24-02-2026, 07:07 AM
ఎపిసోడ్ 93
ఇది శకుని పాచికల ప్లాన్ మీకు అర్థం కాదు లాయర్ వసుంధర కి శాంతి సందేశం పంపించండి అని అర్ణ కి చెప్పాడు ముకుల్.
అడవిలో ఉన్న నిర్మల్ తో మాట్లాడి నిధికి మార్గం దొరికింది అని చెప్పడంతో నవగ్రహాల కొండల దగ్గరికి బయలుదేరారు తల్వార్ వాళ్ళు.
******************
అడవిలో తల్వార్ వాళ్లతో వెళుతూ "దొర! ఆ నవగ్రహాల కొండల దగ్గర ఏమీ ఉండదు ఇప్పటివరకు చాలామంది వెళ్లి చూశారు." అని చెప్పాడు కేశవ.
"ఇప్పటివరకు వెళ్లిన వారిది ఒక లెక్క మనం వెళ్ళింది ఒక లెక్క! ఖచ్చితంగా ఆ నిధిని నేను సొంతం చేసుకుంటాను." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు తల్వార్.
"సరే దొర! అక్కడికి చేరుకున్న వాళ్ళు ఎలా చేరుకున్నారో ఏమో ఆ దారి మొత్తం క్రూర మృగాలు ఉంటాయి." అంటూ తన మనుషుల వైపు చూసి "త్వరగా వెళ్ళండి చీకటి పడే సమయం అయింది." అని చెప్పాడు కేశవ.
అడవిలో వెళుతూ దారిలో పంజా గుర్తులు కనిపించి "కేశవ చెప్పింది నిజమే" మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దారిలో పెద్ద పులులు ఉన్నాయి." అని చెప్పింది వాసుకి.
"అవునా?" అని తన మనుషుల వైపు చూసి "జంతువులని బెదరగొట్టడానికి సౌండ్స్ పెట్టండి." అని చెప్పి "ఇంతకన్నా పెద్ద పెద్ద అడవుల్లోనే ట్రెజర్ హంటర్ చేశాను పులులకి పిల్లి లకి భయపడితే ముందుకు వెళ్లలేము." అని చెప్పాడు తల్వర్.
కాసేపటికి కొండల దగ్గరికి చేరుకుని "దొర! అవే నవగ్రహాల కొండలు ఇక్కడ ఎవరో ఇద్దరు చచ్చి పడి ఉన్నారు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని ముందుకి వెళ్లి చనిపోయిన చీలి వాళ్ళని చూసి "జంతువు వేటాడినట్టు లేదు ఎవరో కొట్టి చంపారు మనం కాకుండా నిధి కోసం వేరే గ్రూప్ కూడా వచ్చినట్లు ఉంది అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
కొండల వెనకాల దాక్కుని సౌండ్స్ విని "మనవాళ్లు వచ్చినట్లు ఉన్నారు." అని చెప్పాడు ప్రమోద్.
"ఒకవేళ వచ్చింది అభీర్ సేన అయితే!" అని భయంగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
రెండు శవాలని చూస్తూ వీళ్ళు మనవాళ్లు కాదు అని "నిర్మల్!" అని గట్టిగా అరిచింది వాసుకి.
ఆ మాట విని కొండల దగ్గర నుంచి బయటికి వచ్చి "హమ్మయ్య వచ్చారా?" అని సంతోషంగా చెప్పాడు నిర్మల్.
"అది సరే కానీ మీరు ముగ్గురే ఉన్నారు మీతో పాటు వచ్చిన మనుషులందరూ ఏమైపోయారు?" అని డౌట్ గా అడిగింది వాసుకి.
"ఆ స్టోరీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది ముందు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి." అని అడిగాడు ఫరూక్.
ఆ మాట విని తన మనిషి వైపు చూసి సైగ చేసాడు తల్వర్.
బ్యాగ్ లోనుంచి ఫుడ్ పాకెట్స్ వాటర్ బాటిల్స్ తీసి ఇవ్వడంతో ఆత్రంగా తింటున్న వాళ్ళని చూసి "ఇంతకీ నిధికి వెళ్లే రూట్ ఎక్కడ కనిపించింది." అని అడిగింది వాసుకి.
ఏమీ మాట్లాడకుండా తింటున్న ముగ్గురుని చూసి "పాపం తిండి లేక పేగులు మాడిపోయినట్లు ఉన్నాయి ముందు జాగ్రత్త లేకుండా అడవిలోకి ఎందుకు వచ్చారు దొర!" అని అడిగాడు కేశవ.
