Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 94


అడవి నుంచి అర్ణతో ఫోన్లో మాట్లాడి ఇక్కడే టెంట్స్ వేయండి తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని సీరియస్గా చెప్పాడు నిర్మల్. 

మిధున్ దాన సంస్కారాలు అయినా తర్వాత విష్ణు, ఆశతో కలిసి వసుంధర దగ్గరికి బయలుదేరింది అర్ణ.

**************

ఉదయం వసుంధర ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న అభీర్ వైపు చూసి "నందా ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడడానికి వస్తున్నారు ఈ టైంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా!" అని అడిగింది వసుంధర.

"మేడం! నిజంగా వాళ్ళు పశ్చాత్తాప పడి క్షమించమని అడగడానికి వచ్చిన నా మనసులో ఉన్న ప్రతికరం దానికి ఒప్పుకోదు. కానీ తప్పు తెలుసుకున్న వాడిని చంపకూడదు అని ధర్మం చెబుతుంది కానీ క్షమించడానికి నేను దేవుడిని కాదు మనిషిని!

నా వాళ్ళ చావు చూసి మనసు విరిగిపోయింది నేను అప్పుడే చచ్చిపోయాను కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడినా నేను అర్థం చేసుకోలేను అందుకే ఆ బాధ్యత మంచి చెడు తెలిసిన మీ చేతుల్లో పెట్టాను." అని చెప్పాడు అభీర్.

"నేను ఒక లాయర్ ని తప్పు చేసిన వ్యక్తి క్షమించమని అడిగితే వదిలేయమని చట్టం కుడా చెప్పదు తప్పకుండా శిక్ష పడాల్సిందే, కానీ అతని కుటుంబ సభ్యులు ఆ శిక్షకి అనర్హులు, నాకు తెలిసింది అదే కాబట్టి నేను కూడా అదే విధంగా మాట్లాడుతాను." అని చెప్పింది వసుంధర.

"మీరు చెప్పింది నిజమే మేడం! అతని కుటుంబ సభ్యులు చేసిన తప్పుకి పశ్చాత్తాప పడితే శిక్షకి అనర్హులు, కానీ ఆ తప్పు మళ్ళీ చేయాలని చుస్తే శిక్షకి అర్హులు!" అని చెప్పాడు అభీర్.

"నేను కూడా ఆలోచించేది ఒక్కటే ఈ గొడవలన్నీ ముగిసిపోయి నువ్వు నీ వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను." అని చెప్పింది వసుంధర.

"నేను కూడా అదే జరగాలని ఆశిస్తున్నాను, నా మనుషులు ఇక్కడే ఉంటారు నాకు మంచి చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడు హాని జరగనివ్వను." అని చెప్పి బైరి తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభీర్.

వసుంధర వైపు చూసి "వదిన! వాళ్ళు నిజంగానే తప్పు తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారు అనుకుంటున్నావా?" అని అడిగింది నీలమ్.

"నాకు తెలిసి ఇక్కడ దాకా వస్తున్నారు అంటే తప్పు తెలుసుకున్నారు అనే అనుకుంటున్నాను." అని చెప్పింది వసుంధర.

"మేడం! నిజంగా ఇది తప్పు అని తెలుసుకున్న వాళ్ళు అయితే మొదటిలోనే ఆగిపోయేవారు ఇక్కడ దాకా వచ్చేవరకు కాదు." అని చెప్పాడు శంకర్.

"మనిషి మొత్తం కోల్పోయిన తర్వాతే అతను చేసింది తప్పు అని తెలుస్తుంది. అలాగే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను ఒక్కసారి మాట్లాడి చూద్దాము వాళ్ళ మనసులో ఏముందో కూడా అర్థం అవుతుంది కదా!" అని చెప్పింది వసుంధర.

"మీరు ఎవరు నమ్మిన ఆ నంద ఫ్యామిలీని నేను మాత్రం నమ్మను." అని చాక్లెట్ తో కలిసి వెళ్ళిపోయింది మిత్ర.

కాసేపటికి కారులో అర్ణ వాళ్ళు అక్కడకి రావడంతో శంకర్ వైపు చూసి "వాళ్ళని లోపలికి తీసుకురా..!" అని చెప్పింది  వసుంధర.

"సరే మేడం!" అని కారు దగ్గరికి వెళ్లి అర్ణ వైపు చూసి "ఇటు వైపు రండి." అని లోపలికి తీసుకువెళ్లాడు శంకర్.

ఇంటి లోపలికి వెళ్లి వసుంధర వైపు చూసి "బయట చాలా రకాల పక్షులు ఉన్నాయి మీరు బర్డ్ లవర్స్ ఆ..?" అని అడిగింది అర్ణ.

