Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 53


జాకిని తీసుకుని గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరాడు అభీర్,
జనార్దన్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి మిచల్ గ్యాంగ్ తో కలిసి మురళి జోషి ఇంటికి బయలుదేరాడు గోకుల్.

*******************
మిచల్ మనుషులతో కలిసి జోషి ఇంటి దగ్గరకు వచ్చి జనార్దన్ కి ఫోన్ చేశాడు గోకుల్.

ఫోన్ రింగ్ అవడం చూసి లిఫ్ట్ చేసి మాట్లాడి మురళి జోషి వైపు చూసి "ఎందుకైనా మంచిది అని మన ఆఫీసర్స్ ని ఇక్కడికి రమ్మన్నాను, మీరు లోపలికి వెళ్ళండి వదిన బాగా భయపడినట్లు ఉంది." అని చెప్పాడు జనార్ధన్.

"సరే! అని లోపలికి వెళుతూ సహదేవుడి వైపు చూసి నువ్వు కూడా లోపలికి రా.!"  అని చెప్పాడు మురళి జోషి.

"మీరు వెళ్ళండి ఆఫీసర్లు వచ్చిన తర్వాత లోపలికి వస్తాను." అని చెప్పి కార్ లో మిచల్ మనుషులు దిగడం చూసి "మీ ఆఫీసర్ లేనా?" అని జనర్దన్ ని అడిగాడు సహదేవుడు.

"అవును! నువ్వు కూడా లోపలికి వేళ్ళు కాస్త వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది." అని చెప్పాడు జనార్ధన్.

"సరే!" అని దూరంగా ఉన్న రాజన్ వాళ్ళ వైపు చూసి "మనవాళ్లే!" అని సైగ చేసి ఇంటి లోపలికి వెళ్ళాడు సహదేవుడు.

ఇద్దరి కూతుర్లను దగ్గరకి తీసుకుని భార్య వైపు చూసి "భయపడకండి ఆఫీసర్స్ వచ్చారు, సహదేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు." అని చెప్పాడు మురళిజోషి.

కంగారు పడుతున్న గీత వాళ్ళ వైపు చూసి "మా నాయకుడు పోసిన ప్రాణం! ఏమీ అవ్వదు మీరు ప్రశాంతంగా ఉండండి." అని చెప్పాడు సహదేవుడు.

అంతలో గోకుల్ వస్తున్న కారు రావడం చూసి దగ్గరికి వెళ్లి "సార్! మురళి జోషి ఫ్యామిలీ, సహదేవుడు ఇంటి లోపలే ఉన్నారు మిస్ అయితే మన పని క్లోజ్!" అని చెప్పాడు జనర్దన్.

"నో ప్రాబ్లం!" అని మిచల్ వైపు చూసి "లోపలకి ఎంటర్ అవ్వడం తోనే సహదేవుడిని షూట్ చెయ్, మురళి జోషి దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందేమో చూసిన తర్వాత వాడి సంగతి చూద్దాము." అని చెప్పి జనర్దన్ తో కలిసి ఇంటి లోపలికి వెళ్ళాడు గోకుల్.

లోపలికి వస్తున్నా గోకుల్ వాళ్ళను చూసి "జనార్ధన్ నువ్వు మోసం చేస్తావని అనుకోలేదు." అని కంగారుగా భార్య పిల్లల్ని ఒక గదిలోకి పంపించాడు మురళి జోషి.

ఆ మాట విని కోపంతో మీదకి వస్తున్న సహదేవుడిని చూసి షూట్ చేశాడు మిచల్.

గన్ సౌండ్ సహదేవుడు అరుపువిని ఇంటి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు రాజన్ వాళ్ళ ఐదుగురు.

బుల్లెట్స్ తగలడంతో కింద పడిపోయి రక్తం మడుగులో ఉన్న సహదేవుడు వైపు చూసి కంగారుగా గోకుల్ దగ్గరికి వెళ్లి "ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ఫ్యామిలీతో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను." అని రిక్వెస్ట్ గా అడిగాడు మురళిజోషి.

"నా చేతికి ఇప్పుడే పంచరత్నాలు పెట్టుకున్నాను వీటికి రక్తాభిషేకం జరగాలి." అని జేబులో నుంచి కత్తి తీసి మురళి జోషి గుండెల్లో పొడిచాడు గోకుల్.

గుండెల్లో కత్తి దిగడంతో భార్య వైపు చూసి "పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి త్వరగా పారిపో!" అని గట్టిగా అరిచాడు మురళీజోషి.