"మేము బానే వచ్చాము ఆ లింగు గాడు మా ఫుడ్ మొత్తం కోతులకి పెట్టాడు, మా మనుషులని పులులకు మోసళ్లకు పెట్టాడు, మమ్మల్ని మాత్రం చంపకుండా వదిలేసాడు." అని చెప్పాడు ఫరూక్.
"లింగు అంటే కళ్ళు లేని వాడే కదా! చంద్రశేఖర్ ని తప్పించి మహేష్ ని చంపడానికి వచ్చింది వాడే, మళ్లీ ఇక్కడికి కూడా వచ్చాడా?" అని కంగారుగా అడిగింది వాసుకి.
"అవునా?" అని మంచి నీళ్లు తాగుతూ "కనబడదు కనపడదు అంటాడు కానీ మమ్మల్ని మొత్తం నాకిచ్చేసాడు." అని చెప్పాడు నిర్మల్.
"సరేగాని" ఇంతకీ నిధికి వెళ్ళే మార్గం మీరు ఎక్కడ చూశారు? " అని అడిగాడు గఫార్ ఖాన్.
"ఆ కొండల లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చీకటి పడింది కదా కనపడదు ఉదయం వెళదాము." అని చెప్పాడు ప్రమోద్.
"దొర! వీళ్ళ దారి చూస్తుంటే తిండి కోసం ఫోన్ చేసినట్లు ఉన్నారు ఇక్కడ రాళ్లు రప్పలు తప్పితే ఏమీ ఉండవు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని "ఇక్కడ ఉన్నవి రాళ్లు కాదు రత్నాలు!" అని చెప్పి నిర్మల్ దగ్గర ఫోన్ తీసుకుని పక్కకి వెళ్లి అర్ణకి కాల్ చేశాడు ప్రమోద్.
మిథున్ డెడ్ బాడీ దగ్గర బాధగా కూర్చుని ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ఎవరు?" అని అడిగింది అర్ణ.
"నేను ప్రమోద్ ని మాట్లాడుతున్నాను మమ్మల్ని అభీర్ సేన మోసం చేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడే వాసుకి వాళ్ళు కలిశారు." అని చెప్పాడు ప్రమోద్.
"మీరు సేఫ్ గా ఉన్నారు కదా! ఇక్కడ మిధున్ ని చంపేశారు." అని బాధగా చెప్పింది అర్ణ.
"మిధున్ ని చంపేశారా..?" అని గట్టిగా నిర్మల్ వైపు చూసి చెప్పాడు ప్రమోద్.
ఆ మాట విని ఫోన్ తీసుకుని "మిథున్ ని చంపింది ఎవరు?" అని అడిగాడు నిర్మల్.
"అభీర్ మనిషి చంపేడు ఈ విషయంలో టెన్షన్ పడి వెనక్కి రాకండి. మేమే అక్కడికే వస్తాము అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి." అని చెప్పింది అర్ణ.
"నా తమ్ముడిని ఆఖరి చూపు చూడాలి ఫోటో తీసి ఉంచండి." అని చెప్పాడు నిర్మల్.
"నువ్వు ఆఖరి చూపు చూడడం కుదరదు మిధున్ తల పట్టుకు వెళ్ళిపోయారు ఆ కోపన్ని కొన్ని రోజులు అలాగే ఉంచు సమయం వచ్చినప్పుడు బయటకు తీయాల్సి ఉంటుంది." అని చెప్పింది అర్ణ.
"నాకు ఏం చెప్పినా బుర్రలోకి వెళ్లడం లేదు అక్కడికి వచ్చి మరణ హోమం సృష్టించాలని ఉంది." అని ఆవేశంగా చెప్పాడు నిర్మల్.
"కంగారుపడి బయటికి మాట్లాడకు అభీర్ మనుషులు మీ ముందే ఉండి ఉంటారు ఈ సమయంలో ఆవేశం కాదు ఆలోచన చాలా ముఖ్యం!" అని చెప్పింది అర్ణ.
ఆ మాటకి లింగు ని గుర్తు చేసుకుని "నువ్వు చెప్పింది నిజమే! మేమే మూర్ఖంగా ముందుకు వెళ్లాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నిర్మల్.
ఫోన్ పెట్టేసిన నిర్మల్ వైపు చూసి "ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ప్రమోద్.