"ఆ పక్షులు మొత్తం అభీర్ కోసం వచ్చాయి రండి కూర్చోండి." అని చెప్పింది నీలమ్.

"అవునా? మా ఫ్యామిలీ మీద తీస్తున్న డాక్యుమెంటరీ కంప్లీట్ అయిందా?" అని అడిగింది అర్ణ.

"ఇంకా క్లైమాక్స్ మిగిలి ఉంది దాని గురించి అభీర్ ఇంకా ఏమీ చెప్పలేదు." అని చెప్పింది నీలమ్.

"మీ ఫ్యామిలీ అభీర్ కి బాగా దగ్గరైనట్లు ఉన్నారు." అని అడిగాడు విష్ణు.

"అవును! నేను అభీర్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను తన అంగీకరం కోసం వెయిట్ చేస్తున్నాను." అని చెప్పింది నీలమ్.

"మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అతను చేసిన నేరాలకి శిక్ష కూడా పడవచ్చు!" అని చెప్పింది అర్ణ.

"అభీర్ శిక్ష అనుభవించిన తర్వాతే నేరం చేస్తున్నాడు అంతేగాని తప్పుచేసి దేశం వదిలి పారిపోలేదు." అని వెటకారంగా చూస్తూ చెప్పింది నీలమ్.

"అయ్యినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసింది మా నాయకుడు కాదు మేము!" అని వసుంధరతో పాటు అక్కడికి వచ్చారు నారప్ప, మల్లీ.

నారప్ప ని చూసి కోపంతో ఊగిపోతున్న విష్ణు చెయ్యి పట్టుకుని సైలెంట్ గా ఉండమని కళ్ళతో సైగ చేసింది అర్ణ.

అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న చైల్డ్ లో కూర్చుని "ఇటువంటి సిచువేషన్ లో ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు కోపం రావడం సహజం! మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి?" అని అడిగింది వసుంధర.

"మేడం! మేము ఈ గొడవలను ఇక్కడితో ఆపేయాలి  అనుకుంటున్నాము." అని చెప్పింది ఆశ.

"మాటలతో ఆగిపోవడానికి ఇవేమీ ఆస్తి గొడవలు కాదు, ఒక చారిత్రాత్మకమైన వరసత్వం కలిగిన ఒక జాతిని అంతం చేసి వాళ్లు దైవంగా భావించే వాటిని దోచుకోవాలని చూసిన మీ వాళ్ళ అత్యాశ వల్ల ఏర్పడిన మరణ హోమం!" ఇది అని చెప్పింది వసుంధర.

"మరి మీ మరణ హోమం ఆగడానికి పరిష్కారం..?" అని అడిగింది అర్ణ.

"ముకుల్ గారు అభిజిత్ గారు ఈ తప్పుని ఒప్పుకుని చట్టం ముందు లొంగిపోవడమే దీనికి పరిష్కారం!" అని చెప్పింది వసుంధర.

"అలా చేయడం కుదరదు జరిగిన దానికి నష్టపరిహారంగా ఏమి కావాలో అడగమనండి." అని చెప్పింది అర్ణ.

"అంటే! నువ్వు ప్రాణాలను డబ్బుతో లెక్క కడుతున్నావా..?" అని అడిగింది వసుంధర.

"అవును! ఆ డబ్బే కదా అన్నిటికీ కారణం!" అని చెప్పింది అర్ణ.

"అవునా? అలా అయితే అడవిలో కొండా మీద ఉన్న అమ్మవారి ముందు మీ తాతని నీ చేతులతో సజీవ దహనం చెయ్! నీకు ఎంత డబ్బు కావాలో అడుగు." అని చెప్పింది వసుంధర.

ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ "చావు ఒకటే పరిష్కారం అనుకుంటే ఇక్కడదాకా వచ్చే వాళ్ళము కాదు." అని చెప్పింది అర్ణ.

"మరి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి నేను అభీర్ కి చెబుతాను దానికి ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది." అని చెప్పింది వసుంధర.

"మా తాతగారు వాళ్ళు చేసిన తప్పుకి ఇండియాలో ఉన్న మా ఆస్తి మొత్తం ఆ తెగ కి ఇచ్చేస్తాను ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే వాళ్ళకి క్షమాపణ చెబుతాము మేము మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టము." అని చెప్పింది అర్ణ.

"సరే! ఈ విషయం అభీర్ కి చెబుతాను." అని చెప్పింది వసుంధర.

