20-03-2026, 11:48 AM
Part - 8
రేపల్లె...
శాంభవి ఉదయం నాలుగు గంటలకు లేచి, యోగా చేసి, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బయటకు రాగానే మంచం మీద పెట్టి ఉన్న లంగా వోని చూసిన నవ్వుకొని అది వేసుకొని దాని మ్యాచింగ్ సెట్ కూడా పెట్టుకుని పూజ గది దగ్గరికి వస్తుంది.
శాంభవి అన్ని పూర్తి చేసుకుని కిందకి వచ్చేటప్పటికి ఉదయం 6:00 అవుతుంది. శకుంతల బామ్మ రామాయణం చదువుతుంటే,, అత్తగారి అడుగుజాడల్లో నడుస్తున్న సులోచన గారు పూజ చేస్తున్నారు.జయంతి, ధరణి అన్ని అందిస్తున్నారు.
పూజ గది దగ్గరికి వస్తున్న శాంభవి అందెల శబ్దానికి అందరూ శాంభవి వైపు చూసి బొమ్మల్లాగా నిలబడతారు.
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్టు,
రవివర్మ కుంచె కు ప్రాణం పోసినట్టు,
లేలేత సూర్యకిరణాలకు విరిసిన తామర పువ్వు వలె,
వెన్నెల వెలుగులో విరిసిన కమలాన్ని చూసినట్టు, అందరూ ఒక అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తున్నారు.
శాంభవి కిందకి వచ్చే రాము అని వాళ్ళ తాతగారైన రామచంద్రయ్య గారిని పిలిచి నేను ఎలా ఉన్నాను అని బొంగరం లాగా తిరుగుతూ అడుగుతుంది.
దానికి రామచంద్రయ్య గారు మురిసిపోతూ సులోచన గారిని పిలిచి మనరాలికి దిష్టి చుక్క పెట్టిస్తారు.
శివప్రసాద్, భాను ప్రసాదులు కూతుర్ని చూసి మురిసిపోతారు.
అది అంతా చూస్తున్న శకుంతల గారు సంతోషించిన వెంటనే గంభీరంగా శాంభవిని పిలిచి అన్నమయ్య కీర్తనలో ఒక కీర్తన పాడించి పూజ పూర్తి చేస్తారు.
పూజ టైం కి కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా ఉండాలని శకుంతల బామ్మ ఆర్డర్. కాబట్టి అందరూ ఆ టైం కి పూజ దగ్గర ఉంటారు.
.,.......,..... ........................
హైదరాబాద్...
రుద్ర ఇంటికి వెళ్లగానే ఆగు అనే ఒక అరుపు వినిపిస్తుంది. ఎవరబ్బా అని చూసిన రుద్రా కి తులసి గారు కోపంగా కనిపిస్తారు.
ఏమైంది నా డార్లింగ్ కి, అని అడుగుతూ లోపలికి వస్తాడు.
తులసి గారు కోపంగా చూస్తూ, రాత్రి అంత ఎక్కడికి వెళ్లావు? ఎవరితో ఉన్నావు? ఇప్పుడు ఇంటికి వచ్చేది అని గట్టిగా అడుగుతారు.
ఏంటి అని కళ్ళు చిన్నవి చేసే తులసి గారిని చూస్తాడు. తులసి గారు సైగ చేస్తూ రుద్ర వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. రుద్ర వాళ్ళ అమ్మగారు అయిన చారులత గారు కోపంగా కిచెన్ హడలు కొట్టిస్తున్నారు.
దానికి రుద్రా చిన్న స్మైల్ తో నైట్ వర్క్ ఎక్కువ అయితే,, బావలతో కలిసి బృందావనం వెళ్లాను అని చారులత గారికి వినబడేటట్టు చెబుతాడు.
దానికి చారులత గారు కోపం పాలపొంగు వలె చల్లారిపోయి గబగబా బయటకు వస్తారు.
ఆవిడని అలా చూసిన రుద్ర నాన్నగారు అయినా సంతోష్, కొడుకుని చూసి, అమ్మ నా కొడకా మీ అమ్మ వీక్నెస్ మీద కొట్టావు కదా! ఇప్పుడు నేను ఏమీ మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటూ, పేపర్ చదువుతూ ఉంటారు .