కళ్ళు తుడుచుకుంటూ "ఏమీ లేదు అభీర్ తో అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి మనకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని అక్కడ ఉన్న కేశవ్ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
ఆ మాట విని "ఆ అభీర్ తో మీరు సెటిల్ చేసుకుంటారు ఏమో నేను సెటిల్ చేసుకోవాల్సిన లెక్క చాలా ఉంది." అని చెప్పి కొండల దగ్గరికి వెళ్లి నిధి దారి కోసం వెతుకుతూ ఉన్నాడు గఫర్ ఖాన్.
"దొర! ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయమంటారా? ఇంకా ముందుకు వెళ్లాలా?" అని అడిగాడు కేశవ.
"మనం ఇక్కడే ఉంటున్నాము ఏర్పాట్లు చేయండి. సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి." అని చెప్పాడు నిర్మల్.
"సరే దొర!" అని చెప్పి ఉండడానికి టెంట్స్ వేశారు కేశవ్ మనుషులు.
************
వరదరాజులు గెస్ట్ హౌస్ దగ్గరికి తన మనుషులతో వచ్చిన బైరి వైపు చూసి "మీ కోసమే వెయిట్ చేస్తున్నాము." అని వినయంగా చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
ఆ మాటకి సీరియస్గా చూస్తూ "నా దగ్గర వినయం నటించకండి." అని చెప్పాడు బైరి.
"నువ్వు ఆయన గురించి పట్టించుకోకు లోపలికి వెళదాము." అని తీసుకువెళ్లాడు వరదరాజులు.
అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంటూ "మీ ప్రపోజల్ ఏంమీతో చెప్పండి." అని అడిగాడు బైరి.
"మా ప్రపోజల్ చాలా సింపుల్! మేము అభీర్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అన్ని విషయాలు చెబుదాము అనుకున్నాము కానీ మీరు వచ్చారు ఆయన చెప్పాల్సింది చెబుతున్నాము.
ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోవాలి మా ఫ్యామిలీ ప్రశాంతంగా లండన్ వెళ్లిపోవాలి కావాలి అంటే ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మీరే తీసుకోండి." అని చెప్పాడు మోహిత్.
"అవును! మా ప్రపోజల్ ఇదే దీని కోసం ఏమి చేయమంటే అది చేస్తాము." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు వరదరాజులు వాళ్ళు.
"నిజంగా ఈ విషయం మాట్లాడడానికి మా నాయుకుడిని కలవాలి అనుకున్నారా..?" అని అడిగాడు బైరి.
"అవును! అంతకుమించి మా వైపు నుంచి ఏమీ లేదు అంతేకదా వరదరాజులు!" అని అడిగాడు రఘురామ్.
ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న వరదరాజులు వైపు చూసి "సరే మీకు ఉదయం కాల్ వస్తుంది." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బైరి.
అక్కడి నుంచి బైరి వెళ్లిపోవడంతో రఘురామ్ వాళ్ళ వైపు చూసి "మనం అనుకున్న డీల్ ఏమిటి! మీరు మాట్లాడింది ఏమిటి!" అని అయోమయంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"అర్ణ కాల్ చేసింది గెస్ట్ హౌస్ కి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వెళదామా?" అని అడిగాడు మోహిత్.
"సరే! తంబియర్, సుజిత్ డాక్యుమెంట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్లారు రానివ్వండి బయలుదేరుదాము." అని చికాకుగా చెప్పాడు వరదరాజులు.
"మనం ఇక్కడ ఎంత సేపు ఉన్న వాళ్ళరారు ఎందుకంటే ఆ ఇద్దరు నంద గెస్ట్ హౌస్ లో ఉన్నారు." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఇద్దరు మళ్ళి అక్కడికి ఎందుకు వెళ్లారు?" అని డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"నీకు విషయం ఇంకా అర్థం కాలేదా? వాళ్లు వెళ్లలేదు తీసుకువెళ్లారు." అని చెప్పాడు వరదరాజులు.
"కరెక్ట్ పదండి వెళదాం." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు మోహిత్
***********
ఉదయం మిథున్ దహన సంస్కారాలు చేసి బాధపడుతున్న అభిజిత్ వైపు చూసి "కన్న కొడుకు దూరమైతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఇంకా ఇదే చివరి చావు అవ్వాలి." అని అర్ణ వైపు చూసాడు ముకుల్.
"సరే తాతయ్య!' అని చెప్పి విష్ణు,ఆశతో కలిసి వసుంధరని కలవడానికి కార్ లో బయలుదేరింది అర్ణ.
