13-02-2026, 08:58 AM
ఎపిసోడ్ 76
మిధున్ తో పాటు వచ్చిన అమ్మాయిని పరిచయం చేస్తూ తను సర్పరాజ్ కూతురు వాసుకి అభీర్ సేన గురించి ఆ కొండల గురించి రీసెర్చ్ చేస్తూ పగతో పెరిగింది అని చెప్పాడు మహేష్.
****************
మహేష్ చెప్పింది విని వాసుకి వైపు చూసి "మీ నాన్నగారు చనిపోయిన తర్వాత లండన్ లో నీకోసం చాలా సంవత్సరాలు వెతికాను కానీ నీ గురించి తెలియలేదు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు?" అని అడిగాడు ముకుల్.
"మా నాన్నగారితో పాటు గోకుల్ అంకుల్ కూడా చనిపోయారని తెలిసి నేను ఇండియా బయలుదేరి వచ్చాను అప్పటికే మీరు లండన్ వెళ్లిపోయారు, ఆ అభీర్ జైల్లో ఉన్నాడు అతని సైన్యం ఇంకా బతికే ఉంది అని తెలుసుకుని వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టాను.
అంతేకాదు నా తండ్రి చావుకి కారణమైన కొండల గురించి తెలుసుకోవడానికి శివమణి రీసెర్చ్ చేసిన ఫైల్స్ మొత్తం తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేశాను మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు టైం వచ్చిందని తెలిసి మహేష్ కి కాల్ చేసాను." అని చెప్పింది వాసుకి.
ఆ మాటలు విని వాసుకిని చూస్తూ "పేరుకు తగ్గట్టే దీని ఒళ్లంతా విషమే అనుకుంటా!" అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
వాసుకి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి "నువ్వు మా నాన్నగారి స్నేహితుడి కూతురివి అంటే మా కుటుంబంలో ఒకరితో సమానమే! నా తండ్రి నీ తండ్రి చావుకి కారణం ఒక్కరే మనం కలిసి వాళ్ళని అంతం చేద్దాము." అని చెప్పింది అర్ణ.
"మనకి ఇప్పుడు అభీర్ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి కావాలి అతను మన మాట వినాలి అలా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు అభిజిత్.
"మీ కుటుంబ సభ్యులు తప్పితే మిగతా వాళ్ళందరిని ఇక్కడి నుంచి పంపించండి మనం మాట్లాడుకుందాము." అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ చెప్పింది వాసుకి.
ఆ మాట విని "సరే మేడం! నేను వెళుతున్నాను విష్ణు కోసం ఎవరైనా వెళితే నేను కూడా వెళతాను." అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది రియా.
"అయ్యా" నేను కూడా వెళ్లి ఆ జూ పని చూస్తాను మీకు శ్రేయోభిలాషులమె కాని కుటుంబ సభ్యులను కాదు కదా!" అని ప్రతాప్ మిశ్రని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు వరదరాజులు.
అక్కడ ఉన్న వర్కర్స్ వైపు చూసి "మీరు కూడా లోపలికి వెళ్లి పని చూసుకోండి." అని చెప్పింది అర్ణ.
"నువ్వు చెప్పాల్సింది ఇంకా చెప్పొచ్చు! ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు ఎవరూ లేరు." అని చెప్పాడు ముకుల్.
తన బ్యాగ్ లో నుంచి ఒక బాక్స్ తీసి ఆన్ చేసి సౌండ్ పెంచింది వాసుకి.
ఆ మిషన్ నుంచి వచ్చే సౌండ్ కి అక్కడ ఉన్న పక్షులు మొత్తం ఎగిరిపోవడం చూసి నవ్వుతున్న వాసుకి ని చూసి "ఆ సౌండ్ ఏంటి? చాలా భయంకరంగా ఉంది ఎందుకు పెట్టావు?" అని అడిగాడు మిథున్.
