17-03-2026, 07:58 AM
Part - 2
21 సంవత్సరాలు తరువాత,,,
రేపల్లె గ్రామం, తూర్పుగోదావరి జిల్లా ( కల్పితం),
ఆంధ్రప్రదేశ్..
శకుంతల అమ్మ, శకుంతల అమ్మ అని ఒక మహిళ ఒక ఇంటి ముందు నుంచి పిలుస్తుంది. ఆ ఇల్లు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఇంటి చుట్టు పూల మొక్కలు, పెరటి వైపు తులసి కోట, కూర గాయల మొక్కలతో ఉంది. ఇంటి ముందు కళ్ళాపు జల్లి నిండుగా ముగ్గు వేసి ఉంది. ఆ ఇల్లు నిండుగా లక్ష్మీ కళ తో, ఆధ్యాత్మిక భావనంతో, సంతోషాల నిలయమై ఉంది.
ఆ మహిళా పిలుపు విని శకుంతల గారు బయటకు వచ్చారు. శకుంతల గారి వయసు 90 సంవత్సరాలు పైన ఉంటాయి. ఇంటికి పెద్ద దిక్కు. ఆమె మాటను ఇంటిలోని వారందరూ గౌరవిస్తారు. వయసు పై పడటంతో కర్ర సహాయంతో నడుస్తున్నారు. చాలా గంభీరంగా ఉంటారు దైవభక్తి చాలా ఎక్కువ. నిత్యం భగవంతునికి పూజ చేయనిదే గంగైనా ముట్టుకోరు.
శకుంతల గారు బయటకు వచ్చే ఏమైంది అని గంభీరంగా అడిగారు. అప్పుడు ఆ మహిళ శకుంతల గారిని చూస్తూ ముక్కు చీదుతూ, అమ్మ చూశారా మీ ముని మనవరాలు ఏమి చేసిందో అని రాగాలు తీస్తుంది.
దానికి చిరాకు వచ్చి గట్టిగా అరుస్తారు. చెప్పి అయినా ఏడువు , ఏడ్చి అయినా చెప్పు, అంతేగాని రెండు కలపకు అని అరుస్తారు.
అప్పుడు ఆ మహిళ భయపడి ఇలా చెబుతుంది. మేము పాలు తీసుకుని పక్కన ఉన్న ఆశ్రమానికి తీసుకు వెళుతూ ఉంటే మీ మనవరాలు అన్ని పారబోసింది. మాకు ₹2,000 నష్టమని శోకాలు పెట్టింది.
అది విన్న శకుంతల గారు కోపంతో ఏయ్ నోరు ముయ్. నా బంగారం తొందరపడి ఆలోచన లేకుండా చేయదు. ఏమి జరిగిందో నేను కనుక్కుంటాను అని సాంబాని గట్టిగా పిలుస్తారు.
సాంబ ఇంటి పెద్ద పాలేరు. నమ్మినబంటు. తరతరాలగా సాంబా పూర్వీకులు ఈ కుటుంబంతోనే ఉన్నారు.
సాంబ పరిగెత్తుకుని వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు అప్పుడు శకుంతల బామ్మ జరిగింది చెప్పి ఏం జరిగింది అని గట్టిగా అడుగుతారు.
అప్పుడు సాంబా కొడుకు వచ్చి చెబుతాడు. వాడి పేరు నాని. వయస్సు 8 సంవత్సరాలు ఉంటాయి. బామ్మ గారు మరి ఏమో వీళ్ళు పాలల్లో నీళ్లు కలిపి రోజు పట్టికెళుతున్నారు. అక్క అది చూసి తప్పు అని చెప్పింది వీరు వినలేదు అందుకే ఈరోజు పారబోసాము అని చెప్పాడు.
అది విని శకుంతల బామ్మ గారు కోపంతో ఆ మహిళ మీద అరుస్తారు. తప్పు నీ వైపు ఉంది నా బంగారాన్ని అంటే ఊరుకోను అని గట్టిగా అంటారు.
ఆ మహిళ కోపంతో నీ మనవరాలు ఏం చేసినా వెనకేసుకు వస్తున్నారు. రేపు అదే మీకు పెద్ద ప్రాబ్లం అవుతుందని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది. తన చేసిన తప్పు అందరికీ తెలిసింది అని డబ్బులు పోయాయి అని ఉక్రోషంతో వెళ్లిపోతుంది.
