18-03-2026, 02:51 PM
కలుపుకుంటే కలదు సుఖం!
రచన: విజయా సుందర్
పచ్చగా పేడతో అలికిన వాకిట్లో ముత్యాల ముగ్గులు, దారికిరువైపులా స్వాగతం చెప్తూ పచ్చని బంతిపూలు విరగబూసి ఉన్నాయి. మిరపమందార, ముద్దామందార, గరుడవవర్ధని, నందివర్ధని, మెట్టతామర పూలతో కలకళలాడుతూ, కల్మషమెరుగని కన్నెపిల్లలా సోయగాలు విరజిమ్ముతున్నది ఆ లోగిలి!
గడప గౌరి పసుపు కుంకుమలతో నిండి, వాకిలి కి కట్టిన పచ్చని మామిడి ఆకులు, బంతిపూల తోరణంతో పండు ముత్తయిదువులా పకపకలాడుతున్నది ఆ లోగిలి!
జడగంటలు ఊపుకుంటూ, పచ్చని లంగా, ఎర్రని జరీ అంచు జాకెట్టు, ఎర్రని ఓణీలతో, నిండు యవ్వనం తొణికిసలాడే పడుచు పిల్ల పకపకలాడుతూ, ఎదురు వచ్చింది, అప్పుడే ఆ గడపలో కాలు పెడుతున్న ఆ ఇంటి ఆడబడుచు నీలవేణికి. వెనకాలే టాక్సీకి డబ్బులు ఇచ్చి వస్తున్నాడు ఆ ఇంటి అల్లుడు, నీలవేణి భర్త శ్యాంసుందర్.
"అమ్మా! అత్తయ్యా మామయ్య వచ్చారే" అత్త చేతిలో బాగ్ అందుకుంటూ లోపలికి కేక వేస్తున్న మేనకోడలిని మురిపెంగా చూస్తూ నీలవేణి, "ఎంత పొడుగయ్యావే?" అంటూ బుగ్గలు పుణికింది.
"అంతా నీ పోలికే అంటారు అత్తా" అంటూ అత్తని ఇష్టంగా చూస్తూ అన్నది స్నిగ్ధ.
పెద్ద వదినగారు సుమిత్ర చెంగుకి చేతులు తుడుచుకుంటూ ఆడబడుచుని అక్కున చేర్చుకుని, కొంగు కప్పుకుంటూ, ఇంటి అల్లుడి యోగక్షేమాలనడిగింది.
మెల్లిగా తల్లి రాజేశ్వరి, తండ్రి రామారావు, పెద్దఆన్నగారు శేషాద్రి, చిన్న అన్న సాకేత్, చిన్న వదిన రమ్య, వాళ్ళ అబ్బాయి రవి, కూతురు లాస్య, పెద్దన్నగారి కొడుకు పార్థు... అంతా బిలల్లాడుతూ వచ్చారు.
ఉగాది పండుగ అంతా వాళ్ళింట్లోనే ఉన్నదా అన్నట్లు అందరూ హాసపరిహాసాలతో, తలా ఒక పని చేసుకుంటూ, తోటి కోడళ్లద్దరూ మడి కట్టుకుని అత్తగారు చెప్పినట్లు చేస్తూ, అరమరికలు లేకుండా నవకాయ పిండివంటల్తో వంటలు చేశారు. మగవాళ్ళు, అత్తగారు, పిల్లలకి తీరుగా అరిటాకులు వేసి వడ్డించి వాళ్లంతా తిని లేచాక, తోటికోడళ్లు, ఆడబడుచు కూర్చున్నారు భోజనాలకి.
"నువ్వు కూడా వాళ్ళందరితో కూర్చుని తినవమ్మా అంటే తిన్నావు కాదు. చూడు రెండు దాటిపోయింది. " పెద్ద వదిన సుమిత్ర మరదలిని చిన్నగా మందలిస్తూ అన్నది.
"ఆ అమ్మా! అక్కచెల్లెలిద్దరూ మాకు వేయకుండా ఏమి దాచిపెట్టి వేసుకుంటున్నారో చూడద్దూ!" నీలవేణి మేలమాడింది.
పెద్ద వదిన తల మీద చిన్నగా మొట్టి, " మేమేం తింటున్నామో చూస్తావు కదూ... ఇదిగో.. ఈ పెద్ద బొబ్బట్టు నీకోసం ప్రత్యేకంగా చేసా. ఆపకుండా తినాలి" సుమిత్ర కూడా మరదలిని ఆట పట్టించడం మొదలెట్టింది.
చిన్న వదిన రమ్య, "పిల్లల్ని ఎప్పుడూ తేవేమిటి నీలా?" అన్నది.
"మహేష్ ఇప్పుడు జాబ్ మారాడు. కొత్తది కదా సెలవు పెట్టే వీలు లేదని వాడు రాలేదు. ఇంక సుస్మితకి ఫైనల్ పరీక్షలు బాగా దగ్గరకొచ్చాయి అని, అది రాలేదు... అంటే వదినా".