"ఆ అభీర్ సేన గురించి మీకు సరిగ్గా తెలీదు ఆ పక్షులు కూడా వాళ్ళకి గుడాచారులుగా పని చేస్తాయి." అని చెప్పింది వాసుకి.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. ఆ పక్షులే నా ప్లాన్ మొత్తం పాడుచేసాయి." అని చెప్పింది అర్ణ.
"ఆ జారువా తెగ గురించి మొదట తెలుసుకుంది శివమణి కాదు అతని అసిస్టెంట్ చంద్రశేఖర్! అతను రీసెర్చ్ చేసి దాని గురించి శివమణికి చెబితే తను మీతో చేతులు కలిపాడు.
ఆ శివమణికి కూడా తెలియని చాలా విషయాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని గురించి ప్రతి విషయం నాకు తెలుసు మీ వాళ్ళని పంపించి చంద్రశేఖర్ ని ఇక్కడికి తీసుకు రమ్మనండి." అని చెప్పింది వాసుకి.
"ఒకవేళ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన మనకు హెల్ప్ చేస్తాడని గ్యారెంటీ ఏమిటి?" అని అడిగాడు రఘురామ్.
"ఆ చంద్రశేఖర్ మనకి కచ్చితంగా హెల్ప్ చేయడు, కానీ చేసేటట్లు మనం చేసుకోవాలి అతని కూతురు, ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలిసే ఉంటుంది.
రెండు పనులు ఒకేసారి జరిగిపోవాలి లేకపోతే అభీర్ ఎంటర్ అవుతాడు అప్పుడు మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని చెప్పింది వాసుకి.
"ఆ విషయం నేను చూసుకుంటాను." అని సాధు వైపు చూసి "మేడం చెప్పిన ఆ ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ ఉండాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే సార్!" అని వాసుకి దగ్గర అడ్రస్ తీసుకుని తన మనుషులతో కలిసి బయలుదేరాడు సాధు.
"ఆ జారువా తెగ వాళ్ళు ఇంకా 250 మంది దాకా బతికి ఉన్నారని తెలిసింది నిజమేనా?" అని అడిగాడు ముకుల్.
" నా రీసెర్చ్ ప్రకారం అడవి నుంచి ఆ తెగకి సంబంధించిన వారు 250 మంది మీరు వెళ్ళకముందే అక్కడి నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో బతుకుతున్నారు.
అభీర్ ప్రతి 50 మందికి ఒక నాయకుడిని నియమించడు అతనికి మాత్రమే ఆ యాభై మంది ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుస్తుంది.
మనం ఆ ఐదుగురిని పట్టుకుంటే మిగతా వారి గురించి తెలుస్తుంది. వాళ్ళని అభీర్ కి దూరం చెయ్యచ్చు!" అని చెప్పింది వాసుకి.
"మరి ఆ ఐదుగురిని పట్టుకోవడం ఎలా వాళ్ల గురించి నీకు తెలుసా?" అని అడిగింది అర్ణ.
"నాకు తెలిసి ఆ ఐదుగురు మీతో కలిసి మీతో మాట్లాడుతూ మీతో పని చేస్తూ మీతో నమ్మకంగా ఉంటారు వాళ్ళని కనిపెట్టే మార్గం నా దగ్గర ఉంది ముందు చంద్రశేఖర్ ని ఇక్కడకు రానివ్వండి." అని చెప్పింది వాసుకి.
ఆ మాట విని ముకుల్ వైపు చూసి "తాతయ్య! నువ్వు మన చుట్టూ అభీర్ మనుషులు ఉన్నట్లు ఉంది అన్నావు అయితే అది నిజమే! వాళ్ల గురించి తెలిసిన రోజున చావు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ.
"వాసుకి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మనవాళ్లు చంద్రశేఖర్ ని తీసుకు వచ్చిన తర్వాత నిన్ను పిలుస్తాను." అని చెప్పాడు ముకుల్.
"సరే!" అని మహేష్, మిథున్ లతో కలిసి లోపలికి వెళ్ళింది వాసుకి.
రూమ్లోకి తీసుకువెళ్లి "ఆ కొండల మీద చాలామంది కన్ను ఉంది అవి అంత విలువైనవా?" అని అడిగాడు మిథున్.
