20-03-2026, 11:47 AM
Part - 7
పబ్ నుంచి అబ్బాయిల నలుగురు ఇంటిదారి పట్టారు. నలుగురు డ్రింక్ చేసి ఉండడం వల్ల డ్రైవర్ వచ్చి వాళ్ళ నలుగురిని ఒకే మాన్షన్ లోనికి తీసుకు వెళ్ళాడు.
పొద్దుట సుప్రభాతంతో మెలకువ వచ్చినా నలుగురు ఒకరి తర్వాత ఒకరు లేచి కిందకు వచ్చారు.
కిందకు వచ్చిన నలుగురు పూజ చేసుకుని వచ్చిన కౌసల్య గారిని చూసి గుడ్ మార్నింగ్ అమ్మ అని విహాన్ అద్వైత్ చెబితే , గుడ్ మార్నింగ్ అత్తయ్య అని R. D, గుడ్మార్నింగ్ ఆంటీ అని ధీరజ్ ఒకేసారి చెబుతారు.
నలుగురిని ఒక చూపు చూసి సర్వెంట్ అయినా కాంతాన్ని పిలుస్తుంది. కాంతం నిమ్మకాయలు పిండిన నాలుగు మజ్జిగ గ్లాసులు తెస్తుంది.
తాగండి అని కౌసల్య గారు చెప్పగానే నలుగురు మాట్లాడకుండా తాగేస్తారు.
అప్పుడే వాకింగ్ పూర్తి చేసుకుని లోపలకు వచ్చిన జితేంద్ర గారు, దేవేంద్ర గారు ఏరా తాగింది దిగిందా అని కోపాన్ని నటిస్తూ అడుగుతారు.
నలుగురు బుద్ధిమంతుల్లాగా తలూపుతారు . రాత్రి పబ్బులో జరిగింది మాకు తెలిసింది.
వాళ్లతో జాగ్రత్త వాళ్ళు విష నాగులు కన్న ప్రమాదం అని దేవేంద్ర గారు పిడికిలి బిగిస్తారు. జితేంద్ర గారు తమ్ముడు భుజం మీద చేయి వేసి ప్రెస్ చేస్తారు.
అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన అనసూయ గారు మనవళ్ళు ని చూసి పలకరిస్తారు. కొడుకులు వైపు చూస్తారు.
దేవేంద్ర గారు తల్లిని చూసి మౌనంగా అక్కడ నుండి వెళ్లిపోతారు. అది చూసి అనసూయ గారు చాలా బాధపడతారు. తన మూర్ఖత్వం వలన ఎలాంటి ఇల్లు ఎలా అయిపోయిందని బాధపడుతూ పూజ గది వైపు చూస్తారు.
పూజగది అంతా నిండు అలంకరణలతో, నైవేద్యాలతో నిండి ఉంటుంది.
కానీ చిరునవ్వు లేని పసిపాప మొఖం వలె ఆ పూజ గదిలో దీపారాధన ఉండదు. అనసూయ పూజ గదిని చూస్తూ, పక్కనే ఉన్న ఫోటోను చూసి బాధతో ఆవిడ చేసిన తప్పుకి కృంగిపోతారు. ఆ ఫోటోకి దండ వేసి ఉంటుంది.
R. D వాళ్ళ అమ్మమ్మగారి చెయ్యి మెత్తగా నొక్కి, తాతయ్య ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. దానికి అనసూయ గారు రోజు ఈ టైంకి మీ తాతగారు గార్డెన్ లోనే ఉంటారు అక్కడే ఉన్నారు అని చెబుతారు.
R. D గార్డెన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ తాతగారైన రాఘవేంద్ర గారిని చూసి పలకరిస్తాడు. రాఘవేంద్ర గారు మనవడిని చూసి రా రుద్ర ఎంతసేపైంది అని అడుగుతారు.
రాత్రి వచ్చాను మిమ్మల్ని పలకరించి ఇంటికి వెళదామని ఆగాను అని చెబుతాడు. దానికి రాఘవేంద్ర గారు చిరు మందహాసం చేస్తారు.
రుద్ర వాళ్ళ తాత గారిని అడుగుతాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా అని?? దేని గురించి రుద్రా అని రాఘవేంద్ర గారు అడుగుతారు.
ఏమీ తెలియని వారి వల్ల అడగకండి అంటే, దానికి రాఘవేంద్ర గారు ఒక నిట్టూర్పు విడిచి, ఇలారా అని రుద్ర చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తారు.
తిన్నగా పూజ గది దగ్గరికి తీసుకువెళ్లి పూజ గదిని చూపిస్తారు. అందరూ రాఘవేంద్ర గారిని పూజగదిని చూస్తారు.
ఈ పూజ గదిలో దీపం వెలిగి 21 సంవత్సరాలు అయింది. ఈ పూజ గది అనే కాదు, మనకు సంబంధించిన ఏ సంస్థలో కూడా ఎక్కడా కూడా దీపం వెలగడం లేదు. మన ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో కూడా ఎక్కడా కూడా దీపం వెలగడం లేదు.
దీనికి కారణం ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు. దేవేంద్రకు జరిగిన అన్యాయాన్ని నేను ఎలాగా తీర్చలేను.
కానీ, మనకు సంబంధించిన ప్రతి చోట దీపాలు వెలిగి, నా కొడుకు కళ్ళల్లో సంతోషం చూసిన రోజున నేను ఈ మౌనాన్ని వదులుతాను.
ఈ సంతోషాన్ని వెనక్కి తీసుకువచ్చే బాధ్యత నా ముగ్గురు మనవళ్ళు మీద పెడుతున్నాను అని చెప్పి లోపలికి వెళ్లి పోతారు.
అక్కడి వాతావరణం అంతా గంభీరంగా ఉంటుంది. ఆ వాతావరణం తేలిక చేయడానికి ధీరజ్ అవును బావ, రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా! మరి ఆంటీకు ఫోన్ చేసి చెప్పావా అని రుద్రవంక చూసి ఐ బ్లింక్ చేస్తాడు.
దానికి రుద్రపళ్ళునూరుతూ నాకు తెలుసు. మా అమ్మని, నా డార్లింగ్ ని ఎలా కూల్ చేయాలో అని చెబుతూ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళతాడు.
ధీరజ్ కూడా అందరికీ బాయ్ చెప్పి బయటకు వెళుతూ, ఎంట్రన్స్ గేటు మీద ఉన్న బృందావనం అనే పేరు చూసి, ఇంటిపేరు బృందావనం.
పేరుకు తగ్గట్టు అన్ని ఉన్నాయి కానీ, సంతోషం లేదు. అనుకుంటూ వెళ్ళిపోతాడు.
రాఘవేంద్ర గారి మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటి??
బృందావనంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏమిటి??


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)