చారులత గారు రుద్ర దగ్గరికి వచ్చి అందరూ ఎలా ఉన్నారు? నాన్నగారులు ఏమైనా మార్పు వచ్చిందా?? నాన్న, చిన్నన్నయ్య అమ్మతో మాట్లాడుతున్నారా? అని ఆత్రంగా అడుగుతారు.
చారులత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆవిడకి తెలిసిన సరే, ఏదైనా మార్పు వచ్చిందేమో అని ఆరాటం.
కోడలి ఆరాటం చూసిన తులసి గారు, అన్ని నీకు తెలిసి కూడా ఎందుకే ఇంత బాధ... ఈ సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది అని అంటారు. అంతే కదా అత్తయ్య గారు అని కిచెన్ లోకి వెళతారు .
రుద్ర వాళ్ళ అమ్మగారిని చూస్తూ ఈ సమస్యకు సొల్యూషన్ లేదా గ్రానీ అని అడుగుతాడు.
సమస్య ఉన్న చోట సమాధానం కూడా ఉంటుంది. కొన్ని సమస్యలకు సమాధానం వెంటనే దొరుకుతుంది.కొన్ని సమస్యలకు సమయం పడుతుంది..
ఆ పరిష్కారం కోసమే మీ అమ్మ, అత్తయ్య చెయ్యని పూజ లేదు. మొక్కని దేవుడు లేడు.
ప్రతి ఒక్కరూ ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అని చెబుతారు.
అంతా వింటున్నా రుద్ర సరే గ్రానీ అని, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళతాను.
ఈరోజు న్యూ ప్రాజెక్ట్ గురించి టెండర్ ఉంది అని చెబుతాడు.
ఎవరు మనకు కాంపిటేటర్ అంటే ఇంకెవరు ఆ మయూరి అని చెబుతాడు. దానికి తులసి గారు ముఖం వికారంగా పెట్టుకొని పాపి చిరాయువు అని మయూరి, నాగేంద్ర ను చూసే చెప్పొచ్చు అంటారు.
ప్రాజెక్ట్ టెండర్ ఎవరికి వస్తుంది??
శాంభవి ఉదయం నాలుగు గంటలకు లేచి, యోగా చేసి, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బయటకు రాగానే మంచం మీద పెట్టి ఉన్న లంగా వోని చూసిన నవ్వుకొని అది వేసుకొని దాని మ్యాచింగ్ సెట్ కూడా పెట్టుకుని పూజ గది దగ్గరికి వస్తుంది.
శాంభవి అన్ని పూర్తి చేసుకుని కిందకి వచ్చేటప్పటికి ఉదయం 6:00 అవుతుంది. శకుంతల బామ్మ రామాయణం చదువుతుంటే,, అత్తగారి అడుగుజాడల్లో నడుస్తున్న సులోచన గారు పూజ చేస్తున్నారు.జయంతి, ధరణి అన్ని అందిస్తున్నారు.
పూజ గది దగ్గరికి వస్తున్న శాంభవి అందెల శబ్దానికి అందరూ శాంభవి వైపు చూసి బొమ్మల్లాగా నిలబడతారు.
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్టు,
రవివర్మ కుంచె కు ప్రాణం పోసినట్టు,
లేలేత సూర్యకిరణాలకు విరిసిన తామర పువ్వు వలె,
వెన్నెల వెలుగులో విరిసిన కమలాన్ని చూసినట్టు, అందరూ ఒక అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తున్నారు.
శాంభవి కిందకి వచ్చే రాము అని వాళ్ళ తాతగారైన రామచంద్రయ్య గారిని పిలిచి నేను ఎలా ఉన్నాను అని బొంగరం లాగా తిరుగుతూ అడుగుతుంది.
దానికి రామచంద్రయ్య గారు మురిసిపోతూ సులోచన గారిని పిలిచి మనరాలికి దిష్టి చుక్క పెట్టిస్తారు.
శివప్రసాద్, భాను ప్రసాదులు కూతుర్ని చూసి మురిసిపోతారు.
అది అంతా చూస్తున్న శకుంతల గారు సంతోషించిన వెంటనే గంభీరంగా శాంభవిని పిలిచి అన్నమయ్య కీర్తనలో ఒక కీర్తన పాడించి పూజ పూర్తి చేస్తారు.