"ఆ కొండల కన్నా విలువైనది అక్కడ ఉంది. దానికోసమే మా నాన్నగారు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను అది స్తాదిస్తాను, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని నోటి నుంచి మనం ఎలాగైనా రాబట్టాలి." అని చెప్పింది వాసుకి.
"అంత విలువైనది అక్కడ ఏముంది?" అని ఆత్రుతగా అడిగాడు మహేష్.
ఆ మాటకి సీరియస్గా చూస్తూ "తొందరెందుకు గోడలకి కూడా చెవులు ఉంటాయి నేను మీతో పాటే ఉంటాను కదా అన్ని విషయాలు చెబుతాను." అని చెప్పింది వాసుకి.
"సరే! నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో!" అని చెప్పి మహేష్ తో కలిసి బయటకు వచ్చి హడావిడిగా వెళుతున్న రఘురామ్ ని చూసి "వాసుకి చెప్పింది నిజమే!" అని చెప్పాడు మిథున్.
****************
సాయంత్రం చంద్రశేఖర్ ని తన కూతురుని సాధు తీసుకురావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్లి "మనం కలుసుకోకుండా ఎలా ఉన్నామో అర్థం కాలేదు, నువ్వు శివమణికి శిష్యుడివి అయినా గురువుతో సమానం అని ఇప్పుడే తెలిసింది." అని చెప్పాడు ముకుల్.
"సార్! మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఆయన దగ్గర కొన్ని రోజులు అసిస్టెంట్ గా పని చేశాను ఆర్కియాలజీ గురించి నాకు అర్థం కాకపోవడంతో మానేశాను." అని చెప్పాడు చంద్రశేఖర్.
"అవునా?" అని చంద్ర శేఖర్ పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసి "తను నీ కూతురు ప్రియా కాదు కాలేజ్లో టీచరుగా పనిచేస్తుంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపిచి సుఖంగా ఉండడం నీకు చూడాలని లేదా?" అని అడిగాడు ముకుల్.
అంతలో మిథున్ వాళ్లతో కలిసి అక్కడికి వచ్చి "ఆ జారువా తెగ గురించి రీసెర్చ్ చేసింది మీరే అని నాకు తెలుసు!" అని తన చేతిలో ఉన్న డైరీ ఫైల్స్ చూపించింది వాసుకి.
ఆ మాట విని చంద్రశేఖర్ ఫేసులో ఫీలింగ్స్ మారడం గమనించి మిస్సైల్ వైపు చూసి సైగ చేసింది అర్ణ.
సైగలు గమనించి ప్రియాని అక్కడినుంచి బలవంతంగా గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్లాడు మిసైల్.
"నా కూతుర్ని ఏమి చేయకండి మీకేం కావాలో చెప్పండి." అని కంగారుగా అడిగాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన గురించి, ఆ కొండ దగ్గర ఉన్న అమోఘమైన నిధి గురించి నీకు తెలుసు, కానీ శివమణికి అన్ని విషయాలు చెప్పకుండా దాచావు ఇప్పుడు నీ కూతురి కోసం ఆ విషయాలు బయటపెట్టు!" అని అడిగింది వాసుకి.
"జారువా తెగ నుంచి ఏర్పడ్డ అభీర్ సేన గురించి నేను మొదటే శివమణిని హెచ్చరించాను నా మాట వినలేదు ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను వాళ్ల జోలికి వెళ్ళకండి. మీరు చేసిన తప్పులకు క్షమించామని అభీర్ ని వేడుకోండి మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన అంత గొప్పదా శివాజీ మహారాజ్ దగ్గర సైన్యంలో వీళ్ళ పూర్వీకులు పని చేశారు ఆ విషయం మాకు కూడా తెలుసు!" అని వెటకారంగా చెప్పింది అర్ణ.
