13-02-2026, 08:56 AM
ఎపిసోడ్ 75
జాకీ చనిపోయిన ప్లేస్ నుంచి కార్లో వెళుతూ మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది అని అభీర్ ని అడిగింది మిత్ర.
ఆ గెస్ట్ హౌస్ దగ్గర నువ్వు పెట్టిన మిషన్ ని వాళ్ళు కనిపెట్టవచ్చు ఏమో కానీ అక్కడ ఆడుకుంటున్న ఆ పక్షులను ఎవరు కనిపెట్టలేరు అని ఆకాశంలో ఎగురుతున్న వాటిని చూపించాడు అభీర్.
******************
ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుడు సింబా తీసుకువెళ్లినా విష్ణు పరిస్థితి ఏమిటి? ఆ కొండలు చూపించి తీసుకువస్తాడా? లేక అక్కడే వదిలేస్తాడా?" అని డౌట్ గా అడిగాడు చాక్లెట్.
"అడవిలో మా సింబా ఆడుకునే రాతికొండా ఒకటి ఉంది అక్కడికి ఏదైనా తీసుకు వెళ్తే తిరిగి వెనక్కి పంపించాడు. అయినా విష్ణు కి అడవిలో బోర్ కొట్టదులే ఎందుకంటే ఈరోజు జూలో ఉన్న జంతువుల్ని మొత్తం రాజన్ అక్కడికి పంపిస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు నారప్ప.
కాసేపాటికి వసుంధర ఇంటి దగ్గర కార్ దిగి లోపలికి వస్తున్న అభీర్ ని చూసి "చాలా థాంక్స్! కరెక్ట్ టైం కి వచ్చావు లేకపోతే ఎవరు ప్రాణాలతో ఉండే వాళ్ళు కాదు." అని చెప్పేడు శ్రీకర్.
అభీర్ ని చూసి తండ్రి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ "హాయ్ అంకుల్!" అని వచ్చింది రోషిని.
ప్రణతి, రోషిణిల వైపు చూసి "అవును! మిమ్మల్ని కిడ్నాప్ చేసి రూమ్ లో ఉంచారు కదా భయం వేయలేదా? ఏడవకుండా బానే ఉన్నారు." అని డౌట్ గా అడిగింది మిత్ర.
"భయం ఎందుకు? మమ్మల్ని ఉంచిన రూమ్ కిటికీ దగ్గరకి సెక్యూరిటీగా ఈ ఇంటి దగ్గర ఉండే పక్షులు వచ్చాయిగా..!" అని చెప్పింది ప్రణతి.
"అవును! ఆరోజు పక్షులు నాతో కూడా మాట్లాడతాయని అంకుల్ చెప్పారు కదా! అందుకే వాటితో అభీర్ అంకుల్ ని తీసుకు రమ్మని చెప్పాను అవి వెళ్లి తీసుకువచ్చాయి." అని క్యూట్ గా చెప్పింది రోషిని.
అంతలో స్కూటీ మీద మల్లితో కలిసి అక్కడికి వచ్చి "అందరూ ఇక్కడే ఉన్నారా?" అని అభీర్ వైపు చూసి "ఇక్కడ ఇంత జరుగుతుంటే మమల్ని ప్రహల్లాద్ భార్యతో వంట ప్రోగ్రాం షూట్ చేయమని పంపించావు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీలమ్.
"మాకే కాదు మీకు కూడా ఫ్యామిలి ఉంది అని వాళ్ళకి గుర్తు చేశాను, ఇంకా ఎవరు ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్లారు." అని చెప్పాడు అభీర్.
అక్కడికి వచ్చి అభీర్ దగ్గర ఉన్న రోషిని తీసుకుని "పిల్లల్ని నువ్వు ఎలాగైనా కాపాడుతావని ధైర్యంతోనే ఉన్నాను, అయ్యినా ఆ నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ మొత్తం గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు.
నువ్వు తలుచుకుంటే చంపాలి అనుకున్న వాళ్ళను అందరిని ఒకేసారి చంపేయొచ్చు ఎందుకు వెయిట్ చేస్తున్నావు?" అని డౌట్ గా అడిగింది వసుంధర.
"మేడం! శ్రీకృష్ణుడు 18 సార్లు జలాసందురుడి తో యుద్ధం చేశాడు ప్రతిసారి శ్రీకృష్ణుడు విజయం సాధించాడు, అవకాశం వచ్చిన ఆ రాక్షసుడిని చంపకుండా వదిలేసేవాడు ఎందుకో తెలుసా?" అని అడిగాడు అభీర్.