అడవిలో ఉన్న నిర్మల్ తో మాట్లాడి నిధికి మార్గం దొరికింది అని చెప్పడంతో నవగ్రహాల కొండల దగ్గరికి బయలుదేరారు తల్వార్ వాళ్ళు.
******************
అడవిలో తల్వార్ వాళ్లతో వెళుతూ "దొర! ఆ నవగ్రహాల కొండల దగ్గర ఏమీ ఉండదు ఇప్పటివరకు చాలామంది వెళ్లి చూశారు." అని చెప్పాడు కేశవ.
"ఇప్పటివరకు వెళ్లిన వారిది ఒక లెక్క మనం వెళ్ళింది ఒక లెక్క! ఖచ్చితంగా ఆ నిధిని నేను సొంతం చేసుకుంటాను." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు తల్వార్.
"సరే దొర! అక్కడికి చేరుకున్న వాళ్ళు ఎలా చేరుకున్నారో ఏమో ఆ దారి మొత్తం క్రూర మృగాలు ఉంటాయి." అంటూ తన మనుషుల వైపు చూసి "త్వరగా వెళ్ళండి చీకటి పడే సమయం అయింది." అని చెప్పాడు కేశవ.
అడవిలో వెళుతూ దారిలో పంజా గుర్తులు కనిపించి "కేశవ చెప్పింది నిజమే" మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దారిలో పెద్ద పులులు ఉన్నాయి." అని చెప్పింది వాసుకి.
"అవునా?" అని తన మనుషుల వైపు చూసి "జంతువులని బెదరగొట్టడానికి సౌండ్స్ పెట్టండి." అని చెప్పి "ఇంతకన్నా పెద్ద పెద్ద అడవుల్లోనే ట్రెజర్ హంటర్ చేశాను పులులకి పిల్లి లకి భయపడితే ముందుకు వెళ్లలేము." అని చెప్పాడు తల్వర్.
కాసేపటికి కొండల దగ్గరికి చేరుకుని "దొర! అవే నవగ్రహాల కొండలు ఇక్కడ ఎవరో ఇద్దరు చచ్చి పడి ఉన్నారు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని ముందుకి వెళ్లి చనిపోయిన చీలి వాళ్ళని చూసి "జంతువు వేటాడినట్టు లేదు ఎవరో కొట్టి చంపారు మనం కాకుండా నిధి కోసం వేరే గ్రూప్ కూడా వచ్చినట్లు ఉంది అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు గఫర్ ఖాన్.
కొండల వెనకాల దాక్కుని సౌండ్స్ విని "మనవాళ్లు వచ్చినట్లు ఉన్నారు." అని చెప్పాడు ప్రమోద్.
"ఒకవేళ వచ్చింది అభీర్ సేన అయితే!" అని భయంగా చూస్తూ చెప్పాడు ఫరూక్.
రెండు శవాలని చూస్తూ వీళ్ళు మనవాళ్లు కాదు అని "నిర్మల్!" అని గట్టిగా అరిచింది వాసుకి.
ఆ మాట విని కొండల దగ్గర నుంచి బయటికి వచ్చి "హమ్మయ్య వచ్చారా?" అని సంతోషంగా చెప్పాడు నిర్మల్.
"అది సరే కానీ మీరు ముగ్గురే ఉన్నారు మీతో పాటు వచ్చిన మనుషులందరూ ఏమైపోయారు?" అని డౌట్ గా అడిగింది వాసుకి.
"ఆ స్టోరీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది ముందు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి." అని అడిగాడు ఫరూక్.
ఆ మాట విని తన మనిషి వైపు చూసి సైగ చేసాడు తల్వర్.
బ్యాగ్ లోనుంచి ఫుడ్ పాకెట్స్ వాటర్ బాటిల్స్ తీసి ఇవ్వడంతో ఆత్రంగా తింటున్న వాళ్ళని చూసి "ఇంతకీ నిధికి వెళ్లే రూట్ ఎక్కడ కనిపించింది." అని అడిగింది వాసుకి.
ఏమీ మాట్లాడకుండా తింటున్న ముగ్గురుని చూసి "పాపం తిండి లేక పేగులు మాడిపోయినట్లు ఉన్నాయి ముందు జాగ్రత్త లేకుండా అడవిలోకి ఎందుకు వచ్చారు దొర!" అని అడిగాడు కేశవ.
"మేము బానే వచ్చాము ఆ లింగు గాడు మా ఫుడ్ మొత్తం కోతులకి పెట్టాడు, మా మనుషులని పులులకు మోసళ్లకు పెట్టాడు, మమ్మల్ని మాత్రం చంపకుండా వదిలేసాడు." అని చెప్పాడు ఫరూక్.
