17-02-2026, 09:03 AM
Part - 102
విక్రమ్ ఒడిలో కూర్చునే తులాభారానికి సిద్ధం అవుతుంది. అవని పడిపోకుండా ఒక చేతులేని నడుము చుట్టూ వేసి ఒక చేతితో తుల భారం తాడును గట్టిగా పట్టుకుంటాడు.
మొదటిగా పువ్వులు మొదలు పెడతారు. గులాబీలతో మొదలుపెట్టి అన్ని పువ్వులతో ముందు తులాభారం వేస్తారు. అవన్నీ చూస్తూ అవని కళ్ళు నోరు వదిలేసి మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది .
తరవాత పళ్లుతో వేస్తారు. అవని ఇంకా తట్టుకోలేక విక్రమ్ చెవులో ఇన్ని రకాల పండ్లు పువ్వులు ఎక్కడ దొరికాయి అంటే నా భార్య కోసం ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తాను గాని మూసుకుని కూర్చో అంటాడు. పళ్ళు తర్వాత స్వీట్స్ కూరగాయలు...
నిత్యావసర సరుకులు అన్న ప్రతి దానితోనూ తులాభారం వేస్తారు. ఇక చివరిగా నాణాలు, వెండి బంగారం కూడా తులాభారానికి వాడితే అవి చూసిన అవని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి.
తులాభారం వేసిన వస్తువులతోనే ఆలయ ప్రాంగణం అంతా నిండిపోతుంది. మెల్లిగా అవిని నీ ఒడిలో నుంచి దింపి విక్రమ్ కూడా లేచి బాడీని స్ట్రెచ్ చేస్తాడు.
అవని అవేమీ పట్టించుకునే పొజిషన్లో ఉండదు. ఒక రకమైన డీప్ షాక్ లో ఉండిపోతుంది. లలిత అవిని దగ్గరకు వచ్చే లోపలికి వెళదాం రా అనగానే.. అత్తగారి వైపు చూసి ఏమిటిది అత్తయ్య అని అడుగుతుంది.
ఆ మాటకి ఏమైంది రా అని అడిగితే... ఏమీ లేదు అని తల ఊపుతుంది. చెప్పరా మనసులో ఏదైనా బాధ ఉంటే ఇక్కడే తీర్చేసుకో... అది మళ్ళీ మళ్ళీ మొయ్యొద్దు.
అత్తయ్య గారి చేతులు పట్టుకుని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకలికి అలమటిస్తూనే ఉన్నాను. మంచి భోజనం ఒక పూట దొరికినా. ఆ రోజు నాకు పండగ లాగానే ఉండేది.
కాలేజ్ కి సెలవు వస్తే మంచినీళ్లు తాగేదాన్ని. అలాంటిది ఈరోజు నా పేరు మీద ఇన్ని రకాలు ఇస్తూ ఉంటే... మాట తడబడుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటుంది.
అవిని పరిస్థితి అర్థమవుతూ ఉంటే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. లలితగారు గట్టిగా హత్తుకుని పిచ్చి పిల్ల జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడతావు ఎందుకు...
చెడు జరిగింది అంటే అంతకన్నా మంచి మన కోసం ఎదురు చూస్తుందని అర్థం. నీ జీవితంలో ఉన్న చెడు అంతా అయిపోయింది.
నీ ముందు ఉన్నది అంతా కూడా మంచి రోజులే అని కన్నీళ్లు తుడిచి పద తల్లి అని గుడి లోపలికి తీసుకువెళతారు. విక్రమ్ కూడా మౌనంగా అవిని తో లోపలికి వెళ్తాడు.
అవిని పేరు మీద అన్ని రకాల పూజలు చేపిస్తారు. అన్నదానం ఏర్పాటు చేస్తారు. ప్రతి ట్రస్ట్ లో కూడా భారీగా విరాళాలు డొనేట్ చేస్తారు .
అన్నదానంలో అవిని చేతే వడ్డన చేపిస్తారు. అది అవినికి చాలా తృప్తిగా అనిపిస్తుంది. భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చిన దారిలోనే అందరూ వెళ్ళిపోతారు.