పూజ టైం కి కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా ఉండాలని శకుంతల బామ్మ ఆర్డర్. కాబట్టి అందరూ ఆ టైం కి పూజ దగ్గర ఉంటారు.
.,.......,..... ........................
హైదరాబాద్...
రుద్ర ఇంటికి వెళ్లగానే ఆగు అనే ఒక అరుపు వినిపిస్తుంది. ఎవరబ్బా అని చూసిన రుద్రా కి తులసి గారు కోపంగా కనిపిస్తారు.
ఏమైంది నా డార్లింగ్ కి, అని అడుగుతూ లోపలికి వస్తాడు.
తులసి గారు కోపంగా చూస్తూ, రాత్రి అంత ఎక్కడికి వెళ్లావు? ఎవరితో ఉన్నావు? ఇప్పుడు ఇంటికి వచ్చేది అని గట్టిగా అడుగుతారు.
ఏంటి అని కళ్ళు చిన్నవి చేసే తులసి గారిని చూస్తాడు. తులసి గారు సైగ చేస్తూ రుద్ర వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. రుద్ర వాళ్ళ అమ్మగారు అయిన చారులత గారు కోపంగా కిచెన్ హడలు కొట్టిస్తున్నారు.
దానికి రుద్రా చిన్న స్మైల్ తో నైట్ వర్క్ ఎక్కువ అయితే,, బావలతో కలిసి బృందావనం వెళ్లాను అని చారులత గారికి వినబడేటట్టు చెబుతాడు.
దానికి చారులత గారు కోపం పాలపొంగు వలె చల్లారిపోయి గబగబా బయటకు వస్తారు.
ఆవిడని అలా చూసిన రుద్ర నాన్నగారు అయినా సంతోష్, కొడుకుని చూసి, అమ్మ నా కొడకా మీ అమ్మ వీక్నెస్ మీద కొట్టావు కదా! ఇప్పుడు నేను ఏమీ మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటూ, పేపర్ చదువుతూ ఉంటారు .
చారులత గారు రుద్ర దగ్గరికి వచ్చి అందరూ ఎలా ఉన్నారు? నాన్నగారులు ఏమైనా మార్పు వచ్చిందా?? నాన్న, చిన్నన్నయ్య అమ్మతో మాట్లాడుతున్నారా? అని ఆత్రంగా అడుగుతారు.
చారులత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆవిడకి తెలిసిన సరే, ఏదైనా మార్పు వచ్చిందేమో అని ఆరాటం.
కోడలి ఆరాటం చూసిన తులసి గారు, అన్ని నీకు తెలిసి కూడా ఎందుకే ఇంత బాధ... ఈ సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది అని అంటారు. అంతే కదా అత్తయ్య గారు అని కిచెన్ లోకి వెళతారు .
రుద్ర వాళ్ళ అమ్మగారిని చూస్తూ ఈ సమస్యకు సొల్యూషన్ లేదా గ్రానీ అని అడుగుతాడు.
సమస్య ఉన్న చోట సమాధానం కూడా ఉంటుంది. కొన్ని సమస్యలకు సమాధానం వెంటనే దొరుకుతుంది.కొన్ని సమస్యలకు సమయం పడుతుంది..
ఆ పరిష్కారం కోసమే మీ అమ్మ, అత్తయ్య చెయ్యని పూజ లేదు. మొక్కని దేవుడు లేడు.
ప్రతి ఒక్కరూ ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అని చెబుతారు.
అంతా వింటున్నా రుద్ర సరే గ్రానీ అని, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళతాను.
ఈరోజు న్యూ ప్రాజెక్ట్ గురించి టెండర్ ఉంది అని చెబుతాడు.
ఎవరు మనకు కాంపిటేటర్ అంటే ఇంకెవరు ఆ మయూరి అని చెబుతాడు. దానికి తులసి గారు ముఖం వికారంగా పెట్టుకొని పాపి చిరాయువు అని మయూరి, నాగేంద్ర ను చూసే చెప్పొచ్చు అంటారు.
ప్రాజెక్ట్ టెండర్ ఎవరికి వస్తుంది??


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)