ఇద్దరు పిల్లల్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్న గీత వైపు చూసి గన్ ఎయిమ్ చేసారు మిచల్, జనార్దన్ లు.

చనిపోయిన ఇద్దరి వైపు చూసి ఫోన్ తీసి ముకుల్ కి కాల్ చేసి "డాడ్! ఇక్కడ పని పూర్తి అయింది లాయర్ కి కాల్ చేసి చెప్పు, నేను కూడా బైరి బయలుదేరుతున్నాను." అని చెప్పాడు ముకుల్.

"గుడ్! త్వరగా బయలుదేరు." అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కన ఉన్న ఆబిజిత్ వైపు చూసి "జాకీ కి కాల్ చేసి జోషి ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది అని చెప్పు, విషయం తెలిసిన వెంటనే అభీర్ అక్కడికి వెళతాడు." అని చెప్పి హిర్వాణి కి కాల్ చేసి పని పూర్తయింది సెక్యూరిటీ ఆఫీసర్లు పంపించండి." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకుని మురళి జోషి ఇంటికి బయలుదేరాడు హిర్వాణి.

గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న జాకీ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.

ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే "జాకీ! మురళి జోషి ఇంటి దగ్గర గొడవ జరుగుతుందంట మీరు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసారు కదా!" అని అడిగాడు అభిజిత్.

"అవును భయ్యా! మేము గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాము." అని చెప్పాడు జాకి.

ఫోన్లో ఆ మాట విని హడావిడిగా అక్కడ నుంచి పరుగెత్తాడు అభీర్.

ఫోన్ లైన్ లో ఉన్న అభిజిత్ తో మాట్లాడుతూ "అన్న! అభీర్ హడావిడిగా వెళ్ళాడు మురళిజోషి ఇంటికి వెళుతున్నాడు అనుకుంటా!" అని చెప్పాడు జాకి.

"సరే! నువ్వు అక్కడి నుంచి బయలుదేరి బైరి వచ్చేసేయ్! మన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది." అని నవ్వుతూ చెప్పి ఫోన్ కట్ చేశాడు అభిజిత్.

**********

అంతలో బయట ఉన్న మిచల్ మనుషుల్ని కొట్టి ఇంటి లోపలికి వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న సహదేవుడిని చూసి కోపంతో మిచల్, జనార్దన్ లని రెండు చేతులతో ఎత్తి దూరంగా గిరాటు వేశాడు బైరి.

కిందపడి లెచి పరిగెడుతూ "సార్! అభీర్ మనుషులు ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు పారిపోదాం పదండి." అని కంగారు వెనుకా వైపు నుంచి బయటికి వెళ్ళాడు జనార్ధన్.

రియా లోపలికి రావడం చూసి భయంతో జనార్దన్ వెనకాలే పారిపోయాడు మిచల్.

సహదేవుడు రక్తపు మడుగులో ఉండడం చూసి కోపంతో గోకుల్ మీదకు ఎగిరి తన చేతిలో ఉన్న కత్తిని మేడలో దింపింది రియా.

అది చూసి భయంతో గట్టిగా అరిచిన గీత వైపు చూసి "మీ భర్తకు తగిన శాస్తి జరిగింది. పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి సుఖంగా బతకండి." అని సహదేవుడిని పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు బైరి.

బయట ఉన్న మిచల్ మనుషులని కొట్టి లోపలికి వచ్చి చనిపోయిన మురళి జోషి సహదేవుడిని చూసి మెడ దగ్గర కత్తి దిగి బాధగా అరుస్తున్న గోకుల్ చేతి వేళ్ళకి పంచరత్నాలు కనపడడంతో దగ్గరకు వెళ్లి కత్తితో వేళ్ళు నరికి ఉంగరాలు తీసుకుని

బాధతో అరుస్తున్న గోకుల్ వైపు చూసి "వీడికి మామూలు చావు రాకూడదు ప్రాణం ఉండగానే ఒంటిలో నుంచి రక్తం మొత్తం బయటికి కారిపోవాలి ఆ విధంగా నరకండి." అని  కసిగా చెప్పాడు రాజన్.

మిగతా నలుగురు  గోకుల్ ని చంపకుండా నరాలు తెంపి సహదేవుడి వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు.

అంతలో అక్కడికి వచ్చి చనిపోయిన సహదేవుడని చూసి దగ్గరికి వెళ్లి బాధపడుతూ "నీ మాట వినకుండా వెళ్లాను నిన్ను దూరం చేసుకున్నను." అని గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉన్నాడు అభీర్.

అంతలో లోపలకి వచ్చి మనం  ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి." అని కంగారుగా చెప్పాడు శంకర్.