వెళుతున్న కళ్యాణ్ మాత్రం వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ధనుంజయ్ చేతులెత్తి నమస్కారం చేస్తాడు.
చిన్నగా తలువుపి కళ్యాణ్ వెళ్లిపోతాడు.
ధనుంజయ్ కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకుంటాడు. సత్యవతి గారు తల నిమురుతు.. అవని ఎలాగుంది... సంతోషంగా ఉందా అని అడుగుతారు.
రజిత చేసిన పుణ్యం నా కూతురిని కాచింది. అందుకే బంగారం లాంటి భర్త... తల్లి లాగా చూసుకునే అత్తింటి వారు దొరికారు అమ్మ.
ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా... గుడిలో జరిగింది ప్రతిదీ చెబుతాడు. మేము కూడా వచ్చేవాళ్ళం కదరా...
మనల్ని చూస్తే తన సంతోషం ఆవిరి అయిపోతుంది. నువ్వు నీ కూతురికి ఎదురు పడలేదా అంటే లేదు అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.
మరి తులాభారానికి కావలసినవి అన్నీ నువ్వే సిద్ధం చేశావు కదరా... అది ఇన్ని సంవత్సరాలు నా కూతురుని పస్తులు ఉంచిన దానికి చిన్న ప్రాయశ్చిత్తం అమ్మ..
అది కూడా బావగారిని, విక్రమ్ ని చాలా కష్టంగా ఒప్పించవలసి వచ్చింది. విక్రమ్ అయితే అసలు ఒప్పుకోలేదు.
నా భార్యకు అన్ని నేనే చూసుకోగలను. మధ్యలో మీరు ఎవరని నా మీద చాలా కోప్పడ్డాడు. బావ గారే కష్టంగా విక్రమ్ ని ఒప్పించారు.
విక్రమ్ చాలా అఇష్టంగానే ఒప్పుకున్నాడు అని బాధగా చెబుతారు. అమ్మ నీకు ఒక విషయం చెప్పనా అని ఒడిలో నుంచి లేచి అంటారు.
ఏంట్రా అని చంపపైన చెయ్యవేసి అడిగితే.. ఈరోజు నా కూతురి చేతితో అన్నం తిన్నాను అమ్మ. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేసాను.
నువ్వు అనేది ఏంట్రా.. అన్నదానంలో నువ్వు కూడా కూర్చున్నావా అని బాధగా అడుగుతారు. తప్పేముందమ్మ నా కూతురి చేతితో అన్నం తినాలి అంటే కూడా అదృష్టం ఉండాలి.
ఆ అదృష్టం కల్పించిన ఆ కుటుంబానికి ఎప్పటికి నేను రుణపడే ఉంటాను. అవని తులాభారం వేసిన తర్వాత నా కూతురు వాళ్ల అత్తగారిని పట్టుకుని ఎలా ఏడ్చిందో తెలుసా అమ్మ.
ఆకలికి ఎలా అలమటించిందో చెబుతూ ఉంటే నా ప్రాణం తరుక్కుపోయిందమ్మ. అసలు నేను ఇంత కసాయిగా ఎలా ఉండగలిగాను.
కూతురి ఆకలిని కూడా గుర్తించలేనంత మాయలో పడిపోయానా.. ఎందుకమ్మా ఇంత ఐశ్వర్యం సంపాదించాను.
ఆ డబ్బు సంపాదించడం, భార్గవి చూసుకుంటుంది అన్న గుడ్డి నమ్మకంలో పడిపోయి అవినికి దూరమైపోయాను. ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు అవిని తో కూర్చుని ఉండి ఉంటే ఈ రోజు నా కూతురు నాకు దూరమయ్యేది కాదు కదా...
నా కూతురు ప్రతి సంతోషంలో నేను ఉండేవాడిని. ఎప్పటికైనా నా కూతురు నన్ను క్షమిస్తుందంటావా అని బేలగా అడుగుతాడు.