శకుంతల గారు కోడల్ని గట్టిగా పిలుస్తారు సులోచన అని.. అంతే సులోచన గారు భయంగా పరుగున వస్తారు.
సులోచన భర్త అయిన రామచంద్రయ్య గారు భార్య పరుగు చూసి ఎక్కడికి సులోచన అ పరుగు?? నువ్వు ఏమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అని చిన్నగా మందలిస్తారు
ఆవిడ కోపంగా భర్త వంక చూస్తూ అత్తయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళవద్దా అని అడుగుతారు. అంతే ఆ మాటకు రామచంద్రయ్య గారు బిగుసుకుపోయారు. సులోచన గారు గట్టిగా పిలుస్తారు ఏవండీ అని...
అంతే ఆయన వెంటనే స్పృహలోకి వచ్చి తొందరగా వెళ్ళు నన్ను అడిగితే పొలం వెళ్లడానికి బయలుదేరాను అని చెప్పు చెమటలు తుడుచుకుంటారు. రామచంద్రయ్య గారు పేపర్ పక్కన పెట్టి గబగబా పొలం వెళుతూ ఉంటారు.
ఇంత వయసు వచ్చిన ఈయనకే వీళ్ళ అమ్మ భయం పోలేదు నాకు అత్తగారు భయం పోతుందా ఎప్పటికైనా అని అనుకుంటారు సులోచన గారు.
ఒక్క చూపు భర్త గారిని చూసి అత్తగారి దగ్గరికి పరుగున వెళతారు సులోచన.
శకుంతలా బామ్మ గారు కోడల్ని చూడగానే అడుగుతారు బంగారం ఎక్కడ అని??
సులోచన గారికి మాత్రం ఏం తెలుస్తుంది ? మనవరాలు ఎక్కడ ఉందని?? తన కొడుకులు, మనవళ్ళు చేసే గారాబంతో ఏ అల్లరి పనిలో ఉందో ఎవరిని దుమ్ము దులుపుతుందో తెలియక ఆవిడ బిక్క మొహం వేసి అత్తగారి వంక భయంగా చూస్తూ నిలబడింది.
శకుంతల గారు కోడలి వంక చూస్తున్నారు ఏమి సమాధానం చెబుతుందా అని..
కథ కొనసాగుతూ ఉంది....
రేపల్లె గ్రామం, తూర్పుగోదావరి జిల్లా ( కల్పితం),
ఆంధ్రప్రదేశ్..
శకుంతల అమ్మ, శకుంతల అమ్మ అని ఒక మహిళ ఒక ఇంటి ముందు నుంచి పిలుస్తుంది. ఆ ఇల్లు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఇంటి చుట్టు పూల మొక్కలు, పెరటి వైపు తులసి కోట, కూర గాయల మొక్కలతో ఉంది. ఇంటి ముందు కళ్ళాపు జల్లి నిండుగా ముగ్గు వేసి ఉంది. ఆ ఇల్లు నిండుగా లక్ష్మీ కళ తో, ఆధ్యాత్మిక భావనంతో, సంతోషాల నిలయమై ఉంది.
ఆ మహిళా పిలుపు విని శకుంతల గారు బయటకు వచ్చారు. శకుంతల గారి వయసు 90 సంవత్సరాలు పైన ఉంటాయి. ఇంటికి పెద్ద దిక్కు. ఆమె మాటను ఇంటిలోని వారందరూ గౌరవిస్తారు. వయసు పై పడటంతో కర్ర సహాయంతో నడుస్తున్నారు. చాలా గంభీరంగా ఉంటారు దైవభక్తి చాలా ఎక్కువ. నిత్యం భగవంతునికి పూజ చేయనిదే గంగైనా ముట్టుకోరు.
శకుంతల గారు బయటకు వచ్చే ఏమైంది అని గంభీరంగా అడిగారు. అప్పుడు ఆ మహిళ శకుంతల గారిని చూస్తూ ముక్కు చీదుతూ, అమ్మ చూశారా మీ ముని మనవరాలు ఏమి చేసిందో అని రాగాలు తీస్తుంది.
దానికి చిరాకు వచ్చి గట్టిగా అరుస్తారు. చెప్పి అయినా ఏడువు , ఏడ్చి అయినా చెప్పు, అంతేగాని రెండు కలపకు అని అరుస్తారు.
