10-02-2026, 11:47 AM
గోడగూచి
![[Image: G.jpg]](https://i.ibb.co/Q7pTY0Sg/G.jpg)
రచన: సుధావిశ్వం ఆకొండి
'మాతా చ పార్వతీదేవీ - పితాదేవో మహేశ్వరః.
బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్'
జీవులు అందరికీ అమ్మ పార్వతీదేవి అయితే, తండ్రి పరమేశ్వరుడు, శివునికి నిజమైన భక్తులు అయినవారు బంధువులు అయితే, ముల్లోకాలు కూడా మన దేశమనే భావన కలిగివుండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు.
అటువంటి భావనలు ఉంటే సులభంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన వద్ద ఏమి తెలియని పసిపాపలాగే ఉండాలి. తల్లిదండ్రుల పైన పసిపిల్లలు ఎంతటి ప్రేమను కలిగివుంటారో, వారిని వదిలి ఉండలేకపోతారో అలాంటి భావనలు భగవంతునిపై కలిగివుండాలి.
తనకు తినమని అమ్మనాన్నలు ఇచ్చిందే వాళ్లకు పెడతానని, వాళ్లు కూడా తినాలని మారాం చేసే పసిపిల్లల వలె ఉంటే గనుక, జగత్తుకే తల్లిదండ్రులు అయినా, అంతటివారు ఆ ప్రేమకు పొంగిపోయి తాము దిగివస్తారు. అనుగ్రహించి, చివరకు తమలోకి తీసుకుని మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకు సాక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే, ఎందరో భక్తుల చరిత్రలు అందుకు ఉదాహరణలు!
శివ భక్తులైన నాయనార్లలో ఎంతోమంది అలా స్వామి అనుగ్రహం పొందినవారే! ఇంకా ఎందరో శివభక్తులు ఉన్నారు. కొందరు ముసలితనంలో ముక్తిని పొందితే, కొందరు మధ్యవయస్సులో, మరికొందరు పసి వయస్సులోనే ఈ లోకం పోకడలు తెలిసి, సంసారం అనే సాగరం ఈదులాడకుండానే ముక్తిని పొందారు. వారి పూర్వజన్మ సుకృతం! ఆ భోళా శంకరుని అనుగ్రహం!
అటువంటి వారిలో చాలా పసిపిల్లలా ఉన్నప్పుడే, శివుని వద్ద అలాగే మారాం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది, ముక్తిని పొందిన ఒక పసిపాప కథనే ఈ గోడగూచి.
పూర్వం శివదేవుడు అనే ఒక గృహస్తు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. తమ ఊళ్లోని శివాలయంలో అర్చకుడు అతడు. ఆయన రోజూ శివాలయానికి బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసిన తరువాత ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని ప్రతిరోజూ ఎంతో భక్తితో అర్చించేవాడు.
అలా గడిచిపోతుండగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లకతప్పని పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగని ఆలోచించాడు.
చివరికి తన కూతురిని దగ్గరికి పిలిచాడు.
“అమ్మా గోడగూచీ! నేనూ, అమ్మ ఊరికి వెళ్తున్నాం! మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు తల్లీ!
అలాగే ఇంకో ముఖ్యమైన పని నీకు అప్పజెప్పి వెళ్తాను! జాగ్రత్తగా చేయాలి! అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా! ప్రతిరోజూ నేను శివుడికి పాలు ఇచ్చి వస్తాను కదా! ఇప్పుడు ఆ పని ఎలాగని ఆలోచించాను. శివుడికి రోజూ పాలు ఆరగింపు చేయకపోతే ఎలా? అందుకని ఆ పని నువ్వు చేయాలి! నీకు అప్పజెప్పి వెళ్తాను. రోజూ జాగ్రత్తగా స్వామికి పాలు ఇవ్వాలి నువ్వు. ఆటలు అంటూ ఎటూ వెళ్ళకు తల్లీ!
జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఈ పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.
"అలాగే నాన్నగారూ! తప్పకుండా చేస్తాను. మీరు పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి!' అంది.
అలా ప్రతిరోజూ గుడికి వెళ్లి, పాలు సమర్పించే పని కూతురు గోడగూచికి అప్పగించాడు శివదేవుడు. తర్వాత శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.
మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని, మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి, సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. రెండు చేతులెత్తి స్వామికి భక్తిగా మొక్కింది.
తర్వాత పాల వైపు చేతులు చూపిస్తూ......
“శివయ్యా! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను! ఆరగించవయ్యా!” అని శివుడికేసి చూస్తూ చెప్పింది.
శివుడు మాట్లాడలేదు. పాలు తాగలేదు.
'ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు? నేను ఇలాగే చూస్తుంటే తాగడం ఎలా అని తాగడం లేదో!' అని అనుకుంది మనసులో.
వెంటనే కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి తొంగి చూసింది. గిన్నెలో ఉన్న పాలు అలాగే ఉన్నాయి. ఆ గిన్నె వైపు విచిత్రంగా చూసింది.
"అయ్యో! శివయ్యా! పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. నీకు తాగటానికి ఏమిటి ఇబ్బంది? ప్రతిరోజూ నాన్నగారు తెచ్చి ఇస్తారు కదా నీకు! అలాగే తీసుకుని వచ్చాను. కానీ కొంచెం కూడా తాగలేదు నువ్వు. ఎందుకు? అన్ని పాలు అలాగే ఉన్నాయి. నేను తెచ్చిన తాగవా! తాగు తాగు!" అంటూ శివుడికేసి చూసి ఆదేశించినట్లుగా అంది.