ఆ మాటకి సత్యవతి గారికి కూడా ఏడుపు వస్తుంది. కాలమే ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతుంది రా.. నువ్వు తెలుసుకోలేద నీ కూతురు ఎలాంటి ఇబ్బంది పడిందో.. రజిత ఎలా చనిపోయిందో..
అలాగే అవిని కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు. ధనుంజయ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా లేచి ఆఫీసు రూంలోకి వెళ్తాడు.
అక్కడ నిలువెత్తు రూపంలో నవ్వుతూ కనిపిస్తున్న రజిత ఫోటోని చూస్తూ ఈరోజు అవని ఎంత సంతోషంగా ఉందో తెలుసా..
మన అల్లుడు బంగారం. ఎంత ముందు చూపు ఉన్నవాడో తెలుసా.. నాలాంటి వాడు కాదు. భార్య మీద ప్రేమ ఉంటే సరిపోదు. వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టాలి అన్న ముందు జాగ్రత్త ఉన్నవాడు.
అవని మనసులోనికి ఆలోచన కూడా రాకముందే అన్నీ చేసేస్తున్నాడు. నువ్వు చేసుకున్న పుణ్యమే ఈరోజు మన బిడ్డని కాస్తుంది రజిత అని ఫోటోని తడుముతూ రాత్రంతా అక్కడే పడుకుండిపోతాడు.
కొడుకు బాధ అర్థమవుతున్న సరే పెద్దవాళ్ళిద్దరూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటారు. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి.
శరీరానికి తగిలిన గాయం అయితే మానిపోతుంది అని సర్ది చెప్పుకోవచ్చు కానీ.. మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానేది కాదు.
పక్కన ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు కానీ తగిలిన దెబ్బకి బాధ అనుభవించేది కూడా గాయపడిన వాళ్లే కాబట్టి...
పక్కన ఉన్న వాళ్ళు చెప్పగలరు గాని ఆ బాధను తీసుకోలేరు. అందుకే అటు అవనికి చెప్పలేక ఇటు ధనుంజయ్ బాధ తీర్చలేక పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా నలిగిపోతున్నారు.
ధనుంజయ్ ఉదయమే తొందరగా లేచి మంచి ఉషారుగా రెడీ అవుతాడు. అమ్మ ఆకలేస్తుంది అని హడావుడి చేస్తాడు.
కొడుకులోని నూతన ఉత్సాహాన్ని చూసి సత్యవతి, శేషగిరి ఆశ్చర్యపోతారు. సర్వెంట్స్ ని కంగారు పెట్టి టిఫిన్ రెడీ చేయించి వడ్డిస్తారు.
రోజు తినేదానికన్నా ఆ రోజు ఎక్కువగా తింటాడు. ఏమైందిరా ఇంత సంతోషంగా ఉన్నావు. నేను తీసుకున్న నిర్ణయం అమల్లో పెట్టే రోజు దగ్గరకు వచ్చింది.
అలాగే ఆ రాక్షసిని కూడా కలవడానికి వెళుతున్నాను అని చెబుతాడు. ఇప్పుడు అవసరమా అంటే చాలా అవసరం అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోతాడు.
జైలుకు వెళ్లి జైలర్ పర్మిషన్ తో భార్గవిని కలుస్తాడు. భార్గవి భర్త ముందుకు వచ్చి నిలబడుతుంది. భార్గవిని చూస్తూ ఉంటాడు.
మేకప్ తో మెరుగులు దిద్దిన అందం కనపడటం లేదు. కళ్ళ కింద నల్లటి చారలు వచ్చి బక్క చిక్కుపోయి ఉంది.
అయినా ధనుంజయ్ కి ఎటువంటి జాలి కలగడం లేదు. రెండు చేతులు ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టుకుని ఎలా ఉన్నావ్ భార్గవి అని అడుగుతాడు.
భర్త వైపు కోపంగా చూస్తుంది. ఆ చూపుకి నవ్వుతూ ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నావు . నేనయితే చాలా సంతోషంగా ఉన్నాను.