"సుస్మిత ఏమి చదువుతున్నదే"? అక్కడే ముక్కాలి పీట మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ, వీళ్ల మాటల్లో అప్పుడప్పుడు మాట కలుపుతున్న తల్లి ఆడిగిందానికి, "నువ్వెప్పుడూ మర్చిపోతూనే ఉంటావు మనవరాలి చదువు. అదిప్పుడు ఎం. టెక్ చేస్తున్నది. " అన్నది.
సరదాగా వదినా మరదళ్ళు ఛలోక్తులతో భోజనాలు చేసారు.
***
ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా, అల్పాహారాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్ల మీదకి పోయింది సంభాషణ.
పెద్ద అన్నయ్య శేషాద్రి, " అమ్మాయ్ నీలా! ఈ ఏడాది ఆడపిల్లలు లాస్య, స్నిగ్ధ ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలని నాన్నగారు తీర్మానించారు.... అని మాట్లాడబోతుంటే రామారావుగారు అందుకుని, "చెప్పవే అమ్మడూ! నీ కొడుక్కి ఏ మేనగోడల్ని చేసుకుంటావో?" అన్నారు.
ఇంత సడన్ గా, ఇంత సూటిగా తండ్రి ప్రశ్నిస్తుంటే నీలవేణి ఖంగుతిన్నది. ఒక్క నిమిషం తమాయించుకుని, "నన్ను అడుగుతారేమిటి నాన్నగారు? మీ అల్లుడు పక్కనే ఉన్నారుగా... ఆయన్ని అడగండి " అన్నది.
బాధ్యత అంతా తన మీదకి నెట్టేసి తప్పించుకున్న భార్యని కొరకొరా చూసి, సమాధానం కోసం చూస్తున్న మావగారితో, "ఇంకా ఇప్పుడే అనుకోవడం లేదండీ. అయినా ఎప్పుడయినా వాడి ఇష్టమే" అంటూ ఆయనా తప్పించుకున్నాడు.
ఇంతలో లాస్య చేతిలో సెల్ మోగింది.
మహేష్ ఫోన్ చేసాడు... లాస్య అవతలి రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతుంటే, రమ్య కూడా లేచి వెళ్ళింది...
ఇటీవల లాస్య అర్థరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన రమ్య ఆమె సెల్ ఫోన్ లో హిస్టరీ అంతా చూసింది. మహేష్ దగ్గర నుండి రోజూ కాల్స్ ఉండటం చూసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ దిశగా మాట్లాడుతున్నారు... అసలు సంగతి తెలుసుకుందామని లేచింది.
రచన: విజయా సుందర్
పచ్చగా పేడతో అలికిన వాకిట్లో ముత్యాల ముగ్గులు, దారికిరువైపులా స్వాగతం చెప్తూ పచ్చని బంతిపూలు విరగబూసి ఉన్నాయి. మిరపమందార, ముద్దామందార, గరుడవవర్ధని, నందివర్ధని, మెట్టతామర పూలతో కలకళలాడుతూ, కల్మషమెరుగని కన్నెపిల్లలా సోయగాలు విరజిమ్ముతున్నది ఆ లోగిలి!
గడప గౌరి పసుపు కుంకుమలతో నిండి, వాకిలి కి కట్టిన పచ్చని మామిడి ఆకులు, బంతిపూల తోరణంతో పండు ముత్తయిదువులా పకపకలాడుతున్నది ఆ లోగిలి!
జడగంటలు ఊపుకుంటూ, పచ్చని లంగా, ఎర్రని జరీ అంచు జాకెట్టు, ఎర్రని ఓణీలతో, నిండు యవ్వనం తొణికిసలాడే పడుచు పిల్ల పకపకలాడుతూ, ఎదురు వచ్చింది, అప్పుడే ఆ గడపలో కాలు పెడుతున్న ఆ ఇంటి ఆడబడుచు నీలవేణికి. వెనకాలే టాక్సీకి డబ్బులు ఇచ్చి వస్తున్నాడు ఆ ఇంటి అల్లుడు, నీలవేణి భర్త శ్యాంసుందర్.
"అమ్మా! అత్తయ్యా మామయ్య వచ్చారే" అత్త చేతిలో బాగ్ అందుకుంటూ లోపలికి కేక వేస్తున్న మేనకోడలిని మురిపెంగా చూస్తూ నీలవేణి, "ఎంత పొడుగయ్యావే?" అంటూ బుగ్గలు పుణికింది.
"అంతా నీ పోలికే అంటారు అత్తా" అంటూ అత్తని ఇష్టంగా చూస్తూ అన్నది స్నిగ్ధ.
పెద్ద వదినగారు సుమిత్ర చెంగుకి చేతులు తుడుచుకుంటూ ఆడబడుచుని అక్కున చేర్చుకుని, కొంగు కప్పుకుంటూ, ఇంటి అల్లుడి యోగక్షేమాలనడిగింది.
మెల్లిగా తల్లి రాజేశ్వరి, తండ్రి రామారావు, పెద్దఆన్నగారు శేషాద్రి, చిన్న అన్న సాకేత్, చిన్న వదిన రమ్య, వాళ్ళ అబ్బాయి రవి, కూతురు లాస్య, పెద్దన్నగారి కొడుకు పార్థు... అంతా బిలల్లాడుతూ వచ్చారు.