"శివాజీ మహారాజ్ దగ్గర పని చేసిన సైన్యం అంత గొప్పదా?" అని అడిగాడు మహేష్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "ఎవరైతే 70 కిలోల కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేయగలుగుతారో ఆయనే యాసచి,
రెండు వేల మంది శత్రు సైన్యం ఎదురుగా ఉన్న ఒంటరిగా ఎదురోడ్డి పోరాడగలడో ఆయనే బాజీ.
ఎవరైతే చెయ్యి తెగిపడిన ఒంటి చేత్తో యుద్ధం చేయగలరో ఆయనే తానాజీ.
ఎవరైతే ఢిల్లీ నుంచి పూణే వరకు తన గుర్రం మీద ఎనిమిది గంటల్లో ప్రయాణించగలరో ఆయనే సంతాజీ.
కేవలం 700 మంది మరాఠీ యోధులను తీసుకువెళ్లి 30 వేల మంది మొగలూల సైన్యాన్ని తిప్పికొట్టినవాడు రాంజీ.
మొగల్స్ ఇంట్లో దూరి మాయ చేసి పిచ్చి వాళ్లని చేసిన వాడే బహిర్జీ.
అఫ్జల్ ఖాన్ రక్షకుడు ఎత్తిన చేతిని నిండు సభలో నరికిన వాడే జోహిజీ.
అఫ్జల్ ఖాన్ తలని నరికి తీసుకు వచ్చిన వారి పేరే సాంబాజి.
ఘోరమైన సింహంతో పోరాడి చీల్చి చెండాడిన వాడే చత్రపతి శంభాజీ.
ఇంతమంది వీరులతో రాజ్యాన్ని నిర్వహించిన వారే చత్రపతి శివాజీ.
ఈ వీరులకి సహాయం చేస్తూ చత్రపతి శివాజీ మహారాజ్ కి వెన్నంటి ఉండవని అమ్మవారి శక్తీ తో వచ్చినవారే అభీర్ సేన!
ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్న వారి వారసులతో మీరు ఢీకొట్టపోతున్నారు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి." అని ఆవేశంగా చెప్పాడు చంద్రశేఖర్.
****************
మహేష్ చెప్పింది విని వాసుకి వైపు చూసి "మీ నాన్నగారు చనిపోయిన తర్వాత లండన్ లో నీకోసం చాలా సంవత్సరాలు వెతికాను కానీ నీ గురించి తెలియలేదు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు?" అని అడిగాడు ముకుల్.
"మా నాన్నగారితో పాటు గోకుల్ అంకుల్ కూడా చనిపోయారని తెలిసి నేను ఇండియా బయలుదేరి వచ్చాను అప్పటికే మీరు లండన్ వెళ్లిపోయారు, ఆ అభీర్ జైల్లో ఉన్నాడు అతని సైన్యం ఇంకా బతికే ఉంది అని తెలుసుకుని వాళ్ళ గురించి వెతకడం మొదలుపెట్టాను.
అంతేకాదు నా తండ్రి చావుకి కారణమైన కొండల గురించి తెలుసుకోవడానికి శివమణి రీసెర్చ్ చేసిన ఫైల్స్ మొత్తం తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేశాను మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు టైం వచ్చిందని తెలిసి మహేష్ కి కాల్ చేసాను." అని చెప్పింది వాసుకి.
ఆ మాటలు విని వాసుకిని చూస్తూ "పేరుకు తగ్గట్టే దీని ఒళ్లంతా విషమే అనుకుంటా!" అని మనసులో అనుకున్నాడు ప్రతాప్ మిశ్రా.
వాసుకి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి "నువ్వు మా నాన్నగారి స్నేహితుడి కూతురివి అంటే మా కుటుంబంలో ఒకరితో సమానమే! నా తండ్రి నీ తండ్రి చావుకి కారణం ఒక్కరే మనం కలిసి వాళ్ళని అంతం చేద్దాము." అని చెప్పింది అర్ణ.
"మనకి ఇప్పుడు అభీర్ గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి కావాలి అతను మన మాట వినాలి అలా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు అభిజిత్.
