Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 54


సహదేవుడి దహన సంస్కారాలు చేస్తూ ఉండగా అక్కడికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారని తెలిసి రాజన్ వాళ్ళ ఐదుగురుని శంకర్ తో పాటు వెళ్లిపోమని చెప్పాడు అభీర్.

**************

ఆ మాట విని "నాయకుడా! నీతో పాటే మేము ఎక్కడికి వెళ్ళాము." అని మొండిగా చెప్పింది రియా.

"అభీర్ సేన నాయకుడుగా నేను చెబుతున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మళ్లీ నేను తిరిగి వస్తాను." అని చెప్పాడు అభీర్.

మాట జవదాట లేక శంకర్ తో కలిసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు ఐదుగురు.

అంతలో హిర్వాణి, సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి అక్కడికి వచ్చి దూరంగా సహదేవుడు చీతి పేరుస్తున్న అభీర్ ని చూపించి "జోషి సార్ ని చంపింది అతనే వెంటనే అరెస్ట్ చేయండి.
తప్పించుకున్నాడు అంటే పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. " అని చెప్పి మిచల్ తో కలిసి మిగతా వాళ్ల కోసం చూస్తూ ఉన్నాడు జనార్ధన్.

అభీర్ ని చుట్టూ ముట్టి పట్టుకుని చేతికి సంకెళ్లు వేసి "ఆఫీసర్ ని చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము." అని చెప్పాడు ఎస్సై నిరంజన్.

"ఆ ఆఫీసర్ గారిని చంపింది నేను కాదు, ఈ దహన సంస్కారాలు చేసిన తర్వాత మీతో పాటు వస్తాను కావాలంటే ఆయన భార్యని కూడా అడగండి." అని చెప్పాడు అభీర్.

చేతికి సంకెళ్లు ఉండడం చూసి దగ్గరకు వచ్చి ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసాడు జనర్దన్.

ఫోన్ రింగ్ అవ్వడం చూసి హడావుడిగా లిఫ్ట్ చేసి "ఆ  అభీర్ గాడు దొరికాడా?" అని అడిగాడు ముకుల్.

"సార్! దొరికాడు సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు కూడా చేశారు సహదేవుడు దహన సంస్కారాలు చేసి వస్తాను అని చెపుతున్నాడు." అని చెప్పాడు జనార్ధన్.

ఆ మాట విని "స్పీకర్ ఆన్ చెయ్!" అని చెప్పి "హిర్వాణి వాడిని వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్లండి. లేకపోతే తెలివిగా తప్పించుకుంటాడు. " అని చెప్పాడు ముకుల్.

ఫోన్లో ముకుల్ చెప్పిన మాట విని "ఓకే సార్!" అని సెక్యూరిటీ ఆఫీసర్లు వైపు చూసి 'తీసుకువెళ్లండి.' అని సైగ చేసాడు హిర్వాణి.

అభీర్ ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్లడం చూసి కట్టెలు మీద ఉన్న సహదేవుడి బాడీని మిచల్ తో కలిసి కింద పడేసాడు జనార్ధన్.

కింద పడ్డ సహదేవుడి శరీరన్ని చూసి జనార్దన్ వైపు కోపంగా చూస్తూ "నేను బయటికి వచ్చిన తర్వాత మొదటగా చంపేది నిన్నే!" అని ఆవేశంగా జీపు ఎక్కాడు అభీర్.

ఆ మాట విని భయంగా చూస్తూ మిచల్ తో కలిసి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు జనార్ధన్.

*************

ఉదయం గెస్ట్ హౌస్ కి చేరుకుని చనిపోయిన గోకుల్ బాడీ దగ్గర బాధ పడుతున్న ముకుల్ దగ్గరకు వెళ్లి "సార్!  గోకుల్ గారు ఆక్సిడెంట్లు చనిపోయినట్లు క్రియేట్ చేయించాను.

మీరు ఓకే అంటే ఇప్పుడే ప్రెస్ కి రిలీజ్ చేస్తాను, అలాగే మీరు చెప్పిన ఆ కుర్రాడు నోయిడా స్టేషన్లో ఉన్నాడు మీరు చెప్పిన వెంటనే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయిస్తాను." అని చెప్పాడు హిర్వాణి.

ఎదురుగా ఉన్న జనార్ధన్ మిచల్ వైపు చూసి "నా కొడుకుని చంపిన వాళ్ళు దొరికారా?" అని కోపంగా చూస్తూ అడిగాడు ముకుల్.

"సార్! వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, అసలు  ఎలా ఉంటారో కూడా తెలియదు." అని చెప్పాడు జనార్దన్.

"ఎక్కడకి పోతారు అభీర్ గాడి కోసం స్టేషన్ దగ్గరికి వస్తారు కదా!" అని చెప్పి హిర్వాణి  వైపు చూసి "నంద వారసుడు యాక్సిడెంట్లు లో చనిపోయాడు అని ప్రెస్ రిలీజ్ చేయించండి." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్!" అని అక్కడ నుంచి వెళ్ళాడు హిర్వాణి.