"అవును! ఎందుకు? ఆ అనుమానం నాకు కూడా ఉంది." అని ఆత్రుతగా అడిగాడు సందీప్.
"యుద్ధానికి వచ్చిన ప్రతిసారి తనికి సహాయం చేసే రాజ్యలా నుండి రాజులు తీసుకుని వచ్చేవాడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు వాళ్ళని అంతం చేసేవారు.
ప్రాణాలతో వెనక్కి వెళ్లి కసితో మళ్ళీ కొత్తవారిని తీసుకువచ్చేవాడు, అలా రాక్షసుడికి సహాయం చేసే వాళ్ళు అందరూ అంతమైయినా తర్వాత జలసందురిడి వంతు వచ్చింది.
అలాగే ఆధర్మం వైపు ఉండి ముకుల్ వాళ్లకి సహాయం చేసే వాళ్ళందరూ ముందుకు వస్తారు అందరూ మరణిస్తారు ఆదే పంచమ వేదం లో ఉన్న యుద్ధ నీతి!" అని చెప్పాడు అభీర్.
ఆ మాటలు ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు అందరు.
***************
నంద గెస్ట్ హౌస్ దగ్గర టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ "ఎవరి ఫోన్లు కలవడం లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు." అని ముకుల్ వైపు చూసి "తాతయ్య! మనవాళ్ళు ఆ అభీర్ ని, మిత్రని చంపేసి ఉంటారా?" అని ఆత్రుతగా అడిగింది అర్ణ.
"నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది కచ్చితంగా ఈ రోజు అక్కడ ఎవరో ఒకరు చాస్తారు, ఎందుకంటే చుట్టూ ఉన్న స్నైపర్స్ ని ఎవరు కనిపెట్టలేరు, ఆవేశపడి అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ తలలొ దిగుతుంది." అని చెప్పాడు మోహిత్.
అక్కడికి వస్తు "ఒకసారి టీవీ చూడండి. ఆ ప్రహ్లాద్ గాడు న్యూస్ లొ పురాణం చెబుతున్నాడు." అని వెటకారంగా అన్నాడు రఘూరామ్.
"అవునా?" అని లాప్టాప్ లొ న్యూస్ ఆన్ చేసింది అర్ణ.
మీడియాతో మాట్లాడుతూ "చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పట్టుకునే క్రమంలో షూట్ అవుట్ జరిగింది.
ఆ ముఠా లొ అందరూ చనిపోయారు పిల్లలు సేఫ్ గా ఉన్నారు వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము." అని చెప్పాడు ప్రహ్లాద్.
"ఏంటి? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నాడు?" అని కోపంగా అడిగాడు అభిజిత్.
గెస్ట్ హౌస్ లోకి వచ్చి కారు దిగి వస్తున్నా నెల్సన్ వాళ్ళని చూసి "అసలు అక్కడ ఏం జరిగింది? విష్ణు, జాకీ ఎక్కడ?" అని అడిగాడు ముకుల్.
"సార్! అక్కడికి అభీర్ తన మనుషులతో వచ్చాడు మేము షూట్ చేద్దాము అనుకునే లోపు పక్షుల గుంపు మా మీద పడింది. ఒక పెద్ద పక్షి వచ్చి విష్ణు సార్ ని కాళ్లతో ఎత్తుకు వెళ్ళిపోయింది. మిత్ర చేతులతో జాకిని చంపించేసాడు." అని చెప్పాడు నెల్సన్.
"మరి ప్రహల్లాద్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీడియాతో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు?" అని కోపంగా చూస్తూ అడిగింది అర్ణ.
"ప్రహల్లాద్ తో పాటు మిగిలిన ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ని ఆ అభీర్ తన గ్రిప్ లొ ఉంచుకున్నాడు, అందుకే తను ఏమీ చేయలేకపోయాడు. మీరు వేసిన ప్లాన్ మొత్తం వాళ్లకి తెలిసిపోయింది. కచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అభీర్ కి చెప్పి ఉంటారు." అని అనుమానంగా చెప్పాడు నెల్సన్.
"అవునా?" అని అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "నో! ఈ ప్లాన్ గురించి ఎవరికీ తెలీదు. అయ్యినా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ చేయడానికి ఫోన్ లు పని చేయడం లేదు ఎవరు బయటకు వెళ్ళలేదు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?" అని అడిగింది అర్ణ.