ఎందుకో తెలుసా నా ముద్దుల కూతురు... ఎంతో అపురూపంగా అత్తోరింట్లో ఉంది. అలాగే నా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి అవబోతుంది అని పొగరుగా చెబుతాడు.
ఆ మాటలు వినగానే భార్గవి కోపంతో పిడికిలి బిగిస్తుంది. కానీ ఏమీ చేయలేదు కదా.. అందుకే చూస్తూ ఉండిపోతుంది.
ఏమిటి భార్గవి ఇవి వింటూ ఉంటే కోపం వస్తుందా.. నన్ను నా కూతుర్ని చంపేయాలి అన్నంత కసి పెరుగుతుందా అని అడుగుతాడు...
మెల్లిగా నోరు విప్పుతుంది. తప్పు చేసింది నేను. నన్ను శిక్షించండి. శిల్ప మీ కూతురే కదా.. శిల్పకి ఎలా అన్యాయం చేయగలుగుతున్నారు అని లేని ప్రేమని మళ్లీ చూపించడం మొదలు పెడుతుంది.
ఆ మాటకి నవ్వుతూ ఇంకా నీ యాక్టింగ్ మొదలు పెట్టలేదు ఏంటా అనుకున్నాను. పర్వాలేదు స్టార్ట్ చేశావు అంటాడు.
కన్నీళ్లు కారుస్తూ నేను మారానండి.
మారాను అని చెప్పిన మీరు ఎందుకు నమ్మడం లేదు. పాము మారింది అని చెబితే ఎవరైనా నమ్ముతారా.. నమ్మి పాము పక్కన కోడి పిల్లని పడుకోబెడతారా చెప్పు అంటాడు.
నేను పాము నా అని ఈసారి గట్టిగానే అడుగుతుంది. అంతకన్నా ప్రమాదకరం. నీ కడుపున పుట్టిన అది కూడా అలాగే తయారైంది కదా...
దాన్ని నా కూతురు అని చెప్పుకోవాలి అంటే నాకే అవమానం అని ఛీత్కరంగా అంటాడు.
భార్గవి రియాక్షన్ ఏమిటి...
కథ కొనసాగుతుంది...
మొదటిగా పువ్వులు మొదలు పెడతారు. గులాబీలతో మొదలుపెట్టి అన్ని పువ్వులతో ముందు తులాభారం వేస్తారు. అవన్నీ చూస్తూ అవని కళ్ళు నోరు వదిలేసి మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది .
తరవాత పళ్లుతో వేస్తారు. అవని ఇంకా తట్టుకోలేక విక్రమ్ చెవులో ఇన్ని రకాల పండ్లు పువ్వులు ఎక్కడ దొరికాయి అంటే నా భార్య కోసం ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తాను గాని మూసుకుని కూర్చో అంటాడు. పళ్ళు తర్వాత స్వీట్స్ కూరగాయలు...
నిత్యావసర సరుకులు అన్న ప్రతి దానితోనూ తులాభారం వేస్తారు. ఇక చివరిగా నాణాలు, వెండి బంగారం కూడా తులాభారానికి వాడితే అవి చూసిన అవని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి.
తులాభారం వేసిన వస్తువులతోనే ఆలయ ప్రాంగణం అంతా నిండిపోతుంది. మెల్లిగా అవిని నీ ఒడిలో నుంచి దింపి విక్రమ్ కూడా లేచి బాడీని స్ట్రెచ్ చేస్తాడు.
అవని అవేమీ పట్టించుకునే పొజిషన్లో ఉండదు. ఒక రకమైన డీప్ షాక్ లో ఉండిపోతుంది. లలిత అవిని దగ్గరకు వచ్చే లోపలికి వెళదాం రా అనగానే.. అత్తగారి వైపు చూసి ఏమిటిది అత్తయ్య అని అడుగుతుంది.
ఆ మాటకి ఏమైంది రా అని అడిగితే... ఏమీ లేదు అని తల ఊపుతుంది. చెప్పరా మనసులో ఏదైనా బాధ ఉంటే ఇక్కడే తీర్చేసుకో... అది మళ్ళీ మళ్ళీ మొయ్యొద్దు.