"మీ కుటుంబ సభ్యులు తప్పితే మిగతా వాళ్ళందరిని ఇక్కడి నుంచి పంపించండి మనం మాట్లాడుకుందాము." అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ చెప్పింది వాసుకి.
ఆ మాట విని "సరే మేడం! నేను వెళుతున్నాను విష్ణు కోసం ఎవరైనా వెళితే నేను కూడా వెళతాను." అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది రియా.
"అయ్యా" నేను కూడా వెళ్లి ఆ జూ పని చూస్తాను మీకు శ్రేయోభిలాషులమె కాని కుటుంబ సభ్యులను కాదు కదా!" అని ప్రతాప్ మిశ్రని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు వరదరాజులు.
అక్కడ ఉన్న వర్కర్స్ వైపు చూసి "మీరు కూడా లోపలికి వెళ్లి పని చూసుకోండి." అని చెప్పింది అర్ణ.
"నువ్వు చెప్పాల్సింది ఇంకా చెప్పొచ్చు! ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు ఎవరూ లేరు." అని చెప్పాడు ముకుల్.
తన బ్యాగ్ లో నుంచి ఒక బాక్స్ తీసి ఆన్ చేసి సౌండ్ పెంచింది వాసుకి.
ఆ మిషన్ నుంచి వచ్చే సౌండ్ కి అక్కడ ఉన్న పక్షులు మొత్తం ఎగిరిపోవడం చూసి నవ్వుతున్న వాసుకి ని చూసి "ఆ సౌండ్ ఏంటి? చాలా భయంకరంగా ఉంది ఎందుకు పెట్టావు?" అని అడిగాడు మిథున్.
"ఆ అభీర్ సేన గురించి మీకు సరిగ్గా తెలీదు ఆ పక్షులు కూడా వాళ్ళకి గుడాచారులుగా పని చేస్తాయి." అని చెప్పింది వాసుకి.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. ఆ పక్షులే నా ప్లాన్ మొత్తం పాడుచేసాయి." అని చెప్పింది అర్ణ.
"ఆ జారువా తెగ గురించి మొదట తెలుసుకుంది శివమణి కాదు అతని అసిస్టెంట్ చంద్రశేఖర్! అతను రీసెర్చ్ చేసి దాని గురించి శివమణికి చెబితే తను మీతో చేతులు కలిపాడు.
ఆ శివమణికి కూడా తెలియని చాలా విషయాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని గురించి ప్రతి విషయం నాకు తెలుసు మీ వాళ్ళని పంపించి చంద్రశేఖర్ ని ఇక్కడికి తీసుకు రమ్మనండి." అని చెప్పింది వాసుకి.
"ఒకవేళ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చిన మనకు హెల్ప్ చేస్తాడని గ్యారెంటీ ఏమిటి?" అని అడిగాడు రఘురామ్.
"ఆ చంద్రశేఖర్ మనకి కచ్చితంగా హెల్ప్ చేయడు, కానీ చేసేటట్లు మనం చేసుకోవాలి అతని కూతురు, ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలిసే ఉంటుంది.
రెండు పనులు ఒకేసారి జరిగిపోవాలి లేకపోతే అభీర్ ఎంటర్ అవుతాడు అప్పుడు మన ప్లాన్ మొత్తం పాడవుతుంది." అని చెప్పింది వాసుకి.
"ఆ విషయం నేను చూసుకుంటాను." అని సాధు వైపు చూసి "మేడం చెప్పిన ఆ ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ ఉండాలి." అని చెప్పాడు అభిజిత్.
"సరే సార్!" అని వాసుకి దగ్గర అడ్రస్ తీసుకుని తన మనుషులతో కలిసి బయలుదేరాడు సాధు.
"ఆ జారువా తెగ వాళ్ళు ఇంకా 250 మంది దాకా బతికి ఉన్నారని తెలిసింది నిజమేనా?" అని అడిగాడు ముకుల్.
" నా రీసెర్చ్ ప్రకారం అడవి నుంచి ఆ తెగకి సంబంధించిన వారు 250 మంది మీరు వెళ్ళకముందే అక్కడి నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో బతుకుతున్నారు.