"మరిఆ పక్షి విష్ణుని ఎటు తీసుకొని వెళ్లిందో కనిపించలేదా?" అని కంగారుగా అడిగాడు ముకుల్.
"నో సార్! అది ఎటు వెళ్లిందో అర్థం కాలేదు చాలా వేగంగా వెళ్ళిపోయింది." అని తలదించుకుని చెప్పాడు నెల్సన్.
"నాకు తెలిసి ఆ పక్షి సింబా అయ్యి ఉంటుంది. విష్ణుని కచ్చితంగా ఆ కొండల దగ్గరికి తీసుకు వెళుతుంది." అని చెప్పేడు అభిజిత్.
"మనం విష్ణు ని ఎలాగైనా కాపాడాలి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మీ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను చెప్పిన ప్లాన్ కాస్తా వింటారా..? మనం విష్ణు ని సేవ్ చేయొచ్చు, ఆ కొండలని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, అభీర్ ని గట్టి దెబ్బ కొట్టొచ్చు!" అని చెప్పాడు రఘూరామ్.
"ఆ ప్లాన్ ఏమిటో చెప్పండి? మనం ఎలాగైనా విష్ణు ని కాపాడాలి." అని అడిగాడు ముకుల్.
"అడవి మొత్తం మన హ్యాండ్ ఓవర్ లొ ఉండాలి అంటే అక్కడి నుంచి తీసుకువచ్చి జూలో పెట్టిన జంతువులు మొత్తాన్ని తీసుకువెళ్లి అక్కడ వదిలి, దానిని సంరక్షణ కేంద్రంగా మార్చి మన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలి.
అప్పుడు ఆ అడవిలో ఉండేది మన మనుషులే కాబట్టి ఆ కొండల పని ఈజీ అవుతుంది. ఒకవేళ విష్ణు అక్కడే ఉంటే మనకు ఈజీగా దొరుకుతాడు, ఆ అభీర్ కుడా మన చేతికి దొరుకుతాడు." అని చెప్పాడు రఘురామ్.
"ఆ అడవిని సంరక్షణ కేంద్రంగా మార్చి జంతువుల్ని అక్కడికి పంపించడం అంత ఈజీగా అయిపోతుందా?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.
"ఆ పని నేను చూసుకుంటాను ఎందుకంటే ఆ మినిస్ట్రీ నా చేతిలోనే ఉంది." అని చెప్పి రఘురామ్ వైపు సంతోషంగా చూస్తు 'నా నెత్తిన పాలు పోసాడు.' అని మనసులో అనుకున్నాడు వరదరాజులు.
"అయ్యినా సరే! ఆ సంరక్షణ కేంద్రంలో మన మనుషులు ఉండాలి అంటే అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా!" అని అనుమానంగా అడిగాడు మోహిత్.
"ఆ సంగతి నేను చూసుకుంటాను 12 సంవత్సరాల క్రితం గోకుల్ అంకుల్ తో పాటు చనిపోయిన జావిద్ కొడుకు ఫారుక్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ మినిస్టర్! తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి మాత్రం ఉండదా..!" అని చెప్పాడు నిర్మల్.
"మంచి ప్లాన్! ఆ అభీర్ గాడు వాడి మనుషులు ఆ అడవిలోకి రావాలి అంటే మనల్ని దాటుకుని రావాలి వచ్చినవాడిని వచ్చినట్లు అక్కడే పాతి పెడితే సరిపోతుంది." అని కోపంగా చెప్పాడు అభిజిత్.
వరదరాజులు వైపు చూసి "అంకుల్! మీరు వెంటనే పర్మిషన్ తెప్పించండి. ఫారుక్ ని కలిసి అడవి సంగతి, ఆ కొండల సంగతి నేను నిర్మల్ చూసుకుంటాము." అని చెప్పాడు ప్రమోద్.
"నా ఐడియా ఎలా ఉంది? అప్పుడప్పుడు నేను కూడా విజిట్ చేస్తూ ఉంటాను." అని ప్రమోద్ వైపు వెటకారంగా చూస్తూ నవ్వాడు రఘురామ్.
"సరే!" అని వరదరాజుల వైపు చూసి "ఆ పర్మిషన్స్ స్పీడ్ గా అయ్యాటట్లు చూడు." అని చెప్పాడు ముఖేష్.