ఉగాది పండుగ అంతా వాళ్ళింట్లోనే ఉన్నదా అన్నట్లు అందరూ హాసపరిహాసాలతో, తలా ఒక పని చేసుకుంటూ, తోటి కోడళ్లద్దరూ మడి కట్టుకుని అత్తగారు చెప్పినట్లు చేస్తూ, అరమరికలు లేకుండా నవకాయ పిండివంటల్తో వంటలు చేశారు. మగవాళ్ళు, అత్తగారు, పిల్లలకి తీరుగా అరిటాకులు వేసి వడ్డించి వాళ్లంతా తిని లేచాక, తోటికోడళ్లు, ఆడబడుచు కూర్చున్నారు భోజనాలకి.
"నువ్వు కూడా వాళ్ళందరితో కూర్చుని తినవమ్మా అంటే తిన్నావు కాదు. చూడు రెండు దాటిపోయింది. " పెద్ద వదిన సుమిత్ర మరదలిని చిన్నగా మందలిస్తూ అన్నది.
"ఆ అమ్మా! అక్కచెల్లెలిద్దరూ మాకు వేయకుండా ఏమి దాచిపెట్టి వేసుకుంటున్నారో చూడద్దూ!" నీలవేణి మేలమాడింది.
పెద్ద వదిన తల మీద చిన్నగా మొట్టి, " మేమేం తింటున్నామో చూస్తావు కదూ... ఇదిగో.. ఈ పెద్ద బొబ్బట్టు నీకోసం ప్రత్యేకంగా చేసా. ఆపకుండా తినాలి" సుమిత్ర కూడా మరదలిని ఆట పట్టించడం మొదలెట్టింది.
చిన్న వదిన రమ్య, "పిల్లల్ని ఎప్పుడూ తేవేమిటి నీలా?" అన్నది.
"మహేష్ ఇప్పుడు జాబ్ మారాడు. కొత్తది కదా సెలవు పెట్టే వీలు లేదని వాడు రాలేదు. ఇంక సుస్మితకి ఫైనల్ పరీక్షలు బాగా దగ్గరకొచ్చాయి అని, అది రాలేదు... అంటే వదినా".
"సుస్మిత ఏమి చదువుతున్నదే"? అక్కడే ముక్కాలి పీట మీద కూర్చుని వత్తులు చేసుకుంటూ, వీళ్ల మాటల్లో అప్పుడప్పుడు మాట కలుపుతున్న తల్లి ఆడిగిందానికి, "నువ్వెప్పుడూ మర్చిపోతూనే ఉంటావు మనవరాలి చదువు. అదిప్పుడు ఎం. టెక్ చేస్తున్నది. " అన్నది.
సరదాగా వదినా మరదళ్ళు ఛలోక్తులతో భోజనాలు చేసారు.
***
ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా, అల్పాహారాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్ల మీదకి పోయింది సంభాషణ.
పెద్ద అన్నయ్య శేషాద్రి, " అమ్మాయ్ నీలా! ఈ ఏడాది ఆడపిల్లలు లాస్య, స్నిగ్ధ ఇద్దరికీ పెళ్లిళ్లు చెయ్యాలని నాన్నగారు తీర్మానించారు.... అని మాట్లాడబోతుంటే రామారావుగారు అందుకుని, "చెప్పవే అమ్మడూ! నీ కొడుక్కి ఏ మేనగోడల్ని చేసుకుంటావో?" అన్నారు.
ఇంత సడన్ గా, ఇంత సూటిగా తండ్రి ప్రశ్నిస్తుంటే నీలవేణి ఖంగుతిన్నది. ఒక్క నిమిషం తమాయించుకుని, "నన్ను అడుగుతారేమిటి నాన్నగారు? మీ అల్లుడు పక్కనే ఉన్నారుగా... ఆయన్ని అడగండి " అన్నది.
బాధ్యత అంతా తన మీదకి నెట్టేసి తప్పించుకున్న భార్యని కొరకొరా చూసి, సమాధానం కోసం చూస్తున్న మావగారితో, "ఇంకా ఇప్పుడే అనుకోవడం లేదండీ. అయినా ఎప్పుడయినా వాడి ఇష్టమే" అంటూ ఆయనా తప్పించుకున్నాడు.
ఇంతలో లాస్య చేతిలో సెల్ మోగింది.
మహేష్ ఫోన్ చేసాడు... లాస్య అవతలి రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతుంటే, రమ్య కూడా లేచి వెళ్ళింది...
ఇటీవల లాస్య అర్థరాత్రి దాకా ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన రమ్య ఆమె సెల్ ఫోన్ లో హిస్టరీ అంతా చూసింది. మహేష్ దగ్గర నుండి రోజూ కాల్స్ ఉండటం చూసింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ దిశగా మాట్లాడుతున్నారు... అసలు సంగతి తెలుసుకుందామని లేచింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)