అత్తయ్య గారి చేతులు పట్టుకుని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకలికి అలమటిస్తూనే ఉన్నాను. మంచి భోజనం ఒక పూట దొరికినా. ఆ రోజు నాకు పండగ లాగానే ఉండేది.
కాలేజ్ కి సెలవు వస్తే మంచినీళ్లు తాగేదాన్ని. అలాంటిది ఈరోజు నా పేరు మీద ఇన్ని రకాలు ఇస్తూ ఉంటే... మాట తడబడుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటుంది.
అవిని పరిస్థితి అర్థమవుతూ ఉంటే అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. లలితగారు గట్టిగా హత్తుకుని పిచ్చి పిల్ల జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడతావు ఎందుకు...
చెడు జరిగింది అంటే అంతకన్నా మంచి మన కోసం ఎదురు చూస్తుందని అర్థం. నీ జీవితంలో ఉన్న చెడు అంతా అయిపోయింది.
నీ ముందు ఉన్నది అంతా కూడా మంచి రోజులే అని కన్నీళ్లు తుడిచి పద తల్లి అని గుడి లోపలికి తీసుకువెళతారు. విక్రమ్ కూడా మౌనంగా అవిని తో లోపలికి వెళ్తాడు.
అవిని పేరు మీద అన్ని రకాల పూజలు చేపిస్తారు. అన్నదానం ఏర్పాటు చేస్తారు. ప్రతి ట్రస్ట్ లో కూడా భారీగా విరాళాలు డొనేట్ చేస్తారు .
అన్నదానంలో అవిని చేతే వడ్డన చేపిస్తారు. అది అవినికి చాలా తృప్తిగా అనిపిస్తుంది. భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చిన దారిలోనే అందరూ వెళ్ళిపోతారు.
వెళుతున్న కళ్యాణ్ మాత్రం వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ధనుంజయ్ చేతులెత్తి నమస్కారం చేస్తాడు.
చిన్నగా తలువుపి కళ్యాణ్ వెళ్లిపోతాడు.
ధనుంజయ్ కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకుంటాడు. సత్యవతి గారు తల నిమురుతు.. అవని ఎలాగుంది... సంతోషంగా ఉందా అని అడుగుతారు.
రజిత చేసిన పుణ్యం నా కూతురిని కాచింది. అందుకే బంగారం లాంటి భర్త... తల్లి లాగా చూసుకునే అత్తింటి వారు దొరికారు అమ్మ.
ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో తెలుసా... గుడిలో జరిగింది ప్రతిదీ చెబుతాడు. మేము కూడా వచ్చేవాళ్ళం కదరా...
మనల్ని చూస్తే తన సంతోషం ఆవిరి అయిపోతుంది. నువ్వు నీ కూతురికి ఎదురు పడలేదా అంటే లేదు అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.
మరి తులాభారానికి కావలసినవి అన్నీ నువ్వే సిద్ధం చేశావు కదరా... అది ఇన్ని సంవత్సరాలు నా కూతురుని పస్తులు ఉంచిన దానికి చిన్న ప్రాయశ్చిత్తం అమ్మ..
అది కూడా బావగారిని, విక్రమ్ ని చాలా కష్టంగా ఒప్పించవలసి వచ్చింది. విక్రమ్ అయితే అసలు ఒప్పుకోలేదు.
నా భార్యకు అన్ని నేనే చూసుకోగలను. మధ్యలో మీరు ఎవరని నా మీద చాలా కోప్పడ్డాడు. బావ గారే కష్టంగా విక్రమ్ ని ఒప్పించారు.
విక్రమ్ చాలా అఇష్టంగానే ఒప్పుకున్నాడు అని బాధగా చెబుతారు. అమ్మ నీకు ఒక విషయం చెప్పనా అని ఒడిలో నుంచి లేచి అంటారు.
ఏంట్రా అని చంపపైన చెయ్యవేసి అడిగితే.. ఈరోజు నా కూతురి చేతితో అన్నం తిన్నాను అమ్మ. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేసాను.