ఆ మాట విని "సరే అయ్యా! వెంటనే ఆ పని అయ్యేటట్లు చేస్తాను." అని ప్రతాప్ మిశ్రతో కలిసి అక్కడి నుంచి వెళుతూ "మనం ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాము, వాళ్ళ నోటితోనే జూలొ జంతువుల్ని అడవికి పంపించమని చెప్పారు." అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.
తమ వైపు కోపంగా చూస్తున్న రియాని చూసి వరదరాజులు వెనకాలే వెళ్లారు తంబీయర్, సుజిత్ లు.
రఘురామ్ దగ్గరకి వచ్చి "ఈ ప్లాన్ నిజంగా మీదేనా? లేక ఎవరైనా చెప్పారా?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"నాకు ఎవరైనా ప్లాన్ చెప్పగలరా?" అని స్మైల్ ఇచ్చాడు రఘురామ్.
"ఏంటే! మీ మామయ్య ఎలా కనపడుతున్నాడు? మీ నాన్న పోయిన తర్వాత నంద బిజినెస్ లు మొత్తం ఒంటి చేత్తో నడిపారు." అని గొప్పగా చెప్పింది ఝాన్సీ.
"అవునవును అప్పుడు జరిగిన పెంట ఇంకా ఉంది." అని చీప్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"ఈ టైమ్ లో మనలో మనం నిందించుకోవడం కాదు, ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మనకి ఒకరు కావాలి. " అని చెప్పాడు ముకుల్.
అంతలో అక్కడికి కార్ లొ వచ్చి మిథున్ తో పాటు బ్యాగ్ పట్టుకుని లోపలకి వస్తున్న అమ్మాయిని చూసి "మహేష్ ఎవరు ఆ అమ్మాయి?" అని అడిగింది అర్ణ.
"ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన మనిషి కావాలి అన్నారు కదా, తన తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఆ తెగ వాళ్ళ మీద ఆ కొండల మీద రీసెర్చ్ చేస్తూ పగతో బతుకుతుంది. సర్పరాజ్ కూతురు 'వాసుకి' ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది." అని చెప్పాడు మహేష్.
ఆ గెస్ట్ హౌస్ దగ్గర నువ్వు పెట్టిన మిషన్ ని వాళ్ళు కనిపెట్టవచ్చు ఏమో కానీ అక్కడ ఆడుకుంటున్న ఆ పక్షులను ఎవరు కనిపెట్టలేరు అని ఆకాశంలో ఎగురుతున్న వాటిని చూపించాడు అభీర్.
******************
ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుడు సింబా తీసుకువెళ్లినా విష్ణు పరిస్థితి ఏమిటి? ఆ కొండలు చూపించి తీసుకువస్తాడా? లేక అక్కడే వదిలేస్తాడా?" అని డౌట్ గా అడిగాడు చాక్లెట్.
"అడవిలో మా సింబా ఆడుకునే రాతికొండా ఒకటి ఉంది అక్కడికి ఏదైనా తీసుకు వెళ్తే తిరిగి వెనక్కి పంపించాడు. అయినా విష్ణు కి అడవిలో బోర్ కొట్టదులే ఎందుకంటే ఈరోజు జూలో ఉన్న జంతువుల్ని మొత్తం రాజన్ అక్కడికి పంపిస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు నారప్ప.
కాసేపాటికి వసుంధర ఇంటి దగ్గర కార్ దిగి లోపలికి వస్తున్న అభీర్ ని చూసి "చాలా థాంక్స్! కరెక్ట్ టైం కి వచ్చావు లేకపోతే ఎవరు ప్రాణాలతో ఉండే వాళ్ళు కాదు." అని చెప్పేడు శ్రీకర్.
అభీర్ ని చూసి తండ్రి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ "హాయ్ అంకుల్!" అని వచ్చింది రోషిని.
ప్రణతి, రోషిణిల వైపు చూసి "అవును! మిమ్మల్ని కిడ్నాప్ చేసి రూమ్ లో ఉంచారు కదా భయం వేయలేదా? ఏడవకుండా బానే ఉన్నారు." అని డౌట్ గా అడిగింది మిత్ర.
"భయం ఎందుకు? మమ్మల్ని ఉంచిన రూమ్ కిటికీ దగ్గరకి సెక్యూరిటీగా ఈ ఇంటి దగ్గర ఉండే పక్షులు వచ్చాయిగా..!" అని చెప్పింది ప్రణతి.