అభీర్ ప్రతి 50 మందికి ఒక నాయకుడిని నియమించడు అతనికి మాత్రమే ఆ యాభై మంది ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుస్తుంది.
మనం ఆ ఐదుగురిని పట్టుకుంటే మిగతా వారి గురించి తెలుస్తుంది. వాళ్ళని అభీర్ కి దూరం చెయ్యచ్చు!" అని చెప్పింది వాసుకి.
"మరి ఆ ఐదుగురిని పట్టుకోవడం ఎలా వాళ్ల గురించి నీకు తెలుసా?" అని అడిగింది అర్ణ.
"నాకు తెలిసి ఆ ఐదుగురు మీతో కలిసి మీతో మాట్లాడుతూ మీతో పని చేస్తూ మీతో నమ్మకంగా ఉంటారు వాళ్ళని కనిపెట్టే మార్గం నా దగ్గర ఉంది ముందు చంద్రశేఖర్ ని ఇక్కడకు రానివ్వండి." అని చెప్పింది వాసుకి.
ఆ మాట విని ముకుల్ వైపు చూసి "తాతయ్య! నువ్వు మన చుట్టూ అభీర్ మనుషులు ఉన్నట్లు ఉంది అన్నావు అయితే అది నిజమే! వాళ్ల గురించి తెలిసిన రోజున చావు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పింది అర్ణ.
"వాసుకి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మనవాళ్లు చంద్రశేఖర్ ని తీసుకు వచ్చిన తర్వాత నిన్ను పిలుస్తాను." అని చెప్పాడు ముకుల్.
"సరే!" అని మహేష్, మిథున్ లతో కలిసి లోపలికి వెళ్ళింది వాసుకి.
రూమ్లోకి తీసుకువెళ్లి "ఆ కొండల మీద చాలామంది కన్ను ఉంది అవి అంత విలువైనవా?" అని అడిగాడు మిథున్.
"ఆ కొండల కన్నా విలువైనది అక్కడ ఉంది. దానికోసమే మా నాన్నగారు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను అది స్తాదిస్తాను, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చంద్రశేఖర్ కి తెలుసు అతని నోటి నుంచి మనం ఎలాగైనా రాబట్టాలి." అని చెప్పింది వాసుకి.
"అంత విలువైనది అక్కడ ఏముంది?" అని ఆత్రుతగా అడిగాడు మహేష్.
ఆ మాటకి సీరియస్గా చూస్తూ "తొందరెందుకు గోడలకి కూడా చెవులు ఉంటాయి నేను మీతో పాటే ఉంటాను కదా అన్ని విషయాలు చెబుతాను." అని చెప్పింది వాసుకి.
"సరే! నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో!" అని చెప్పి మహేష్ తో కలిసి బయటకు వచ్చి హడావిడిగా వెళుతున్న రఘురామ్ ని చూసి "వాసుకి చెప్పింది నిజమే!" అని చెప్పాడు మిథున్.
****************
సాయంత్రం చంద్రశేఖర్ ని తన కూతురుని సాధు తీసుకురావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్లి "మనం కలుసుకోకుండా ఎలా ఉన్నామో అర్థం కాలేదు, నువ్వు శివమణికి శిష్యుడివి అయినా గురువుతో సమానం అని ఇప్పుడే తెలిసింది." అని చెప్పాడు ముకుల్.
"సార్! మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఆయన దగ్గర కొన్ని రోజులు అసిస్టెంట్ గా పని చేశాను ఆర్కియాలజీ గురించి నాకు అర్థం కాకపోవడంతో మానేశాను." అని చెప్పాడు చంద్రశేఖర్.
"అవునా?" అని చంద్ర శేఖర్ పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసి "తను నీ కూతురు ప్రియా కాదు కాలేజ్లో టీచరుగా పనిచేస్తుంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపిచి సుఖంగా ఉండడం నీకు చూడాలని లేదా?" అని అడిగాడు ముకుల్.