మిచల్ వైపు చూసి "స్టేషన్ దగ్గరకి నీ మనుషుల తో కలిసి వేళ్ళు, అభీర్ కోసం వాడి మనుషులు అక్కడకి రాగానే నరికి అవతల పారేయండి." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్!" అని అక్కడ్నుంచి తన మనుషులని తీసుకుని వెళ్ళాడు మిచల్.

*******************

మినిస్టర్ జావిద్ తో పాటు బైరి అడవులలో ఉన్న కొండల దగ్గరికి చేరుకుని "సర్పరాజ్! తొమ్మిది కొండల శాంపిల్స్ తీసుకో, అలాగే ఒక ఫోటో కూడా తీసుకో కొన్ని రోజులకి ఇక్కడ కొండలు కనబడకుండా చేస్తాను నా ఫ్రెండ్ ఆత్మ శాంతించాలి." అని చెప్పాడు అభిజిత్.

"సరే! అని సంతోషంగా కొండల వైపు తిరిగి సెల్ఫీ తీసుకొని శాంపిల్ తీసుకురావడానికి కొండల దగ్గరికి వెళ్ళాడు సర్పరాజ్.

కొండల వైపు సంతోషంగా చూస్తూ "అభిజిత్! వీటిని తవ్వడం మొదలుపెడితే  మనకి ఎంత అమౌంట్ వస్తుంది." అని ఆశగా అడిగాడు జావిద్.

"ఒక్క కొండ తవ్వితే చాలు ఇప్పటివరకు మనం సంపాదించిన దానికి పది రెట్లు వస్తుంది. ఈ విషయాలు మీ మనుషుల దగ్గర మాట్లాడకండి. అందరి దృష్టిలో ఇవి విషపు కొండలు మాత్రమే! అంత సీక్రెట్ గా జరిగిపోవాలి." అని చెప్పాడు అభిజిత్.

"సరే!" అని వెనక్కి తిరిగి తన పీఏ వైపు చూసి "మీరు కారు దగ్గర ఉండండి." అని చెప్పి కొండల వైపు నుంచి గట్టిగా అరుపు వినపడడంతో పరుగులు వెళ్లి చూసి భయంగా వెనక్కి వస్తూ "సర్పరాజ్ కాలి బూడిద అయిపోయాడు." అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళడు జావిద్.

"అవునా?" అని కొంచెం ముందుకు వెళ్లి కొండను పట్టుకుని ఎండు చెట్టు కాలినట్లు కాలుతున్న సర్పరాజ్ చూసి భయంతో చెమటలు తుడుచుకుని ఆకాశంలో రాబందుల అరుపులు విని "జాకీ! మనం ఇక్కడ ఉండకూడదు." అని కార్ దగ్గరకి వెళ్ళాడు అభిజిత్.

కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళుతు ఉండగా సడన్ గా చెట్టు అడ్డంగా పడడంతో కార్ దానిని గుద్దుకొని పల్టీలు కొట్టుకుంటూ వెళ్లింది.

చెట్టుకొమ్మ జావీద్ గుండెల్లో గుచ్చుకొని తన కళ్ళ ముందు చనిపోవడం ఒక పక్కన రక్తం మడుగులో ఒళ్ళంతా దెబ్బలతో రక్తం మాడుగులో ఉన్న అభిజిత్ ని చూసి కొండల వైపు నుంచి వస్తున్న బయకరమైన అరుపులు వినలేక చెవులు మూసుకుని భయంగా చూస్తూ ఉండిపోయడు జాకీ.
*****************

ఆదే సమయం లో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న జనార్దన్ వైపు చూసి "మనం ఒకసారి స్టేషన్ కి వెళ్లి అభీర్ ని చూసి వద్దాము వాడి కళ్ళలో భయం నేను చూడాలి." అని చెప్పాడు ముకుల్.

అంతలో గెస్ట్ హౌస్ లోపలికి వచ్చి "సార్! మీరు చెప్పినట్లు గోకుల్ గారు యాక్సిడెంట్లు చనిపోయినట్లు అన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తుంది. మనం ఇప్పుడు ఈ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఒక రిపోర్ట్ రాయించి మీడియా ముందు బయటకు తీసుకువచ్చి దహన సంస్కారాలు చేయించాలి అప్పుడు అన్ని మనం అనుకున్నట్లు జరుగుతాయి." అని చెప్పాడు హిరణ్య.

"ఆ విషయం మొత్తం నువ్వే దగ్గర ఉండి చూసుకో నాకు చిన్న పని ఉంది. నా కొడుకు శవం హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేలోపు నేను అక్కడ ఉంటాను." అని చెప్పి జనార్ధన్ తో కలిసి స్టేషన్ కి బయలుదేరాడు ముకుల్.