"లింగు అంటే కళ్ళు లేని వాడే కదా! చంద్రశేఖర్ ని తప్పించి మహేష్ ని చంపడానికి వచ్చింది వాడే, మళ్లీ ఇక్కడికి కూడా వచ్చాడా?" అని కంగారుగా అడిగింది వాసుకి.
"అవునా?" అని మంచి నీళ్లు తాగుతూ "కనబడదు కనపడదు అంటాడు కానీ మమ్మల్ని మొత్తం నాకిచ్చేసాడు." అని చెప్పాడు నిర్మల్.
"సరేగాని" ఇంతకీ నిధికి వెళ్ళే మార్గం మీరు ఎక్కడ చూశారు? " అని అడిగాడు గఫార్ ఖాన్.
"ఆ కొండల లోపలికి వెళ్ళాలి ఇప్పుడు చీకటి పడింది కదా కనపడదు ఉదయం వెళదాము." అని చెప్పాడు ప్రమోద్.
"దొర! వీళ్ళ దారి చూస్తుంటే తిండి కోసం ఫోన్ చేసినట్లు ఉన్నారు ఇక్కడ రాళ్లు రప్పలు తప్పితే ఏమీ ఉండవు." అని చెప్పాడు కేశవ.
ఆ మాట విని "ఇక్కడ ఉన్నవి రాళ్లు కాదు రత్నాలు!" అని చెప్పి నిర్మల్ దగ్గర ఫోన్ తీసుకుని పక్కకి వెళ్లి అర్ణకి కాల్ చేశాడు ప్రమోద్.
మిథున్ డెడ్ బాడీ దగ్గర బాధగా కూర్చుని ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ఎవరు?" అని అడిగింది అర్ణ.
"నేను ప్రమోద్ ని మాట్లాడుతున్నాను మమ్మల్ని అభీర్ సేన మోసం చేశారు మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడే వాసుకి వాళ్ళు కలిశారు." అని చెప్పాడు ప్రమోద్.
"మీరు సేఫ్ గా ఉన్నారు కదా! ఇక్కడ మిధున్ ని చంపేశారు." అని బాధగా చెప్పింది అర్ణ.
"మిధున్ ని చంపేశారా..?" అని గట్టిగా నిర్మల్ వైపు చూసి చెప్పాడు ప్రమోద్.
ఆ మాట విని ఫోన్ తీసుకుని "మిథున్ ని చంపింది ఎవరు?" అని అడిగాడు నిర్మల్.
"అభీర్ మనిషి చంపేడు ఈ విషయంలో టెన్షన్ పడి వెనక్కి రాకండి. మేమే అక్కడికే వస్తాము అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి." అని చెప్పింది అర్ణ.
"నా తమ్ముడిని ఆఖరి చూపు చూడాలి ఫోటో తీసి ఉంచండి." అని చెప్పాడు నిర్మల్.
"నువ్వు ఆఖరి చూపు చూడడం కుదరదు మిధున్ తల పట్టుకు వెళ్ళిపోయారు ఆ కోపన్ని కొన్ని రోజులు అలాగే ఉంచు సమయం వచ్చినప్పుడు బయటకు తీయాల్సి ఉంటుంది." అని చెప్పింది అర్ణ.
"నాకు ఏం చెప్పినా బుర్రలోకి వెళ్లడం లేదు అక్కడికి వచ్చి మరణ హోమం సృష్టించాలని ఉంది." అని ఆవేశంగా చెప్పాడు నిర్మల్.
"కంగారుపడి బయటికి మాట్లాడకు అభీర్ మనుషులు మీ ముందే ఉండి ఉంటారు ఈ సమయంలో ఆవేశం కాదు ఆలోచన చాలా ముఖ్యం!" అని చెప్పింది అర్ణ.
ఆ మాటకి లింగు ని గుర్తు చేసుకుని "నువ్వు చెప్పింది నిజమే! మేమే మూర్ఖంగా ముందుకు వెళ్లాము." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నిర్మల్.
ఫోన్ పెట్టేసిన నిర్మల్ వైపు చూసి "ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ప్రమోద్.
కళ్ళు తుడుచుకుంటూ "ఏమీ లేదు అభీర్ తో అన్ని విషయాలు సెటిల్ అయిపోతున్నాయి మనకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని అక్కడ ఉన్న కేశవ్ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిర్మల్.