నువ్వు అనేది ఏంట్రా.. అన్నదానంలో నువ్వు కూడా కూర్చున్నావా అని బాధగా అడుగుతారు. తప్పేముందమ్మ నా కూతురి చేతితో అన్నం తినాలి అంటే కూడా అదృష్టం ఉండాలి.
ఆ అదృష్టం కల్పించిన ఆ కుటుంబానికి ఎప్పటికి నేను రుణపడే ఉంటాను. అవని తులాభారం వేసిన తర్వాత నా కూతురు వాళ్ల అత్తగారిని పట్టుకుని ఎలా ఏడ్చిందో తెలుసా అమ్మ.
ఆకలికి ఎలా అలమటించిందో చెబుతూ ఉంటే నా ప్రాణం తరుక్కుపోయిందమ్మ. అసలు నేను ఇంత కసాయిగా ఎలా ఉండగలిగాను.
కూతురి ఆకలిని కూడా గుర్తించలేనంత మాయలో పడిపోయానా.. ఎందుకమ్మా ఇంత ఐశ్వర్యం సంపాదించాను.
ఆ డబ్బు సంపాదించడం, భార్గవి చూసుకుంటుంది అన్న గుడ్డి నమ్మకంలో పడిపోయి అవినికి దూరమైపోయాను. ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు అవిని తో కూర్చుని ఉండి ఉంటే ఈ రోజు నా కూతురు నాకు దూరమయ్యేది కాదు కదా...
నా కూతురు ప్రతి సంతోషంలో నేను ఉండేవాడిని. ఎప్పటికైనా నా కూతురు నన్ను క్షమిస్తుందంటావా అని బేలగా అడుగుతాడు.
ఆ మాటకి సత్యవతి గారికి కూడా ఏడుపు వస్తుంది. కాలమే ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతుంది రా.. నువ్వు తెలుసుకోలేద నీ కూతురు ఎలాంటి ఇబ్బంది పడిందో.. రజిత ఎలా చనిపోయిందో..
అలాగే అవిని కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు. ధనుంజయ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా లేచి ఆఫీసు రూంలోకి వెళ్తాడు.
అక్కడ నిలువెత్తు రూపంలో నవ్వుతూ కనిపిస్తున్న రజిత ఫోటోని చూస్తూ ఈరోజు అవని ఎంత సంతోషంగా ఉందో తెలుసా..
మన అల్లుడు బంగారం. ఎంత ముందు చూపు ఉన్నవాడో తెలుసా.. నాలాంటి వాడు కాదు. భార్య మీద ప్రేమ ఉంటే సరిపోదు. వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టాలి అన్న ముందు జాగ్రత్త ఉన్నవాడు.
అవని మనసులోనికి ఆలోచన కూడా రాకముందే అన్నీ చేసేస్తున్నాడు. నువ్వు చేసుకున్న పుణ్యమే ఈరోజు మన బిడ్డని కాస్తుంది రజిత అని ఫోటోని తడుముతూ రాత్రంతా అక్కడే పడుకుండిపోతాడు.
కొడుకు బాధ అర్థమవుతున్న సరే పెద్దవాళ్ళిద్దరూ ఏమీ చేయలేక చూస్తూ ఉంటారు. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి.
శరీరానికి తగిలిన గాయం అయితే మానిపోతుంది అని సర్ది చెప్పుకోవచ్చు కానీ.. మనసుకు తగిలిన గాయం అంత తొందరగా మానేది కాదు.
పక్కన ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు కానీ తగిలిన దెబ్బకి బాధ అనుభవించేది కూడా గాయపడిన వాళ్లే కాబట్టి...
పక్కన ఉన్న వాళ్ళు చెప్పగలరు గాని ఆ బాధను తీసుకోలేరు. అందుకే అటు అవనికి చెప్పలేక ఇటు ధనుంజయ్ బాధ తీర్చలేక పెద్ద వాళ్ళు ఇద్దరు కూడా నలిగిపోతున్నారు.