కాసేపటికి స్టేషన్ బయట కారు ఆగడం చూసి హడావిడిగా లోపలికి వెళ్లి "సార్! నంద గ్రూప్ చైర్మన్ ముకుల్ గారు మన స్టేషన్ కి వచ్చారు." అని కంగారుగా చెప్పాడు పాఠక్.

"అవునా?" అని హడావిడిగా బయటికి వచ్చి "నమస్తే సార్!" అని చెప్పి పక్కనే ఉన్న జనార్ధన చూసి "సార్! వాళ్ళ బాబు యాక్సిడెంట్ కేసు ఈ స్టేషన్ కాదు." అని స్లోగా చెప్పాడు  ఎస్ఐ నిరంజన్.

"ఆ విషయం మాకు కూడా తెలుసు! మీము వచ్చింది జోషి సార్ కేసులో ఒక కుర్రాడిని అరెస్టు చేశారు కదా అతన్ని చూడడానికి!" అని చెప్పాడు జనార్ధన్.

"అవునా సార్!" అని లోపలికి తీసుకువెళ్లాడు నిరంజన్.

"ఆ సెల్ లో ఉన్న కుర్రాడిని చూడడానికి ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు జనార్ధన్.

"నో సర్! ఎవరు రాలేదు. అతను కూడా స్టేషన్ కి వచ్చిన దగ్గరనుంచి సెల్లో కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేస్తున్నట్లు కూర్చున్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు." అని చెప్పాడు నిరంజన్.

ఆ మాట విని సెల్ దగ్గరికి వెళ్లి "అభీర్!" అని పిలిచాడు ముకుల్.

ఆ పిలుపుకి కళ్ళు తెరిచి దగ్గరకు వచ్చి "నువ్వే కదా ముకుల్ నంద! ఈ అరాచకానికి కారణం కూడా నువ్వే కదా! నా వాళ్ళని చంపావు నీ వారసుడైన పోగొట్టుకున్నావు ఇప్పటికైనా తప్పు తెలుసుకో నా సహదేవుడికి అంత్యక్రియలు చేసి నీ పాపం కడిగేసుకో ప్రణభిక్ష పెడతాను." అని చెప్పాడు అభీర్.

ఆ మాటకి నవ్వుతూ "నాకు ఇంకా వారసులు ఉన్నారు నా కొడుకు చివరి కోరిక తీర్చకుండా మాత్రం ఉండను, మా వాళ్ళు నీ ప్రదేశం మొత్తం నాశనం చేస్తాను.

మీ జాతి ఆనమాలు లేకుండా నేను చేస్తాను, నీ సహదేవుడికి అంత్యక్రియలు కాదు వాడి శవాన్ని కుక్కలు పీకు తింటున్నాయి చూడు." అని వీడియో చూపించడు ముకుల్.

మొబైల్లో వీడియో చూస్తూ ఆవేశంగా ముకుల్ వైపు చూసి "ఈరోజుతో నీ పాపం పండింది. నువ్వు అక్కడ ఉన్న కొండలని ముట్టుకోను కూడా ముట్టుకోలేవు." అని ఎర్రటి కళ్ళతో కోపంగా చూస్తూ చెప్పాడు అభీర్.

"నా కళ్ళముందే నీ మనుషులు మొత్తం కుక్క చావు చచ్చారు, మిగతా వాళ్ళని కూడా అదే విధంగా చంపుతాను నువ్వు దేవుడులా కొలిచే ఆ కొండలను తొలిచి అక్కడ నాగళ్ళతో దున్నిస్తాను.

నువ్వు జైల్ నుంచి బయటకు రాకుండా లోపలే కుళ్ళి కుళ్ళి చచ్చేటట్లు చేస్తారు అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది." అని చెప్పాడు ముకుల్.

ఆ మాటకి కళ్ళు మూసుకుని గంభీరమైన గొంతుతో "ముకుల్ నంద బయట ఉన్న నా సైన్యానికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా పారిపో,

నేను మళ్ళీ పుష్కర కాలం తర్వాత బయటికి వస్తాను. అప్పుడు నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను, నీకు సహాయం చేసిన వారిని సంహరిస్తాను, నీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలిస్తాను, కానీ నిన్ను మాత్రం చంపను.

నువ్వు చేసిన పాపం గుర్తుకు తెచ్చుకుని కుళ్ళి కూసించి బతికి ఉండగానే నిన్ను రాబందులు పీక్కు తింటాయి అది నా కళ్ళలో చూస్తాను ఇది నా నోటి నుంచి వచ్చిన మాట కాదు భవాని మత నీకు ఇస్తున్న శాపం!" అని కళ్ళు తెరిచాడు అభీర్.

ఎదురుగా ఉన్న అభీర్ కళ్ళ వైపు చూసి భయంతో వెనక్కి వచ్చి గబగబా అక్కడ నుంచి వెళ్లి కార్ ఎక్కి చెమటలు తుడుచుకుంటూ వణుకుతూ ఉన్నాడు ముకుల్.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 01-02-2026, 08:39 AM



Users browsing this thread: 1 Guest(s)