18-03-2026, 07:15 AM
Part - 4
R. D క్యాబిన్ లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరిని చూసి, ఏంటి బావలిద్దరికీ గాలి ఇటు మళ్ళింది. మీ క్యాబిన్ వదిలేసి నా క్యాబిల్లోకి దూరారు అని వెటకారంగా అడుగుతాడు.
వాళ్ళిద్దరూ అంత వెటకారం వద్దులే బావ. వర్క్ బిజీ లో పడి వీకెండ్ పార్టీ మిస్ అవుతున్నాం. సో ఈవినింగ్ వెళదామని నీతో చెప్పడానికి వచ్చాము అని చెబుతారు.
రుద్ర దేవాన్ష్ గజపతి ( R. D) వాళ్లకి ఓకే చెప్పి, అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు?? అని అడుగుతాడు. దానికి బావలు ఇద్దరు నిట్టూర్చి అలాగే ఉన్నారు అంటారు.
దానికి R. D నిట్టూర్చి ఈ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ వెతకాలి. ఆ పర్సన్ ఎవరో గాని తొందరగా వెతకాలి అని అంటాడు. దానికి ఇద్దరూ అవును అని తలూపుతారు.
అప్పుడే లోపలికి వచ్చిన ధీరజ్, వీళ్లిద్దరినీ చూసి గుడ్ మార్నింగ్ విహాన్ సార్, గుడ్ మార్నింగ్ అద్వైత్ సార్ అని చెబుతాడు.
దానికి ఇద్దరూ ఏరా బలిసిందా అని అడుగుతారు. దానికి ధీరజ్ లేదు సార్, మీ అంత కాదు సార్ ఏదో కొంచమే, అని వినయానికే వినయంగా చెబుతాడు.
వెంటనే ఇద్దరూ లేచి ఒకరు మెడ మీద చేతులు వేస్తే, ఇంకొకరు పొట్టలో గుద్దుతారు. అబ్బా ప్లీజ్ నన్ను వదలండి. పొద్దుట మీ బావ యముడికి హాయ్ చెప్పించాడు, ఇప్పుడు మీరు గెలాక్సీ చూపిస్తున్నారు. ప్లీజ్ నన్ను వదలండి బాబు అని రిక్వెస్ట్ చేస్తాడు. అలారా దారికి! ఈవినింగ్ రెడీగా ఉండు పబ్ కి వెళదామని చెబుతారు.
మనం మళ్లీ రేపల్లె వెళదాము....
శకుంతల బామ్మ గారు సులోచనను గట్టిగా పిలిచి అడుగుతారు బంగారం ఎక్కడ అని అ?? ది అత్తయ్య మరేమో అని నసుకుతూ ఉంటారు.. ఏమైంది అని అడుగుతుంటే వెంటనే నాని (సాంబ కొడుకు )వచ్చి సులోచన గారికి హింట్ ఇస్తాడు.
బంగారం గుడికి వెళ్లి అటు నుంచి అంటే కాలేజీకి వెళుతుందని అని చెబుతాడు. వెంటనే సులోచన గారు పాఠం చెప్పినట్టు గబగబా చెబుతారు.
దానికి బామ్మగారు మురిసిపోతూ బంగారం ఎప్పుడూ బంగారమే. అని గొడవ అంతా మర్చిపోయి భగవద్గీత తెరుస్తారు. సులోచన గారు ఊపిరి తీసుకుని మెల్లగా లోపలికి వెళ్తారు.
అత్తగారి అవస్థలు చూసి జయంతి, ధరణి ముసిముసి నవ్వులు నవ్వుతారు. అది చూసి సులోచన గారు ఉడుక్కుంటూ నవ్వండి, బాగా నవ్వండి . మీ ఇద్దరికీ మా అత్తగారి లాంటి అత్తగారు రాక నేను అలసిపోయానని మూతి ముడుచుకుంటారు.
వెంటనే కోడలు ఇద్దరు అత్తగారిని పట్టుకుని మా అత్తగారు సో స్వీట్, మీరు ఇలా మూతి ముడిస్తే మావయ్య గారికి చాలా కష్టమని అల్లరి చేస్తూ ఉంటారు.
దానికి సులోచన గారు సిగ్గుపడతారు. వెంటనే సులోచన గారు తేరుకుని ధరణి ఇంతకీ మన రాక్షసి ఏది? అత్తయ్య గారు అడుగుతుంటే చాలా కంగారు వచ్చింది.
కరెక్ట్ టైంకి నాని వచ్చే రక్షించాడు అని చెబుతారు. అదేంటి నాని ఇంకా కాలేజ్ కి వెళ్లలేదా అని జయంతి అడుగుతుంది.
వెంటనే ధరణి అయితే ఇది కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అత్తయ్యఅంటుంది. అయినా నేను ఇంకా కాలేజీకి వెళ్లలేదు కదా! కాలేజ్ టైమ్ ఇంకా ఉంది కదా అత్తయ్య అంటుంది ధరణి.
వెంటనే సులోచన గారికి పగలే చుక్కలు కనపడి చెమటలు పడతాయి. ఏమైంది అత్తయ్య?? అంత టెన్షన్ పడుతున్నారు అని అడిగితే?
వెంటనే సులోచన గారు చెప్తారు, ఆ రాక్షసి నాని గాడితో కాలేజీకి వెళ్లానని చెప్పించింది. మా అత్తగారి నన్ను అడిగేటప్పటికీ, నేను టెన్షన్ లో అదే చెప్పాను
ఇప్పుడు అత్తయ్య గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అన టెన్షన్ పడుతూ ఉంటారు..
ఇప్పుడు కోడలు ఇద్దరు వాళ్ళ అత్తగారిని ఎలా సేవ్ చేస్తారు??
ఇంతకీ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది??
కథ కొనసాగుతుంది...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)