"అవును! ఆరోజు పక్షులు నాతో కూడా మాట్లాడతాయని అంకుల్ చెప్పారు కదా! అందుకే వాటితో అభీర్ అంకుల్ ని తీసుకు రమ్మని చెప్పాను అవి వెళ్లి తీసుకువచ్చాయి." అని క్యూట్ గా చెప్పింది రోషిని.
అంతలో స్కూటీ మీద మల్లితో కలిసి అక్కడికి వచ్చి "అందరూ ఇక్కడే ఉన్నారా?" అని అభీర్ వైపు చూసి "ఇక్కడ ఇంత జరుగుతుంటే మమల్ని ప్రహల్లాద్ భార్యతో వంట ప్రోగ్రాం షూట్ చేయమని పంపించావు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీలమ్.
"మాకే కాదు మీకు కూడా ఫ్యామిలి ఉంది అని వాళ్ళకి గుర్తు చేశాను, ఇంకా ఎవరు ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్లారు." అని చెప్పాడు అభీర్.
అక్కడికి వచ్చి అభీర్ దగ్గర ఉన్న రోషిని తీసుకుని "పిల్లల్ని నువ్వు ఎలాగైనా కాపాడుతావని ధైర్యంతోనే ఉన్నాను, అయ్యినా ఆ నంద ఫ్యామిలీ, అభిజిత్ ఫ్యామిలీ మొత్తం గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు.
నువ్వు తలుచుకుంటే చంపాలి అనుకున్న వాళ్ళను అందరిని ఒకేసారి చంపేయొచ్చు ఎందుకు వెయిట్ చేస్తున్నావు?" అని డౌట్ గా అడిగింది వసుంధర.
"మేడం! శ్రీకృష్ణుడు 18 సార్లు జలాసందురుడి తో యుద్ధం చేశాడు ప్రతిసారి శ్రీకృష్ణుడు విజయం సాధించాడు, అవకాశం వచ్చిన ఆ రాక్షసుడిని చంపకుండా వదిలేసేవాడు ఎందుకో తెలుసా?" అని అడిగాడు అభీర్.
"అవును! ఎందుకు? ఆ అనుమానం నాకు కూడా ఉంది." అని ఆత్రుతగా అడిగాడు సందీప్.
"యుద్ధానికి వచ్చిన ప్రతిసారి తనికి సహాయం చేసే రాజ్యలా నుండి రాజులు తీసుకుని వచ్చేవాడు ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు వాళ్ళని అంతం చేసేవారు.
ప్రాణాలతో వెనక్కి వెళ్లి కసితో మళ్ళీ కొత్తవారిని తీసుకువచ్చేవాడు, అలా రాక్షసుడికి సహాయం చేసే వాళ్ళు అందరూ అంతమైయినా తర్వాత జలసందురిడి వంతు వచ్చింది.
అలాగే ఆధర్మం వైపు ఉండి ముకుల్ వాళ్లకి సహాయం చేసే వాళ్ళందరూ ముందుకు వస్తారు అందరూ మరణిస్తారు ఆదే పంచమ వేదం లో ఉన్న యుద్ధ నీతి!" అని చెప్పాడు అభీర్.
ఆ మాటలు ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు అందరు.
***************
నంద గెస్ట్ హౌస్ దగ్గర టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ "ఎవరి ఫోన్లు కలవడం లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు." అని ముకుల్ వైపు చూసి "తాతయ్య! మనవాళ్ళు ఆ అభీర్ ని, మిత్రని చంపేసి ఉంటారా?" అని ఆత్రుతగా అడిగింది అర్ణ.
"నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది కచ్చితంగా ఈ రోజు అక్కడ ఎవరో ఒకరు చాస్తారు, ఎందుకంటే చుట్టూ ఉన్న స్నైపర్స్ ని ఎవరు కనిపెట్టలేరు, ఆవేశపడి అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ తలలొ దిగుతుంది." అని చెప్పాడు మోహిత్.
అక్కడికి వస్తు "ఒకసారి టీవీ చూడండి. ఆ ప్రహ్లాద్ గాడు న్యూస్ లొ పురాణం చెబుతున్నాడు." అని వెటకారంగా అన్నాడు రఘూరామ్.
"అవునా?" అని లాప్టాప్ లొ న్యూస్ ఆన్ చేసింది అర్ణ.