పంచరత్నాలు అభీర్ చేతిలో పెట్టి "నాయకుడా! మన కొండకి వెళ్దాము పద!" అని చెప్పాడు బైరి.

రక్తంతో తడిసి ఉన్న పంచరత్న ఉంగరాలని చూసి "నా వల్ల మనలో మరొకరి ప్రాణం పోయింది." అని బాధపడుతూ సహదేవుడి శరీరాన్ని భుజాన వేసుకుని అక్కడ్నుంచి తన వాళ్లతో కలిసి వెళ్ళాడు అభీర్.

అభీర్ వాళ్ళు వెళ్లడం దూరం నుంచి చూస్తూ "మిచల్! నువ్వు వాళ్ళకి కనపడకుండా వెనకాలే ఫాలో అవ్వు ఎక్కడికి వెళుతున్నారో మనకి తెలియాలి." అని చెప్పి ఇంట్లోకి వెళ్లి చనిపోయిన గోకుల్ ని చూసి షాక్ అయ్యి కంగారుగా ముకుల్ కి కాల్ చేశాడు జనార్ధన్.

ఫోన్ లిఫ్ట్ చేసి "జనార్ధన్! అక్కడికి అభీర్ వచ్చాడా? వాడిని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారా?  గోకుల్ బాబు అక్కడ నుంచి బయలుదేరి పోయాడా? " అని అడిగాడు ముకుల్.

"సార్! ఇక్కడ ఒక పొరపాటు జరిగింది. అభీర్ వాళ్ళ  మనుషల చేతిలో మన గోకుల్ గారు చనిపోయారు." అని బాధగా చెప్పాడు జనార్ధన్.

"అవునా?" అని ఫోన్ కట్ చేసి హిర్వాణి కి కాల్ చేసాడు ముకుల్.

ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "సార్! టూ మినిట్స్ లో అక్కడ ఉంటాను మీరు టెన్షన్ పడకండి." అని చెప్పాడు హిర్వాణి.

"ఆ ఇంటి దగ్గర నా కొడుకు చనిపోయాడు ఈ కేసులో ఆ విషయం బయటికి రాకూడదు, ఆ బాడీని నా గెస్ట్ హౌస్ దగ్గరికి పంపించే ఏర్పాటు చేయించు." అని డల్ గా చెప్పాడు ముకుల్.

ఆ మాట విని "సారీ సార్! బాబు బాడీ మీ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. సార్ అక్కడ చనిపోయినట్లు మూడో కంటికి తెలియదు." అని చెప్పాడు హిర్వాణి.

ఫోన్లో మాట్లాడుతున్న  ముకుల్ వైపు చూసి "అంకుల్! నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను గోకుల్ ఒక్కడినే అక్కడికి పంపించకండి అని, మీరు నా మాట వినలేదు వెనక్కి వెళ్దాము పదండి." అని బాధపడుతూ చెప్పాడు అభిజిత్.

"నా కొడుకు ఆశ పడ్డ ప్రతిదీ వాడికి ఇస్తూ వస్తున్నాను వాడు చివరిసారిగా ఆశపడ్డా ఈ కొండలు కూడా నాకు కావాలి మీరు వెళ్ళండి. నేను వెనక్కి వెళ్తాను." అని జావీద్ తో పాటు అభిజిత్, సర్పరాజ్ లని పంపించి ఢిల్లీకి బయలుదేరాడు ముకుల్.

*************
మురళి జోషి ఇంటి దగ్గరికి హిర్వాణి సెక్యూరిటీ ఆఫీసర్లు తో రావడం చూసి మిచల్ కి కాల్ చేసి అభీర్ వాళ్ళు ఉన్న ప్లేస్ తెలుసుకుని తీసుకువెళ్లాడు  జనార్ధన్

సహదేవుడికి దహన సంస్కారాలు చేయడానికి అభీర్ వాళ్ళు సిద్ధం చేస్తూ ఉండగా సెక్యూరిటీ అధికారి జీప్ లు రావడం చూసి "మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోవాలి సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తున్నారు." అని చెప్పాడు శంకర్.

ఆ మాట విని ఐదుగురు వైపు చూసి "మీరు శంకర్ తో పాటు వెళ్లిపోండి. నేను సహదేవుడి దహన సంస్కారాలు చేసి వస్తాను." అని చెప్పాడు అభీర్.

"అలా అయితే మేము కూడా ఇక్కడే ఉంటాము." అని మొండిగా చెప్పింది రియా.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 01-02-2026, 08:37 AM



Users browsing this thread: 1 Guest(s)