించుకుని టెండర్ ఆఫీస్ కి బయలుదేరుతాడు.
గదిలో కూర్చున్న రాఘవేంద్ర గారికి మనసు అంతా గందరగోళంగా ఉంటుంది ఇది అని చెప్పలేని భావం మొదలవుతుంది. రాఘవేంద్ర గారు గది బయటకు వచ్చి జితేంద్ర అని పిలుస్తారు.
ఆఫీస్ కి రెడీ అవుతున్న జితేంద్ర బయటకు వచ్చి ఏమైంది నాన్నగారు అంటే, మనసంతా గందరగోళంగా ఉంది నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దేవేంద్ర కి చెప్పు.
మనం ఇప్పుడే గురువుగారు వద్దకు వెళ్దాం అని చెబుతాడు. దానికి జితేంద్ర గారు పదండి అని చెప్పి, దేవేంద్ర కి ఫోన్ చేసి వర్క్ గురించి చెప్పి.. గురువుగారు ఆశ్రమం ఉన్న శ్రీశైలం వెళ్తారు. (ఆశ్రమం అంతా కల్పితం)
భర్త మాటలు విన్న అనసూయ కి కంగారు వచ్చి కౌసల్యాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళుతుంది.
టెండర్ ఆఫీస్ కి బయలుదేరిన రుద్ర కారుకి పురిటినప్పులతో ఒక అమ్మాయి అడ్డు వస్తుంది. కాపాడండి అని అరుస్తూ ఉంటుంది.
రుద్ర ధీరజ్ కారు దిగి అమ్మాయిని బ్యాక్ సీట్లో పడుకోబెడతారు. ఆ అమ్మాయితో... నీతో ఎవరూ లేరు ఏంటి అని అడుగుతారు.
దానికి అమ్మాయి నా భర్త ఆటో కోసం వెళ్లి ఇంకా రాలేదు అని చెబుతోంది.
అవునా...... అంటూ కారు ని ముందుకు దూకిస్తాడు. ఇంతలో అద్వైత్ ఫోన్ చేసి, మీరు ఇంకా రాలేదేంటి?? మేము వచ్చి చాలా సేపు అయింది. చిన్నాన్న కూడా వచ్చారు అని చెబుతాడు.
దానికి రుద్ర అవునా... చిన్న మామకు మంచి గిఫ్ట్ ఉంది అని చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు.
రుద్ర ఇచ్చే గిఫ్ట్ ఏమిటి??
పురిటి నొప్పులతో బాధపడుతున్న అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేస్తారు??
కథ కొనసాగుతుంది....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)