అంతలో మిథున్ వాళ్లతో కలిసి అక్కడికి వచ్చి "ఆ జారువా తెగ గురించి రీసెర్చ్ చేసింది మీరే అని నాకు తెలుసు!" అని తన చేతిలో ఉన్న డైరీ ఫైల్స్ చూపించింది వాసుకి.
ఆ మాట విని చంద్రశేఖర్ ఫేసులో ఫీలింగ్స్ మారడం గమనించి మిస్సైల్ వైపు చూసి సైగ చేసింది అర్ణ.
సైగలు గమనించి ప్రియాని అక్కడినుంచి బలవంతంగా గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్లాడు మిసైల్.
"నా కూతుర్ని ఏమి చేయకండి మీకేం కావాలో చెప్పండి." అని కంగారుగా అడిగాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన గురించి, ఆ కొండ దగ్గర ఉన్న అమోఘమైన నిధి గురించి నీకు తెలుసు, కానీ శివమణికి అన్ని విషయాలు చెప్పకుండా దాచావు ఇప్పుడు నీ కూతురి కోసం ఆ విషయాలు బయటపెట్టు!" అని అడిగింది వాసుకి.
"జారువా తెగ నుంచి ఏర్పడ్డ అభీర్ సేన గురించి నేను మొదటే శివమణిని హెచ్చరించాను నా మాట వినలేదు ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను వాళ్ల జోలికి వెళ్ళకండి. మీరు చేసిన తప్పులకు క్షమించామని అభీర్ ని వేడుకోండి మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాడు." అని చెప్పాడు చంద్రశేఖర్.
"ఆ అభీర్ సేన అంత గొప్పదా శివాజీ మహారాజ్ దగ్గర సైన్యంలో వీళ్ళ పూర్వీకులు పని చేశారు ఆ విషయం మాకు కూడా తెలుసు!" అని వెటకారంగా చెప్పింది అర్ణ.
"శివాజీ మహారాజ్ దగ్గర పని చేసిన సైన్యం అంత గొప్పదా?" అని అడిగాడు మహేష్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "ఎవరైతే 70 కిలోల కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేయగలుగుతారో ఆయనే యాసచి,
రెండు వేల మంది శత్రు సైన్యం ఎదురుగా ఉన్న ఒంటరిగా ఎదురోడ్డి పోరాడగలడో ఆయనే బాజీ.
ఎవరైతే చెయ్యి తెగిపడిన ఒంటి చేత్తో యుద్ధం చేయగలరో ఆయనే తానాజీ.
ఎవరైతే ఢిల్లీ నుంచి పూణే వరకు తన గుర్రం మీద ఎనిమిది గంటల్లో ప్రయాణించగలరో ఆయనే సంతాజీ.
కేవలం 700 మంది మరాఠీ యోధులను తీసుకువెళ్లి 30 వేల మంది మొగలూల సైన్యాన్ని తిప్పికొట్టినవాడు రాంజీ.
మొగల్స్ ఇంట్లో దూరి మాయ చేసి పిచ్చి వాళ్లని చేసిన వాడే బహిర్జీ.
అఫ్జల్ ఖాన్ రక్షకుడు ఎత్తిన చేతిని నిండు సభలో నరికిన వాడే జోహిజీ.
అఫ్జల్ ఖాన్ తలని నరికి తీసుకు వచ్చిన వారి పేరే సాంబాజి.
ఘోరమైన సింహంతో పోరాడి చీల్చి చెండాడిన వాడే చత్రపతి శంభాజీ.
ఇంతమంది వీరులతో రాజ్యాన్ని నిర్వహించిన వారే చత్రపతి శివాజీ.
ఈ వీరులకి సహాయం చేస్తూ చత్రపతి శివాజీ మహారాజ్ కి వెన్నంటి ఉండవని అమ్మవారి శక్తీ తో వచ్చినవారే అభీర్ సేన!
ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్న వారి వారసులతో మీరు ఢీకొట్టపోతున్నారు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి." అని ఆవేశంగా చెప్పాడు చంద్రశేఖర్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)