ధనుంజయ్ ఉదయమే తొందరగా లేచి మంచి ఉషారుగా రెడీ అవుతాడు. అమ్మ ఆకలేస్తుంది అని హడావుడి చేస్తాడు.
కొడుకులోని నూతన ఉత్సాహాన్ని చూసి సత్యవతి, శేషగిరి ఆశ్చర్యపోతారు. సర్వెంట్స్ ని కంగారు పెట్టి టిఫిన్ రెడీ చేయించి వడ్డిస్తారు.
రోజు తినేదానికన్నా ఆ రోజు ఎక్కువగా తింటాడు. ఏమైందిరా ఇంత సంతోషంగా ఉన్నావు. నేను తీసుకున్న నిర్ణయం అమల్లో పెట్టే రోజు దగ్గరకు వచ్చింది.
అలాగే ఆ రాక్షసిని కూడా కలవడానికి వెళుతున్నాను అని చెబుతాడు. ఇప్పుడు అవసరమా అంటే చాలా అవసరం అని చెప్పి బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోతాడు.
జైలుకు వెళ్లి జైలర్ పర్మిషన్ తో భార్గవిని కలుస్తాడు. భార్గవి భర్త ముందుకు వచ్చి నిలబడుతుంది. భార్గవిని చూస్తూ ఉంటాడు.
మేకప్ తో మెరుగులు దిద్దిన అందం కనపడటం లేదు. కళ్ళ కింద నల్లటి చారలు వచ్చి బక్క చిక్కుపోయి ఉంది.
అయినా ధనుంజయ్ కి ఎటువంటి జాలి కలగడం లేదు. రెండు చేతులు ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టుకుని ఎలా ఉన్నావ్ భార్గవి అని అడుగుతాడు.
భర్త వైపు కోపంగా చూస్తుంది. ఆ చూపుకి నవ్వుతూ ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నావు . నేనయితే చాలా సంతోషంగా ఉన్నాను.
ఎందుకో తెలుసా నా ముద్దుల కూతురు... ఎంతో అపురూపంగా అత్తోరింట్లో ఉంది. అలాగే నా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి అవబోతుంది అని పొగరుగా చెబుతాడు.
ఆ మాటలు వినగానే భార్గవి కోపంతో పిడికిలి బిగిస్తుంది. కానీ ఏమీ చేయలేదు కదా.. అందుకే చూస్తూ ఉండిపోతుంది.
ఏమిటి భార్గవి ఇవి వింటూ ఉంటే కోపం వస్తుందా.. నన్ను నా కూతుర్ని చంపేయాలి అన్నంత కసి పెరుగుతుందా అని అడుగుతాడు...
మెల్లిగా నోరు విప్పుతుంది. తప్పు చేసింది నేను. నన్ను శిక్షించండి. శిల్ప మీ కూతురే కదా.. శిల్పకి ఎలా అన్యాయం చేయగలుగుతున్నారు అని లేని ప్రేమని మళ్లీ చూపించడం మొదలు పెడుతుంది.
ఆ మాటకి నవ్వుతూ ఇంకా నీ యాక్టింగ్ మొదలు పెట్టలేదు ఏంటా అనుకున్నాను. పర్వాలేదు స్టార్ట్ చేశావు అంటాడు.
కన్నీళ్లు కారుస్తూ నేను మారానండి.
మారాను అని చెప్పిన మీరు ఎందుకు నమ్మడం లేదు. పాము మారింది అని చెబితే ఎవరైనా నమ్ముతారా.. నమ్మి పాము పక్కన కోడి పిల్లని పడుకోబెడతారా చెప్పు అంటాడు.
నేను పాము నా అని ఈసారి గట్టిగానే అడుగుతుంది. అంతకన్నా ప్రమాదకరం. నీ కడుపున పుట్టిన అది కూడా అలాగే తయారైంది కదా...
దాన్ని నా కూతురు అని చెప్పుకోవాలి అంటే నాకే అవమానం అని ఛీత్కరంగా అంటాడు.
భార్గవి రియాక్షన్ ఏమిటి...
కథ కొనసాగుతుంది...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)