అప్పుడు ఆ మహిళ భయపడి ఇలా చెబుతుంది. మేము పాలు తీసుకుని పక్కన ఉన్న ఆశ్రమానికి తీసుకు వెళుతూ ఉంటే మీ మనవరాలు అన్ని పారబోసింది. మాకు ₹2,000 నష్టమని శోకాలు పెట్టింది.
అది విన్న శకుంతల గారు కోపంతో ఏయ్ నోరు ముయ్. నా బంగారం తొందరపడి ఆలోచన లేకుండా చేయదు. ఏమి జరిగిందో నేను కనుక్కుంటాను అని సాంబాని గట్టిగా పిలుస్తారు.
సాంబ ఇంటి పెద్ద పాలేరు. నమ్మినబంటు. తరతరాలగా సాంబా పూర్వీకులు ఈ కుటుంబంతోనే ఉన్నారు.
సాంబ పరిగెత్తుకుని వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు అప్పుడు శకుంతల బామ్మ జరిగింది చెప్పి ఏం జరిగింది అని గట్టిగా అడుగుతారు.
అప్పుడు సాంబా కొడుకు వచ్చి చెబుతాడు. వాడి పేరు నాని. వయస్సు 8 సంవత్సరాలు ఉంటాయి. బామ్మ గారు మరి ఏమో వీళ్ళు పాలల్లో నీళ్లు కలిపి రోజు పట్టికెళుతున్నారు. అక్క అది చూసి తప్పు అని చెప్పింది వీరు వినలేదు అందుకే ఈరోజు పారబోసాము అని చెప్పాడు.
అది విని శకుంతల బామ్మ గారు కోపంతో ఆ మహిళ మీద అరుస్తారు. తప్పు నీ వైపు ఉంది నా బంగారాన్ని అంటే ఊరుకోను అని గట్టిగా అంటారు.
ఆ మహిళ కోపంతో నీ మనవరాలు ఏం చేసినా వెనకేసుకు వస్తున్నారు. రేపు అదే మీకు పెద్ద ప్రాబ్లం అవుతుందని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది. తన చేసిన తప్పు అందరికీ తెలిసింది అని డబ్బులు పోయాయి అని ఉక్రోషంతో వెళ్లిపోతుంది.
శకుంతల గారు కోడల్ని గట్టిగా పిలుస్తారు సులోచన అని.. అంతే సులోచన గారు భయంగా పరుగున వస్తారు.
సులోచన భర్త అయిన రామచంద్రయ్య గారు భార్య పరుగు చూసి ఎక్కడికి సులోచన అ పరుగు?? నువ్వు ఏమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అని చిన్నగా మందలిస్తారు
ఆవిడ కోపంగా భర్త వంక చూస్తూ అత్తయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళవద్దా అని అడుగుతారు. అంతే ఆ మాటకు రామచంద్రయ్య గారు బిగుసుకుపోయారు. సులోచన గారు గట్టిగా పిలుస్తారు ఏవండీ అని...
అంతే ఆయన వెంటనే స్పృహలోకి వచ్చి తొందరగా వెళ్ళు నన్ను అడిగితే పొలం వెళ్లడానికి బయలుదేరాను అని చెప్పు చెమటలు తుడుచుకుంటారు. రామచంద్రయ్య గారు పేపర్ పక్కన పెట్టి గబగబా పొలం వెళుతూ ఉంటారు.
ఇంత వయసు వచ్చిన ఈయనకే వీళ్ళ అమ్మ భయం పోలేదు నాకు అత్తగారు భయం పోతుందా ఎప్పటికైనా అని అనుకుంటారు సులోచన గారు.
ఒక్క చూపు భర్త గారిని చూసి అత్తగారి దగ్గరికి పరుగున వెళతారు సులోచన.
శకుంతలా బామ్మ గారు కోడల్ని చూడగానే అడుగుతారు బంగారం ఎక్కడ అని??
సులోచన గారికి మాత్రం ఏం తెలుస్తుంది ? మనవరాలు ఎక్కడ ఉందని?? తన కొడుకులు, మనవళ్ళు చేసే గారాబంతో ఏ అల్లరి పనిలో ఉందో ఎవరిని దుమ్ము దులుపుతుందో తెలియక ఆవిడ బిక్క మొహం వేసి అత్తగారి వంక భయంగా చూస్తూ నిలబడింది.
శకుంతల గారు కోడలి వంక చూస్తున్నారు ఏమి సమాధానం చెబుతుందా అని..
కథ కొనసాగుతూ ఉంది....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)