"అభీర్ ఈ డీల్ కి ఒప్పుకున్నాడో లేదో మాకు ఎలా తెలుస్తుంది?" అని అడిగాడు విష్ణు.

"అడవిలోకి వెళ్లిన వాళ్ళు రేపటి వరకు క్షేమంగా ఉంటే అభీర్ ఈ డిల్ కి ఒప్పుకున్నట్లే అని అర్థం చేసుకోండి." అని చెప్పింది వసుంధర.

"ఓకే థాంక్యూ!' అని చెప్పి రెండు స్వ్వీట్ పాకెట్స్ అక్కడ పెట్టి ఒకటి అభీర్ కి కూడా పంపించండి." అని చెప్పి విష్ణు వాళ్ళతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది అర్ణ.

అక్కడి నుంచి అర్ణ వాళ్ళు వెళ్లిన తర్వాత వసుంధర వైపు చూసి "వదినా! నువ్వు మెత్తగా మాట్లాడతావేమో అని డౌట్ పడ్డాను కానీ నీ మాటలు వాళ్లకి తూటాలు లాగా తగిలాయి." అని సంతోషంగా చెప్పింది నీలమ్.

ఆ మాటకి నవ్వుతూ "అది నా గొప్పతనం కాదు న్యాయానికి ఉన్న పొగరు! ఆ స్వీట్ ప్యాకెట్స్ పక్కన పెట్టండి అభీర్ దీనికి ఒప్పుకుంటే అప్పుడు నోరు తీపి చేసుకుందాము." అని చెప్పింది వసుంధర.

**************

కార్ లో వెళుతూ అర్ణ వైపు చూసి "అభీర్ ఒప్పుకుంటాడంటావా?" అని డౌట్ గా అడిగింది ఆశ.

"తాతయ్య చెప్పినట్లు అభీర్ కి మంచితనం అనే ఒక జబ్బు ఉంది. అది ఉన్న మనిషిని ఎవ్వడు బాగు చేయలేడు, డబ్బు మీద ఆశ లేని వాడు సంపాదించలేడు." అని చెప్పింది అర్ణ.

"నెక్స్ట్ మన స్టెప్ ఏమిటి?" అని అడిగాడు విష్ణు.

"అడవిలోకి వెళ్లిన మన మనుషులు ఎవరు చావకుండా ఉండాలని కోరుకోవడమే!" అని చెప్పింది అర్ణ.

కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకొని ముకుల్, అభిజిత్ వైపు చూసి "మనం అనుకున్న మాట అక్కడ చెప్పాను  చేయవలసిన పని చేశాను." అని అహంకారంగా చూస్తూ ఒక నవ్వు నవ్వింది అర్ణ.

"నాకు తెలిసి ఈ డిల్ కి కచ్చితంగా అభీర్ ఒప్పుకుంటాడు మనం అడవికి వెళ్లడానికి ప్రిపేర్ అవడం బెటర్!" అని చెప్పింది ఆశ.

కోపంగా అక్కడికి వస్తూ "ఏంటి మీరు చేసినా డీల్? నాన్నగారు వాడికి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా? దాని కంటే అందరం చావడం బెటర్!" అని ఆవేశంగా చెప్పింది ఝన్సీ.

"అవును! మేము కరెక్ట్ గా డీల్ చేసుకునే టైం లో ఫోన్ చేసి ఆపారు, ఇప్పుడు మీరు వెళ్లి చేసింది ఇదా! అడవికి వెళ్లి వాడి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పిన తర్వాత మనం తిరిగి ఏ మొహం పెట్టుకుని లండన్ వెళతాము." అని అడిగాడు రఘురామ్.

అక్కడ దూరంగా నుంచున్న ఇద్దరు వైపు చూసి "వాళ్ళు ఎవరో మీకు తెలుసా?" అని అడిగాడు ముకుల్.

"ఆ రాము గాడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత వంట చేయడానికి వచ్చారు, ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది?" అని విసుగ్గా చూస్తూ చెప్పింది నళిని.

"మీకు అక్కడ వరకే తెలుసు వాళ్లలో ఒకడి పేరు నాదేల్  మిచల్ కొడుకు, మరొకడు జనార్ధన్ కొడుకు ధీరాజ్ ఇద్దరు  అభీర్ ని చంపాలి అనే కసిమిదే ఇక్కడికి వచ్చారు, మన పని మనం చేస్తే వాళ్ల పని వాళ్లు చేశారు." అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.

"తాతయ్య! మళ్ళీ ఎటు వంటి పిచ్చి పని చేయలేదు కదా!" అని కంగారుగా అడిగింది ఆశ.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 24-02-2026, 07:09 AM



Users browsing this thread: 9 Guest(s)