ఆ మాట విని "ఆ అభీర్ తో మీరు సెటిల్ చేసుకుంటారు ఏమో నేను సెటిల్ చేసుకోవాల్సిన లెక్క చాలా ఉంది." అని చెప్పి కొండల దగ్గరికి వెళ్లి నిధి దారి కోసం వెతుకుతూ ఉన్నాడు గఫర్ ఖాన్.
"దొర! ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయమంటారా? ఇంకా ముందుకు వెళ్లాలా?" అని అడిగాడు కేశవ.
"మనం ఇక్కడే ఉంటున్నాము ఏర్పాట్లు చేయండి. సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి." అని చెప్పాడు నిర్మల్.
"సరే దొర!" అని చెప్పి ఉండడానికి టెంట్స్ వేశారు కేశవ్ మనుషులు.
************
వరదరాజులు గెస్ట్ హౌస్ దగ్గరికి తన మనుషులతో వచ్చిన బైరి వైపు చూసి "మీ కోసమే వెయిట్ చేస్తున్నాము." అని వినయంగా చెప్పాడు ప్రతాప్ మిశ్రా.
ఆ మాటకి సీరియస్గా చూస్తూ "నా దగ్గర వినయం నటించకండి." అని చెప్పాడు బైరి.
"నువ్వు ఆయన గురించి పట్టించుకోకు లోపలికి వెళదాము." అని తీసుకువెళ్లాడు వరదరాజులు.
అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంటూ "మీ ప్రపోజల్ ఏంమీతో చెప్పండి." అని అడిగాడు బైరి.
"మా ప్రపోజల్ చాలా సింపుల్! మేము అభీర్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అన్ని విషయాలు చెబుదాము అనుకున్నాము కానీ మీరు వచ్చారు ఆయన చెప్పాల్సింది చెబుతున్నాము.
ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోవాలి మా ఫ్యామిలీ ప్రశాంతంగా లండన్ వెళ్లిపోవాలి కావాలి అంటే ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మీరే తీసుకోండి." అని చెప్పాడు మోహిత్.
"అవును! మా ప్రపోజల్ ఇదే దీని కోసం ఏమి చేయమంటే అది చేస్తాము." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు వరదరాజులు వాళ్ళు.
"నిజంగా ఈ విషయం మాట్లాడడానికి మా నాయుకుడిని కలవాలి అనుకున్నారా..?" అని అడిగాడు బైరి.
"అవును! అంతకుమించి మా వైపు నుంచి ఏమీ లేదు అంతేకదా వరదరాజులు!" అని అడిగాడు రఘురామ్.
ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న వరదరాజులు వైపు చూసి "సరే మీకు ఉదయం కాల్ వస్తుంది." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బైరి.
అక్కడి నుంచి బైరి వెళ్లిపోవడంతో రఘురామ్ వాళ్ళ వైపు చూసి "మనం అనుకున్న డీల్ ఏమిటి! మీరు మాట్లాడింది ఏమిటి!" అని అయోమయంగా చూస్తూ అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"అర్ణ కాల్ చేసింది గెస్ట్ హౌస్ కి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వెళదామా?" అని అడిగాడు మోహిత్.
"సరే! తంబియర్, సుజిత్ డాక్యుమెంట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్లారు రానివ్వండి బయలుదేరుదాము." అని చికాకుగా చెప్పాడు వరదరాజులు.
"మనం ఇక్కడ ఎంత సేపు ఉన్న వాళ్ళరారు ఎందుకంటే ఆ ఇద్దరు నంద గెస్ట్ హౌస్ లో ఉన్నారు." అని చెప్పాడు రఘురామ్.
ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఇద్దరు మళ్ళి అక్కడికి ఎందుకు వెళ్లారు?" అని డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.
"నీకు విషయం ఇంకా అర్థం కాలేదా? వాళ్లు వెళ్లలేదు తీసుకువెళ్లారు." అని చెప్పాడు వరదరాజులు.
"కరెక్ట్ పదండి వెళదాం." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు మోహిత్
***********
ఉదయం మిథున్ దహన సంస్కారాలు చేసి బాధపడుతున్న అభిజిత్ వైపు చూసి "కన్న కొడుకు దూరమైతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఇంకా ఇదే చివరి చావు అవ్వాలి." అని అర్ణ వైపు చూసాడు ముకుల్.
"సరే తాతయ్య!' అని చెప్పి విష్ణు,ఆశతో కలిసి వసుంధరని కలవడానికి కార్ లో బయలుదేరింది అర్ణ.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)