![[Image: G.jpg]](https://i.ibb.co/Q7pTY0Sg/G.jpg)
రచన: సుధావిశ్వం ఆకొండి
'మాతా చ పార్వతీదేవీ - పితాదేవో మహేశ్వరః.
బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్'
జీవులు అందరికీ అమ్మ పార్వతీదేవి అయితే, తండ్రి పరమేశ్వరుడు, శివునికి నిజమైన భక్తులు అయినవారు బంధువులు అయితే, ముల్లోకాలు కూడా మన దేశమనే భావన కలిగివుండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు.
అటువంటి భావనలు ఉంటే సులభంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన వద్ద ఏమి తెలియని పసిపాపలాగే ఉండాలి. తల్లిదండ్రుల పైన పసిపిల్లలు ఎంతటి ప్రేమను కలిగివుంటారో, వారిని వదిలి ఉండలేకపోతారో అలాంటి భావనలు భగవంతునిపై కలిగివుండాలి.
తనకు తినమని అమ్మనాన్నలు ఇచ్చిందే వాళ్లకు పెడతానని, వాళ్లు కూడా తినాలని మారాం చేసే పసిపిల్లల వలె ఉంటే గనుక, జగత్తుకే తల్లిదండ్రులు అయినా, అంతటివారు ఆ ప్రేమకు పొంగిపోయి తాము దిగివస్తారు. అనుగ్రహించి, చివరకు తమలోకి తీసుకుని మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకు సాక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే, ఎందరో భక్తుల చరిత్రలు అందుకు ఉదాహరణలు!
శివ భక్తులైన నాయనార్లలో ఎంతోమంది అలా స్వామి అనుగ్రహం పొందినవారే! ఇంకా ఎందరో శివభక్తులు ఉన్నారు. కొందరు ముసలితనంలో ముక్తిని పొందితే, కొందరు మధ్యవయస్సులో, మరికొందరు పసి వయస్సులోనే ఈ లోకం పోకడలు తెలిసి, సంసారం అనే సాగరం ఈదులాడకుండానే ముక్తిని పొందారు. వారి పూర్వజన్మ సుకృతం! ఆ భోళా శంకరుని అనుగ్రహం!
అటువంటి వారిలో చాలా పసిపిల్లలా ఉన్నప్పుడే, శివుని వద్ద అలాగే మారాం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది, ముక్తిని పొందిన ఒక పసిపాప కథనే ఈ గోడగూచి.
పూర్వం శివదేవుడు అనే ఒక గృహస్తు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. తమ ఊళ్లోని శివాలయంలో అర్చకుడు అతడు. ఆయన రోజూ శివాలయానికి బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసిన తరువాత ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని ప్రతిరోజూ ఎంతో భక్తితో అర్చించేవాడు.
అలా గడిచిపోతుండగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లకతప్పని పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగని ఆలోచించాడు.
చివరికి తన కూతురిని దగ్గరికి పిలిచాడు.
“అమ్మా గోడగూచీ! నేనూ, అమ్మ ఊరికి వెళ్తున్నాం! మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు తల్లీ!
అలాగే ఇంకో ముఖ్యమైన పని నీకు అప్పజెప్పి వెళ్తాను! జాగ్రత్తగా చేయాలి! అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా! ప్రతిరోజూ నేను శివుడికి పాలు ఇచ్చి వస్తాను కదా! ఇప్పుడు ఆ పని ఎలాగని ఆలోచించాను. శివుడికి రోజూ పాలు ఆరగింపు చేయకపోతే ఎలా? అందుకని ఆ పని నువ్వు చేయాలి! నీకు అప్పజెప్పి వెళ్తాను. రోజూ జాగ్రత్తగా స్వామికి పాలు ఇవ్వాలి నువ్వు. ఆటలు అంటూ ఎటూ వెళ్ళకు తల్లీ!
జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఈ పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.
"అలాగే నాన్నగారూ! తప్పకుండా చేస్తాను. మీరు పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి!' అంది.
అలా ప్రతిరోజూ గుడికి వెళ్లి, పాలు సమర్పించే పని కూతురు గోడగూచికి అప్పగించాడు శివదేవుడు. తర్వాత శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.
మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని, మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి, సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. రెండు చేతులెత్తి స్వామికి భక్తిగా మొక్కింది.
తర్వాత పాల వైపు చేతులు చూపిస్తూ......
“శివయ్యా! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను! ఆరగించవయ్యా!” అని శివుడికేసి చూస్తూ చెప్పింది.
శివుడు మాట్లాడలేదు. పాలు తాగలేదు.
'ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు? నేను ఇలాగే చూస్తుంటే తాగడం ఎలా అని తాగడం లేదో!' అని అనుకుంది మనసులో.
వెంటనే కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి తొంగి చూసింది. గిన్నెలో ఉన్న పాలు అలాగే ఉన్నాయి. ఆ గిన్నె వైపు విచిత్రంగా చూసింది.
"అయ్యో! శివయ్యా! పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. నీకు తాగటానికి ఏమిటి ఇబ్బంది? ప్రతిరోజూ నాన్నగారు తెచ్చి ఇస్తారు కదా నీకు! అలాగే తీసుకుని వచ్చాను. కానీ కొంచెం కూడా తాగలేదు నువ్వు. ఎందుకు? అన్ని పాలు అలాగే ఉన్నాయి. నేను తెచ్చిన తాగవా! తాగు తాగు!" అంటూ శివుడికేసి చూసి ఆదేశించినట్లుగా అంది.
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)