మీడియాతో మాట్లాడుతూ "చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని పట్టుకునే క్రమంలో షూట్ అవుట్ జరిగింది.
ఆ ముఠా లొ అందరూ చనిపోయారు పిల్లలు సేఫ్ గా ఉన్నారు వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము." అని చెప్పాడు ప్రహ్లాద్.
"ఏంటి? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నాడు?" అని కోపంగా అడిగాడు అభిజిత్.
గెస్ట్ హౌస్ లోకి వచ్చి కారు దిగి వస్తున్నా నెల్సన్ వాళ్ళని చూసి "అసలు అక్కడ ఏం జరిగింది? విష్ణు, జాకీ ఎక్కడ?" అని అడిగాడు ముకుల్.
"సార్! అక్కడికి అభీర్ తన మనుషులతో వచ్చాడు మేము షూట్ చేద్దాము అనుకునే లోపు పక్షుల గుంపు మా మీద పడింది. ఒక పెద్ద పక్షి వచ్చి విష్ణు సార్ ని కాళ్లతో ఎత్తుకు వెళ్ళిపోయింది. మిత్ర చేతులతో జాకిని చంపించేసాడు." అని చెప్పాడు నెల్సన్.
"మరి ప్రహల్లాద్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీడియాతో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు?" అని కోపంగా చూస్తూ అడిగింది అర్ణ.
"ప్రహల్లాద్ తో పాటు మిగిలిన ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ని ఆ అభీర్ తన గ్రిప్ లొ ఉంచుకున్నాడు, అందుకే తను ఏమీ చేయలేకపోయాడు. మీరు వేసిన ప్లాన్ మొత్తం వాళ్లకి తెలిసిపోయింది. కచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అభీర్ కి చెప్పి ఉంటారు." అని అనుమానంగా చెప్పాడు నెల్సన్.
"అవునా?" అని అక్కడ ఉన్న వారి వైపు చూస్తూ "నో! ఈ ప్లాన్ గురించి ఎవరికీ తెలీదు. అయ్యినా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ చేయడానికి ఫోన్ లు పని చేయడం లేదు ఎవరు బయటకు వెళ్ళలేదు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది?" అని అడిగింది అర్ణ.
"మరిఆ పక్షి విష్ణుని ఎటు తీసుకొని వెళ్లిందో కనిపించలేదా?" అని కంగారుగా అడిగాడు ముకుల్.
"నో సార్! అది ఎటు వెళ్లిందో అర్థం కాలేదు చాలా వేగంగా వెళ్ళిపోయింది." అని తలదించుకుని చెప్పాడు నెల్సన్.
"నాకు తెలిసి ఆ పక్షి సింబా అయ్యి ఉంటుంది. విష్ణుని కచ్చితంగా ఆ కొండల దగ్గరికి తీసుకు వెళుతుంది." అని చెప్పేడు అభిజిత్.
"మనం విష్ణు ని ఎలాగైనా కాపాడాలి." అని టెన్షన్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"మీ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి నేను చెప్పిన ప్లాన్ కాస్తా వింటారా..? మనం విష్ణు ని సేవ్ చేయొచ్చు, ఆ కొండలని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, అభీర్ ని గట్టి దెబ్బ కొట్టొచ్చు!" అని చెప్పాడు రఘూరామ్.
"ఆ ప్లాన్ ఏమిటో చెప్పండి? మనం ఎలాగైనా విష్ణు ని కాపాడాలి." అని అడిగాడు ముకుల్.
"అడవి మొత్తం మన హ్యాండ్ ఓవర్ లొ ఉండాలి అంటే అక్కడి నుంచి తీసుకువచ్చి జూలో పెట్టిన జంతువులు మొత్తాన్ని తీసుకువెళ్లి అక్కడ వదిలి, దానిని సంరక్షణ కేంద్రంగా మార్చి మన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలి.
అప్పుడు ఆ అడవిలో ఉండేది మన మనుషులే కాబట్టి ఆ కొండల పని ఈజీ అవుతుంది. ఒకవేళ విష్ణు అక్కడే ఉంటే మనకు ఈజీగా దొరుకుతాడు, ఆ అభీర్ కుడా మన చేతికి దొరుకుతాడు." అని చెప్పాడు రఘురామ్.
"ఆ అడవిని సంరక్షణ కేంద్రంగా మార్చి జంతువుల్ని అక్కడికి పంపించడం అంత ఈజీగా అయిపోతుందా?" అని డౌట్ గా అడిగాడు సుభాష్.
"ఆ పని నేను చూసుకుంటాను ఎందుకంటే ఆ మినిస్ట్రీ నా చేతిలోనే ఉంది." అని చెప్పి రఘురామ్ వైపు సంతోషంగా చూస్తు 'నా నెత్తిన పాలు పోసాడు.' అని మనసులో అనుకున్నాడు వరదరాజులు.
"అయ్యినా సరే! ఆ సంరక్షణ కేంద్రంలో మన మనుషులు ఉండాలి అంటే అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా!" అని అనుమానంగా అడిగాడు మోహిత్.
"ఆ సంగతి నేను చూసుకుంటాను 12 సంవత్సరాల క్రితం గోకుల్ అంకుల్ తో పాటు చనిపోయిన జావిద్ కొడుకు ఫారుక్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ మినిస్టర్! తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి మాత్రం ఉండదా..!" అని చెప్పాడు నిర్మల్.
"మంచి ప్లాన్! ఆ అభీర్ గాడు వాడి మనుషులు ఆ అడవిలోకి రావాలి అంటే మనల్ని దాటుకుని రావాలి వచ్చినవాడిని వచ్చినట్లు అక్కడే పాతి పెడితే సరిపోతుంది." అని కోపంగా చెప్పాడు అభిజిత్.
వరదరాజులు వైపు చూసి "అంకుల్! మీరు వెంటనే పర్మిషన్ తెప్పించండి. ఫారుక్ ని కలిసి అడవి సంగతి, ఆ కొండల సంగతి నేను నిర్మల్ చూసుకుంటాము." అని చెప్పాడు ప్రమోద్.
"నా ఐడియా ఎలా ఉంది? అప్పుడప్పుడు నేను కూడా విజిట్ చేస్తూ ఉంటాను." అని ప్రమోద్ వైపు వెటకారంగా చూస్తూ నవ్వాడు రఘురామ్.
"సరే!" అని వరదరాజుల వైపు చూసి "ఆ పర్మిషన్స్ స్పీడ్ గా అయ్యాటట్లు చూడు." అని చెప్పాడు ముఖేష్.
ఆ మాట విని "సరే అయ్యా! వెంటనే ఆ పని అయ్యేటట్లు చేస్తాను." అని ప్రతాప్ మిశ్రతో కలిసి అక్కడి నుంచి వెళుతూ "మనం ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాము, వాళ్ళ నోటితోనే జూలొ జంతువుల్ని అడవికి పంపించమని చెప్పారు." అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.
తమ వైపు కోపంగా చూస్తున్న రియాని చూసి వరదరాజులు వెనకాలే వెళ్లారు తంబీయర్, సుజిత్ లు.
రఘురామ్ దగ్గరకి వచ్చి "ఈ ప్లాన్ నిజంగా మీదేనా? లేక ఎవరైనా చెప్పారా?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"నాకు ఎవరైనా ప్లాన్ చెప్పగలరా?" అని స్మైల్ ఇచ్చాడు రఘురామ్.
"ఏంటే! మీ మామయ్య ఎలా కనపడుతున్నాడు? మీ నాన్న పోయిన తర్వాత నంద బిజినెస్ లు మొత్తం ఒంటి చేత్తో నడిపారు." అని గొప్పగా చెప్పింది ఝాన్సీ.
"అవునవును అప్పుడు జరిగిన పెంట ఇంకా ఉంది." అని చీప్ గా చూస్తూ చెప్పింది అర్ణ.
"ఈ టైమ్ లో మనలో మనం నిందించుకోవడం కాదు, ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మనకి ఒకరు కావాలి. " అని చెప్పాడు ముకుల్.
అంతలో అక్కడికి కార్ లొ వచ్చి మిథున్ తో పాటు బ్యాగ్ పట్టుకుని లోపలకి వస్తున్న అమ్మాయిని చూసి "మహేష్ ఎవరు ఆ అమ్మాయి?" అని అడిగింది అర్ణ.
"ఆ అభీర్ సేన గురించి పూర్తిగా తెలిసిన మనిషి కావాలి అన్నారు కదా, తన తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి ఆ తెగ వాళ్ళ మీద ఆ కొండల మీద రీసెర్చ్ చేస్తూ పగతో బతుకుతుంది. సర్పరాజ్ కూతురు 'వాసుకి' ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది." అని చెప్పాడు మహేష్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)